భానోదయం: మార్చి 2018

7, మార్చి 2018, బుధవారం

రైతునేస్తం

భానోదయం బ్లాగుకు విచ్చేసినందుకు మీకు ధన్యవాధములు.

ప్రతి రోజు ఉదయం తన లేలేత కిరణాలతో చీకటిని పారద్రోలి వెండి వెలుగులు నింపేవాడు భానుడు.

సమాజానికి నా అక్షర కిరణాలతో వెలుగులు నింపడమే భానోదయం బ్లాగు.

భారతదేశం:
రైతు ప్రధాన దేశం కానీ ఈదేశంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కవ.
ఈ దేశంలో వేలకోట్లు ముంచే వారికి ఎర్ర తివాచి పరిచి అప్పులిచ్చే బ్యాంకులు రైతుల పంట సాగుకు మాత్రం కాళ్ళరిగేలా తిప్పుతారు.
ఒక బిస్కేట్ కంపెనీ వాడో లేదా వేరే ఏఇతర కంపెనీ వాడయినా తాను తయారు చేసిన వస్తవుకు ధరను తనే నిర్ణయిస్తాడు కాని రైతులు కష్టపడి పండించిన పంటల ధరలను ధళారులు నిర్ణయిస్తారు.
రైతులు కష్టపడుతున్నారు ధళారులు కోటీశ్వరులవుతున్నారు.
ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల కష్టాలు తీరడం లేదు.
ఉద్యోగులు ,వ్యాపారస్తులు,సాఫ్టవేర్ ఉద్యోగులు,పారిశ్రామిక వేత్తలు మీరంతా ఒక్కసారి ఆలోచించండి రైతుల గురించి మనందరికి అన్నం పెట్టే రైతన్న దీనస్థితిని మాకెందుకు ప్రభుత్వాలు చూసుకుంటాయిలే అనకండి చూస్తూనే ఉన్నాం స్వతంత్య్రం వచ్చి ఎన్నేండ్లయినా ఏం మారింది రైతుల బతుకు.


      ఎప్పుడూ ఏసీ గదుల్లో కూర్చూనే మీకు ఎక్కడ నుండి వస్తుంది మీరు తినే అన్నం.
మీరు తినే ప్రతీ మెతుకు రైతు చెమటోడ్చి పండించిందే.
మేము ఊరికే తినట్లేదు డబ్బులిచ్చి కొంటున్నాం అనొచ్చు కానీ మీరు కొనే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నిర్ణయించేది రైతులు కాదు మద్యవర్తులు, దళారులే.
ధళారులు రైతుల వద్ద నుండి తక్కువ ధరకు కొని మార్కెట్లో రెట్టింపు ధరలకు అమ్మి లాభాలు గడిస్తున్నారు.
ఎండనకా వాననక కష్టపడి పంటలు పండించిన  రైతులకు  మాత్రం కష్టాలు కన్నీళ్ళె మిగులుతున్నాయి.
 ఈ దేశంలో రైతు ఆనందంగా జీవించలేడా.?
రైతులు జీవితాలు మారవా.?


ఈ దేశంలో రైతుల కష్టాలు విత్తనలనుండే మొదలవుతాయి. విత్తన కంపెనివాడు నకిలి విత్తనాలను అంటగట్టి మోసం చేస్తాడు.

ఒకవేళ విత్తనాలు బాగుండి మొలకెత్తితే వర్షాలు సరిగ్గా పడతాయో లేదో అని ఆందోళన.

అన్ని అనుకూలించి పంటలు బాగా పండితే మార్కెట్లో అమ్మడానికి వెళితే గిట్టుబాటు ధరలు లేక పెట్టిన పెట్టుబడి కుడా రాని పరిస్థితి. రైతుల కష్టపడితే ధళారులు లాభపడుతున్నారు.

రైతులు బాగుండాలంటే ధళారి వ్యవస్థ పోవాలి.
నేరుగా రైతులే తాము పండించిన పంటలను అమ్ముకునేలా చేస్తే ఇటు రైతులు అటు వినియోగదారులు ఇద్దరు బాగుపడుతారు.

రైతులకు అనుకూలంగా ఉండేటట్టు ప్రభుత్వాలు విధానాలు రూపొందించాలి. ప్రజలు కూడా నేరుగా రైతుల వద్దనుండే వ్యవసాయ ఉత్పత్తులను కొనే ఏర్పాట్లు చేయాలి అప్పుడే రైతులు బాగుపడుతారు.

ఈ రోజుల్లో అందరికి డబ్బే ప్రధానం అయ్యింది డబ్బు డబ్బు డబ్బు. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఒక్క రైతు మాత్రమే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఇంకా తన కష్టాన్నే నమ్ముకుని వ్యవసాయం చేస్తూ ఈ దేశానికి అన్నం పెడుతున్నాడు.
చాలా మంది రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేనప్పుడు ఎందుకు ఇంకా వ్యవసాయం చేయడం అంటూ వ్యవసాయం మానేసి పట్టణాలకు వలసవెళ్ళి చిన్న చితక పనులు చేసుకుంటు బతుకుతున్నారు.

గతంలో ఉమ్మడి  తెలుగు రాష్ట్రంలో స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రే వ్యవసాయం దండగ అని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రే ఇలా అన్నప్పుడు రైతులు ఏం చేయాలి సాయం చేయాల్సిన వాడే నువ్వు చేయాల్సిన పని దండగ అంటే ఏం చేస్తారు. సాయం చేయాల్సింది పోయి వ్యవసాయమే దండగా అంటే ఇక రైతులు చేసేది ఏమిటి. వ్యవసాయం వదిలేయడమే శరణ్యం.

ముఖ్యమంత్రి గారి వ్యవసాయం దండగా అనే మాటల ప్రకారం ఆయన రైతుల పట్ల వ్యవసాయం పట్ల ఆయనకున్న అసహనం అర్థమవుతుంది. రైతులందరు వ్యవసాయం మానేస్తే జనాలకు ఈయన గడ్డి తిని బతకమంటారేమో.? లేదా నోట్ల కట్టలు తినమంటారేమో?

ప్రభుత్వాలు రైతులకు అనుకూల విధానాలను అవలంభించి వ్యవసాయాన్ని ప్రత్సాహించాలి.
వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండగ అనే రోజులు రావాలి. రైతులు ఆనందంగా జీవించే రోజులు రావాలి..
అప్పుడే  ‌రైతు బాగుంటాడు రైతు బాగుంటే ఈ దేశం బాగుపడుతుంది..