భానోదయం: 2021

5, జులై 2021, సోమవారం

బైక్, స్కూటర్ ఏది బెస్ట్.

   

బైక్, స్కూటర్ ఏది బెస్ట్

   ఈ రోజుల్లో బయటికి వెళ్లి ఏపని చేయాలన్నా బైక్ తప్పనిసరిగా ఉండాలి. కోవిడ్ వల్ల పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అంతగా నడవడం లేదు. పైగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అన్నిచోట్లా ఉండదు. పల్లెటూళ్ళలో అసలే ఉండదు. సిటీలో కూడా అన్నిచోట్లకు బస్సు సౌకర్యం ఉండదు. ఆటోలో వెళ్ళాలంటే ఎక్కువ మొత్తంలో చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదికాక టైం కి ఆటో కాని బస్ కాని ఉండదు. కోవిడ్ వల్ల ఎక్కువగా ఆటోలు, బస్సు లు కూడా తిరగడం లేదు. ఒకవేళ తిరిగిన అంతమంది లో వెళ్ళాలంటే వైరస్ భయం.

ఇన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం అదేంటంటే బైక్ కొనుక్కోవడం. టైం కి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వైరస్ భయము ఉండదు. ఈ సమయంలో ప్రతి ఇంట్లో బైక్ ఉండాల్సిందే. లేకపోతే ఏపని జరగదు. కాబట్టి ప్రతీ ఒక్కరు కొనాలి అని చూస్తారు. అంటే అందరూ కాదు బండి లేని వాళ్ళు. 

    ఇప్పుడు మార్కెట్లో బండి కొనాలంటే రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి "బైక్" మరొకటి "స్కూటర్" ఈ రెండింటిలో ఏది కొనాలని చాలామందికి డౌట్ వస్తుంది. మరి అలాంటప్పుడు బైక్ బెటరా స్కూటర్ బెటరా.? మనకు ఏది కంఫర్ట్  తెలుసుకోవాలి.


ముందుగా బైక్ గురించి తెలుసుకుందాం.


ప్లస్ పాయింట్స్:-

బైక్ చూడడానికి లుక్ బాగుంటుంది.

ఎక్కువ మైలేజీ ఇస్తుంది.

మెయింటెనెన్స్ తక్కువ.

దూర ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.


మైనస్ పాయింట్స్:-


గేర్లు, క్లఛ్ మళ్ళీ మళ్ళీ మారుస్తూ ఉండాలి.

బైక్ పై ఏదైనా లగేజీ తీసుకెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది.

బైక్ లో గూడ్స్ స్పేస్ ఉండదు.

బైక్ ను ఇంట్లో అందరూ నడపలేరు.


స్కూటర్ గురించి చూద్దాం.


ప్లస్ పాయింట్స్:-


స్కూటర్ కి గేర్లు ఉండవు కాబట్టి మళ్ళీ మళ్ళీ గేర్లు మార్చే పని ఉండదు.

ఎలాంటి లగేజీ అయినా స్కూటర్ పై  తీసుకుని రావచ్చు.

గ్యాస్ సిలిండర్ గాని, బియ్యం బస్తాలు గాని కిరాణా వస్తువులు కూరగాయలు సులభంగా తీసుకుని రావచ్చు.

ఇంట్లో ఎవరైనా సులభంగా నడపగలరు. ఆడవాళ్ళు కూడా నడపడానికి అనుకూలంగా ఉంటుంది.


మైనస్ పాయింట్స్:-


స్కూటర్ బైక్ అంత స్టైలిష్ గా ఉండదు.

మెయింటెనెన్స్ కాస్తా ఎక్కువ.

బైక్ కంటే మైలేజ్ తక్కువగా ఇస్తుంది.

దూర ప్రయాణాలకు అనుకూలంగా ఉండదు.



రెండింటి లో  తేడాలు గమనించాక ఏది బెస్ట్ అంటే స్కూటర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు స్టెల్ ముఖ్యం కాదు కంఫర్ట్ ముఖ్యం.

మాటిమాటికీ గేర్లు మార్చే తలనొప్పి ఉండదు.ఎలాంటి లాగేజీ అయినా సులభంగా తీసుకుని రావచ్చు.


స్కూటర్ కేవలం ఆడవాళ్ళకు మాత్రమే అనుకుంటారు కాని ఎవరైనా నడపొచ్చు. ఇంట్లో పెద్దవాళ్లు సైతం సులభంగా నడపగలరు.

ముఖ్యంగా ట్రాఫిక్ లో నడపడానికి, లగేజీ తీసుకురావడానికి స్కూటర్ ది బెస్ట్ ఆప్షన్.

బైక్ కంటే స్కూటర్ అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుంది.

బైక్ తీసుకుని ఎవరూ లాంగ్ డ్రైవ్ లకు వెళ్ళారు. నిత్యం ఈ ట్రాఫిక్ , ఈ గుంతలు రోడ్లపైనే తిరగాలి. కాబట్టి స్కూటర్ కొనడం బెటర్.

డిజైన్ పరంగా, లుక్ పరంగా ఇప్పుడు చాలా మంచి స్కూటర్స్ మార్కెట్లో ఉన్నాయి.

అందులో నాకు నచ్చింది అయితే activa 6g బాగుంటుంది అని అనుకుంటున్నాను.





21, మే 2021, శుక్రవారం

సోనుసూద్ రియల్ హీరో నువ్వు దేవుడు సామీ. స్టార్ హీరోలు నీ కాలి గోటికి సరిపోరు.

 

  సోనుసూద్ అంటే మన తెలుగు వాళ్ళకి అరుంధతి సినిమాలో అఘోర గుర్తొస్తాడు. అంత క్రూరంగా ఉంటుంది ఆ సినిమాలో ఆయన నటన. ఆ సినిమాలో జేజమ్మ సోనూసూద్ పాత్రను చంపేస్తే  జేజమ్మ జేజమ్మ అంటు జేజేలు పలికారు. ఇప్పుడు ఎక్కడ జేజమ్మ  సినిమాల్లో ఏదో పీకి పారేశాం అంటు ఫోజు కొడుతారు మరీ ఇలాంటి కష్ట  సమయంలో ఎక్కడ జేజమ్మ. సోనుసూద్ ను సినిమాల్లో చూసి అందరు తిట్టుకుంటారు ఎందుకంటే అతను విలన్ కాబట్టి అందరు విలన్ లా భావించే సోనుసూద్ ఎంత జాలి హృదయం సామీ నీది. నువ్వయ్య అసలైన హీరోవి. కనిపించే దేవుడివి.

 ఆడవాళ్ళు ఏం సహాహం చేస్తారని మీరనొచ్చు. ఎందుకు చేయరు ఏ రంగంలో లేరు చెప్పండి ఆడవాళ్ళు. అన్ని రంగాల్లోను మగవారితో సమానంగా దూసుకుపోతున్నారు. మరీ ఇప్పుడు ఇలాంటి కష్ట సమయంలో ఎక్కడ ఈ జేజమ్మ ఈ జనాల వళ్ళే కదా మీరు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు. ప్రజలు అల్లాడిపోతున్న చూసి చూడనట్టు ఉన్నారు వీళ్ళు. మానవత్వం లేని వారు..


  సినిమాల్లో హీరోలు ప్రజలకు సహాయం చేసినట్టు నటిస్తేనే వాళ్ళను దేవుళ్ళలాగా చూస్తారు ప్రజలు ఇక ఫ్యాన్స్ అయితే చెప్పక్కర్లేదు వాళ్ళకు పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి పూల మాలాలు వేస్తారు. పాలాభిషేకాలు చేస్తారు. ఇంతలా హీరోలను దేవుళ్ళలా భావిస్తారు ప్రజలు. మరీ ఇలాంటి కష్టకాలంలో ఏ హీరో దేవుడు ప్రజలకు సహాయం చేయడం లేదే? మన దగ్గర A  to Z స్టార్ లు  ఉన్నారు ఏ ఒక్క స్టార్ కూడా ప్రజల కష్టాలను చూసి సహాయం చేయడం లేదు వీళ్ళు హీరోలా!

 వీళ్ళు స్టార్ లా తూ...  వీళ్ళంతా హీరోలు కాదు డమ్మీ గాళ్ళు మానవత్వం లేని నిజమైన విలన్లు  వీళ్ళు. కోట్ల డబ్బు ఉన్నాగాని సహాయం చేయలేని వీళ్ళు స్వార్థపరులు. మానవత్వంలేని వారు. 


జేజమ్మలే కాదు ఇంకా చాలా మంది పెద్ద స్టార్ లు సినిమాల్లోనే జనాలను ఆదుకుంటారు. అది నటన అని అదరికి తెలుసు అది చూసి పిచ్చి జనాలు మా హీరో గొప్పవాడు అంటు పొగిడెస్తారు. వీళ్ళు సినిమాల్లోనే హీరోలు బయట డమ్మీ గాళ్ళు.  ఈ కరోనా టైంలో పేదవారు అల్లాడిపోతున్నా చూసి చూడనట్టు ఉంటున్నారు మహా స్వార్థపరులు.


మన స్టార్ హీరోలు సినిమాల్లో ప్రజలకు సహాయం చేసే శ్రీమంతులు. బయట మాత్రం సమాజసేవలో బిచ్చగాళ్ళ కంటే హీనంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళకంటే బిచ్చగాళ్ళే నయం తమ కళ్ళముందు ఎవరైన ఆపదలో ఉంటే ఆదుకుంటారు. 

 మానవతా దృక్పథంతో పేద ప్రజలకు సహాయం చేస్తూ యావత్ భారతదేశ ప్రజల గుండెల్లో దేవుడిలా ఉన్న ఆ ఒక్కడు, నిజమైన శ్రీమంతుడు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న ఆపద్భాందవుడు  మనసు  ఉన్న మహారాజు అతడే సోనుసూద్. సోనూసూద్ సార్ సరిలేరు నీకెవ్వరు.


మన హీరోలు  సినిమాల్లో సింహాలు పులులు చిరుతలు టైగర్ లు బయట డమ్మీగాళ్ళు.

సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద స్టార్ హీరోలూ సోనుసూద్ సార్ కాలి గోటికి సరపోరు. 

రియల్ హీరో సోనుసూద్ కనిపించే దేవుడు సామీ మీరు..

19, మే 2021, బుధవారం

మంతెన సత్యనారాయణ రాజు గారికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందట.! 8 రోజుల్లోనే కోలుకున్నారట.

https://youtu.be/qub5q1qUxUA

 ప్రకృతి జీవన విధానం గురించి మనకు ఎన్నో సలహాలు, సూచనలు ఇస్తున్నారు మన మంతెన గారు. ఆయన ఆరోగ్య సలహాలు పాటిస్తూ ఎంతోమంది ఆరోగ్యకరమైన జీవనం గడుపుతున్నారు. 

 నాకు తెలిసి ఆయన గత 20 సంవత్సరాలుగా ప్రకృతి జీవన విధానం గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి. వ్యాధులు వస్తే మందులు వాడకుండా ఎలా తగ్గించుకోవాలో తెలియజేస్తున్నారు. ఆయన సలహాలు పాటిస్తూ ఆరోగ్యాభిలాషులందరు ఆరోగ్యకరమైన జీవితం గడుపుతున్నారు.

 మంతెన గారికి కూడా గత ఏప్రిల్ 30 న జ్వరం వస్తే కోవిడ్ టెస్ట్ చేయిస్తే  పాజిటివ్ వచ్చిందట. జ్వరం వచ్చినప్పటినుండే ఆయన లంఖనం చేసి 8 రోజుల్లోనే కోవిడ్ నుంచి కోలుకున్నారట. 8రోజుల తర్వాత మళ్ళి టెస్ట్ చేయిస్తే నెగిటివ్ వచ్చిందట.

ఆయన ఇంత తొందరగా కోలుకోవడానికి కారణం ప్రకృతి జీవన విధానం పాటిస్తారు కాబట్టి.

లంఖనం చేసి వైరస్ ను  ఎదుర్కొన్నారు.

లంఖనం అంటే ఆహార పదార్థాలు తీనకుండా రోజంత తేనె నీళ్ళు తాగుతు ఉండటం. ఇలా చేయడం వల్ల శరీరం సహజ సిద్దంగానే వైరస్ ను ఎదుర్కొంటుందని మంతెన గారు చెబుతారు ఇప్పుడు చేసి చూపించారు.

 మంతెన గారిలాగా మందులు వాడకుండా లంఖనం చేసి అందరు కోవిడ్ నుండి కోలుకుంటారా అంటే కోలుకోలేరు. ఎందకంటే రాజు గరు ఎన్నో ఏళ్ళుగా ప్రకృతి జీవన విధానాన్ని పాటిస్తున్నారు. కాబట్టి తొందరగా కోలుకున్నారు.

 ప్రకృతి జీవన విధానంలో మంచి ఆహార నియమాలు పాటిస్తారు. కాబట్టి ఏ వ్యాదులు రావు వచ్చిన తొందరగా కోలుకుంటారు.

చాలామంది మంచి ఆహారపు అలవాట్లు పాటించక అనేక రోగాల పాలవుతున్నారు.

అందరు ఆరోగ్యకరమైన జీవనం గడపాలంటే మంతెన గారి ప్రకృతి జీవన విధానం పాటించి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను.

 ఒక ముఖ్య గమనిక:- మీరు మంతెన సత్యనారాయణ రాజు గారిలా లంఖనం చేసి వైరస్ ను ఎదుర్కొంటాను అంటే కుదరదు. ఎందుకంటే  మీ ఆహారపు ఆలవాట్లు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెసింగ్ ఫుడ్ కు అలవాటు పడిపోయారు కాబట్టి మీరు మందులు వాడాల్సిందే. వైరస్ నుండి కోలుకున్నాక ప్రకృతి జీవన విధానం పాటించి ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడే రాజుగారు చెప్పినట్టు లంఖనం చేసి వైరస్ ను ఎదుర్కొంటానంటే కుదరదు మీ ఆహారపు అలవాట్ల వల్ల అది కుదరదు హాస్పిటల్ వెళ్ళి మందులు వాడుతూ పౌష్టికాహారం తీసుకోండి.  ఆయన చాలా ఏళ్ళ నుండి ప్రకృతి జీవన విధానంలో ఉన్నారు కాబట్టి వైరస్ నుండి తొందరగా కోలుకున్నారు.

మంతెన గారి వీడియో ఇక్కడ చూడండి.

https://youtu.be/qub5q1qUxUA


16, మే 2021, ఆదివారం

భయపడకండి ధైర్యంగా ఉండండి అప్పుడే కరోనాను జయించగలరు.

 భయపడితే ఎంత బలవంతుడైన ఓడిపోతాడు. ధైర్యంగా ఉంటే సామాన్యుడు కూడా బలవంతుడౌతాడు.

  ఒక రాజ్యంలో రాజు భయపడితే ఎంతపెద్ద సైన్యం ఉన్న శత్రువు చేతిలో ఓడిపోతాడు. అదే రాజు ధైర్యంగా ఉండి ఎంత పెద్ద శత్రువైనా సరే   మన పరాక్రమం ముందు గడ్డిపోచతో  సమానం. ఈరాజ్యం మనది ఎవడో గొట్టం గాడు వచ్చి ఆక్రమిస్తానంటే ఊరుకుంటామా? తన్ని తరిమేద్దాం. అని సైన్యానికి ధైర్యం చెబితే సైనికులు వీరోచితంగా పోరాడి శత్రువును మట్టికరిపిస్తారు.  అలా కాకుండా శత్రువును చూసి భయపడి వారితో మనం గెలువలమా? అని సందిగ్ధం వ్యక్తం చేస్తే ఇక సైనికులు కూడా డీలా పడిపోయి దైర్యంగా యుద్దం చేయకుండా శత్రువు చేతిలో ఓడిపోయి రాజ్యాన్ని  కోల్పోతారు. 

  ఇప్పుడు మనదేశంలో అందరు కనిపించని శత్రువు కరోనా తో యుద్దం చేస్తున్నారు. ఆ శత్రువును ఓడించాలంటే ముందుగా మనం దైర్యంగా ఉండాలి. అలాగే మాస్క్, సానిటైజర్ వంటి ఆయుధాలతో ఈ యుద్దంలో గెలవాలి. అలాగే పౌష్టికాహారం తింటూ బలంగా ఉండి శత్రువును తన్ని తరిమేయాలి. 

మీరు ధైర్యం కోల్పోయి నాకేమవుందోనని బయపడిపోతే మీలో ఉన్న  రక్షణవ్యవస్థ బలహీనపడి శత్రువును ఎదుర్కోలేక ఓడిపోతుంది. నాకేమి కాదు అని ధైర్యంగా  ఉండిపౌష్టికాహారం తీసుకుంటూ డాక్టర్ సూచించిన మందులు వాడుతుంటే మన రక్షణ వ్యవస్థ  వైరస్ తో పోరాడి వైరస్ ను అంతం చేస్తుంది.

 

  మన దేహం ఒక రాజ్యం అనుకుంటే మన  మనసు ఈ రాజ్యానికి రాజు. మనలో రక్షణ వ్యవస్థ ఈ రాజ్యానికి సైన్యం. మన మనసు ఏవిధంగా ఆలోచిస్తుందో శరీరం కూడా మనసుకు అనుగునంగానే పనిచేస్తుది. కాబట్టి మనం మనసులో ఏదనుకుంటే దాని ప్రభావం శరీరంపై పడుతుది. 

 నాకు ఏమవుతుందోనని మనసులో భయపడిపోయి ఆందోళన చెందారంటే దాని ప్రభావం శరీరంపై పడి లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయి. ఆ భయంలో బీపి పెరగడం , చెమటలు పట్టడం, గుండె దడ రావడం వంటివి జరిగి శరీరంలోని వ్యవస్థలన్ని అతలాకుతలం అయిపోతాయి తీవ్ర అనారోగ్యం పాలవుతారు. మన మనసు చెప్పినట్టే శరీరం వింటుంది. ఏ పని చేయాలన్న ముందు మనసులో అనుకుంటేనే చేస్తాం. మనసు రీమోట్ అయితే శరీరం టీవీ లాంటిది. అక్కడ  రిమోట్ నొక్కితేనె ఇక్కడ టీవీ పని చేసినట్టు మన మనసు ఎలా చెప్తే శరీరం అలా పని చేస్తుంది. కాబట్టి మనసులో నాకు ఏమికాదు అని ధైర్యంగా అనుకున్నారనుకోండి అప్పుడు మీకు ఏమికాదు. ఆరోగ్యంగా ఉంటారు.

 

  మనసు చెప్తే శరీరం ఎలా వింటుందో ఒక ఉదాహరణ - మీరు ఉదయం  5 గంటలకు నిద్ర లేవాలి అనుకుని అలారమ్ పెట్టుకున్నారు. ఏదో లేవాలి అంతే అనుకుని పడుకున్నారు. ఉదయం అలారమ్ మోగినా మీరు నిద్ర లేవలేరు. ఎందుకంటే మీరు గట్టిగా అనుకోలేరు కాబట్టి అలారమ్ మోగినా గాని ఆఫ్ చేసి మళ్ళి పడుకుంటారు. అదే మీకు చాలా ముఖ్యమైన జాబ్ ఇంటర్వూ ఉంది అక్కడకు వెళ్ళాలంటే ఉదయం 4 గంటలకే నిద్ర లేచి బయలు దేరాలి. అప్పుడు మీరు గట్టిగా మనసులో అనుకుంటారు ఉదయం 4 గంటలకే నిద్రలేవాలని మైండ్ లో  ఫీక్సయిపోతారు. ఆశ్ఛర్యంగా మీరు 4 గంటలకే నిద్ర లేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఆరోజు మీరు అలారమ్ పెట్టడం మర్చిపోతారు అయినా మీరు అనుకున్న సమాయానికే మేలుకుంటారు. ఇది ఎలా జరిగిందంటే మీరు మనసులో గట్టిగా అనుకున్నారు కాబట్టి. మీ ఊరినుండి ఇంటర్వూ కు వెళ్ళే పట్టణం చాలా దూరం మీ దగ్గర బైక్ లేదు అయినా అక్కడకు వెళ్ళాల్సిందే అని గట్టిగా మనసులో అనుకున్నారు. అంతే ఆటోలనో బస్సులోనో వెళ్ళి ఇంటర్యూకు అటెండ్ అవుతారు. నేను వెళ్తాను అనే గట్టి సంకంల్పం ఉంటే తప్పకుండా వెళ్తావు. నీ సంకల్పానికి ప్రకృతి కూడా తోడవుతుంది, దైవం కూడా తోడయ్యి నీవు ఒక్క అడుగు ముందుకేస్తే వెనక నుండి దైవం పది అడుగులు నడిపిస్తాడు. అందుకే ధైర్యంగా ఉంటే ఏదైనా సాదించగలం.

  అదే ఇంటర్వూకు వెళ్ళాలి మీ దగ్గర బైక్ ఉంది కాని మనసులో గట్టి సంకల్పం లేదు వెళ్తానో లేదో అంత దూరం వెళ్తే మద్యలో ఏమన్న అయితే అనుకుంటూ వెళ్తే నిజంగానే ఏదో ఒకటి అవతుంది. 

ఏమవుతుందోనని భయపడొద్దు భయపడితే ఏది సాదించలేము. 

ధైర్యంగా ఉండండి తప్పకుండా విజయం సాదిస్తారు.

ఇప్పుడు చాలా మంది కరోనాకు భయపడి ఏమవుతుందో ఆని ఆందోళన చెందతున్నారు.  అలా భయపడి తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ముందు భయాన్ని వదిలేసి నాకేమి కాదు అని  ధైర్యంగా ఉంటే తొందరగా కోలుకుంటారు. 

 దైర్యంగా ఉన్న వాళ్ళకు దైవం కూడా తోడుంటాడు. 

యత్భావం తథ్భవతి అని శ్రీకష్ణ పరమాత్మ చెప్పినట్టు మనం ఏది తలచుకుంటే అదే జరుగతుతుంది. మంచి తలచుకుంటే మంచి జరుగుతుంది.  చెడుగా తలుచుకుంటే చెడే జరుగుతుంది. కాబట్టి ఎల్లప్పుడు మంచినే కోరుకోండి అంతా మంచే జరుగతుంది. 

భయాన్ని వదిలేసి ధైర్యంగా ఉండండి అప్పుడే దేన్నైనా జయించగలరు.

 

13, మే 2021, గురువారం

మన కూరగాయలు మనమే పండిద్దాం ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం.

   

    మనకు ప్రతిరోజు అవసరమయ్యే నిత్యావసరాలలో కూరగాయలు, ఆకుకూరలు మొదటి స్థానంలో ఉంటాయి.

ప్రతీవారం మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకుంటాం. అలా కాకుండా మనమే కురగాయలు పండించుకుని తింటే ఎలా ఉంటుంది చెప్పండి?

     ఓ వందో రెండొందలో పెడితే వారానికి సరిపడా కూరగాయలు వస్తాయి దీనికోసం కూరగాయలు పండించడం అవసరమా? అని మీరు అనొచ్చు. 

నిజమే వంద రొండొందలకి వారానికి సరిపడా కూరగాయలు వస్తాయి కాని కోట్లు ఖర్చుపెట్టిన కాని ఆరోగ్యం, ఆనందం రావు.

  నేడు కూరగాయలు, ఆకుకూరలు ఎలా పండిస్తున్నారో మనకు తెలుసు.కృత్రిమ ఎరువులు విపరీతంగా వాడుతున్నారు. అలాగే పురుగు మందులు కూడా ఎక్కువగా వాడుతున్నారు. ఇంతలా కృత్రిమ ఎరువులు, పురుగు మందులు వాడిన కూరగాయలను తినడం ఆరోగ్యానికి మంచిదా చెప్పండి? వీటిని తినడం అంటే డబ్బులిచ్చి అనారోగ్యం కొనుక్కున్నట్టే. 

  ఈరోజుల్లో రైతు విత్తన కంపెనీలు, ఎరువులు పురుగుమందుల కంపెనీల చేతిలో కీలుబొమ్మల మారిపోయాడు. వారు చెప్పినట్టు విచ్చలవిడిగా ఎరువులు పురుగుమందులు వాడి పంటలు పండిస్తున్నారు. అలా చేయ్యకపోతే దిగుబడి రాదు. అందువల్ల రైతులు పంటలకు విపరీతంగా ఎరువులు, పురుగుమందులు వాడుతున్నారు. వీటిని ఇంతలా వాడటం వలన పర్యావరణానికి హాని కలుగుతుందని చాలామంది రైతులకు తెలియదు.

  మా తాతల కాలంలో వ్యవసాయం అంటే ప్రకృతి వ్యవసాయమే. సహజసిద్దంగా పంటలు పండించేవారు. విత్తనాలను వచ్చిన పంటలనుండే సేకరించేవారు.ఎరువుల విషయానికివస్తే పశువుల పేడ, ఎండుగడ్డిని సంవత్సరమంతా పెంటల్లో వేసి పంటలు వేసేముందు పొలంలో వేసుకునేవారు ఈ ఎరువు వేయడం వలన దిగుబడి బాగా వచ్చేది. ఇక పురుగుమందులు అసలు వాడేవారు కాదు ఎందుకంటే పశువుల ఎరువులు వాడటం వలన ఇన్ని పురుగులు పంటలకు ఆశించేవికావు. ఇలా పండించిన ఆహారం తిని వారు ఆరోగ్యంగా ఉండేవారు. 

మరీ నేడు ఆధునిక వ్యవసాయంలో పశువుల ఎరువులు వాడటం మానేశారు. అసలు ఇప్పుడు రైతుల వద్ద పశువులు లేకుండా పోయాయి. కృత్రిమ ఎరువులకు రైతులు అలవాటు పడిపోయారు. 'ఒకప్పుడు వ్యవసాయం అంటే పాడి పంట అనేవారు ఇప్పుడు వ్యవసాయం అంటే రసాయన పంట'.


 ఇప్పుడు కూడా ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు సుభాష్ పాలేకర్ గారి లాంటి వారు. అయిన రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళడంలేదు. ఎందుకంటే ఈ విధానంలో కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది. ఎరువులు విత్తనాలు సహజసిద్దంగా మనమే తయారు చేసుకోవాలి అంత ఓపిక ఇప్పటి రెతులకు లేదు మార్కెట్ కి వెళ్ళామా , విత్తనాలు కొన్నమా, రసాయన ఎరువులు, పురుగుమందులు తెచ్చామా పంటలకు వేశామా అంతే తేలికగా అయిపోయే. ప్రకృతి వ్యవసాయం చేసే ఓపిక ఇప్పటి రైతులకు లేదు. మరి వాళ్ళు పండించిన రసాయన పంటలే తిని అనారోగ్యం పాలవడం కంటే మనమే సొంతంగా ప్రకృతి సిద్దంగా కూరగాయలను పండించుకుని ఆరోగ్యంగా ఉందాం.

  మనం కూరగాయలను పండించేందుకు ఇంటిముందు కాని ఇంటిమీద కాని కొంచెం స్థలం ఉంటే సరిపోతుంది. ఈ పెరటి తోట ప్రారంబించేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. మడులు తయారు చేసుకోవడం, కుండీలు తెచ్చుకోవడం విత్తనాలు, మట్టి, వర్మీకంపోస్ట్, కోకోపీట్ , వేపపిండి లాంటివి తెచ్చి పెరటి తోట తయారు చేసుకోవడం వరకు కొంచెం కష్టమెన పనే. ఇష్టంగా చేస్తే ఏపని కష్టం అనిపించదు. పైగా ఇది మన ఆరోగ్యం కోసం చేసేపని. ఒక్కసారి మీ పెరటి తోట సిద్దమయ్యి కూరగాయలు కాయడం, ఆకుకూరలు పెరగడం చూస్తుంటే మీ చేతుల్తో పెంచారు కాబట్టి ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. మన పెరటి తోటలో కూరగాయలే కాకుండా పూల మొక్కలు, పండ్లమొక్కలు కూడా పెంచుకోవాలి. ఉదయం లేవగానే ఆ మొక్కల మద్యన తిరుగుతుంటే ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. 

  మన పెరటి తోటలో పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు బయట మార్కెట్లో కొన్న వాటికంటే రుచిగా ఉంటాయి. అలాగే ఆరోగ్యం కూడా.

 

 మీరు పెరటి తోటలు పెంచాలనుకుంటే mad gardenar, noorjahan terrace garden అనే యూట్యూబ్ ఛానెల్ విడియోలు చూసి చక్కగా పెరటి తోటలు పెంచండి. మాధవి గారు, నూర్జహాన్ గారు పెరటి తోటల పెంపకం గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు.

   వండుకోవడమే కష్టం అయ్యి స్విగ్గి, జోమాటో లో తెప్పించుకుని తినే ఈరోజుల్లో ఈ పెరటి తోటల్లో పండించి వండుకోవటం కష్టమంటారా.? ఆరోగ్యంగా ఉండాలంటే కొంచెం కష్టపడాల్సిందే. మరీ ఇంత బద్ధకం పనికిరాదు ఇంట్లో వండుకునే ఆహారాన్ని  బయట హోటళ్ళ నుండి కష్టపడకుండా ఇంటిదగ్గరకే తెప్పించుకుని తింటున్నారు. రేపు ఇంకో బొగ్గి సంస్థ వచ్చి ఆహారాన్ని తినిపిస్తాం అంటే ఆ సేవలను వినియోగించునేలా ఉన్నారు. మరీ ఇంత సోమరితనం అయితే ఎలా? డబ్బు డబ్బు అని పరిగెడుతూ ప్రకృతి జీవన విధానానికి దూరంగా జీవిస్తున్నారు. డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని మర్చిపోతున్నారు. ఆరోగ్యం లేకుంటే ఎంత డబ్బుంటే ఏం ప్రయోజనం. అవసరానికి తగినంత డబ్బుంటే చాలు. డబ్పుకోసమే జీవితం అన్నట్టు ఉండకూడదు. ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి.

 

పెరటి తోటల పెంపకం వలన కూరగాయలు, పండ్లతో పాటు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. ఇళ్ళు కూడా చల్లగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంటిముందు వాతావరణం  ఆహ్లాదకరంగా ఉంటుంది.

అందరు పెరటి తోటలు పెంచి ఆరోగ్యకరమైన కూరగాయలు, పండ్లు తింటు ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను. అలాగే పర్యావరణానికి మేలు చేసిన వారవుతారు.  

       ధన్యవాదాలు...


   

 

 

 

   


16, మార్చి 2021, మంగళవారం

ఇప్పుడు జానపద గాయకులు సినిమాలకు పబ్లిసిటీ... సారంగదరియా...

 

     

                       సారంగదరియా పాట‌ గురించి కొన్నాళ్ళుగా వివాదం నడుస్తుంది. ఈ పాట‌ను శేఖర్ కమ్ముల  లవ్ స్టోరీ సినిమాలో తనకు చెప్పకుండానే వాడుకున్నారని జానపద గాయని కోమలి గారు ఆవేదన వ్యక్తం చేశారు.

      సారంగదరియా పాట‌ను మొదట‌గా పాడింది కోమలి. యూట‌్యూబ్ లో ఆమె పాడిన పాట‌ కూడా ఉంది. జానపద పాట‌లలో ఈ పాట‌ కొంచం ఫేమస్ సాంగే. కానీ అంత పెద్ద ఫేమస్ కాదు. కానీ ఈ వివాదం వల్ల చాలా ఫేమస్ అయ్యింది. సింగర్ కోమలి కూడా పెద్దగా ఎవరికి తెలియదు. ఈ వివాదం వల్ల ఆమె అందరికి తెలిసింది. నటుడు మోహన్ బాబు ఆమెని "మొసగాళ్ళు"  సినిమా ఫంక్షన్ కి పిలిచి మోసం చేయడం గురించి ఒక పాట‌ను కూడా పాడించారు. సినిమాల్లోనూ పాట‌లు పాడే అవకాశం కల్పిస్తాను అన్నారు.  ఆ తర్వాత కోమలి గారిని సత్కరించారు. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఈ సారంగదరియా పాట‌ వివాదం కాకుంటే ఆమె ఇక్కడ వరకు వచ్చేదా.?
 
           మోసగాళ్ళు సినిమాకి  సింగర్ కోమలి గారిని పిలిపించి మోసం చేయడం మీద పాట‌ పాడించడం ఎందుకో....?

ఒకరు పాడిన పాటను వారికి తెలికుండా వాడుకోవడం కాపీరైట‌్ ఇష్యూ వస్తుందని సామాన్యులకు కూడా తెలుస్తుంది. కానీ శేఖర్ కమ్ముల, సుద్దాల ఆశోక్ తేజ  వంటి పెద్ద పెద్ద సినిమా డైరెక్టర్స్ కి, రైట‌ర్స్ కి తెలియదా..? 

        ఇలా వివాదం జరిగుతుంది అని తెలిసే చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే సినిమా పబ్లిసిటీ కోసమే ఇలాంటివి చేస్తుంట‌రనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి వివాదాలే సినిమా పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు. కానీ శేఖర్ కమ్ముల వంటి మంచి దర్శకులు కూడా ఇలాంటివి చేయడం చూస్తుంటే తన సినిమా మీద తనకు నమ్మకం లేకపోవడమే అవుతుంది. 

    ఏది ఏమైనా ఈ సారంగదరియా పాట‌ వివాదం వల్ల అందరికి మంచే జరిగింది. కోమలి గారికి సినిమాల్లో పాట‌లు పాడే అవకాశం వచ్చింది. శేఖర్ కమ్ముల సినిమా కు పబ్లిసిటీ వచ్చింది.

    ఇక మోహన్ బాబు గారు కోమలి గారికి సినిమాల్లో పాట‌లు పాడే అవకాశం తప్పకుండా ఇవ్వాలి లేదంటే ఆయన కూడా ఈ వివాదాన్ని మోసగాళ్ళు సినిమా పబ్లిసిటీ కోసం ఉపయోగించుకున్నారని అర్థమవుతుంది.,,,!!

    ఈ మద్య గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన చాలామంది    గాయనీ గాయకులు తమ ప్రతిభతో పైకి వస్తున్నారు. అసలు సంగీతం గురించి ఏమాత్రం అవగాహన లేని వారు సైతం అద్భుతంగా పాడి అందరి ఆదరాభిమానాలు పొందుతున్నారు.  అందులో అరవై ఏళ్ళ వయసులో సైతం "ఆడనెమలి" పాట‌తో సంగీత ప్రియులను ఉర్రూతలూగించారు "కనకవ్వ" గారు..

    ఇలా చాలా మంది  ప్రతిభ ఉన్న గాయని గాయకులు తమ ప్రతిభతో పైకి వస్తున్నారు.

వీరి ప్రతిభను కొంతమంది  సినిమాల్లో వాడుకుంటున్నారు.

నిజంగా సినిమా వాళ్ళకు ఇలాంటి వారిపై ప్రేమ ఉంటే వారికి అవకాశాలు ఇవ్వాలి కానీ వారిని తమ సినిమా ప్రచారాల కోసమే, తాము పే....ద్ద దయాహృదయులమని ప్రజల్లో చాటుకోవడం కోసమె చేస్తున్నారే తప్ప నిజంగా వారిని పైకి తేవాలని అయితే కాదు....  అని నాకు అనిపిస్తుంది...

      ఆ మద్య 2018లో  బేబి అనే ఆవిడ చాలా బాగా పాట‌లు పాడుతుందని, ఆమెది చాలా అద్భుతమైన గొంతు అని అందరూ పొగడ్తలతో ముంచెత్తారు. మొత్తంగా ఆమెని ఆకాశానికి ఎత్తేసారు... సంగీత దర్శకులు కోటి గారు, రఘుకుంచె గారు, పొగడ్తలతో ముంచెత్తారు. చిరంజీవి గారు తన ఇంటికి పిలిచి సత్కరించారు.  
బేబీ గారిని మట‌్టిలో మాణిక్యం అంటు పొగిడారు.
ఆ మట‌్టిలో మాణిక్యం ఇక సినిమాల్లో పాడుతూ బిజీగా అయిపోతుంది అనుకున్నాం... కానీ ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా ఆమె పాడింది లేదు... అసలు ఏమైంది ఈ మట‌్టిలో మాణిక్యం..
అంత పెద్ద సినిమా స్టార్స్   పొగిడిన బేబీ గారు ఇప్పటి వరకు ఒక్క పాట‌ పాడింది లేదు...

రామ్ గోపాల్ వర్మ
అబ్బ సొత్తు కాదురా టాలెంటు ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటూ... అన్నట‌్టు... టాలెంట‌్ మన దగ్గర ఉంటే ఎవరి సహాయం అవసరం లేదు. ముఖ్యంగా సినిమా రంగంలో.
           

ఈ మద్య ఎవరికైనా కొంచెం టాలెంట‌్ ఉన్న వారిని ఈ సినిమా వాళ్ళు షేర్ మార్కెట్ లో  షేర్ లాగా బాగా పైకి ఎత్తుతారు...

అప్పుడు  వీళ్ళ  పరిస్థితి ఎలా ఉంటుందంటే  ఫండమెంట‌ల్ గా , టెక్నికల్ గా అంత బలంగా లేని షేర్ అప్పర్ సర్క్యూట‌్ లోకి వెళ్ళి. ఆ తర్వాత అమాంతం ఢమాల్ న కిందపడిపోయి షేర్ మార్కెట్ నుండి  డీలిస్ట్ అయిపోయినట‌్టు ఉంటుంది..

  కాబట్టి ఎవరో పొగిడారని ఇక తమ జీవితం రంగులమయం అవుతుందని కలల లోకంలో విహరించకండి.

గొప్ప స్టార్స్  చుక్కలే చూపిస్తారు.
ఎందుకంటే వాళ్ళు పెద్ద స్టార్స్ కాబట్టి..

అందుకే  ఎవరో పొగిడారని పొంగిపోవద్దు మనలో టాలెంటు ఉంటే మనమే పైకి వస్తాం.

ఎవరి సహాయం అవసరం లేదు.  మీలో టాలెంటు ఉంటే    

యూట‌్యూబ్ లో ఛానెల్ పెట్టి పాట‌లు పాడండి చాలు.

యూట‌్యూబ్ మిమ్మల్ని స్టార్స్ ని చేస్తుంది..

10, మార్చి 2021, బుధవారం

బంగారు తెలంగాణ కాదు కాలుష్య తెలంగాణ.

        

                మనిషి ప్రశాంతంగా,ఆరోగ్యంగా బ్రతకాలంటే స్వచ్ఛమైన గాలి,నీరు ఎంతో అవసరం. స్వచ్ఛమైన గాలి,నీరు ఎక్కడ లభిస్తుంది అంటే పల్లెటూర్లో లభిస్తుంది అని అందరూ చెబుతారు. ఎందుకంటే పట‌్ట‌ణాల్లో గాలి,నీటి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. పట‌్ట‌ణాల్లో,నగరాల్లో నివసించే ప్రజలు వారాంతాల్లో నగర కాలుష్యానికి దూరంగా పల్లెల వైపు వచ్చి స్వచ్ఛమైన గాలిని, వాతావరణాన్ని ఆస్వాదిస్తుం‌టారు.  పల్లెటూళ్ళంటే పచ్చని ప్రకృతితో, స్వచ్చమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో కళకళలాడుతూ ఉండేవి.  ఉండేవి అని ఎందుకన్నానంటే అది గతంలో ఇప్పుడు కాదు. ఎందుకంటే  ఇప్పుడు        పల్లెటూళ్ళు కాలుష్యంలో  పట‌్ట‌ణాలతో పోటీ పడుతున్నాయి. ఇప్పుడు కాలుష్యంలో పట‌్నంకు, పల్లెకు తేడా లేదు. 

               

              ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంతో కళకళలాడుతూ ఉండే పల్లెల్లో ఇప్పుడు కాలుష్యంతో విలవిల ాడుతున్నాయి. పట‌్ట‌ణాల్లో  వాహనాల పొగ, ప్లాస్టిక్ వ్యర్ధాలు, డ్రైనేజీల వలన కాలుష్యాం ఏర్పడుతుంది. ఇక్కడ ప్రజలు ఎక్కువగా చదువుకున్న వాళ్ళే ఉం‌టారు. వీరికి కాలుష్యం పట‌్ల అవగాహన కూడా ఉంటుంది. అయిన పర్యావరణ కాలుష్యం గురించి ఎవ్వరూ పట్టించుకోరు. అందువలన పట‌్ట‌ణాలెప్పుడు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు పల్లెలు కూడా కాలుష్యంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ముఖ్యంగా గాలి కాలుష్యం విపరీతంగాపెరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాల గురించి చదువుకున్న వాళ్ళే పట‌్టించుకోరు. ఇక పల్లెల్లో ఉండే చదువుకోని ప్రజలకు ఎలాంటి అవగాహన ఉండదు. అందువల్ల పల్లెల్లో కాలుష్యం పెరిగిపోయింది. ముఖ్యంగా గాలి  కాలుష్యం పెరిగిపోయింది. ఎలా అంటే ప్లాస్టిక్ వ్యర్ధాలను తగల పెట‌్ట‌డం వలన గాలి కాలుష్యం ఎక్కువగా ఉంది.  ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వాడకం విపరీతంగాపెరిగిపోయింది. క్యారీబ్యాగ్, కూల్ డ్రింక్స్ బాటిల్స్, ఫుడ్ ప్యాకింగ్ కవర్స్,    ప్లాస్టిక్ విస్తరాకులు, చిప్స్ ప్యాకెట్స్ ఇలా అన్ని ప్లాస్టిక్ మయమే వీటిని వాడిన తర్వాత ఒక దగ్గర వేసి కాల్చి వేస్తున్నారు. దీని వలన ఏర్పడిన పొగ వలన పర్యావరణ ానికి ఎంత ప్రమాదమో వారికి తెలియదు, ఆ పొగ పీల్చటం వలన ఎలాంటి అనారోగ్యాలు వస్తాయో వారికి తెలియదు. ఇది తెలియక చాలామంది ప్లాస్టిక్ వ్యర్ధాలను తగలబెడుతుంట ారు. ఇదివరకు ఎవరి ఇళ్ళముందు వారు తగలబెట్టెవారు. దీని వలన కొంత సమయం గాలి కాలుష్యం ఆ చుట్టు పక్కల ఉండేది. కానీ ఇప్పుడు  ఈ గాలి కాలుష్యం, పొగ రోజంతా పల్లెలను పట్టి పీడిస్తోంది. ఇలా రోజంతా గాలి కాలుష్యం, పొగ రావడానికి కారణం ప్రభుత్వాల అతి తెలివి వల్ల నేడు గ్రామాల్లో వాయు కాలుష్యం పెరిగిపోయింది.


              ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లో ఇంటింటికి వచ్చి చెత్త సేకరించే కార్యక్రమం నడుస్తుంది. తడిచెత్త, పొడి చెత్త వేరు వేరుగా సేకరించాలని కొన్ని గ్రామాల్లో రెండు చెత్త బుట్టలను ఇవ్వడం జరిగింది. తడి చెత్త, పొడి చెత్త గురించి అవగాహన కల్పించారు. ఇక్కడ వరకు ప్రభుత్వం చేసిన పని మెచ్చుకోదగ్గ విషయమే. కానీ ఈ చెత్త డబ్బాలు కొన్ని గ్రామాల్లోనే ఇచ్చారు. చాలా గ్రామాల్లో ఇవి ఇవ్వలేదు. సరే ఇవ్వలేకున్నా సరే మేమే తెచ్చుకుంటాం చెత్తను   వేరు చేసి ఇస్తాం ఈ చెత్తను ప్రభుత్వం ఏమి చేయాలి? పర్యావరణ ానికి హాని కలిగించకుండా రీసైక్లింగ్ చేయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా తడి చెత్త, పొడి చెత్త , ఆ చెత్త ఈ చెత్త అని తెడా లేదు అన్ని చెత్తలు ఒకటే అన్నట‌్టు ఒకే చోట‌ వేస్తున్నారు. ఈ చెత్త  సేకరించే వారు ఉదయం ఒక ట‌్రాక్ట‌ర్ తో గ్రామంలో మొత్తం తిరిగి అన్ని రకాల చెత్తలు అందులో వేసుకుని ఊరి బయట‌ ఉన్న చెత్త డంప్ యార్డ్ లో వేస్తున్నారు.  ఇక్కడ వరకు బాగానే ఉంది కదా?  తెలంగాణ గ్రామాలు దీని వలన స్వచ్ఛంగా వెలిగిపోతున్నాయి అని మీరు అనొచ్చు, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం అని కూడా అనొచ్చు. కాని నేను మాత్రం ఇది పరమ దరిద్రమైన చెత్త పని అని అంటాను.... ఎందుకంటే ఒకపని చేస్తే ప్రజలకు మేలు కలగాలి కాని ఈ చెత్త సేకరించే పని వలన ప్రజలకు నష్ట‌మే తప్ప మేలు జరగడం లేదు.


           ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లో చెత్త డంప్ యార్డులు నిర్మించారు. దాంట‌్లో చెత్తను వేరు చేయడానికి అన్నట‌్టు చిన్న చిన్న గదులు నిర్మించారు. అందులో  గ్రామాల్లో సేకరించిన చెత్తను వేరు చేసి రీసైక్లింగ్ చేయాలి. కానీ ఇప్పడు ఏం చేస్తున్నారంటే డంపు యార్డ్ ముందు ఒక పెద్ద గుంత తీసి గ్రామంలో సేకరించిన చెత్తను అందులో వేసి తగలబెడుతున్నారు. దీని వలన 24/7 365 రోజులు అది మండుతూనే ఉంటుంది. ఆ పొగ పగటి పూట‌ పైకి వెళుతుంది. అప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. కాని సాయంత్రం పూట‌ చుట్టు పక్కల మొత్తం పొగతో నిండిపోయి నరకం కనిపిస్తుంది. గాలి పీల్చాం‌టేనే భయం వేస్తుంది. దగ్గు, ఆయాసం, కళ్ళ మంట‌లు నరకయాతన.

       అసలు ప్రభుత్వాలకు ఇలాంటి చెత్త ఐడియాలు ఎందుకొస్తాయో..? 😭😭😭 మా గ్రామంలో అయితే సాయంత్రం అయ్యిందం‌టే చాలు ఈ చెత్త డంపు యార్డ్ వల్ల దానికి దగ్గరగా ఉన్న ఇళ్ళ ప్రజలు    చాలా ఇబ్బంది పడుతున్నారు.. అందుకు ఉదాహరణ నేనే... సాయంత్రం నుండి ఉదయం వరకు ఆ పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్నా. నా పక్కన ఎవరైన సిగరెట‌్ తాగితేనే నాకు పడదు అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతాను. అలాంటిది లక్షల సిగరెట్లు  కాల్చినంత పొగ వస్తే ఏం చేయాలి. ఉపాది లేక  దశాబ్దం పాటు ఊరు వదిలి వెళ్ళిపోయాం.అక్కడ నానా కష్టాలు పడ్డాం. తెలంగాణ వచ్చాక మన బతుకులు బాగు పడతాయని సొంత ఊరికి వస్తే ఇక్కడేమే స్వచ్చమైన గాలి కూడా లభించడం లేదు. ఇదేనా బంగారు తెలంగాణ అంటే.????

        బంగారు తెలంగాణ ఎవరికి అయ్యిందో అందరికి తెలిసిందే. ఒక కుటుంబం బాగు పడితే చాలా...???


ఇది చాలా చిన్న సమస్య ఇంత పెద్ద రాద్దాంతం చేయడం అవసరమా అని మీరు అనొచ్చు. ఆ కష్టం అనుభవించిన వాడికే తెలుస్తుంది ఆ భాదేమిటో.  ఎక్కడైన పొగ వస్తేనే అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతాం అలాంటిది మన ఇంటికి దగ్గర 24 గంట‌లు పొగ అది కూడా ప్లాస్టిక్ ను తగలబెట్టిన పొగ వస్తే ఎలా ఉం‌టుందో ఆలోచించండి. ఇలాంటి కలుషితమైన గాలిని పీల్చి అనారోగ్యాల పాలయితే ఆసుపత్రుల చుట‌్టు తిరిగే స్తోమత మాకు లేదు. నాకు ఆసుపత్రులంటే మహా భయం.. అక్కడకు వెళ్ళాలంటే ఇంట‌్లో డబ్బులు కాసే చెట్లు ఉండాలి. అయినా ఆసుపత్రుల చుట‌్ట‌్టు తిరగడం కం‌టే ఆరోగ్యంగా ఉండట‌మే మేలు కదా..  


            కెసిఆర్ సార్ అంటే నాకు ఎంతో అభిమానం... నా చుట్టూ ఉండే వాళ్ళు ఎందరు కెసిఆర్ సార్ ను విమర్శించిన

 సార్ గొప్పవాడు  విమర్శించడం తప్పు అనేవాడిని . నేనే తప్పు అని ఇప్పుడు అర్థం అయ్యింది.. ఒక పని చేసే ట‌ప్పుడు అది పూర్తిగా  అమలు జరిగేలా చూడాలి అది వారి బాధ్యత. కాని ఆ పనిని  సగంలోనే వదిలేస్తే   బాధ్యతారాహిత్యం అంటారు.. ఈ చెత్త డంప్ యార్డులు ఎందుకు కట‌్ట‌డం జరిగింది అక్కడ జరుగుతున్నదేమిటి. అది పూర్తిగా నిర్దేశించిన పని జరుగుతుందా లేదా అనే బాధ్యత ప్రభుత్వానికి లేదా....??  కెసిఆర్ సార్ బంగారు తెలంగాణ అంటాడు సార్ మాకు బంగారు తెలంగాణ అవసరం లేదు. మాకు స్వచ్చమైన గాలి కూడా లభించడం లేదు నీ బంగారు తెలంగాణలో...


నా తెలంగాణ ఇప్పుడు కాలుష్యానికి చిరునామా. 

కెసిఆర్ సారూ నీకు కోటి దండాలు...🙏🙏🙏🙏🙏🙏

మీరు ఈ రాష్ట‌్రాన్ని బంగారు తెలంగాణ చేయకపోయిన పరవలేదు కానీ కాలుష్య తెలంగాణగా మాత్రం చేయకండి..


ఇక చివరగా ఒక మాట‌.. కెసిఆర్ సార్ చెప్పిన బంగారు తెలంగాణ ఎక్కడుందంటే ఆయన ఫామ్ హౌస్ లో ఉంది మంచి ఆహ్లాదకరమైన వాతావరణం హాయిగా ఆయన నివసిస్తున్నారు. సార్..... మీరు ముఖ్యమంత్రి అయ్యింది మీ కు‌టుంబం మాత్రమే హాయిగా ప్రశాంతంగా,ఆరోగ్యంగా జీవించడానికి కాదు. తెలంగాణ ప్రజలు హాయిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించాలి. దాన్ని అం‌టారు బంగారు తెలంగాణ అని.. నీ ఫామ్ హౌస్ పక్కన ఒక చెత్త డంపు యార్డ్ ఉండి ఊరి చెత్తనంతా అక్కడ వేసి తగలబెడితే తేలుస్తుంది మా బాధేమిటో. ఈ మాట‌ మీకు కోపం కలిగిస్తే, మాట‌ అన్నందుకే మీకు కోపం వస్తే మీరు గ్రామాల్లో కట‌్టించిన చెత్త డంపు యార్డుల   పొగ వల్ల నరకం అనుభవిస్తున్న మాకు ఎంత రావాలి మీపై కోపం..😠😠😠😠😠😠😠😠😠😠


ఇంకా చాలా అక్రమాలు జరుగుతున్నాయి.  కొండలు తవ్వేయడం, పచ్చని పంట‌ పొలాల్లో కంపెనీలు,  వెంచర్లు వేయడం వలన పర్యావరణం నాశనం అవుతుంది.. ఇక ఒకప్పుడు హైదరాబాద్ తాగునీటీ అవసరాలు తీర్చిన జంట‌ జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు కాలుష్యం కాకుండా 111 జీవో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఇప్పడు కెసిఆర్ ప్రభుత్వం వచ్చింది కదా బంగారు తెలంగాణ చేయాలి కదా ... అందుకే కెసిఆర్ సార్ 111 జీవోను కూడా ఎత్తి పడేస్తా అని చెప్పాడు.. నాకు తెలుసి కెసిఆర్ సార్  తెలంగాణ రాష్ట‌్రాన్ని కాలుష్యంగా మార్చడానికే కంకణం కట‌్టుకున్నట్టున్నాడు..

ఈ రెండు జలాశయను కూడా హూస్సేన్ సాగర్ లాగా  సుగంధభరితమైన జలాశయాలుగా మార్చాలనుకుంటున్నాడు. సారూ మీరు బంగారు తెలంగాణ చేస్తాను అం‌టే ఈ విధంగా చేస్తావనుకోలేదు..

సారూ కెసిఆరూ ఇలాంటి బంగారు తెలంగాణ మాకు వద్దు..... నీకు కోటి దండాలు...🙏🙏🙏🙏🙏🙏��