భానోదయం: ఓడిన వారి పరిస్థితి ఏంటి..??

24, మే 2019, శుక్రవారం

ఓడిన వారి పరిస్థితి ఏంటి..??


     
    ఎన్నికల్లో  గెలిచిన జగన్ సీఎం అవుతారు, నరేంద్ర మోడి పీఎం అవుతారు. మరీ ఓడిన వారి పరిస్థితి ఏంటి..


     ఆంద్రప్రదేశ్ లో జగన్ ప్రభంజనంలో చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ఘోరంగా ఓడిపోయారు
ఈవిఎమ్ మిషన్ ల వల్లే తాము ఓడిపోయామని  చంద్రబాబు అనుమానం. ఎందుకంటే ఎన్నికల కంటే ముందునుండే చంద్రబాబు ఈవిఎమ్ మిషన్ లను వ్యతిరేకిస్తూ వచ్చాడు. జనాల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు ఈవిఎమ్ లు పెట్టిన బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగిన ఎలా గెలుస్తారు. చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో అన్ని సగం సగం పనులే. ఐదేళ్ళు చేయలేని పనులు ఎన్నికలు దగ్గర పడగానే రైతులకు , ఆడపడుచులకు ఎవో కొన్ని తాయిలాలు ఇస్తే తనను మళ్ళీ గెలిపిస్తారని బాబు ఐడియా. జనాలు వెర్రి వాళ్ళ ఏంటి? ఇచ్చింది పుచ్చుకుని బాబుకు తగిన బుద్ది చెప్పారు.
ఐదేళ్ళు పట్టించుకోకుండా ఎన్నికలకు ముందు ప్రేమ ఒలకబోస్తే ఎవరు నమ్ముతారు.? అందుకే బై బై బాబు అంటు ఇంటికి పంపారు.?
పైగా కేంద్రంలో చక్రం తిప్పుదామనుకున్నాడు కాని రాష్ట్రంలోనే సైకిల్ ఫంక్చర్ అయ్యే ఇకా చేసేదేముంది  సైకిల్ చక్రాలు పీకి మనవడితో ఆడుకుంటాడు... అని జనాలు అనుకుంటున్నారు..
 
పవన్ కళ్యాణ్ పరిస్థితి మరీ ధారుణం ఛాయ్ పోయక ముందే గ్లాస్ పగిలిపాయే..  తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన పేరు చెప్పుకుని ఎమ్మెల్యేగా నిలడితే కళ్ళుముసుకుని గెలిచేంత పవర్ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి స్వయంగా ఎన్నికల్లో  ఎమ్మెల్యేగా నిలబడితే ఘోరంగా ఓడిపోవడం శ్చర్యం వేస్తుంది. ఒకచోట కాదు  రెండు చోట్ల ఓడిపోవడం ఇంకా ఆశ్చర్యం...
   పవన్ సార్ కి తెలియదు ఈలలు గోలలు వేసినంత ఈజీగా ఓట్లు పడవని. ఇంకా నయం ఒక్క సీటు గెలుచుకుని ఇజ్జత్ కాపాడుకున్నాడు.
ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్  తన పార్టీ గెలిచే సీట్లతో చక్రం తిప్పుదామనుకున్నాడు. కర్ణాటకలో కుమారస్వామిలాగా కింగ్ మేకర్ అవ్వాలనుకున్నాడు కాని జనాలు జోకర్ ని చేసారు. ఆవేశ ప్రసంగాలు, పంచ్ డైలాగులు, సాదారణ వ్యక్తిలాగా వ్యవహరించడాలు ఇవేమి ఆయనను గెలిపించలేవు. ఈ ఎన్నికల్లో గబ్బర్ సింగ్ లాగా పవర్ చూపిద్దామనుకున్నాడు కాని అజ్ఞాతవాసిలాగా అయిపోయాడు. ఇక పవన్ సార్ ఐదేళ్ళు ప్రశ్నిస్తాడో లేక అజ్ఞాతవాసి లాగా సినిమాలు తీసుకుంటాడో వేచిచూడాలి....



   కేంద్రంలో రాహుల్ గాంధీ పరిస్థితి చూస్తే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాం కాబట్టి ఈ సారి కేంద్రంలో కూడా గెలిచి ప్రధాని  అవుదామనుకున్నాడు. కాని పప్పు అయ్యాడు. రాఫెల్ ను  పట్టుకుని వేలాడితే జనాలు ఎలా ఓట్లేస్తారు.
అటు వైపు ఉన్నది మోది. రాహుల్ లాంటి వాళ్ళ పప్పులు ఉడకవక్కడ. ఈ దేశ ప్రజలు రాహుల్ గాంధీని ఒక జోకర్ లా చూస్తారే తప్ప ప్రధానమంత్రి పదవి పై కూర్చోబెట్టే సాహసం చేయరు. దేశం గురించి అవగాహన లేని వ్యక్తి దేశ ప్రధాని అవ్వలేడు. ప్రజలకు కావాలసింది సమర్థవంతంగా పాలించే పాలకులు రాహుల్ గాంధీ లాంటి పప్పూలు కాదు. ఇక రాహుల్ గాంధీ బంపర్ మెజారిటీతో కేరళలో గెలవడం ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ రాహుల్ గెలవడానికి ప్రధాన కారణం అక్కడ హిందూ వ్యతిరేకతే కారణం. హిందూ వ్యతిరేక ఓటర్లు  ఓటు వేయడం మూలాన  రాహుల్ గాంధీ అక్కడ గెలిచారు. యూపిలో ఓడిపోయాడు.
ఒక చోట గెలిచాడు ఎలాగు పార్లమెంటు లో అడుగు పెడుతాడు తర్వాత ఇంకెంటి ప్రియా ప్రకాశ్ వారియర్ లా కన్నుకొడుతూ ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేస్తాడు.  బయట రాఫెల్ గురించి వాదిస్తూ మరో ఐదేళ్ళు అలా ముందుకు వెళ్తాడు...

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

పచ్చ పీడ వదిలింది. అలాగే ఈ పచ్చ కుల పిచ్చి మీడియా దరిద్రం కూడా విరగడ అవ్వాలి.