భానోదయం: ఆగస్టు 2018

20, ఆగస్టు 2018, సోమవారం

మొక్కలు నాటుదాం

   
  చెట్లు ప్రగతికి మెట్లు. అంతెకాదు మన జీవనాధారం చెట్లు లేనిదే మనిషి మనుగడ లేదు. ప్రాణవాయువును ప్రసాదించేది ఈ చెట్లే. మరియు కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకుని మనకు ఆక్సీజన్ ప్రసాదిస్తాయి.
అనేక రకాల పండ్లు,పువ్వులు, ఔషదాలు మనకు ప్రసాదిస్తాయి ఈ కల్పవృక్షాలు ఇలా అనేక రకాలుగా మనకు ఉపయోగపడే చెట్లను అభివృద్ది పేరిట నరికేస్తుఉన్నారు.
మనిషి వల్ల చెట్లకు ఏ ఉపయోగం లేదు కాని చెట్ల వల్లె మనిషి బ్రతుకుతున్నాడు. చెట్లు లేకుంటే మనిషే లేడు.

      అభివృద్ది పేరిట అడవులను నాశనం చేస్తున్నారు. కొండలను తొలచి క్వారీలుగా మార్చి అపురూపమైన వృక్షసంపదను నాశనం చేసి పచ్చని ప్రకృతిని వికృతంగా మార్చేస్తున్నారు. కొందరి స్వార్థపరుల అత్యాశ మూలంగా పచ్చని పర్యావరణాన్నీ నాశనం చేసి కోట్లకు పడగలెత్తుతున్నారు అక్కడి ప్రజల జీవినాన్నీ దుర్భరం చేస్తున్నారు.

     పర్యావరణం ఎప్పుడు సమతుల్యంగ ఉంటేనే అంతా బావుంటుంది. అడవులను నాశనం చేసి కొండలను తవ్వేసి ఇష్టారాజ్యంగా ప్రకృతిని నాశనం చేస్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతిని అతివృష్టి అనావృష్టి లాంటి విపత్తులు ఎదుర్కోవలసి వస్తుంది.

      ఈ భూమి మీద మానవుడు బ్రతకడానికి అన్నీ విదాలుగా అనుకూలంగా ఉంది. మరే ఇతర గ్రహం మీద మానవుడు జీవించలేడు. ఈ భూమిపై ఉన్న సౌకర్యాలు ఏ గ్రహం మీద లేవు కనీసం నీరు కూడా లేదు. మనకు ఇన్నీ విదాలుగా మన మనుగడకు తోడ్పడే భూమిని మనం ఏం చేస్తున్నాం చేజేతులారా నాశనం చేస్తున్నాం. కొందరి అత్యాశల వల్ల ధన దాహం వల్ల ప్రకృతిని నాశనం చేసి పర్యావరణాన్నీ అసతుల్యం చేసి భూగ్రహంపై కూడా మనిషి జీవనానికి ప్రమాదకరంగా మరే రోజులు ఎంతో దూరంలో లేవు.

అభివృద్ది అనేది అవసరమే కాని పర్యావరణ సమతుల్యత అనేది ఎంతో ముఖ్యం.

       అభివృద్ది అంటే ఒక దగ్గర పచ్చని ప్రకృతిని నాశనం చేసి మరో చోట  ఎత్తైన భవనాలు నిర్మించడం కాదు. పర్యావరణాన్నీ సమతులంగా ఉంచడం. అంటే ఒక చెట్టును కొట్టేస్తే రెండు చెట్లు నాటాలి, వాటిని పెద్దగా అయ్యేవరకు కాపాడాలి.

       నేడు కోట్లాది వాహనాలు,ఫ్యాక్టరీల వల్ల విపరీతమైన గాలి కాలుష్యం పెరిగిపోయింది. ప్రధాన నగరాలల్లో గాలి కాలుష్యం మరి ఎక్కవ పీల్చే గాలి కూడా కరువే అక్కడ.
ఇప్పటికే మనం నీటిని కొనుక్కోని తాగుతున్నాం ముందు ముందు గాలిని కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చినా ఆశ్చ్యర్య పోవలసిన అవసరం లేదు. ప్రకృతి ప్రసాదించిన నీరు గాలి ఎక్కడైనా ఉచితంగా లభించాలి కాని ఇప్పుడు కొనుక్కోవలసి వస్తుంది. ముందు ముందు ఇంకా దారుణంగా ఉంటుందేమో.

      మనిషి బ్రతకడానికి అన్నివిదాలుగా ప్రకృతి ఉంది. కానీ అత్యాశకు మాత్రం ఎంత ఉన్నా సరిపోదు.

      . మనిషి వల్ల ప్రకృతికి ఎలాంటి ఉపయోగం లేదు కాని ప్రకృతి వల్లే మనిషి బ్రతుకుతున్నాడు. అది తెలిసి కూడా తను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాడు. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా వుంటుందో మనకు తెలుసు ..



           కాబట్టి  పర్యావరణాన్నీ నాశనం చేయకుండా వీలైనన్నీ మొక్కలు నాటీ ప్రకృతిని కాపాడుదాం ఆనందంగా జీవిద్దాం.

     ఒక మొక్క నాటండి దానికి నీరు పోసి కొంచెం పేడ కాని వీలయితే కంపోస్టు ఎరువు వేసి చూడండి అది పూల మొక్క లేదా పండ్ల మొక్క కానివండి కొన్ని రోజుల తర్వాత వాటికి పూలు పండ్లు కాస్తుంటే అ ఆనందం మాటల్లో చెప్పలేనిది. 

దయచేసి ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటండి పర్యావరణాన్నీ కాపాడండీ...