భానోదయం

10, ఏప్రిల్ 2026, శుక్రవారం

నిజమైన మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? రమణ మహర్షి బోధించిన అద్భుత సత్యం!

 



చాలామంది మనశ్శాంతి కోసం ఊర్లు తిరుగుతుంటారు, ఆశ్రమాలకు వెళ్తుంటారు. కానీ, బాహ్య ప్రపంచంలో మార్పులు వెతికినంత కాలం మనసు ప్రశాంతంగా ఉండదు. ఇదే విషయాన్ని రమణ మహర్షి ఒక చిన్న సంఘటన ద్వారా ఎలా వివరించారో ఈ కథలో చూద్దాం.


ఆశ్రమంలో జరిగిన సంఘటన


ఒక వ్యక్తి తన ఇంట్లో మనశ్శాంతి లేక, ప్రశాంతత కోసమని రమణ మహర్షి గారి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ కొన్నాళ్లు ధ్యానం చేస్తూ గడుపుతున్నాడు. అయితే ఒకరోజు అనుకోకుండా ఆశ్రమ వంటశాల వైపు వెళ్ళినప్పుడు అతనికి ఒక విషయం తెలిసింది. అక్కడ వంటవాడు 30 కిలోల కూరగాయలు తెచ్చి, లెక్కల్లో మాత్రం 50 కిలోలు అని రాసి, మిగిలిన 20 కిలోల సొమ్మును తన జేబులో వేసుకుంటున్నాడు. ఇది రోజువారీ జరుగుతున్న అవినీతి అని గమనించాడు.


మహర్షి మౌనం - భక్తుడి అసహనం


ఆ భక్తుడు ఈ విషయాన్ని రమణ మహర్షి గారికి వివరించాడు. "స్వామి, మీ ఆశ్రమంలో ఇలా అన్యాయం జరుగుతోంది, ఆ వంటవాడు దొంగతనం చేస్తున్నాడు" అని చెప్పాడు. కానీ మహర్షి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ధ్యానంలో ఉండిపోయారు. ఇలా ఎన్నిసార్లు చెప్పినా ఆయనలో చలనం లేకపోవడంతో, ఆ వ్యక్తికి ఓపిక నశించింది.

ఒకరోజు కోపంతో, "స్వామి! ఇంటి వద్ద మనశ్శాంతి లేక ఇక్కడికి వస్తే, ఇక్కడ కూడా ఇంత అవినీతి జరుగుతుంటే మీరు పట్టించుకోరేంటి? అసలు మీకు ఇవేవీ పట్టవా?" అని గట్టిగా అడిగేశాడు.

మహర్షి ఇచ్చిన జ్ఞానబోధ

అప్పుడు రమణ మహర్షి నెమ్మదిగా కళ్లు తెరిచి ఇలా అన్నారు:


"చూడు నాయనా.. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు? నేను ఆరోజు ఎలా ఉన్నానో, ఈరోజు కూడా అలాగే ఉన్నాను. నేను నా మట్టుకు ధ్యానం చేసుకుంటుంటే, ఎవరో వచ్చి ఈ గోడలు కట్టారు, వంటలు చేస్తున్నారు. ఇందులో ఏది నాది? అసలు ఈ ఆశ్రమం నాది అని నీకు ఎవరు చెప్పారు?"


ఆయన ఇంకా కొనసాగిస్తూ.. "నీకు మనశ్శాంతి ఎందుకు లేదో తెలుసా? నువ్వు అక్కడ (ఇంట్లో) ఏం జరుగుతుందో వెతికావు, ఇక్కడ (ఆశ్రమంలో) ఏం జరుగుతుందో వెతుకుతున్నావు. నీ మనసు లౌకిక విషయాల మీద, ఎదుటివారి తప్పుల మీద ఉంది. మనసు అనేది నీ ఇంట్లో ఉన్నా, ఇక్కడ ఉన్నా ఒకటే. ఎప్పుడైతే నీ మనసును పరమాత్మ వైపు మళ్ళించి, నీ లోపలికి నువ్వు చూసుకుంటావో.. అప్పుడే నీకు నిజమైన శాంతి లభిస్తుంది. లౌకిక విషయాల్లో పడి కొట్టుమిట్టాడితే నువ్వు ఎక్కడికి వెళ్లినా ప్రశాంతత దొరకదు." అని హితబోధ చేశారు.. అప్పుడు ఆ భక్తుడికి జ్ఞానోదయం కలిగింది..


మనం నేర్చుకోవాల్సిన పాఠం


మనం మనశ్శాంతిని ప్రదేశాల్లో వెతుకుతాం, కానీ అది మన ఆలోచనల్లో ఉంటుంది. ఎదుటివారు ఏం చేస్తున్నారు, సమాజం ఎలా ఉంది అనే విషయాల కంటే.. మన అంతరాత్మ ఏం చెబుతోంది, మనం దైవచింతనలో ఎంతవరకు ఉన్నాం అనేది ముఖ్యం. మనసు మారనంత కాలం, మనుషులు మారినా ప్రదేశాలు మారినా ప్రశాంతత అనేది దొరకదు.!

7, ఏప్రిల్ 2026, మంగళవారం

నా మద్దతు ఇజ్రాయెల్ కే🇮🇱

 అమెరికా, ఇరాన్ యుద్ధం లో మీ మద్దతు ఎవరికి..?


నా మద్దతు ఇజ్రాయెల్ కే





ఈ యుద్ధం ప్రారంభం కావడానికి అసలు కారణం ఇరాన్.


ఇజ్రాయెల్ కొత్త టెక్నాలజీ కనిపెడుతూ, అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది.


ఇజ్రాయెల్ ఏ దేశంపై అన్యాయంగా దాడి చేయలేదు.

అలా చేసే దేశమైతే మిగితా ముస్లిం దేశాల్లాగా చెత్త దేశంగా తయారయ్యేది.


టెక్నాలజీ తో ప్రపంచంలో అగ్రగామిగా ఎదిగింది.


మరి ఇరాన్ ఏం చేస్తుంది ఉగ్రవాదులను పెంచి పోషించి, ఇజ్రాయెల్ మీద పదే పదే దాడి చెయిస్తుంది.



ఇజ్రాయెల్ టెక్నాలజీని కనిపెడితే 

ఇరాన్ ఉగ్రవాదులను కనిపెట్టింది.

హెజ్ బొల్లా, హమాస్, హూతీ,ఐసిస్ లాంటి ఉగ్ర సంస్థలను పెంచి పోషించింది..


తాను అభివృద్ధి చెందదు, ఇతరులను అభివృద్ధి చెందనీయదు మతం ముసుగులో తన ప్రజలకే స్వేచ్చ లేకుండా నియంత పాలన చేస్తుంది..


తనంతట తానుగా ప్రశాంతంగా బ్రతుకుతున్న ఇజ్రాయెల్ పై పదే పదే దాడులు చేయిస్తే ఏ దేశం అయినా ఎన్ని సార్లు భరిస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం యుద్ధమే అని నేరుగా యుద్ధం చేస్తుంది.


అక్టోబర్ 7, 2023 న పండుగ జరుపుకుంటున్న ఇజ్రాయెల్ ప్రజలపై ఇరాన్ పెంచి పోషించిన హమాస్ తీవ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 1200 మందిని చంపేసి,250 మందిని బందీలుగా తీసుకెళ్ళిన విషయం మనకు తెలిసిందే..


ఇరాన్ వద్ద అణుబాంబు లేదు, ఒకవేళ ఉంటే ఎప్పుడో ఇజ్రాయెల్ పైనా వాడేది ఎందుకంటే ఇజ్రాయెల్ ను లేకుండా చేయడం ఇరాన్ లక్ష్యం.


అందుకని ఇలా దొంగచాటున దాడులు చేసి ఇజ్రాయెల్ ప్రజలను లేకుండా చేయడం వీరి లక్ష్యం..


ఇజ్రాయెల్ ప్రజలపై ఇరాన్ తీవ్రవాదులు దాడి చేసినట్టే, మన భారతీయులపై పాకిస్తాన్ తీవ్రవాదులు పెహల్గాం లో దాడి చేసారు .. ఈరెండు దాడులు ఒక రకంగా జరిగాయి కారణం మతం ఇస్లాం కాని వారు ఈ భూమిమీద ఉండకూడదు ఇదే ఇస్లాం తీవ్రవాదుల లక్ష్యం..


ఇజ్రాయెల్ ఎప్పుడు ఇరాన్ పై దాడి చేయలేదు కాని ఇరాన్ కు ఇజ్రాయెల్ అంటే పడకపోవడానికి కారణం మతం. ఇస్లాం కానివారు ఉండకూడదు అనే క్రూరత్వం..


ఈ ప్రపంచం మొత్తం ఇస్లాం మతం మాత్రమే ఉండాలని వారి కోరిక ..


ఎంత క్రూరులు తమ మతం కాకుంటే బ్రతకనియ్యరా..


ప్రపంచంలో మొత్తం ఇస్లాం మతం మాత్రమే ఉండాలని వారి లక్ష్యం..


అందుకే ఇలాంటి ముస్లిం దేశాలు ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి ఉన్నాయి.. డబ్బులు మొత్తం ఉగ్రవాదులను పెంచి పోషించడానికే సరిపోతే ఇంకా అభివృద్ధి ఎక్కడ ఉంటుంది, 


 నా మద్దతు ఎప్పుడు ఇజ్రాయెల్ కే ...🇮🇱🇮🇱

చిన్న దేశం అయినా, చుట్టూ శత్రువులే ఉన్నా, నిరంతరం దాడులు జరుగుతునే ఉన్నా, యుద్ధాలు గెలిచి పవర్ ఫుల్ దేశంగా నిలిచింది, చాలా గొప్ప ఆవిష్కరణలు చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది..


ఇరాన్ ఏం చేసింది నా దృష్టిలో ఇది ఒక చెత్త దేశం .

ఉగ్రవాదులను పెంచి పోషించి, ప్రపంచంలో శాంతి లేకుండా చేసింది.. 


ఇరాన్ లో మాతతత్వ రాజకీయాలు

 అంతం అయితే తప్ప ప్రపంచంలో శాంతి ఉండదు..