భానోదయం: ఆగస్టు 2019

7, ఆగస్టు 2019, బుధవారం

కాశ్మీర్ వెనక ఇంత కథ ఉందా..

 

     
          కాశ్మీర్ అంటే మంచుకొండలు, సెలయేళ్ళు, అందమైన లోయలు గుర్తొస్తాయి. కాశ్మీర్ అంటే భూతల స్వర్గం అని అంటారు.  అక్కడి ప్రజలు ఎంతో అదృష్టవంతులు ఎందుకంటే కాశ్మీర్ లాంటి అందమైన ప్రదేశంలో నివసిస్తున్నందుకు. కాశ్మీర్ గురించి నా చిన్నప్పుడు పాఠశాలలో చదువుకున్నాం. శ్రీ "నాయని కృష్ణకుమారి" గారు రచించిన  "కాశ్మీర దర్శనం" అనే పాఠం ఉండేది. అందులో కృష్ణకుమారి గారు కాశ్మీర్ గురించి వర్ణించిన వర్ణన గురించి చదువుతుంటే కాశ్మీర్ లో విహరించినట్టు ఉండేది. ఈ పాఠం వింటుంటే కాశ్మీర్ కళ్ళకు కట్టినట్టు అనిపించేది అంత అద్భుతంగా వర్ణించారు కృష్ణకుమారి గారు "కాశ్మీర దర్శనం"లో. కాశ్మీర్ అంటే ఇంత అందంగా ఉంటుందా ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి ఆ అందాలను చూడాలని ఉండేది. కాశ్మీరు ప్రజలు ఎంతో అదృష్టవంతులు అనుకునేవాన్ని కాని పాఠశాల స్థాయి దాటి  జాతీయ విషయాలు అవగాహనకు వస్తున్న రోజుల్లో కాశ్మీర్ అంటే ఏంటో తెలిసింది. కాశ్మీర్ అంటే భూతల స్వర్గమే కాని అది నాణేనికి ఒకవైపు మాత్రమే రెండోవైపు భూతల నరకం కూడా కాశ్మీరే అన్నట్టు ఉంది అక్కడి పరిస్థితి. ప్రపంచంలో నిత్యం వివాదాస్పద అంశం ఏదైనా ఉందంటే అది కాశ్మీరే.

          ప్రతీరోజు కాశ్మీర్ లో కాల్పులు, పాక్ కవ్వింపు చర్యలు అంటూ వార్తలు. ఇంత అందమైన కాశ్మీర్లో ఎందుకు ఈ కాల్పులు. నాకు అర్థమయ్యేది కాదు. అక్కడ నివసించే ప్రజలు నిత్యం ఏ వైపు నుంచి కాల్పులు జరుగుతాయో అని బిక్కుబిక్కుమంటు జీవనం సాగిస్తుంటే కాశ్మీరీలు అదృష్టవంతులు అనే నా అభిప్రాయం మారిపోయింది. కాశ్మీర్ లో నిత్యం ఉగ్రవాదుల దాడులు సర్వసాధారణం అయిపోయాయి. దీనికి కారణం ఏంటా అని తెలుసుకుంటే కాశ్మీర్ అల్లర్ల వెనుక పాకిస్థాన్ అనే భూతం ఉందని అర్థం అయ్యింది. ప్రపంచంలో అతి నీచమైన దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్థానే అని చెప్పొచ్చు.
అసలు ఎందుకు పాకిస్థాన్ ఇలా కాశ్మీర్ లో ఉగ్రవాదులతో నిత్యం దాడులు చేస్తుంది అని నాకు అర్థమయ్యేదికాదు. తర్వాత తెలిసింది ఏంటంటే కాశ్మీర్ ను పాకిస్థాన్ లో కలపడం కోసమే ఇలా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని.

        కాశ్మీర్ లో ఉగ్రవాదం ఇంతలా చెలరేగిపోవడానికి కారణం ఏంటంటే అక్కడ జనాభాలో అధిక శాతం ముస్లింలే ఉండటం. మతాన్ని ఆసరాగ చేసుకుని పాకిస్థాన్ ఉగ్రవాదులు, పాకిస్థాన్ సైన్యం  కాశ్మీరీ ముస్లిం యువకులను ఉగ్రవాదులుగా తీర్చిదిద్ది కాశ్మీర్ లో కల్లోలం సృష్టిస్తున్నారు. ఈ ధారుణాన్ని చూస్తుంటే తన వేళితో తనకంటినే పొడిచేలా చేసింది పాకిస్థాన్ కాశ్మీర్ యువతను. ఈ విషయం తెలియక అక్కడి యువత పాకిస్థాన్  కుటిల బుద్దికి బలైపోతుంది. కేవలం మతాన్ని సాకుగా చూపి  కాశ్మీర్ యువతను ఉగ్రవాదులుగా మార్చేసింది పాకిస్థాన్.

            భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు కాశ్మీర్ సమస్య అలాగే ఉండిపోయింది. ఈ దేశాన్ని ఇన్నాళ్ళు పాలించిన ఏ నాయకుడు కూడా కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు. కాశ్మీర్ సరిహద్దుల్లో భారత సైనికులను పాకిస్థాన్ ఉగ్రవాదులు పొట్టనపెట్టుకుంటున్నారు. ఈ మారణకాండ నిత్యం జరుగుతూనే ఉన్నా దీనికి పరిష్కారం మాత్రం ఏ నాయకుడు చూపలేదు. కాని ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం నరేంద్ర మోది చూపారు ఆర్టికల్ 370 ,35A రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ను రెండు రాష్ట్రాలుగా విభజించి ఎన్నో ఏళ్ళుగా ఉగ్రవాదంతో రగిలిపోతున్న కాశ్మీర్ కు విముక్తి కలిగించారు. దీని ద్వారా అక్కడ శాంతి నెలకొంటుందని భావిస్తున్నాను. కాశ్మీర్ ను రెండుగా విభజిస్తే సమస్య తీరిపోతుందా అంటే తీరిపోదు అక్కడ అభివృద్ది జరిగితే సమస్య తీరిపోతుంది.  ఎందుకంటే పాకిస్థాన్  కాశ్మీర్ యువతకు డబ్బు, మతవాదాన్ని  ఎరగా వేసి ఉగ్రవాదులుగా తయారుచేసి దాడులు చేయిస్తుంది. అదే అక్కడ అభివృద్ది జరిగితే యువతకు  ఉపాది లభిస్తే ఉగ్రవాదులుగా మారాల్సిన అవసరం ఉండదు. ఇన్నాళ్ళు అభివృద్ది చేయలేదా అంటే కేంద్ర  నిధులైతే వెళ్తున్నాయి కాని అభివృద్ది మాత్రం శూన్యం దీనికి కారణం కాశ్మీర్ నాయకులు.

 ఇప్పటి వరకు కాశ్మీర్ భారత్ లో ఒక రాష్ట్రం గానే భావించాను. 370 ఆర్టికల గురించి తెలిసాక కాశ్మీర్ వెనక ఇంత కథ ఉందా అని అర్థమయ్యింది. కాశ్మీర్ ప్రజలకు ప్రత్యేక అధికారాలు ఉండటం, కాశ్మీర్ కు సపరేటు జెండా కూడా ఉండటం నాకు తెలియని కాశ్మీర్ చాలానే ఉందిమరి. కాశ్మీర్ లో పీవోకే,అక్సాయ్ చిన్ అనే ప్రాంతాలు కూడా ఉన్నాయని, పీవోకే పాకిస్థాన్  ఆధీనంలో, అక్సయ్ చిన్  చైనా ఆధీనంలో ఉందని ఇప్పుడే తెలిసింది.


          కాశ్మీర్ అభివృద్ది కాకపోవటానికి అక్కడి నాయకులు కూడా ఒక కారణం ఎందుకంటే వాళ్ళకున్న ప్రత్యేక అధికారాలను అడ్డం పెట్టుకుని కాశ్మీర్ సమస్యను ఇంకా జఠిలం చేసి కాశ్మీర్ ను స్వతంత్ర దేశంగా అవతరించాలని భావించి ఉండవచ్చు. 370 రద్దు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టగానే కాశ్మీర్ ఎంపీలు చొక్కాలు చించుకుని, భారత రాజ్యాంగ ప్రతులను సైతం చించేందుకు ప్రయత్నించడం చూస్తుంటే భారత దేశ రాజ్యాంగం పట్ల కాశ్మీర్ నాయకులకు ఎలాంటి ఉద్దేషం ఉందో అర్థం అవుతుంది. కాశ్మీర్ సమస్యకు  కారణం అక్కడి నాయకులు కూడా కారణం అని అనుమానం కలుగక మానదు. కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపుతుంటే అది స్వాగతించాల్సిందిపోయి వ్యతిరేకించడం చూస్తుంటే వీరు కాశ్మీర్ ను భారత్ నుండి వేరు చేసేందుకు పాకిస్థాన్ కు సహకరస్తున్నారని అనుమానం కలుగుతుంది. పాకిస్థాన్ కు అక్కడి నాయకులు సహకరించడానికి కారణం మతవాదామే.


 ఏది ఏమైనా   ప్రధాని మోది, అమిత్ షా  కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు.