భానోదయం: జూన్ 2019

28, జూన్ 2019, శుక్రవారం

చెన్నైలో నీళ్ళ కరువుకు కారణం ఎవరు.

చెన్నై లో నీటి కరువుకు కారణం ఎవరు.





చెన్నై మెట్రోపాలిటన్ సిటీ దేశంలో నాలుగో పెద్ద నగరం. అలాగే పరిశ్రమలు కూడా ఎక్కువగానే ఉన్న నగరం. సాఫ్ట్వేర్ రంగంలో కూడా అభివృద్ది చెందిన నగరం.  చెన్నైలో 2015 డిసెంబర్ లో వరదలు వచ్చాయి. అదే నగరంలో 2019 ఇప్పుడు తాగడానికి నీళ్ళు లేక విలవిలలాడుతున్నారు జనం.
ఇప్పుడు చెన్నైలో
నీళ్ళ కంటే పెట్రోలే చవక.
ఒకప్పుడు వరదలు ఇప్పుడు నీళ్ళ కరువు దీనికి కారణం ఎవరు. ప్రభుత్వాలా? పాలకులా ? వీళ్ళెవరూ కాదు దీనికి కారణం ప్రజలు.  మనిషి ఆశకు హద్దుండదు విచ్చల విడిగా పర్యావరాణాన్ని నాశనం చేస్తున్నారు. నగరాల్లోనే ఎందుకు వరదలు వస్తాయి? గ్రామాల్లో రావెందుకు ?
 ఎందుకంటే నగారాలు కాంక్రీటు జంగల్లు ఎక్కడా కూడా చుక్క నీరు నిలవకుండా ప్రతీ అడుగు కాంక్రీటుతో కప్పేస్తున్నారు. ఇలాంటప్పుడు వర్షం పడితే నీరు ఎక్కడికి పోతుంది? కొంచెం వర్షం పడిన నీరు రోడ్లపైకి వస్తుంది. నాలాలు ఉన్న అక్రమ కట్టడాలతో వాటిని కూడా వదలట్లేదు. భారీ వర్షం కురిస్తే ఏమవుతుంది అటు భూమిలోకి ఇంకలేక,ఇటు డ్రైనేజీ వ్యవస్త లేక ఇళ్ళల్లోకే వస్తాయి. అప్పుడు వరదలొచ్చాయని గగ్గోలు పెడుతుంటారు. ప్రభుత్వాల మీద పడుతుంటారు చేతకాని ప్రభుత్వాలంటూ పాలకుల మీద ఎనలేని కోపం ప్రదర్శింస్తుంటారు. పాపం పాలకులు ఏం చేస్తారు  తమ ప్రభుత్వాలను కాపాడుకోవడంలో బిజీగా ఉంటాయి. ప్రజా సమస్యలు పట్టించుకునే తీరిక ప్రభుత్వాలకెక్కడిది.
ప్రకృతి వైపరిత్యాలకు కారణం ప్రజలు. వాటిని కాపాడే బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ప్రజలకు పర్యావరణం గురించి అవగాహన కల్పించాలి. ఇంకుడు గుంతలు ప్రతీ ఇంటిలో తప్పని సరి చేయాలి. నాలాలపై అక్రమణలను తొలగించాలి. డ్రైనేజీల్లో చెత్త వేయకుండ నివారించాలి. అప్పుడే నగారాల్లో వరదలు రాకుండా ఉంటాయి.

ఇప్పుడు కరువు గురించి చూద్దాం:

 నీళ్ళ కరువుకు కారణం ముఖ్య కారణం  కూడా ప్రజలే. నగరాల్లో ఏ ఇంటిలో చూసిన ఒక బోరు బావి తప్పని సరిగా ఉంటుంది. మన బోరు మన కరెంటు అని విచ్ఛలవిడిగా నీటిని తోడేస్తున్నారు.  భూగర్భ జలాలను అవసరం ఉన్నా లేకపోయిన బోరు బావుల నుండి నీటిని తోడి వృధా చేస్తున్నారు. ప్రతీ ఇంటిలో ఒక బోరుబావి తప్పని సరిగా ఉంటుంది కాని ఏ ఒక్క ఇంటిలో కూడా ఇంకుడు గుంత ఉండదు. జనాలకు నీళ్ళు ఎలా వస్తాయో, ఎంత ఖర్చవుతుందో  కనీస అవగాహన లేదు. ఇక మున్సిపాలిటీ వారు అందించే కుళాయి నీళ్ళ గురించి చెప్పాలి. నేను హైదరాబాదులో ఒక కాలనీలో చూసాను అక్కడ రెండు రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి. అన్ని డ్రమ్ములు, సంపులు, ట్యాంకులు నింపుకున్నాక ఇంకా నీరు వస్తుంది. అప్పుడు మనోళ్ళు ఊరుకుంటారా ఇంటి ముందు ఉన్న రోడ్డుమొత్తం కుళాయి నీటితో ఓ అరగంట కడిగేస్తారు. అలా ఒక్కరు కాదు కాలనీ మొత్తం ఇలాగే రోడ్లను కడిగేస్తారు నీళ్ళు వచ్చినప్పుడల్లా.. దీన్ని బట్టి అర్థమయ్యిందేమిటంటే జనాలకు  నీటి విలువ అస్సలు తెలియదని. అసలు నీళ్ళు మనకు ఎలా వస్తున్నాయి, ఎలా వాటిని వాడుకోవాలి, వృధా చేస్తే ఏమవుతుంది అని వారికి కనీస అవగాహన లేదు.

ప్రభుత్వాలకు కూడా ముందు చూపు ఉండాలి. ఇంత పెద్ద నగరానికి నీటి సరఫరా కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయాలని ముందు చూపు ఉండాలి. ఎండాకాలంలో నీటి అవసరాలను ఎలా తీర్చాలి అని ప్రణాలిక ఉండాలి. ఎండాకాలం వచ్చేసరికి అన్ని జలశయాలను ఊడ్చేస్తే ఏంటి ప్రయోజనం.
నీటిని వృధా చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలి. అప్పడే నీటి కరువు ఉండదు.

నీళ్ళ కరువు రాకుండా ఉండాలంటే :

* ప్రతీ ఇంటిలో తప్పని సరిగా ఇంకుడు గుంత ఉండాలి.
* ప్రతీ ఇంటిలో బోరుబావులు తవ్వుకునేందుకు అనుమతులు ఇవ్వకూడదు.
* నీటిని వృధా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
*  విరివిగా మొక్కలు నాటాలి.
* నీటి పొదుపు గురించి అవగాహన కల్పించాలి.
* నీటిని ఎక్కువగా వినియోగించే బీరు, కూల్ డ్రింక్ లాంటి పరిశ్రమలను మూసివేయాలి.
*  మనిషికి ప్రాణాధారం అయిన నీటికంటే బీర్లు, కూల్ డ్రింకులు అవసరమా చెప్పండి.

ప్రజలకు పర్యావరణం పట్ల కనీస అవగాహన ఉండాలి లేకుంటే ముందు ముందు చుక్క నీరు కూడా దొరకదు..


12, జూన్ 2019, బుధవారం

బోరున విలపిస్తున్న ప్రజలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు

     


           అయ్యా చంద్రబాబు మీరు లేకపోతే ఎట్లాగయ్యా మా బతుకులు దుర్భరంగా తయారయ్యాయి. అన్నదాత సుఖీభవ రద్దు చేశామంటున్నారు. రుణమాఫీ చేయమంటున్నారు ఇట్లగయితే మేం ఎలా వ్యవసాయం చేసేది అంటూ రైతులు  చంద్రబాబు వద్ద గొల్లున ఏడుస్తున్నారు. అయ్యా చంద్రబాబు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు భూములరేట్లు పడిపోయాయి ఇలాగయితే మేం బతికెదెట్ల అంటూ
రాజధాని చుట్టు పక్కల ప్రాంత ప్రజలు చంద్రబాబు వద్ద వాపోతున్నారు.

     సార్ చంద్రబాబు గారు మిమ్మల్ని చూసే మేము బీటెక్ చదువుకున్నాం రెపోమాపో జాబ్ వస్తుంది అనుకున్నాం. కాని ఇప్పుడు పరిస్థితి చూస్తే  మాకు జాబు వచ్చేలా లేదు అంటూ నిరుద్యోగులు బోరున విలపిస్తున్నారు. అయ్యా చంద్రబాబు గారు మిమ్మల్ని ఆధర్శంగా తీసుకునే మా పిల్లల్ని చదివిస్తున్నాం ఇప్పుడు వాళ్ళ భవిష్యత్ ఏంటీ? మీరు ఓడిపోయిన తర్వాత ఇక ఇక్కడికి సాఫ్ట్వేర్ కంపెనీలు రావట, ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతాయట ఇలాగయితే మా పిల్లల భవిష్యత్ ఏంటని చంద్రబాబు గారి వద్ద పిల్లల తల్లిదండ్రులు బోరున విలపించారట. రైతులు, రాజధాని ప్రాంత ప్రజలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకుని తమ కష్టాలను చెప్పుకుని బోరున విలపించారు.

బాబుగారు...

మళ్ళీ మీరొస్తేనే భూముల రేట్లు పెరుగుతాయి, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి,
 కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి,

 రైతులకు అన్నదాత సుఖీభవ వస్తుంది,
రైతులకు రుణమాఫీ అవుతుంది,

మా పిల్లల భవిష్యత్ బాగుంటుంది మళ్ళీ మీరే ముఖ్యమంత్రి కావాలని, తమ కష్టాలను తీర్చాలని ప్రజలు నిన్న  చంద్రబాబు వద్ద బోరున విలపించారట.

9, జూన్ 2019, ఆదివారం

పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి కారణం 150 కోట్లు.

 

     పవన్ ఓడిపోవడానికి ముఖ్య కారణం 150 కోట్ల డబ్బు అంట. ఇది ఎవరో  అన్నది కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే అన్నారు.   150 కోట్లు ఉంటే చాలు ఎన్నికల్లో ప్రత్యర్థిని ఓడించవచ్చని మనం అనుకోవాలా? అంటే జనానికి ఎవరు డబ్బులు ఇస్తే వారికే ఓటు వేస్తారా?  తమకు సరియైన నాయకుడు ఎవరన్నది ప్రజలకు తెలియదని పవన్ అభిప్రాయమా.? ఈ రోజుల్లో ఏ ఓటరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని డబ్బులు పంచిన తమకు సరియైన నాయకుడు ఎవరో వారికే ఓటు వేస్తారు కాని ఎవరు డబ్బులకు, మందుకు ఆశపడి ఓటు వేయరు. అది పవనాలు సార్ కి తెలుసుకోలేక పోతున్నారు. పవన్ అన్నట్టు భీమవరంలో 150 కోట్ల డబ్బులు పంచి తనను ఓడించారని అంటున్నాడు. మరీ గాజువాక లో ఎందుకు ఓడారు అక్కడ ఎన్ని డబ్బులు పంచారు. ఓడిపోయాడు ఏదో కారణం చెప్పాలి అందుకని 150 కోట్లు ఖర్చు చేసి భీమవరంలో తనను వైసీపి ఓడించిందని చెబుతున్నాడు. అంటే పవన్ దృష్టిలో డబ్బులు ఉంటే చాలు ఎన్నికల్లో గెలవచ్చని అర్థమా? . పవన్ దగ్గర డబ్బు ఉంటే ఈ ఎన్నికల్లో గెలిచే వాడేమో!
     
                      తెలుగు రాష్ట్రాలల్లో  పెద్ద సెలెబ్రెటీ, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సొంత పార్టీ స్థాపించి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటి చేస్తే 150  కోట్ల రూపాయలతో ఓడించేస్తే, సామాన్య  ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించడానికి 10 కోట్లు చాలేమే. ఈ లెక్కన చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ సీట్లు గెలవడానికి 2050 కోట్లు ఉంటే చాలు  పవన్ సార్ ఈజీగా గెలిచేవాడేమో. సార్ పవన్ కళ్యాణ్ గారు మీరన్నట్టు డబ్బులు పంచితేనే ఎన్నికల్లో గెలుస్తారనుకుంటే వచ్చే ఎన్నికల్లో మీరు రెండు వేలకోట్లతో పాటు అవతలి పార్టీ వాళ్ళు కూడా డబ్బులు పంచుతారు కాబట్టి దానికి ఇంకో వెయ్యికోట్లు ఎక్కువ మీరు ఖర్చు చేయాల్సి వస్తుంది మరియు ఎన్నికలకు ఇంకా ఐదేళ్ళు సమయం ఉంది కాబట్టి ఖర్చులు పెరిగిపోతాయి అందుకని జనాలకు ఇప్పుడిచ్చే దానికి రెట్టింపు డబ్బులు పంచాలి. లేదంటే ఎవరు ఎక్కవ పంచితే వారికి ఓటేస్తారు. కాబట్టి మొత్తంగా రౌండ్ ఫీగర్ ఓ 5 వేలకోట్లు సిద్ధం చేసుకోండి. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మీరే గెలుస్తారు ముఖ్యమంత్రి అవుతారు. ఇది నేనన్న మాట కాదు మీరే అన్న మాట డబ్బులు పంచి నన్ను ఓడించారని అన్నారు. అందుకని నేను చెబుతున్నాను మీరు కూడా ఒక చోట కూర్చుని డబ్బులు పంచండి మీరే ముఖ్యమంత్రి అవుతారు.


       ఇప్పుడు ఓటర్లకు కావాలసింది సరైనా పాలన అందించే నాయకుడు కాదు ఎవరు ఎక్కువ డబ్బులు పంచితే వారినే ఎన్నికల్లో గెలిపిస్తున్నారు    అనే పవన్ అభిప్రాయం ప్రకారం  తెలంగాణలో కెసీఆర్ కేంద్రంలో మోడి ఇలా డబ్బులు పంచే అధికారంలోకి వచ్చారా??  అని అనుకోవాలా ఈ లెక్కన ఆంధ్రాలో చంద్రబాబు కూడా  ఎన్నికలకు కొన్ని నెలలముందు పథకాల పేరుతో అధికారికంగా డబ్బులు పంచారు. అయినా ఘోరంగా ఓడిపోయారు. మరీ ఇక్కడ డబ్బు ప్రభావం ఎందుకు పనిచేయలేదు? పవన్ సార్ సమాధానం చెప్పాలి..


               
                  కేవలం డబ్బులు పంపిణీ చేస్తే ఎన్నికల్లో గెలుస్తారనుకోవడం పవన్ ఆజ్ఞానానికి నిదర్శనం.
ఈ రోజుల్లో ఓటర్లు అమాయకులేం కారు  ఎవరు సమర్థవంతమైన నాయకులో వారికి తెలుసు గతంలో వారు ఏం చేసారు, వారి కుటుంబం ఎలాంటిది, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారా, తమ సమస్యలను పరిష్కరించగలడా లేదా అని చూస్తారు. అంతేకాని ఎవడో  రెండు వేలు నోటు చేతిలో పెడితే ఓటు వేయరు. అలా అంటే డబ్బు ఉన్న ప్రతోడు ఎన్నికల్లో గెలుస్తాడు.
 పవన్ సార్.... డబ్బులు పంచి జగన్ ఎన్నికల్లో   గెలవలేదు. గతంలో ఆయన తండ్రిగారి పాలన చూసి గెలిపించారు. రాష్ట్రంలో సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేసి జనంతో మమేకమై గెలిచాడు. తన తండ్రిలాగా పాలన చేస్తానని చెప్పి గెలిచాడు. మీకోసం నెనున్నాను అని భరోస ఇచ్చి గెలిచాడు.అంతేకాని డబ్బులు పంచి అధికారంలోకి రాలేదు. జగన్ అవినీతి పరుడు లక్షలకోట్లు సంపాదించాడని అంటున్నారు అన్ని కోట్లు ఉన్న వ్యక్తి డబ్బులు పంచి ఈజీగా గెలవచ్చంటే  2014 ఎందుకు ఓడిపోయారు.?
పవన్ సార్ ఎన్నికల్లో గెలవాలంటే కావల్సింది డబ్బులు కాదు సార్ జనానికి నేనున్నానే భరోస ఇవ్వాలి. సమర్థవంతంగా పాలించగలడనే నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకాన్ని ఈ సారి జగన్ కలిగించాడు గెలిచాడు. జగనన్న జగనన్న జనమంతా నీవెంటే అన్నారు ముఖ్యమంత్రిని చేసారు. నీవు కూడా పవనన్న పవన్న ప్రజలంతా నీవెంటే అనేలా చేయి అప్పుడు నిన్ను గెలిపిస్తారు. అయనా కష్టమే ఎందుకంటే జగన్ లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకో నాయకుడు ఎందుకు అని ప్రజలు భావిస్తున్నారు. అయినా అన్న చిరంజీవి గారు కూడా పార్టీని స్థాపించి కాంగ్రెస్ లో విలీనం చేసినప్పడే సినిమా వాళ్ళ మీద నమ్మకం పోయింది జనాలకి. ఇప్పుడు ఆయన స్వంత తమ్ముడైనా పవన్ ను నమ్మాలంటే కష్టమేమరీ. నమ్మి గెలిపిస్తే మళ్ళీ ఏ పార్టీలోనైనా విలీనం చేసేస్తడేమేనని జనాల భయం కాబట్టి పవన్ ని జనాలు ఇప్పట్లో నమ్మరు.... 

     
     ఇప్పుడు చెప్పండి పవన్ ఓడిపోవడానికి కారణం 150 కోట్ల లేదా  తనపై జనాలకు లేని విశ్వసనీయత వల్లన. ఆయనే తెలుసుకోవాలి.. కేవలం డబ్బు  పంచితేనే గెలుస్తారనుకుంటే ఎప్పటికి పవన్ గెలవలేరు. పైగా జనాలను నోటుకు ఓటు వేస్తారనడం వలన  పవన్ ను ప్రజలు హీనంగా చూసే పరిస్థితి వస్తుంది.