భానోదయం: చెన్నైలో నీళ్ళ కరువుకు కారణం ఎవరు.

28, జూన్ 2019, శుక్రవారం

చెన్నైలో నీళ్ళ కరువుకు కారణం ఎవరు.

చెన్నై లో నీటి కరువుకు కారణం ఎవరు.





చెన్నై మెట్రోపాలిటన్ సిటీ దేశంలో నాలుగో పెద్ద నగరం. అలాగే పరిశ్రమలు కూడా ఎక్కువగానే ఉన్న నగరం. సాఫ్ట్వేర్ రంగంలో కూడా అభివృద్ది చెందిన నగరం.  చెన్నైలో 2015 డిసెంబర్ లో వరదలు వచ్చాయి. అదే నగరంలో 2019 ఇప్పుడు తాగడానికి నీళ్ళు లేక విలవిలలాడుతున్నారు జనం.
ఇప్పుడు చెన్నైలో
నీళ్ళ కంటే పెట్రోలే చవక.
ఒకప్పుడు వరదలు ఇప్పుడు నీళ్ళ కరువు దీనికి కారణం ఎవరు. ప్రభుత్వాలా? పాలకులా ? వీళ్ళెవరూ కాదు దీనికి కారణం ప్రజలు.  మనిషి ఆశకు హద్దుండదు విచ్చల విడిగా పర్యావరాణాన్ని నాశనం చేస్తున్నారు. నగరాల్లోనే ఎందుకు వరదలు వస్తాయి? గ్రామాల్లో రావెందుకు ?
 ఎందుకంటే నగారాలు కాంక్రీటు జంగల్లు ఎక్కడా కూడా చుక్క నీరు నిలవకుండా ప్రతీ అడుగు కాంక్రీటుతో కప్పేస్తున్నారు. ఇలాంటప్పుడు వర్షం పడితే నీరు ఎక్కడికి పోతుంది? కొంచెం వర్షం పడిన నీరు రోడ్లపైకి వస్తుంది. నాలాలు ఉన్న అక్రమ కట్టడాలతో వాటిని కూడా వదలట్లేదు. భారీ వర్షం కురిస్తే ఏమవుతుంది అటు భూమిలోకి ఇంకలేక,ఇటు డ్రైనేజీ వ్యవస్త లేక ఇళ్ళల్లోకే వస్తాయి. అప్పుడు వరదలొచ్చాయని గగ్గోలు పెడుతుంటారు. ప్రభుత్వాల మీద పడుతుంటారు చేతకాని ప్రభుత్వాలంటూ పాలకుల మీద ఎనలేని కోపం ప్రదర్శింస్తుంటారు. పాపం పాలకులు ఏం చేస్తారు  తమ ప్రభుత్వాలను కాపాడుకోవడంలో బిజీగా ఉంటాయి. ప్రజా సమస్యలు పట్టించుకునే తీరిక ప్రభుత్వాలకెక్కడిది.
ప్రకృతి వైపరిత్యాలకు కారణం ప్రజలు. వాటిని కాపాడే బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ప్రజలకు పర్యావరణం గురించి అవగాహన కల్పించాలి. ఇంకుడు గుంతలు ప్రతీ ఇంటిలో తప్పని సరి చేయాలి. నాలాలపై అక్రమణలను తొలగించాలి. డ్రైనేజీల్లో చెత్త వేయకుండ నివారించాలి. అప్పుడే నగారాల్లో వరదలు రాకుండా ఉంటాయి.

ఇప్పుడు కరువు గురించి చూద్దాం:

 నీళ్ళ కరువుకు కారణం ముఖ్య కారణం  కూడా ప్రజలే. నగరాల్లో ఏ ఇంటిలో చూసిన ఒక బోరు బావి తప్పని సరిగా ఉంటుంది. మన బోరు మన కరెంటు అని విచ్ఛలవిడిగా నీటిని తోడేస్తున్నారు.  భూగర్భ జలాలను అవసరం ఉన్నా లేకపోయిన బోరు బావుల నుండి నీటిని తోడి వృధా చేస్తున్నారు. ప్రతీ ఇంటిలో ఒక బోరుబావి తప్పని సరిగా ఉంటుంది కాని ఏ ఒక్క ఇంటిలో కూడా ఇంకుడు గుంత ఉండదు. జనాలకు నీళ్ళు ఎలా వస్తాయో, ఎంత ఖర్చవుతుందో  కనీస అవగాహన లేదు. ఇక మున్సిపాలిటీ వారు అందించే కుళాయి నీళ్ళ గురించి చెప్పాలి. నేను హైదరాబాదులో ఒక కాలనీలో చూసాను అక్కడ రెండు రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి. అన్ని డ్రమ్ములు, సంపులు, ట్యాంకులు నింపుకున్నాక ఇంకా నీరు వస్తుంది. అప్పుడు మనోళ్ళు ఊరుకుంటారా ఇంటి ముందు ఉన్న రోడ్డుమొత్తం కుళాయి నీటితో ఓ అరగంట కడిగేస్తారు. అలా ఒక్కరు కాదు కాలనీ మొత్తం ఇలాగే రోడ్లను కడిగేస్తారు నీళ్ళు వచ్చినప్పుడల్లా.. దీన్ని బట్టి అర్థమయ్యిందేమిటంటే జనాలకు  నీటి విలువ అస్సలు తెలియదని. అసలు నీళ్ళు మనకు ఎలా వస్తున్నాయి, ఎలా వాటిని వాడుకోవాలి, వృధా చేస్తే ఏమవుతుంది అని వారికి కనీస అవగాహన లేదు.

ప్రభుత్వాలకు కూడా ముందు చూపు ఉండాలి. ఇంత పెద్ద నగరానికి నీటి సరఫరా కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయాలని ముందు చూపు ఉండాలి. ఎండాకాలంలో నీటి అవసరాలను ఎలా తీర్చాలి అని ప్రణాలిక ఉండాలి. ఎండాకాలం వచ్చేసరికి అన్ని జలశయాలను ఊడ్చేస్తే ఏంటి ప్రయోజనం.
నీటిని వృధా చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలి. అప్పడే నీటి కరువు ఉండదు.

నీళ్ళ కరువు రాకుండా ఉండాలంటే :

* ప్రతీ ఇంటిలో తప్పని సరిగా ఇంకుడు గుంత ఉండాలి.
* ప్రతీ ఇంటిలో బోరుబావులు తవ్వుకునేందుకు అనుమతులు ఇవ్వకూడదు.
* నీటిని వృధా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
*  విరివిగా మొక్కలు నాటాలి.
* నీటి పొదుపు గురించి అవగాహన కల్పించాలి.
* నీటిని ఎక్కువగా వినియోగించే బీరు, కూల్ డ్రింక్ లాంటి పరిశ్రమలను మూసివేయాలి.
*  మనిషికి ప్రాణాధారం అయిన నీటికంటే బీర్లు, కూల్ డ్రింకులు అవసరమా చెప్పండి.

ప్రజలకు పర్యావరణం పట్ల కనీస అవగాహన ఉండాలి లేకుంటే ముందు ముందు చుక్క నీరు కూడా దొరకదు..


1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.