భానోదయం: రూపం మార్చిన ఆక్టోపస్

6, డిసెంబర్ 2018, గురువారం

రూపం మార్చిన ఆక్టోపస్

   
   ఆక్టోపస్ అంటే అందరికి తెలుసు ఆరు నుండి ఎనిమిది కాల్లు ఉంటాయి వాటినే టెంటకిల్స్ అంటారు. అవసరానికి అనుగునంగా తన ఈ టెంటకిల్స్ తో  రూపాన్ని మార్చుకుంటుంది. పరిసరాలకనుగునంగా రంగులు మారుస్తుంది శత్రు జీవులనుండి కాపాడుకోవడానికి దాని శత్రు జీవిగా మారిపోతుంది అది ఆక్టోపస్ ప్రత్యేకత. మరి సముద్రంలో ఉండే ఆక్టోపస్ ప్రపంచం దృష్టిని ఎలా ఆకర్షించింది అంటే సాకర్ వరల్డ్ కప్ 2010 లో ఏ దేశం మ్యాచ్ నెగ్గుతుందో ముందే జోష్యం చెప్పింది అది చెప్పినట్టే జరిగింది దాని యజమాని పాల్. అందుకే దానికి పాల్ ఆక్టోపస్ అని పేరు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఏమైందో కాని తర్వాత ప్రపంచకప్ లో అది కనపడలేదు. రష్యాలో జరిగిన సాకర్ ప్రపంచకప్ లో చెవిటి పిల్లి జోష్యం చెప్పింది.
    మరీ పాల్ ఏమయ్యింది ప్రపంచవ్యాప్తంగా అందరూ పాల్ గురించి ఆలోచిస్తున్నారు చనిపోయిందా లేదా  సముద్రంలోకి వెళ్ళిపోయిందా ఏమైంది.??
       అలా ఆలోచిస్తుంటే ఆంద్రప్రదేశ్ లో ప్రత్యక్షమైంది ఒక కొత్త రూపంలో ఒకప్పుడు ఫుట్ బాల్ ప్రపంచకప్ లకు జోష్యం చెప్పే పాల్ ఇప్పుడు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో జోష్యం చెప్పింది అరే ఈ హైటెక్ యుగంలో ఈ చిలక జోష్యాలు పాల్ జోష్యాలు ఎవడు నమ్ముతారు అని మీరనొచ్చు నమ్మాలి ఎందుకంటే అది చెప్పిన జోష్యం నిజం అయ్యింది కాబట్టి. 2014  ఎన్నికల్లో తెలంగాణలో సర్వే చేసి  ఫలితాలు ఎలా ఉంటాయో ఈ ఆక్టోపాస్ కరెక్ట్ గా చెప్పింది అప్పుడు ప్రపంచం దృష్టి ఆంధ్రావైపు మళ్ళింది పాల్ ఆక్టోపాస్ ఎక్కడికి వెళ్ళలేదు ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళిందని అందరూ దానికి ఆంధ్ర ఆక్టోపస్ అని పేరు పెట్టారు కాని సముద్రంలో ఉండే ఆక్టోపస్ కి తన లక్షణాలు ఒక్కటి కూడాలేవు.
          మరి ఆక్టోపస్ ఎందుకు తన రూపాన్ని కోల్పోయింది అనుకుంటున్నారా ముందే చెప్పానుగా ఆక్టోపస్ అనే జీవి పరిసరాలకనుగునంగా అవసరానికి తగ్గట్టుగా తన రూపాన్ని మార్చుకుంటుందని అందుకే ఇప్పుడు ఇలా ఆంధ్రా ఆక్టోపస్ గా అవతరించింది. రూపం అయితే మారింది గాని అది చెప్పే జోష్యం మారలేదు. 2014 లో సర్వే చేసి అన్ని ఎన్నికల ఫలితాలు కరెక్ట్ గా చెప్పింది. 2018 లో కూడా సర్వేచేసి  ఫలితాలు చెప్పింది కాని అది నిజం అవుతుందో కాదో అసలు అవుతుందా అని డౌటు ఎందుకంటే పాల్ ఆక్టోపస్ ఒకసారి మాత్రమే ఫుట్ బాల్ టోర్నీకి జోష్యం చెప్పింది తర్వాత చెప్పలేదు తన రూపాన్ని మార్చుకున్నట్టే వృత్తిని ,ప్రాంతాన్ని రెండు మార్చేసింది అదేనండి సాకర్ నుండి ఎన్నికలకు, జర్మనీ నుండి ఆంధ్రప్రదేశ్ కు మారింది ఈసారి మాత్రం ఏమీ మార్చలేదు అలాగే ఉంది అందుకే అది చెప్పే జోష్యం కరెక్ట్ కాదని అనిపిస్తుంది.
     అసలు పాల్ ఆటల నుండి రాజకీయాల వైపు అదికూడా తెలుగు రాజకీయాలవైపు వచ్చింది ఎందుకు ?? బహుషా రాజకీయాలంటేనే రంగులు మార్చడం అనుకుందేమో అవసరాన్ని బట్టి రాజకీయ నాయకులు పార్టీ కండువాలు మారుస్తుంటారు అందుకని ఈ వైపు వచ్చి ఉండాలి రంగులు మార్చే నాయకులను ఊసరవెల్లితో పోలుస్తాం నాకేం తక్కువ రంగులతో పాటు రూపాన్ని కూడా మార్చగలననీ ఇటు వైపు వచ్చి ఉండాలి. కొంపదీసి ఈ ఆక్టోపస్ ను రప్పించింది బాబు గారైతే కాదు కదా!!

 అసలు పాల్ ఈ సారి ఎందుకు తన రూపాన్ని మార్చలేదు ఒకవేళ తన జోష్యం తప్పయితే మార్చుతుందేమో చూడాలి. నాలుగైదు సంవత్సారాలకు ఒక సారి  తన రూపాన్ని మార్చేే పాల్  ఆక్టోపస్ ఈ సారి ఎక్కడికి వెళ్తుందో చూడాలి.
   

           
                      సర్వేజన లగడపాటి భవంతు

కామెంట్‌లు లేవు: