భానోదయం: టెక్నాలజీ
టెక్నాలజీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
టెక్నాలజీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, అక్టోబర్ 2019, గురువారం

దోమల నివారణకు ఏం చేయాలి


దోమల నివారణ



        దోమల నివారణకు ఆల్ అవుట్,గుడ్ నైట్ వంటి లిక్విడ్ వెపరైజర్లు, జెట్ కాయిల్స్, దోమల అగరబత్తీలు వాడుతుంటాం వీటి వల్ల దోమలు రాకుండా ఉంటాయి కాని వీటి వాడకం వల్ల శ్వాసకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అలాగే  ఈ లిక్విడ్ వెపరైజర్లు ఖాళీ అయిపోయిన తర్వాత పారేస్తున్నారు వీటి వలన పర్యావరణం కాలుష్యం అవుతుంది.

 సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దోమలను నివారించాలంటే
మస్కిటో కిల్లర్ ట్రాప్ అనే చిన్న పరికరం సహాయంతో దోమలను నివారించవచ్చు.    దీనివలన
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పైగా ఇవి ఇకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. ఇందులో పడ్డ దోమలు బయటికి వెళ్ళలేవు చనిపోతాయి.కాబట్టి వాటి సంఖ్య పెరగకుండా ఉంటుంది. లిక్విడ్ వెపరైజర్లు,కాయిల్స్,దోమల అగరబత్తీలు వాడటం వల్ల దోమలు రాకుండా ఉంటాయే తప్ప చనిపోవు బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తాయి. మస్కిటో కిల్లర్ ట్రాప్ ను వాడితే
అవి దోమలను ఆకర్షించి చంపేస్తాయి. ఇవి పర్యావరణానికి అనుకూలమైనవి.



దోమల నివారణ







4, సెప్టెంబర్ 2019, బుధవారం

రిమోట్ లేకుండా టీవి ఆపరేట్ చేయడం ఎలా






                  


                                మొబైల్ ఫోన్ తో టీవీని కంట్రోల్ చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్ లో రిమోట్ ఆప్స్ చాలానే ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకుంటే సరి రిమోట్ తో పనిలేకుండా మొబైల్ తో చానెల్స్ మార్చుకోవచ్చు. అలాగే  టీవీ సెట్ అప్ బాక్స్ ను కూడా  రిమోట్ తో కంట్రోల్ చేయవచ్చు. ఏ కంపెని సెట్ అప్ బాక్స్ కి సంబందించిన రిమోట్స్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్నాయి. డిష్ టీవి, సన్ డైరెక్ట్, బిగ్ టీవి, ఎయిర్ టెల్ ఇలా ఏ కంపెని సెట్ అప్ బాక్స్ అయిన గూగుల్ ప్లే స్టోర్ లో వీటికి సంబందించిన రిమోట్స్ ఆప్స్ ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ ఫోన్ తో ఆపరేట్ చేసుకోవచ్చు.


రిమోట్ ఎక్కడైనా మర్చిపోయిన లేదా రిమోట్ పాడైపోయిన సమయంలో ఈ ఆప్స్ ఉపయోగపడుతాయి.

13, మార్చి 2019, బుధవారం

ఎండాకాలంలో ఏ.సి, కూలర్ ఏది ఉత్తమం



              ఎండాకాలం వచ్చిందంటే చాలు చల్లగాలి కోసం కూలరో, ఏ.సి నో వాడుతుంటారు. ఈ రెండింటిలలో ఏది ఉత్తమం.

ముందుగా కూలర్ గురించి చూద్దాం:

సామాన్యంగా కూలర్లను ఎండాకాలంలో మాత్రమే వాడుతుంటారు. మిగితా రోజులు పక్కన పెట్టేస్తుంటారు. ఏ.సీ లను గోడకు బిగిస్తాం కాబట్టీ ఎప్పుడైనాా వాడుకుంటాం. ఏ.సి లు, కూలర్ల వల్ల కొన్ని సౌకర్యాలు ఉన్నాయి, అసౌకర్యాలు కూడా ఉన్నాయి.
అవేంటో చూద్దాం

ప్లస్ పాయింట్లు:

➡️కూలర్ విషయానికి వస్తే దీని ఖరీదు చాలా తక్కువగా ఉంటుంది.

➡️ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ జరుపుకోవచ్చు.

➡️ మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ.

➡️తక్కువ కరెంట్ బిల్ వస్తుంది

మైనస్ పాయింట్లు:

➡️కూలర్ నుండి శబ్ధం ఎక్కువగా వస్తుంది

➡️కూలర్ల వల్ల కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది

➡️నీరు అధికంగా అవసరం అవుతుంది.

➡️కూలర్ నీరు శుభ్రం చేయకపోవడం వలన శ్వాస సంబంద సమస్యలు వస్తాయి.

➡️గదిలో గాలిని కూలర్లు ఫిల్టర్ చేయలేవు కనుక కార్బన్ డై ఆక్సైడ్ గదిలో నే ఉండిపోతుంది.

➡️ కూలర్ లోపల  తేమ వలన ఇనుప పట్టీలు తుప్పు పడుతుంటాయి.

➡️కూలర్ ను తరుచుగా శుభ్రం చేస్తుండాలి లేదంటే దుర్వాసన వస్తుంది.

తప్పని పరిస్థితుల్లో కూలర్ వాడవలసి వస్తే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

కూలర్ ని గదిలో కాకుండా గది బయట ఉంచితే బయట ఉన్నా మంచి గాలి కూలర్ ద్వారా గదిలోకి వస్తుంది.

రెండు మూడు రోజులకు ఒకసారి నీటిని పూర్తిగా తీసేసి శుభ్రం చేస్తుండాలి.

శుభ్రం చేసేటప్పుడు కూలర్ కరెంట్ ప్లగ్ను సాకెట్ నుండి తీసివేసిన తర్వాతే శుభ్రం చేయాలి.

 కూలర్ ఫ్యాన్ ను బిగించే పట్టీలు తుప్పు పట్టకుండా పెయింట్ వేయాలి.

ఇలా చేయడం వలన ఇబ్బంది లేకుండా ఉంటుంది.

ఇప్పుడు ఏ.సి యొక్క సౌకర్యాలు, అసౌకర్యాల గురించి చూద్దాం.

ఏ.సి ని గదిలో గోడకు శాశ్వతంగా బిగిస్తాం కాబట్టి ఏ కాలంలో నైనా వాడుకుంటాం. దీని ఖరీదు ఎక్కువే అయిన ఆరోగ్యపరంగా కూలర్ కంటే బెటర్.

ఏ.సి యొక్క ప్లస్ పాయింట్లు:

➡️ఏ. సి వల్ల గదిలో మనకు కావలసినంత చల్లదనంగా ఉంచుకోవచ్చు.

➡️గోడకు పైన ఉంటుంది కాబట్టి కరెంట్ షాక్ వంటి ప్రమాదాలు ఉండవు.

➡️గదిలోని కర్బెన్ డై ఆక్సెడ్ ను బయటికి పంపి స్వచ్ఛమైన గాలిని గదిలోకి పంపుంతుంది.

➡️నీటి అవసరం ఉండదు


మైనస్ పాయింట్లు:

➡️ ఏ.సి ఖరీదు ఎక్కువ

➡️ఒక చోట నుండి వేరే చోటుకి జరపలేం

➡️కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది

 ధర పరంగా చూసుకుంటే కూలర్ బెటర్.
భద్రత, ఆరోగ్య పరంగా చూసుకుంటే ఏ.సీ బెటర్.


ఏ.సి ,కూలర్ల  కంటే ఇంటి ముందు కొన్ని  చెట్లు పెంచుకుంటే  ఉత్తమం.





















4, ఫిబ్రవరి 2019, సోమవారం

గూగుల్ ప్లస్ షట్ డౌన్

ఎప్రిల్ 2 నుండి గూగుల్ ప్లస్ ఉండదు షట్ డౌన్ అవుతుంది. గత ఏడాది డిసెంబర్ లో ఈ విషయాన్ని గూగుల్ అనౌన్స్ చేసింది. కొన్ని సాంకేతికపరమైన కారణాలవలన యూజర్ల డేటా
ఇతర వ్యక్తులకు చేరుతున్నట్టు గూగుల్ గుర్తించింది. అందువలన గూగుల్ ప్లస్ సేవలను నిలిపివేస్తుంది. యూజర్లు తమ డేటాను ఎప్రిల్ 2లోపు బ్యాకప్ తీసుకోవలసిందిగా గూగుల్ చెబుతుంది.