భానోదయం: ఒక్క మాటతో ఏడు ఎం.పీ సీట్లు పోగొట్టుకున్న కెసీఆర్.

31, మే 2019, శుక్రవారం

ఒక్క మాటతో ఏడు ఎం.పీ సీట్లు పోగొట్టుకున్న కెసీఆర్.




ఒక్క మాటతో ఏడు ఎం.పీ సీట్లు  పోగొట్టుకున్న
కెసీఆర్.

   తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏక పక్షంగా కేసీఆర్ కే మళ్ళీ పట్టం కట్టారు ప్రజలు. 89 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా టిఆర్ఎస్ లో చేరిపోయారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ఎదురులేని విధంగా తయారయింది పరీస్థితి. ఇక రానున్న ఎంపీ ఎలక్షన్లలో 17  సీట్లకు 16  సీట్లు మనమే గెలుస్తాం అనే ధీమాలో ఉన్నారు కేసీఆర్,ఆ పార్టీ నాయకులు. కారు+సారు+సర్కారు=పదహారు అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు ఆపార్టీ నాయకులు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలిచి అలాగే ఓవైసీ సపోర్టు ఎలాగు ఉంటుంది మొత్తం 17 సీట్లు. ఇక ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీ గెలిచే ఎంపీ సీట్ల సపోర్ట్ తో కేంద్రంలో చక్రం తిప్పుదామనుకున్నారు కెసీఆర్ సార్. కేంద్రంలో ఏ పార్టీకి స్వంతంగా  ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని అనుకున్నాడు. ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఏకంగా ప్రధానమంత్రి అవుదామని కలలు కన్నారు కెసీఆర్ సారు.

            ఇక  దేశంలో ఎంపీ ఎలక్షన్స్ తేది ఖరారయ్యింది. అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. టిఆర్ఎస్ పార్టీ గెలుపు ధీమాతో ప్రచారంలోకి దిగింది. అసెంబ్లీ ఫలితాలే పార్లమెంటులో కూడా వస్తాయని ధీమాతో ఉన్నారు. కారు సార్ సర్కారు పదహారు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఇక పార్టీ ముఖ్యమంత్రి కెసీఆర్ సభలలో  ఇతర పార్టీల నాయకులపై ముఖ్యంగా బిజేపి నేతలపై తనదైన శైలిలో విరుచుకు పడ్డారు. ఎలాగు గెలుపు తమదే అని విజయగర్వంతో బిజేపి నేతలపై మీరేనా హిందువులు మేము కదా అంటు విరుచుకుపడ్డారు. మార్చి 17 న కరీంనగర్ సభలో బిజేపి నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తూ  "హిందూ గాళ్ళు బొందు గాళ్ళు" అంటూ వ్యాఖ్యానించారు.
ఈ ఒక్క మాటతో  అప్పటి వరకు కెసీఆర్ కు ఉన్న ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకున్నాడు. కేసిఆర్ హిందు వ్యతిరేకి అంటు జనంలో బలంగా నాటుకు పోయింది.  ఈ వ్యాఖ్యలపై కెసీఆర్ అంత సీరియస్ గా తీసుకోలేదు. ఎన్నికలు ముగిసాయి. అప్పటికి 16 సీట్లు మనవే అనుకున్నారు కెసీఆర్. ఇక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి తీరా ఫలితాలు చూస్తే ఏమయ్యింది సారుకు పదహారు కాదు అందులో సగమే వచ్చాయి. అందరూ షాక్ ఎందుకంటే టిఆర్ఎస్ కు సగం సీట్లు వచ్చినందుకు కాదు రాష్ట్రంలో బిజేపి ఉనికే లేకుండా పోయిందనుకున్నారు. కాని ఈ సారీ బిజేపికి 4 సీట్లు గెలుచుకుని అందరిని ఆశ్ఛర్యపరిచింది. స్వయాన ముఖ్యమంత్రి కుమార్తె సైతం బిజేపి అభ్యర్తి చేతిలో ఓడిపోయింది. మరో మూడు సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. మల్కజ్ గిరిలో రేవంత్ రెడ్డి గెలవడం కూడా కెసీఆర్ పట్ల జనాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని అర్థమవుతోంది.  జనాల్లో కెసీఆర్ పట్ల వ్యతిరేకత రావడానికి ముఖ్య కారణం హిందూ గాళ్ళు బొందు గాళ్ళు అంటూ వ్యాఖ్యానించడం. ఇంకా ముఖ్యమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల గురించి ఎక్కడ ప్రస్తావించక పోవడం. ఇప్పటీకి కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గురించి ఉలుకు లేదు పలుకు లేదు. కెసీఆర్ గారు ఇలాగే ఉంటే ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపి అధికారంలోకి వచ్చిన ఆశ్ఛర్యపోవలసిన పనిలేదు.

               కేంద్రంలో మోది మళ్ళీ అధికారంలోకి రాడని అందరు అనుకున్నారు అన్నిపార్టీలు ఏకమై మోది పై విరుచుకు పడ్డారు. ఎన్ని పార్టీలు ఏకమైన ప్రజలు అందరు ఏకమై మోదికి మళ్ళీ అధికారం కట్టబెట్టారు. ఈ దేశానికి మోది లాంటి నాయకుడే సరియైన వాడని ఈ దేశప్రజలు గట్టిగా నమ్మారు మోదినే ప్రధానిని చేసారు. బిజేపి అంతమైపోతుందని అనుకునే రాష్ట్రంలో ఊహించిన దానికంటే ఎక్కవ సీట్లు సాధించిందటే దానికి కారణం మోది. ఎవరు ఏమనుకున్నా బిజెపీ హిందూ పార్టీ అని చెప్పుకోవచ్చు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఈ దేశ ప్రజలు ఊరుకోరని ఈ పార్లమొంటు ఎన్నికల్లో తెలంగాణ ఫలితాల్లో నిరూపితమయ్యింది.
    ఈ దేశం లౌకిక దేశమే అలాగే హిందు ప్రధానదేశం. ఇతర మతాలను హిందు మతం గౌరవిస్తుంది.

2 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...

Valid Point !

భానోదయం చెప్పారు...

అంతేకదా.