భానోదయం: మే 2019

31, మే 2019, శుక్రవారం

ఒక్క మాటతో ఏడు ఎం.పీ సీట్లు పోగొట్టుకున్న కెసీఆర్.




ఒక్క మాటతో ఏడు ఎం.పీ సీట్లు  పోగొట్టుకున్న
కెసీఆర్.

   తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏక పక్షంగా కేసీఆర్ కే మళ్ళీ పట్టం కట్టారు ప్రజలు. 89 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా టిఆర్ఎస్ లో చేరిపోయారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ఎదురులేని విధంగా తయారయింది పరీస్థితి. ఇక రానున్న ఎంపీ ఎలక్షన్లలో 17  సీట్లకు 16  సీట్లు మనమే గెలుస్తాం అనే ధీమాలో ఉన్నారు కేసీఆర్,ఆ పార్టీ నాయకులు. కారు+సారు+సర్కారు=పదహారు అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు ఆపార్టీ నాయకులు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలిచి అలాగే ఓవైసీ సపోర్టు ఎలాగు ఉంటుంది మొత్తం 17 సీట్లు. ఇక ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీ గెలిచే ఎంపీ సీట్ల సపోర్ట్ తో కేంద్రంలో చక్రం తిప్పుదామనుకున్నారు కెసీఆర్ సార్. కేంద్రంలో ఏ పార్టీకి స్వంతంగా  ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని అనుకున్నాడు. ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఏకంగా ప్రధానమంత్రి అవుదామని కలలు కన్నారు కెసీఆర్ సారు.

            ఇక  దేశంలో ఎంపీ ఎలక్షన్స్ తేది ఖరారయ్యింది. అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. టిఆర్ఎస్ పార్టీ గెలుపు ధీమాతో ప్రచారంలోకి దిగింది. అసెంబ్లీ ఫలితాలే పార్లమెంటులో కూడా వస్తాయని ధీమాతో ఉన్నారు. కారు సార్ సర్కారు పదహారు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఇక పార్టీ ముఖ్యమంత్రి కెసీఆర్ సభలలో  ఇతర పార్టీల నాయకులపై ముఖ్యంగా బిజేపి నేతలపై తనదైన శైలిలో విరుచుకు పడ్డారు. ఎలాగు గెలుపు తమదే అని విజయగర్వంతో బిజేపి నేతలపై మీరేనా హిందువులు మేము కదా అంటు విరుచుకుపడ్డారు. మార్చి 17 న కరీంనగర్ సభలో బిజేపి నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తూ  "హిందూ గాళ్ళు బొందు గాళ్ళు" అంటూ వ్యాఖ్యానించారు.
ఈ ఒక్క మాటతో  అప్పటి వరకు కెసీఆర్ కు ఉన్న ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకున్నాడు. కేసిఆర్ హిందు వ్యతిరేకి అంటు జనంలో బలంగా నాటుకు పోయింది.  ఈ వ్యాఖ్యలపై కెసీఆర్ అంత సీరియస్ గా తీసుకోలేదు. ఎన్నికలు ముగిసాయి. అప్పటికి 16 సీట్లు మనవే అనుకున్నారు కెసీఆర్. ఇక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి తీరా ఫలితాలు చూస్తే ఏమయ్యింది సారుకు పదహారు కాదు అందులో సగమే వచ్చాయి. అందరూ షాక్ ఎందుకంటే టిఆర్ఎస్ కు సగం సీట్లు వచ్చినందుకు కాదు రాష్ట్రంలో బిజేపి ఉనికే లేకుండా పోయిందనుకున్నారు. కాని ఈ సారీ బిజేపికి 4 సీట్లు గెలుచుకుని అందరిని ఆశ్ఛర్యపరిచింది. స్వయాన ముఖ్యమంత్రి కుమార్తె సైతం బిజేపి అభ్యర్తి చేతిలో ఓడిపోయింది. మరో మూడు సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. మల్కజ్ గిరిలో రేవంత్ రెడ్డి గెలవడం కూడా కెసీఆర్ పట్ల జనాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని అర్థమవుతోంది.  జనాల్లో కెసీఆర్ పట్ల వ్యతిరేకత రావడానికి ముఖ్య కారణం హిందూ గాళ్ళు బొందు గాళ్ళు అంటూ వ్యాఖ్యానించడం. ఇంకా ముఖ్యమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల గురించి ఎక్కడ ప్రస్తావించక పోవడం. ఇప్పటీకి కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గురించి ఉలుకు లేదు పలుకు లేదు. కెసీఆర్ గారు ఇలాగే ఉంటే ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపి అధికారంలోకి వచ్చిన ఆశ్ఛర్యపోవలసిన పనిలేదు.

               కేంద్రంలో మోది మళ్ళీ అధికారంలోకి రాడని అందరు అనుకున్నారు అన్నిపార్టీలు ఏకమై మోది పై విరుచుకు పడ్డారు. ఎన్ని పార్టీలు ఏకమైన ప్రజలు అందరు ఏకమై మోదికి మళ్ళీ అధికారం కట్టబెట్టారు. ఈ దేశానికి మోది లాంటి నాయకుడే సరియైన వాడని ఈ దేశప్రజలు గట్టిగా నమ్మారు మోదినే ప్రధానిని చేసారు. బిజేపి అంతమైపోతుందని అనుకునే రాష్ట్రంలో ఊహించిన దానికంటే ఎక్కవ సీట్లు సాధించిందటే దానికి కారణం మోది. ఎవరు ఏమనుకున్నా బిజెపీ హిందూ పార్టీ అని చెప్పుకోవచ్చు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఈ దేశ ప్రజలు ఊరుకోరని ఈ పార్లమొంటు ఎన్నికల్లో తెలంగాణ ఫలితాల్లో నిరూపితమయ్యింది.
    ఈ దేశం లౌకిక దేశమే అలాగే హిందు ప్రధానదేశం. ఇతర మతాలను హిందు మతం గౌరవిస్తుంది.

30, మే 2019, గురువారం

ఖజానా ఖాళీ చేసిన బాబు గారు.

ఖజానా ఖాళీ చేసిన బాబు గారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఖజానాలో ఉన్న డబ్బు 100 కోట్లు మాత్రమే. ఈ నెల కావలసింది 5000 కోట్లు.
కొత్త ముఖ్యమంత్రి లోటు బడ్జెట్ తో ఈ నెల ఉద్యోగులకు జీతాలు ఎలా చెల్లిస్తారు. సంక్షేమ పథకాలు ఎలా అందిస్తారని రాస్తున్నారు. సరే అదే మళ్ళీ బాబు గారే ముఖ్యమంత్రిగా గెలిస్తే ఇలా ఖజానా గురించి రాసేవారా. అంటే జగన్ ఇలాంటి ఆర్థిక పరిస్తితులలో రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కించగలడని పరోక్షంగా బాబుగారి పత్రికలు రాస్తున్నాయి.

     కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి జగన్ ఎలా ఈ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతారు. చంద్రబాబు గారు ఎన్నికలకు ముందే ఖజానా మొత్తం ఖాళీ చేసారు. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న నాలుగున్నర ఏళ్ళలో గుర్తుకు రాని ఆడపడుచులు, రైతులు ఎన్నికలకు నాలుగు నెలల ముందు వారిపై ఎనలేని ప్రేమ ముంచుకొచ్చింది. ఖజానాలో ఉన్న కాస్త డబ్బును ఆడపడుచులకు, రైతులకు పంపిణీ చేసాడు . ఎలాగు గెలవనని బాబు గారికి తెలిసిపోయింది అందుకే ఖజానా మొత్తం ఖాళీ చేసాడు. కొత్త ముఖ్యమంత్రికి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యేలా చేసాడు...
ఇలాంటి ఆర్థిక పరిస్థితులలో బాబుగారే రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలడని అందరూ అనుకుంటారని బాబుగారి ఆలోచన.


27, మే 2019, సోమవారం

పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ అయితే టీచర్లకు పరీక్ష.!!

పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ అయితే టీచర్లకు పరీక్ష.!!


     ఎక్కడైనా పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ అయితే మళ్ళీ పరీక్ష రాస్తుంటారు. కాని మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వారికి చదువు చెప్పిన టీచర్లకే పరీక్ష పెట్టాలని నిర్ణయించింది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఆ రాష్ట్రంలో 700 పాఠశాలల్లో  30% మంది  విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో అక్కడి ఉపాద్యాయుల విషయపరిజ్ఞానాన్ని పరీక్షించాలని మధ్యప్రదేశ్ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ పరీక్షలకు కూడా విద్యార్థులకు పెట్టే పరీక్షలవలే ప్రశ్నపత్రాలు రూపొందిస్తారట. పరీక్ష జూన్ 12   జరుగనుంది.
 
      ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారిని స్వచ్ఛందంగా పదవి విరమణ చేయించడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారట. పరీక్షల్లో ఫెయిల్ అయితే విద్యార్థులదే బాధ్యత అంటారు. కానీ మధ్యప్రదేశ్ లో ఉపాద్యాయుల బాధ్యత కూడా ఉంటుందని వారికి పరీక్ష పెట్టి సరైన నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం.
     
             ఏదో మొక్కుబడిగా చదువులు చెప్పి నెల నెల జీతాలు తీసుకోవడం అలవాటయిపోయింది నేటి ప్రభుత్వ ఉపాధ్యాయులకి. విద్యార్థులు చదివిన చదవకపోయిన మాకేంటి మా జీతాలు మాకు వస్తాయి అనే ధోరణిలో ఉన్నారు. ఇప్పటికి అనేక ప్రభుత్వ పాఠశాలల్లో   చదవడం రాయడం కూడా రాని విద్యార్థులు ఉన్నారు. వారు చదవకపోవడానికి కారణం ఎవరు?? ఇందులో  ఉపాధ్యాయుల బాధ్యత ఏమి లేదా..
పైగా కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థినులపై లైంగిక వేదింపులకు పాల్పడుతున్నారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విద్యార్థినులపట్ల  అసభ్యంగా ప్రవర్తిస్తూ నీచానికి దిగజారుతున్నారు.. ఇలాంటి వారి వలన మిగితా ఉపాధ్యాయులకు చెడ్డపేరు వస్తుంది.  ఇలాంటి నీచమైన ఉపాధ్యాయులను ఎవరు ప్రశ్నించకపోవడం వలన వారు ఆడిందే ఆట పాడిందే పాట. మమ్మల్ని ఎవరు ఏం పీకలేరని వారి ధీమా. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి. అప్పుడేె విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. అలాగే విద్యార్థినుల పట్ల నీచంగా ప్రవర్థించే ఉపాధ్యాయులని ఉద్యోగాల నుండి తీసేసి కఠిన శిక్షలు వేయాలి. అలాగే వారి కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత లేకుండా చేయాలి.

                 
           ఒక ప్రభుత్వ ఉద్యోగానికి వేలల్లో పోటిపడుతున్నారు. ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నవారు ఎందరో ఉన్నారు. అలాంటిది టీచర్  ఉద్యోగం చేసుకుంటు అర లక్ష జీతాలు తీసుకుంటు విద్యార్థినులను లైగికంగా వేదిస్తున్నారు.  ఇలా నీచంగా ప్రవర్తించడం చాలా ధారుణం. ఇలాంటి వారిని ఉద్యోగం నుండి తొలగించి నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలి.


పవిత్రమైన ఉపాధ్యాయవృత్తిలో కీచక టీచర్లు.

https://youtu.be/ZDFdUNojDIY

https://youtu.be/SSK11ezwnTc


https://youtu.be/vA2Pt_FaBno





     


26, మే 2019, ఆదివారం

మాల్దీవులు


         ప్రపంచంలో అందమైన దేశాలలో మాల్దీవులు కూడా ఒకటి.  భారతదేశానికి నైరుతిలో హిందుమహాసముద్రంలో ఉన్న అందమైన దేశం. మాల్దీవులు అనేక పగడపు దీవుల సముదాయం. రాజధాని నగరం మాలే. అధికారిక భాష  ధివేహి. సముద్రమట్టానికి చాలా తక్కువ  ఎత్తులోనే ఉంటుంది. పర్యాటక రంగం , మత్సపరిశ్రమ ముఖ్యమైన ఆదాయ వనరులు.
కరెన్సీ మాల్దీవియన్ రుఫియా మన కరెన్సీలో
1mvr=4.50 inr .
అమెరికా డాలర్స్ లో
1usd=15.46 mvr.
వేసవిలో ఒకసారి సరదాగ అందమైన పగడపు దీవులకు వెళ్ళి గడపాలనుకుంటే మాల్దీవులు ఒక మంచి టూరిస్ట్ ప్లేస్.




24, మే 2019, శుక్రవారం

ఓడిన వారి పరిస్థితి ఏంటి..??


     
    ఎన్నికల్లో  గెలిచిన జగన్ సీఎం అవుతారు, నరేంద్ర మోడి పీఎం అవుతారు. మరీ ఓడిన వారి పరిస్థితి ఏంటి..


     ఆంద్రప్రదేశ్ లో జగన్ ప్రభంజనంలో చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ఘోరంగా ఓడిపోయారు
ఈవిఎమ్ మిషన్ ల వల్లే తాము ఓడిపోయామని  చంద్రబాబు అనుమానం. ఎందుకంటే ఎన్నికల కంటే ముందునుండే చంద్రబాబు ఈవిఎమ్ మిషన్ లను వ్యతిరేకిస్తూ వచ్చాడు. జనాల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు ఈవిఎమ్ లు పెట్టిన బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగిన ఎలా గెలుస్తారు. చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో అన్ని సగం సగం పనులే. ఐదేళ్ళు చేయలేని పనులు ఎన్నికలు దగ్గర పడగానే రైతులకు , ఆడపడుచులకు ఎవో కొన్ని తాయిలాలు ఇస్తే తనను మళ్ళీ గెలిపిస్తారని బాబు ఐడియా. జనాలు వెర్రి వాళ్ళ ఏంటి? ఇచ్చింది పుచ్చుకుని బాబుకు తగిన బుద్ది చెప్పారు.
ఐదేళ్ళు పట్టించుకోకుండా ఎన్నికలకు ముందు ప్రేమ ఒలకబోస్తే ఎవరు నమ్ముతారు.? అందుకే బై బై బాబు అంటు ఇంటికి పంపారు.?
పైగా కేంద్రంలో చక్రం తిప్పుదామనుకున్నాడు కాని రాష్ట్రంలోనే సైకిల్ ఫంక్చర్ అయ్యే ఇకా చేసేదేముంది  సైకిల్ చక్రాలు పీకి మనవడితో ఆడుకుంటాడు... అని జనాలు అనుకుంటున్నారు..
 
పవన్ కళ్యాణ్ పరిస్థితి మరీ ధారుణం ఛాయ్ పోయక ముందే గ్లాస్ పగిలిపాయే..  తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన పేరు చెప్పుకుని ఎమ్మెల్యేగా నిలడితే కళ్ళుముసుకుని గెలిచేంత పవర్ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి స్వయంగా ఎన్నికల్లో  ఎమ్మెల్యేగా నిలబడితే ఘోరంగా ఓడిపోవడం శ్చర్యం వేస్తుంది. ఒకచోట కాదు  రెండు చోట్ల ఓడిపోవడం ఇంకా ఆశ్చర్యం...
   పవన్ సార్ కి తెలియదు ఈలలు గోలలు వేసినంత ఈజీగా ఓట్లు పడవని. ఇంకా నయం ఒక్క సీటు గెలుచుకుని ఇజ్జత్ కాపాడుకున్నాడు.
ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్  తన పార్టీ గెలిచే సీట్లతో చక్రం తిప్పుదామనుకున్నాడు. కర్ణాటకలో కుమారస్వామిలాగా కింగ్ మేకర్ అవ్వాలనుకున్నాడు కాని జనాలు జోకర్ ని చేసారు. ఆవేశ ప్రసంగాలు, పంచ్ డైలాగులు, సాదారణ వ్యక్తిలాగా వ్యవహరించడాలు ఇవేమి ఆయనను గెలిపించలేవు. ఈ ఎన్నికల్లో గబ్బర్ సింగ్ లాగా పవర్ చూపిద్దామనుకున్నాడు కాని అజ్ఞాతవాసిలాగా అయిపోయాడు. ఇక పవన్ సార్ ఐదేళ్ళు ప్రశ్నిస్తాడో లేక అజ్ఞాతవాసి లాగా సినిమాలు తీసుకుంటాడో వేచిచూడాలి....



   కేంద్రంలో రాహుల్ గాంధీ పరిస్థితి చూస్తే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాం కాబట్టి ఈ సారి కేంద్రంలో కూడా గెలిచి ప్రధాని  అవుదామనుకున్నాడు. కాని పప్పు అయ్యాడు. రాఫెల్ ను  పట్టుకుని వేలాడితే జనాలు ఎలా ఓట్లేస్తారు.
అటు వైపు ఉన్నది మోది. రాహుల్ లాంటి వాళ్ళ పప్పులు ఉడకవక్కడ. ఈ దేశ ప్రజలు రాహుల్ గాంధీని ఒక జోకర్ లా చూస్తారే తప్ప ప్రధానమంత్రి పదవి పై కూర్చోబెట్టే సాహసం చేయరు. దేశం గురించి అవగాహన లేని వ్యక్తి దేశ ప్రధాని అవ్వలేడు. ప్రజలకు కావాలసింది సమర్థవంతంగా పాలించే పాలకులు రాహుల్ గాంధీ లాంటి పప్పూలు కాదు. ఇక రాహుల్ గాంధీ బంపర్ మెజారిటీతో కేరళలో గెలవడం ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ రాహుల్ గెలవడానికి ప్రధాన కారణం అక్కడ హిందూ వ్యతిరేకతే కారణం. హిందూ వ్యతిరేక ఓటర్లు  ఓటు వేయడం మూలాన  రాహుల్ గాంధీ అక్కడ గెలిచారు. యూపిలో ఓడిపోయాడు.
ఒక చోట గెలిచాడు ఎలాగు పార్లమెంటు లో అడుగు పెడుతాడు తర్వాత ఇంకెంటి ప్రియా ప్రకాశ్ వారియర్ లా కన్నుకొడుతూ ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేస్తాడు.  బయట రాఫెల్ గురించి వాదిస్తూ మరో ఐదేళ్ళు అలా ముందుకు వెళ్తాడు...

23, మే 2019, గురువారం

నరేంద్ర మోది, రాహుల్ గాంధీ ఎవరు ప్రధాని..??

భారతదేశ ప్రధానిగా ఎవరు గెలిచేదెవరు..,

ఈ ఎన్నికల్లో బిజేపి కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటి
ఒక వైపు నరేంద్ర మోది మరో వైపు రాహుల్ గాంధీ ఇద్దరిలో గెలుపెవరిది. ఈ దేశ ప్రజలు ఎవరికి ప్రధానమంత్రిగా పట్టం కట్టబోతున్నారు.

జస్ట్ మరికొన్ని గంటల్లో ఫలితం తేలబోతుంది.
ఇక నరేంద్ర మోది మరియు రాహుల్ గాంధీ ఇద్దరి పట్ల జనాల్లో ఉన్న అనుకూలతలు ప్రతికూలతలు చూద్దాం.

నరేంద్ర మోది:

  ఛాయ్ అమ్మే వ్యక్తి, ఒక సామాన్య కార్యకర్త నుండి ఈ దేశాన్ని పాలించే స్థాయికి ఎదిగాడు.

అందరి నాయకుల్ల అవినీతికి పాల్పడి వేల కోట్లు దోచుకోవడానికి ఆయనకు కుటుంబం లేదు.

కుటుంబ పాలనకు దూరం.

ప్రపంచ దేశాలతో స్నేహపూర్వక వాతావరణం నెలకోల్పాడు.

మోది వచ్చాక గడిచిన ఐదేళ్ళలో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది. అదే కాంగ్రెస్ పాలనలో అయితే  దేశంలో ఎప్పుడు బాంబు దాడులతో అల్లకల్లోలంగా ఉండేది.

ఏ ప్రధాని చేయలేని సాహసం మోది చేసారు. అసలు ఎవరు కలలో కూడా ఊహించని విధంగా నోట్లరద్దు చేసాడు.

జిఎస్టీని అమలు పరిచాడు.

పాకిస్థాన్  ఉగ్రవాదులపై  రెండు సార్లు సర్జికల్ దాడులు చేసి తగిన గుణపాఠం చెప్పాడు.

మోది వల్ల ఈ దేశం కొంచెం ప్రశాంతంగా ఉంది.

దేశంలో ప్రాంతీయ పార్టీలన్ని కలిసి నరేంద్రమోడిని ఓడించాలని చూస్తున్నారు. 22 పార్టీలు ఒక వైపు బిజెపి ఒక వైపు. ఈ పార్టీలన్ని ఒకటైనప్పుడే అనిపిస్తుంది ఒక్కడిని ఓడించడానికి అందరూ కలిసారు అంటే వీరికి దేశ ప్రయోజనాలకంటే మోడిని ఓడించడమే ముఖ్యం. ఇది మోడి గారికి కలిసొచ్చే అంశం. ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు.

ప్రతికూలతలు:

నోట్లరద్దు అంశం ఈ నోట్లరద్దు వల్ల ప్రతి ఒక్కరు ఇబ్బందులకు గురయ్యారు. నోట్లరద్దు వల్ల నల్లధనం బయటికి రాకపోగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

జీఎస్టీ వల్ల సామాన్యులకు ఒరిగిందేమి లేదు.

మోడి హాయంలో జవాన్ లపై దాడులు పెరిగిపోయాయి.

మేకిన్ ఇండియా లాంటివి  ప్రగతి సాదించలేకపోయాయి.

మోది హిందు పక్షపాతి అని  ఇతర పార్టీల వాళ్ళ ఆరోపణ.

రాహుల్ గాంధీ:

మాజీ ప్రధాని కుమారుడు.

దేశపాలనలో ఉన్నప్పుడే ప్రాణాలు అర్పించిన నాయకుల వారసుడు.

తను ప్రధాని అయ్యే అవకాశం ఉన్న త్యాగం చేసి మన్మోహన్ సింగ్ గారిని ప్రధాని ని చేసిన సోనియా గాంధీ గారు ఈ సారి ఆయన కుమారుడిని ప్రధానిగా చూడాలనుకుంటున్నారు.

ప్రతికూలతలు :

పరిపాలన అనుభవం లేకపోవడం.

దేశ సమస్యలపై కాస్తైన అవగాహన రాహుల్ గాంధీకి లేదు. కేవలం ఈ ఐదేళ్ళలో ఒకే ఒక అంశాన్ని పట్టుకుని వేళాడాడు అదే రాఫెల్ అంశం.
రాహుల్ గాంధీ గారికి రాఫెల్ అనే అంశం తప్పితే దేశంలో ఇంక వేరే సమస్యలు ఏవి కనిపించలేవు.

ఇలాంటి వారు ప్రధాని అయితే దేశాన్ని ఏం పాలిస్తారు. కాంగ్రెస్ ప్రధానులు రబ్బర్ స్టాంపు ప్రధానులని పేరు దీనికి రాహుల్ మినహయింపేమి కాదు.

ఇక పదేళ్ళు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రేస్ హాయాంలో  వెలుగు చూడని కుంభకోణం లేదు. కాంగ్రెస్ అంటే కుంభకోణాలు కుంభకోణాలంటే కాంగ్రేస్ పార్టీ అనే విధంగా రోజుకో కుంభకోణాలు వెలుగుచూసాయి  వారి హాయాంలో. అలాంటి పార్టీకి మళ్ళీ జనాలు పట్టం కడుతారా అంటే డౌటే..

ఇక ఈ సారి రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి కాబట్టి దేశ సమస్యలపై కనీస అవగాహన లేని రాహుల్ గాంధీ ప్రధాని అయితే సమర్థవంతంగా ఆయన ఈ దేశాన్ని సమర్థవంతంగా పాలించగలడని నమ్మకం జనాలకు లేదు. కాబట్టి ఆయన ప్రధాని అయ్యే అవకాశం లేదు.


నోట్లరద్దు, జీఎస్టీ లాంటి వాటి వల్ల జనాలు ఇబ్బందులకు గురి అయిన , సర్జికల్ దాడులు వంటి సహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న అవి  దేశ ప్రయోజనాల కోసమే కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకునే మోడినే మళ్ళీ ప్రధాని కావాలని జనం కోరుకుంటున్నారు.

ఇక రాహుల్ గాంధీ ఈ దేశాన్ని పాలించగలడని ప్రజల్లో నమ్మకం లేదు. ఈ సారి కాదు కదా ఇంకో ఇరవై ఏళ్ళయిన మోడినే ప్రధాని గా గెలుస్తారు.

అన్ని పార్టీలు ఏకమైన మోడి  విజయాన్నీ ఎవరు ఆపలేరు. ఈదేశానికి కావలసింది ధమ్మున్న నాయకుడు. పప్పూలు కాదు.

సో 2019 లో  భారత ప్రధానిగా మళ్ళీ నరేంద్ర మోది గారు గెలుస్తారు.




22, మే 2019, బుధవారం

ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు..??

ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు..??

   మనదేశంలో అటు పార్లమెంటు ఎన్నికలు ఇటు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు అందరికి ఆసక్తికర అంశం ఎవరు గెలుస్తారు అని. కేంద్రం సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలుగు ప్రజలందరిలో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా చంద్రబాబు గారు, జగన్ గారు, పవన్ గారు ఈ ముగ్గురి మధ్యే పోటి నెలకొంది. ఇందులో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు ఎందుకంటే ఆయనకు వచ్చే సీట్లు అంకెలకే పరిమితమవుతాయి కాబట్టి ఆయన సీఎం కాలేరు ఒకవేళ కింగ్ మేకర్ అవుతాడనుకుంటే ఆయన పార్టీకి వచ్చే సీట్లతో అది సాధ్యం కాదు.
ఇక చంద్రబాబు గారు మరియు జగన్ గారి మధ్యే అసలైన పోటి. వీరిద్దరిలో జగన్ కు అత్యధికంగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సారి మాత్రం జగన్ సీఎం అవడం పక్క.

చంద్రబాబు, జగన్, పవన్ ఈ ముుగ్గురిలో ప్రజలు ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు. ఎందుకుఅనేది ఇప్పుడు చూద్దాం.

చంద్రబాబు: అనుకూలతలు

సీనియర్ రాజకీయ నాయకుడు.
మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగాన్ని స్థాపించి హైదరాబాదును ప్రపంచవ్యాప్తం చేసాడు.

ఇక రాష్ట్రం విడిపోయాక రాజధాని నగరాన్ని నిర్మిస్తున్నాడు.

ఆంధ్రుల ఎన్నో ఏళ్ళ స్వప్నం పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాడు.

కియా కార్ల కంపెనీని రాష్ట్రంలో నెలకొల్పాడు.

సెల్ఫోన్ తయారి కంపెనీలు రాష్టరంలో ఏర్పాటు చేసాడు.

చంద్రబాబు ప్రతికూలతలు:

ఉమ్మడి రాష్ట్రాన్ని 9 ఏండ్లు పాలించినప్పుడు కేవలం ఐటీ రంగాన్ని మాత్రమే ప్రోత్సాహించి మిగిత రంగాలను పట్టించుకోలేదు.


వ్యవసాయం దండగ అన్నాడు. వ్యవసాయ రంగాన్ని, రైతులను అవమానించాడు.

కరెంట్ అడిగిన పాపానికి రైతులపై కాల్పులు జరిపించాడు.

అన్ని రంగాలను తుంగలో తొక్కి కేవలం ఐటీ రంగాన్ని మాత్రమే ప్రోత్సహించి హైదరాబాదును అభివృద్ది చేసానని చెప్పుకుంటాడు.

ఉమ్మడి రాష్ట్రం చాలా పెద్దది కేవలం హైదరాబాదును అభివృద్ది చేసి నేను ఈరాష్ట్రాన్ని అభివృద్ది చేసానని పదే పదే చెప్పుకుంటాడు. సరే హైదరాబాదును అభివృద్ది చేసాడు మిగితా ప్రాంతాల పరిస్థితి ఏంటి.?  అక్కడ ప్రజలకు ఉపాది అవకాశాలు ఏంటి.

హైదరాబాద్ లో అభివృద్ది కూడా కేవలం ఐటీ రంగంలోనే చేసాడు. మరి మిగితా రంగాల పరిస్థితి ఏంటి..? అందరు చదువుకున్న వాళ్ళు ఉండరు కదా వారికి ఉపాది అవకాశాలు ఎలా??

హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టింది నేనే అనే చంద్రబాబు గారు ఒకసారి మూసీ నదిని కూడా ప్రపంచ పటంలో పెట్టి ఆయన  చేసిన అభివృద్దిని ప్రపంచానికి చూపాలి..

చంద్రబాబు గారు 9ఏండ్లు సీఎం గా ఉన్నప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్రానికి చేసింది ఒక ఐటీ తప్ప మిగితాదంతా శూన్యం.

ఇక రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు గారు చేసింది రాజధాని నిర్మాణం అది సాగుతూనే ఉంటుంది సింగపూర్ ల చేస్తా అని చెప్పుకుంటున్నారు. అది పూర్తయ్యేదెప్పుడో.

పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నానని గొప్పలు చెప్పే బాబుగారు ఆ ప్రాజెక్ట్ ను ప్రాజెక్ట్ ఐదేళ్ళలో పూర్తి చేయలేదు ఎందుకు ??  ఎందుకంటే చంద్రబాబు  మళ్ళీ గలవకపోతే   ప్రాజెక్ట్ పూర్తవదని జనాలు అనుకుని మళ్ళీ గెలిపిస్తారని ఆయన భ్రమ.

ప్రత్యేక హోదా విషయంలో రోజుకో మాట మాట్లడుతారు.

ఇక గొప్ప కార్ల కంపెని కియా ను రాష్ట్రంలో ఏర్పాటు చేసాను. ఇలాంటి కంపెనీలు చంద్రబాబు వల్లే సాధ్యం అని ప్రజలు భావించి మళ్ళీ తనని గెలిపిస్తారని అనుకుంటున్నాడు. ఓకే..   కార్ల కంపెని వచ్చింది రాష్ట్రానికి. దానివల్ల ఎవరికి ప్రయోజనం
స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని అనుకోవచ్చు కాని అందులో పెద్ద ఉద్యోగాలు అన్ని ఇతర దేశాలు లేదా ఇతర రాష్ట్రాల వారికే వస్తాయి. చిన్న చితక ఉద్యోగాలు స్థానికులకు ఇస్తారు. అందులోను గొడ్డు  చాకిరి చేయించుకుంటారు. ఇలాంటి గొడ్డు పనులు ఎలాగు  మనవాళ్ళు చేయరు అందువలన ఇతర రాష్ట్రాలు ఒడిశా, బీహార్ లాంటి రాష్ట్రాల వారిని  తెప్పించి వారితో చేయించుకుంటారు. ఇప్పుడు చెప్పండి స్థానికులకు ఉద్యోగాలు ఎక్కడివి. ఇలాంటి కంపెనీల వలన ఎవరికి ప్రయోజనం.

మిగితా కంపెనీలైనా సెల్ఫోన్, ఎలక్ట్రానిక్ కంపెనీలలో కూడా ఇదే పరిస్థితి స్థానికులకు ఉద్యోగాలు శూన్యం. పేరుకు ఉద్యోగాలు ఇస్తారు కాని మనవాళ్ళ చేత గొడ్డు చాకిరి చేయించి పొమ్మనలేక పొగ పెట్టిన చందాన వ్యవహరించి బయటికి వెళ్ళేలా చేసి ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఇస్తారు. ఇప్పుడు చెప్పండి ఇదేనా అభివృద్ది అంటే ఈ కంపెనీల వల్ల స్థానికులకు ప్రయోజనం లేకపోగా కాలుష్యం మాత్రం దండిగా ఉంటాది. కాలుష్యం స్థానికులకి ఉద్యోగాలు ఇతర రాష్ట్రాల వారికి ఇది చంద్రబాబు అభివృద్ధి.

ఇక రైతుల విషయానికి వస్తే చంద్రబాబు గారు చేసింది అప్పుడు శూన్యమే ఇప్పుడు పరమ శూన్యం.  రైతులకు , కార్మికులకు,పేదవారికి, మధ్యతరగతి వారికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చని బాబు గారు మళ్ళీ ఎలా ముఖ్యమంత్రిగా గెలుస్తారు.
చంద్రబాబు గారికి ఓటు వేసేది కేవలం ఐటీ ఉద్యోగులు, పార్టీ కార్యకర్తలు మాత్రమే.

ఇక జగన్ విషయానికి వస్తే

ప్రతికూలతలు:

అక్రమ ఆస్తుల కేసులు ఒక్కటే ఆయనపై ఉన్న ఉన్న ప్రతికూల అంశం.

ఇంకోకటి పరిపాలన అనుభవం లేకపోవడం.

 అనుకూలతలు:

రాష్ట్రమంతట పాదయాత్ర చేసి
ఒంటి చెత్తో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి అయిన  మహా నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి కూమారుడిగా ప్రజల్లో జగన్ అంటే అభిమానం.

దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల జనాల హృదయాలు గెలుకున్న నేత ప్రియతమ రాజశేఖర్ రెడ్డిగారు.

రాష్ట్ర ప్రజల సేవలో నిరంతరం కృషి చేస్తూ ప్రజాసేవలోనే తన జీవితాన్ని త్యాగం చేసిన మహావ్యక్తి వైయస్ రాజశేఖర్ రెడ్డిగారు. ముఖ్యమంత్రి పదవికే వన్నే తెచ్చిన మహానేత.
అలాంటి మహానేత కుమారుడు  ముఖ్యమంత్రి అయితే మళ్ళీ రాజశేఖర్ రెడ్డిగారిలా రాష్ట్రాన్ని పాలిస్తాడని జనాలు విశ్వసిస్తున్నారు.

రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాల ద్వారా లభ్ధి పొందారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చిరస్మరణీయం.

  మహానేత  రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతాడని జనాలు విశ్వసిస్తున్నారు.

మరో విషయం ఏంటంటే  జగన్ రాష్ట్రమంతట పాదయాత్రలు చేసి ఆయా ప్రాంతాల పరిస్థితులను  అక్కడి సమస్యలను దగ్గరుండి చూసాడు కాబట్టి జగన్ సీఎం అయితే అక్కడి సమస్యలు పరిష్కారం అవుతాయని జనం జగనే సీఎం కావాలనుకుంటున్నారు.

జగన్ సీఎం అయితే  రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్ని మళ్ళీ ప్రారంభించి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడుతాడని ప్రజలు జగనే సీఎం కావాలనుకుంటున్నారు.

ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నూటికి నూరు శాతం వైయస్ జగన్ గారే.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే లగడపాటి  సర్వే ఏపి ఎన్నికల విషయంలో తప్పు చెప్పిన పవన్ కళ్యాణ్ గారి గురించి కరెక్ట్ గా చెప్పారు.   ఒకటి నుండి మూడు సీట్లు మహా అయితే అంకెలు దాటి సంఖ్యలకు వెళ్ళవు ఆయన పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య. కాబట్టి పవన్ ఈసారి పోటిలో ఉన్న ముఖ్యమంత్రి అన్న పదానికి ఇంకో 20 ఏండ్లు వేచిచూడాలి.

పవన్ పరిస్థితి  ఎలా ఉందంటే పూనకం వచ్చినప్పడు ఊగిపోయి పప్రంగిస్తుంటాడు. ఆయనకు అంత ఆవేశం ఎందుకో ఆయన అభిమానులకే అర్థం కాదు.

రాజకీయాల పట్ల అవగాహన లేదు. పరిపాలన పట్ల అంతకన్నా లేదు ఇలాంటి వ్యక్తి సీఎం అవడం కష్టం. ఇది సినిమా కాదు జీవితం సినిమాల్లో లాగా డైలాగులు కొడితే ఈలలు పడుతాయే తప్ప ఓట్లు పడవు. జనాలకు కావాలసింది పంచ్ డైలాగులు కొట్టేవాడు కాదు. సమర్థవంతంగా రాష్ట్రాన్ని పాలించేవాడు. ఆ నమ్మకం ఈసారి ప్రజలు జగన్ పై ఉంచారు.

2019 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైయస్ జగన్.






19, మే 2019, ఆదివారం

లగడపాటి సర్వే మళ్ళీ బొక్క బోర్ల పడబోతుంది.

     
                   ఎన్నికల సర్వేల్లో లగడపాటి సర్వే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అన్ని సర్వేలు ఏమోకాని లగడపాటి సర్వేలు అంటే జనాలకు ఆసక్తి ఎక్కువ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లగడపాటి గారి  సర్వే బొక్క బోర్ల పడింది. అంతటితో సర్వేల సన్యాసం తీసుకుంటాడనుకున్నారందరు. కాని మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ తో పాటు ఏపి అసెంబ్లీ ఎన్నికల తన సర్వేలు ప్రకటించారు. పార్లమెంటు ఫలితాలు ఎలా ఉన్నా ఏపి అసెంబ్లీ ఫలితాలపై లగడపాటి సర్వే మీదే అందరికి ఆసక్తికరంగా మారింది.

    లగడపాటి సర్వే ప్రకారం ఏపి అసెంబ్లీ ఫలితాల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తన తన సర్వే ప్రకటించాడు.

ఇందులో తెదేపాకు 90 నుండి 110 సీట్లు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 65 నుండి 69 సీట్లు.

జనసేనకు  3 సీట్లు.

ఇతరులకు 1 నుండి 5  సీట్లు వస్తాయని తన ఫలితాలు ప్రకటించాడు.

మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లగడపాటి సర్వే ఏమైంది ఆయన ప్రకటించిన ఫలితాలన్ని తలకిందులైపోయాయి. ఆయన నిజంగా సర్వే చేయలేదు కేవలం తనకు ఇష్టమైన పార్టీలు నాయకులకు అనుకూలంగా ఫలితాలు ప్రకటించి వారిని సంతోషపరిచాడే తప్ప అది నిజమైన సర్వే కాదు. ఇప్పుడు కూడా అలాగే ఉందనిపిస్తుంది ఏపి అసెంబ్లీ ఎన్నికల్లో  లగడపాటి గారు చంద్రబాబు గారికి అనుకూలంగా ఫలితాలు ప్రకటించాడే తప్ప అది నిజమైన సర్వే మాత్రం కాదు. ఈ సారి కూడా లగడపాటి సర్వే బొక్క బోర్ల పడబోతుంది ఇది మాత్రం పక్క. ఇక ఇంతటితో లగడపాటి గారు సర్వేలకు సన్యాసం తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను. అప్పుడు కూడా ఇంకా సర్వేలు చెస్తూ ఉంటే మాత్రం ఆయన ఒక జోకర్ ల జనాల్లో మిగిలిపోతారు.

   చంద్రబాబు గారికి అనుకూలంగా ఫలితాలు వస్తాయని ప్రకటించిన లగడపాటిగారు. చంద్రబాబు గారికి ఓకింత సంతోషం కలిగించారు.  కాని చంద్రబాబు గారికి మాత్రం మళ్ళీ సీఎం అవుతానో కాదో అని బయపడిపోతున్నారు. అధికారంలో ఉండికూడా ఈసీని నిందిస్తున్నారు. వ్యవసాయం దండగ అన్న హైటెక్ బాబు గారు హైటెక్ సిటీని ఆంద్రప్రదేశ్ కి పరిచయం చేసి ఐటీ స్పెల్లింగ్ కి అర్థం చెప్పిన బాబు గారు ఇప్పుడు మాత్రం అదె ఐటీ రంగానికి చెందిన EVM లను  నమ్మడం లేదు. అధికారంలో ఉండికూడా తను గెలుస్తానో లేదో అని బయపడి పోతున్న బాబు గారు ఒకవేళ అపోజిషన్ లో ఉండి ఉంటే అధికార పార్టీ వాళ్ళు అధికార బలంతో తనను గెలవనీయలేదని  దుమ్మెత్తిపోసేవారు. ఈసారి ఒకవేళ బాబుగారు ఓడిపోతే EVM ల వల్లే ఓడిపోయామని తెపుతారు. అంతేకాని తన అసమర్థ పాలన అని ఒప్పుకోడు. ఏది ఏమైన లగడపాటి గారి సర్వే వల్ల బాబు గారు ఫలితాలు వచ్చేవరకు ఫ్రస్ట్రేషన్ లేకుండా కొంచెం ఫన్ గా ఉంటాడు.

రైతుల గురించి మహర్షి కంటే ముందే చెప్పిన నేను


 రైతుల కష్టాల గురించి మహర్షి సినిమా కంటే ముందే చెప్పిన నా పోస్ట్.. రైతునేస్తం.

రైతునేస్తం

https://bhaanodhayam.blogspot.com/2018/03/blog-post.html?m=1

16, మే 2019, గురువారం

ఇనుప రేకుల ఇళ్ళు

   

   ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి. బయట తిరగలేం ఇంట్లో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడుతాం. ఇంట్లో ఏసీలు,  ఫ్యాన్ లు, కూలర్ లు ఆన్ చేసుకుని హాయిగా ఉంటాం. కాని అవి అందరికి సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇళ్ళు కాంక్రీట్ తో నిర్మించినది కావు ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు ఇళ్ళను వివిధ రకాలుగా నిర్మించుకుంటారు. అప్పట్లో ఇళ్ళు తాటాకులతో గడ్డితో నిర్మించేవారు కొందరు నాపరాయితో ఇళ్ళ పైకప్పులు నిర్మించేవారు.  కొందరు  మిద్దెలు నిర్మించేవారు.ఈ ఇళ్ళల్లో ఎండాకాలం చాలా చల్లగా ఉంటుంది. మరియు అన్ని కాలాలకు అనుకూలంగా ఉండేవి.కాలక్రమేణ ఇలాంటి ఇళ్ళు మాయమైపోతున్నాయి. అందరు కాంక్రీట్ ఇళ్ళనే నిర్మించుకుంటున్నారు. కాంక్రీట్ ఇళ్ళు నిర్మించుకునే స్థోమతలేని వారు రేకులతో ఇంటి పైకప్పు నిర్మించుకుంటున్నారు.

  ఈ రేకుల ఇండ్లను కొందరు సింమెంటు రేకులతో నిర్మించుకుంటే మరికొందరు ఇనుప రేకులతో నిర్మించుకుంటున్నారు. కొంతవరకు సిమెంట్ రేకులు నయం కాని ఇనుపరేకుల ఇండ్లల్లో మాత్రం చాలా కష్టంగా ఉంటుంది.కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు కూడా ఈ ఇనుప రేకుల ఇళ్ళళ్ళో పనిచేయవు. ఎందుకంటే ఈ రేకులతో నిర్మించిన ఇళ్ళు ఏ కాలానికి అనుకూలంగా ఉండవు. మొగలి రేకులు అనే సీరియల్ ను లక్షా ఎపిసోడ్ లు చూస్తాం కాని ఇనుప రేకుల ఇళ్ళళ్ళో ఒక్కరోజు కూడా ఉండలేం.

ఇనుప రేకులు అన్ని కాలాల వాతావరణాన్ని రెట్టింపు చేసి అందులో నివసించే వారికి చుక్కలేం ఖర్మ పాలపుతలను కూడా టెలిస్కోప్ లేకుండా చూపిస్తుంది.

ఎండాకాలంలో బయటి కంటే కూడా వేడి ఎక్కువగా ఉంటుంది.

బయట 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే లోపల 45 డిగ్రీలు ఉంటుంది.

ఇక ఫ్యాన్ వేసుకుంటే బోనస్ గా మరో ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి టోటల్ గా 50 డిగ్రీలవుతుంది.

 వానాకాలంలో వర్షం పడుతుంటే భారి శబ్ధంతో ఏమి వినపడదు.

5 సెం.మీ. వర్షం పడితే లోపల మాత్రం 20 సెం.మీ. వర్షం కురిసినంత శబ్ధం వస్తుంది.

ఇక చలికాలంలో అయితే బయట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు ఉంటే లోపల 10 డిగ్రీలు ఉంటుంది.

 సాదారణంగా చలికాలంలో మంచుకురుస్తుంది.
ఇనుప రేకుల ఇళ్ళల్లో మాత్రం పైనుండి చల్లని నీళ్ళు కురుస్తుంటాయి. ఇళ్ళంతా వర్షం పడుతున్నట్టు ఉంటుంది.

ఏమని చెప్పాలండీ ఇనుపరేకుల ఇళ్ళల్లో నివసించేవారి బాధలు ఏ కాలానికి కూడా ఈ రేకులు పనికి రావు పైగా ఆ కాలంలో మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంటాయి. అందరికి నేను చెప్పేది ఏంటంటే  వీలుంటె కాంక్రీటుతో ఇళ్ళు నిర్మించుకోండి అంత స్థోమతలేని వారు కనీసం తాటాకులతోనైనా ఇళ్ళు నిర్మించుకోండి అంతేకాని ఇనుప రేకులతో నిర్మించుకోవద్దు. ఎందుకంటే ఇనుపరేకులు అన్నికాలాలకునకు వ్యతిరేకంగా పనిచేస్తాయి.

 ఎండాకాలంలో వేడిని రెట్టింపు చేస్తుంది.
వానాకాలంలో వాన శబ్ధాన్ని రెట్టింపు చేస్తుంది.
చలికాలంలో చలిని రెట్టింపు చేస్తుంది.

ఎందుకు ఈ రేకులను పైకప్పుగా వేసుకున్నామా అనిపిస్తుంది.
దీనికంటే గడ్డితో కప్పుకున్న గుడిసే ఇళ్ళు 100 రెట్లు నయం. ఎందుకంటే గుడిసెలో ఏ కాలంలో అయిన మనకు అనుకూలంగా ఉంటుంది. గుడిసె అని చిన్న చూపు చూస్తారుగాని ఇవి అన్ని కాలాలకు అనుకులం పర్యావరణ హితంగా ఉంటాయి.

ఇనుప రేకుల ఇళ్ళతో ఇన్ని అవస్థలు పడేకంటే సిమెంటు రేకులు వేయవచ్చు కదా అంటే సిమెంట్ రేకులంటే భయం. ఎందుకంటే ఎవరైన ఇంటిమీద రాళ్ళేస్తారని భయం. అందుకే ఎంత అసౌకర్యంగా ఉన్నా ఇనుప రేకులతోనే ఇంటి పైకప్పు నిర్మించుకుంటున్నారు.

                మరి ఇనుప రేకుల ఇళ్ళళ్ళో ఇన్ని అసౌకర్యాలు భరిస్తూ ఉండాల్సిందేనా దీనికి  పరిష్కారం లేదా అంటే ఉంది. అదేలాగంటే థర్మకోల్ సీలింగ్. ఈ థర్మకోల్ సీలింగ్ ని ఇంట్లో బిగించుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఎండా,వానా,చలి కాలాలలో ఎలాంటి ఇబ్బందిలేకుండా రేకుల ఇంట్లో ఉండొచ్చు. దీనివల్ల ఇళ్ళు అందంగాను ఉంటుంది.
దీనిని తక్కువ ఖర్చుతో మనమే ఇంట్లో బిగించుకోవచ్చు.