భానోదయం: సంగీతం
సంగీతం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సంగీతం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, ఏప్రిల్ 2022, శనివారం

వ్యవసాయం మీద ప్రేమతో ఎకరం విస్తీర్ణంలో బావిని తవ్వించిన రైతు భగీరథుడు.


 ఆలోచన అంటే ఇది, అభివృద్ధి అంటే ఇది, పర్యావరణ పరిరక్షణ అంటే ఇది..


   


    ఒక సామాన్య రైతు గొప్ప పని చేసాడు కాదు కాదు భగీరథ ప్రయత్నం చేశాడు. చేసి సాధించాడు. 


మహారాష్ట్ర బీడ్ జిల్లా పదల్షింగి గ్రామానికి చెందిన రైతు  మారుతి బాజ్గుడే సాధించిన విజయం చూస్తే గర్వంగా ఉంది.. 


బీడ్ జిల్లా ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉండడం వలన నీళ్ళ కరువుతో పంటలు పండేవి కావు.  మారుతి అనే రైతుకు 12 ఎకరాలు పొలం ఉంది ఎంత పొలం ఉంటే ఏంటి లాభం నీళ్ళు లేకుంటే..


అప్పుడు ఆ రైతు ఆలోచన ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టింది. అదేంటంటే తన పొలంలో నీళ్ళ కరువే లేకుండా చేయాలనుకుని ఒక ఎకరం విస్తీర్ణంలో, నలబై అడుగుల లోతుగా  బావిని తవ్వాలనుకున్నాడు. ఎకరం విస్తీర్ణంలో బావి తవ్వడం అంటే మామూలు విషయం కాదు అదికూడా ఒక రైతు.


 ఇది జరిగే పనేనా!


ఇంత విశాలమైన బావిని తవ్వడానికి చాలా ఖర్చు అవుతుంది. 


తవ్వినాక నీళ్ళు రాకుంటే పరిస్థితి ఏంటి?



ఇవేవి మారుతి పట్టించుకోలేదు.

కేవలం తాను అనుకున్నది సాధించాలి అంతే.

తన పొలం ఎప్పుడు పంటలతో  కళకళలాడుతూ ఉండాలి. 


తను అనుకున్నట్టుగానే బావిని తవ్వించాడు. బావిచుట్టు కాంక్రీటు తో గోడ నిర్మించాడు.

 అందుకు అతనికి అయిన ఖర్చు అక్షరాలా కోటిన్నర రూపాయలు..

అంత ఖర్చా ..! అది నీళ్ళ కోసం..!


అని అందరూ నోరెళ్ళబెడతారు. ఇది పిచ్చి పని అనికూడా అంటారు.

అదే కోటిన్నర తో ఏదైనా వ్యాపారం చేసి కోట్లు సంపాదించొచ్చు అంటారు..


కాని మారుతి గారు ఇవేమి పట్టించుకోకుండా వ్యవసాయం మీద ఉన్న ప్రేమతో నీటి కోసం భగీరథ ప్రయత్నమే చేసాడు.


తను అనుకున్నది సాధించాడు. ఇప్పుడు ఎకరం విస్తీర్ణంలో ఉన్న బావిలో పుష్కలంగా నీరు ఉంది. ఆ నీటితో తన పదకొండు ఎకరాల పొలానికి నీరు అందుతుందని అంటున్నాడు. అందులో అన్నిరకాల పండ్ల మొక్కలు, అన్నిరకాల పంటలు వేస్తానంటున్నాడు.


"నీవు ప్రయత్నం చేయి ఫలితం భగవంతుడు చూసుకుంటాడు అన్నట్టు"..

మన ఆలోచన మంచిదైతే మన ప్రయత్నంతో ఏ పని చేసిన ఫలితం సాధించవచ్చు అని నిరూపించారు మారుతి గారు. ఆయన పేరు మారుతి అంటే హనుమాన్. ఆనాడు ఆ హనుమాన్ కొండను పెకిలించి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ మారుతి బీడు భూముల్లో బావిని తవ్వి గంగమ్మను తీసుకొచ్చాడు.. తన పేరుకు సార్థకత తీసుకొచ్చాడు.




చాలా మంది అనుకుంటారు కోటిన్నర రూపాయలు ఖర్చు చేసి ఎకరం విస్తీర్ణంలో బావి తవ్వడం ఎందుకు.

అదే డబ్బు తో ఏదైనా వ్యాపారం చేసి కోట్లు సంపాదించొచ్చు అని..


అదే మనదగ్గర అయితే ఈ పాటికి అలాంటి భూమి ప్లాట్లు చేసి కోట్లకు అమ్ముకునేవాళ్ళు.

ఉన్న నీటి వనరులను కాలుష్యం చేస్తారు.


కాని మారుతి గారు వ్యవసాయం మీద ప్రేమతో ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా తాను అనుకున్నది సాధించాడు.


మారుతి గారు కోటిన్నర ఖర్చు పెట్టిన దానికి ఆయన పొందే ఆనందానికి ఎన్ని వేల కోట్ల డబ్బుతో వెలకట్టలేనిది.


అప్పటి వరకు బీడుగా ఉన్న పొలం తన ప్రయత్నంతో పచ్చని పంటలతో కళకళలాడుతూ ఉంది. విశాలమైన బావిలో పుష్కలంగా నీరు ఉంది. తను పెంచుకున్న వివిధ రకాల పండ్లు మొక్కలు ఉన్నాయి. ఈ ఎండాకాలంలో తన పొలం గట్టు మీద నీటి కాలువ పక్కన ఉన్న ఒక పచ్చని చెట్టుకింద నులక  మంచం వేసుకుని ఒక కునుకు తీస్తుంటే ఆ ఆనందం ఎన్ని లక్షల కోట్లు ఇస్తే వస్తుంది చెప్పండి..


 చుట్టూ పచ్చని పంటపొలాలు,

 పచ్చని చెట్లు, పక్షుల కిలకిలా రావాలు, 

 పొలం గట్టున కాలువలో  చిన్నగా పారే నీటి సవ్వడి, ఆకాలువ నీటితో తడిసిన మట్టి సువాసన,

 ఈ వేసవిలో   మద్యాహ్నం వీచే పిల్లగాలులు. వీటన్నింటిని ఆస్వాదిస్తూ ఆ చెట్టు కింద కూర్చుని ఆస్వాదిస్తూ ఉంటే ఆ ఆనందానికి ఎన్ని కోట్లు వెల కట్టగలం.


మారుతి గారు ఏడాది పొడవునా పంటలు పండిస్తూ హాయిగా ప్రశాంతంగా జీవిస్తారు. 


 ఆయన తను పెట్టిన ఖర్చు తిరిగి సంపాదిస్తాడా అంటే? సంపాదిస్తాడు. 

  

ఎందుకంటే మనదగ్గర వ్యవసాయం తగ్గిపోయింది త్వరలో ఆహార సంక్షోభం తలెత్తుతుంది. అప్పుడు మారుతి లాంటి రైతులు వద్దే ఆహార ధాన్యాల ఉంటాయి కాబట్టి వారు అప్పుడు కోట్లు సంపాదిస్తారు.


ఆయన కోట్లు సంపాదించడం కంటే పర్యావరణాన్ని కాపాడుతున్నాడు అది చాలు ఆయనకు ఈ జన్మకు సంతృప్తి..












 

16, మార్చి 2021, మంగళవారం

ఇప్పుడు జానపద గాయకులు సినిమాలకు పబ్లిసిటీ... సారంగదరియా...

 

     

                       సారంగదరియా పాట‌ గురించి కొన్నాళ్ళుగా వివాదం నడుస్తుంది. ఈ పాట‌ను శేఖర్ కమ్ముల  లవ్ స్టోరీ సినిమాలో తనకు చెప్పకుండానే వాడుకున్నారని జానపద గాయని కోమలి గారు ఆవేదన వ్యక్తం చేశారు.

      సారంగదరియా పాట‌ను మొదట‌గా పాడింది కోమలి. యూట‌్యూబ్ లో ఆమె పాడిన పాట‌ కూడా ఉంది. జానపద పాట‌లలో ఈ పాట‌ కొంచం ఫేమస్ సాంగే. కానీ అంత పెద్ద ఫేమస్ కాదు. కానీ ఈ వివాదం వల్ల చాలా ఫేమస్ అయ్యింది. సింగర్ కోమలి కూడా పెద్దగా ఎవరికి తెలియదు. ఈ వివాదం వల్ల ఆమె అందరికి తెలిసింది. నటుడు మోహన్ బాబు ఆమెని "మొసగాళ్ళు"  సినిమా ఫంక్షన్ కి పిలిచి మోసం చేయడం గురించి ఒక పాట‌ను కూడా పాడించారు. సినిమాల్లోనూ పాట‌లు పాడే అవకాశం కల్పిస్తాను అన్నారు.  ఆ తర్వాత కోమలి గారిని సత్కరించారు. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఈ సారంగదరియా పాట‌ వివాదం కాకుంటే ఆమె ఇక్కడ వరకు వచ్చేదా.?
 
           మోసగాళ్ళు సినిమాకి  సింగర్ కోమలి గారిని పిలిపించి మోసం చేయడం మీద పాట‌ పాడించడం ఎందుకో....?

ఒకరు పాడిన పాటను వారికి తెలికుండా వాడుకోవడం కాపీరైట‌్ ఇష్యూ వస్తుందని సామాన్యులకు కూడా తెలుస్తుంది. కానీ శేఖర్ కమ్ముల, సుద్దాల ఆశోక్ తేజ  వంటి పెద్ద పెద్ద సినిమా డైరెక్టర్స్ కి, రైట‌ర్స్ కి తెలియదా..? 

        ఇలా వివాదం జరిగుతుంది అని తెలిసే చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే సినిమా పబ్లిసిటీ కోసమే ఇలాంటివి చేస్తుంట‌రనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి వివాదాలే సినిమా పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు. కానీ శేఖర్ కమ్ముల వంటి మంచి దర్శకులు కూడా ఇలాంటివి చేయడం చూస్తుంటే తన సినిమా మీద తనకు నమ్మకం లేకపోవడమే అవుతుంది. 

    ఏది ఏమైనా ఈ సారంగదరియా పాట‌ వివాదం వల్ల అందరికి మంచే జరిగింది. కోమలి గారికి సినిమాల్లో పాట‌లు పాడే అవకాశం వచ్చింది. శేఖర్ కమ్ముల సినిమా కు పబ్లిసిటీ వచ్చింది.

    ఇక మోహన్ బాబు గారు కోమలి గారికి సినిమాల్లో పాట‌లు పాడే అవకాశం తప్పకుండా ఇవ్వాలి లేదంటే ఆయన కూడా ఈ వివాదాన్ని మోసగాళ్ళు సినిమా పబ్లిసిటీ కోసం ఉపయోగించుకున్నారని అర్థమవుతుంది.,,,!!

    ఈ మద్య గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన చాలామంది    గాయనీ గాయకులు తమ ప్రతిభతో పైకి వస్తున్నారు. అసలు సంగీతం గురించి ఏమాత్రం అవగాహన లేని వారు సైతం అద్భుతంగా పాడి అందరి ఆదరాభిమానాలు పొందుతున్నారు.  అందులో అరవై ఏళ్ళ వయసులో సైతం "ఆడనెమలి" పాట‌తో సంగీత ప్రియులను ఉర్రూతలూగించారు "కనకవ్వ" గారు..

    ఇలా చాలా మంది  ప్రతిభ ఉన్న గాయని గాయకులు తమ ప్రతిభతో పైకి వస్తున్నారు.

వీరి ప్రతిభను కొంతమంది  సినిమాల్లో వాడుకుంటున్నారు.

నిజంగా సినిమా వాళ్ళకు ఇలాంటి వారిపై ప్రేమ ఉంటే వారికి అవకాశాలు ఇవ్వాలి కానీ వారిని తమ సినిమా ప్రచారాల కోసమే, తాము పే....ద్ద దయాహృదయులమని ప్రజల్లో చాటుకోవడం కోసమె చేస్తున్నారే తప్ప నిజంగా వారిని పైకి తేవాలని అయితే కాదు....  అని నాకు అనిపిస్తుంది...

      ఆ మద్య 2018లో  బేబి అనే ఆవిడ చాలా బాగా పాట‌లు పాడుతుందని, ఆమెది చాలా అద్భుతమైన గొంతు అని అందరూ పొగడ్తలతో ముంచెత్తారు. మొత్తంగా ఆమెని ఆకాశానికి ఎత్తేసారు... సంగీత దర్శకులు కోటి గారు, రఘుకుంచె గారు, పొగడ్తలతో ముంచెత్తారు. చిరంజీవి గారు తన ఇంటికి పిలిచి సత్కరించారు.  
బేబీ గారిని మట‌్టిలో మాణిక్యం అంటు పొగిడారు.
ఆ మట‌్టిలో మాణిక్యం ఇక సినిమాల్లో పాడుతూ బిజీగా అయిపోతుంది అనుకున్నాం... కానీ ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా ఆమె పాడింది లేదు... అసలు ఏమైంది ఈ మట‌్టిలో మాణిక్యం..
అంత పెద్ద సినిమా స్టార్స్   పొగిడిన బేబీ గారు ఇప్పటి వరకు ఒక్క పాట‌ పాడింది లేదు...

రామ్ గోపాల్ వర్మ
అబ్బ సొత్తు కాదురా టాలెంటు ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటూ... అన్నట‌్టు... టాలెంట‌్ మన దగ్గర ఉంటే ఎవరి సహాయం అవసరం లేదు. ముఖ్యంగా సినిమా రంగంలో.
           

ఈ మద్య ఎవరికైనా కొంచెం టాలెంట‌్ ఉన్న వారిని ఈ సినిమా వాళ్ళు షేర్ మార్కెట్ లో  షేర్ లాగా బాగా పైకి ఎత్తుతారు...

అప్పుడు  వీళ్ళ  పరిస్థితి ఎలా ఉంటుందంటే  ఫండమెంట‌ల్ గా , టెక్నికల్ గా అంత బలంగా లేని షేర్ అప్పర్ సర్క్యూట‌్ లోకి వెళ్ళి. ఆ తర్వాత అమాంతం ఢమాల్ న కిందపడిపోయి షేర్ మార్కెట్ నుండి  డీలిస్ట్ అయిపోయినట‌్టు ఉంటుంది..

  కాబట్టి ఎవరో పొగిడారని ఇక తమ జీవితం రంగులమయం అవుతుందని కలల లోకంలో విహరించకండి.

గొప్ప స్టార్స్  చుక్కలే చూపిస్తారు.
ఎందుకంటే వాళ్ళు పెద్ద స్టార్స్ కాబట్టి..

అందుకే  ఎవరో పొగిడారని పొంగిపోవద్దు మనలో టాలెంటు ఉంటే మనమే పైకి వస్తాం.

ఎవరి సహాయం అవసరం లేదు.  మీలో టాలెంటు ఉంటే    

యూట‌్యూబ్ లో ఛానెల్ పెట్టి పాట‌లు పాడండి చాలు.

యూట‌్యూబ్ మిమ్మల్ని స్టార్స్ ని చేస్తుంది..

1, అక్టోబర్ 2019, మంగళవారం

సామజవరగమన సిద్ శ్రీరామ్


 

             కొందరు గాయకులు పాడిన పాటలు ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది. వారు ఏ పాట పాడిన వినసొంపుగా ఉంటుంది. అలాంటి వారిలో "సిద్ శ్రీరామ్" ఒకరు. ఇంతకు ముందు ఈయన పాడిన పాటలు పెద్ద హిట్టయ్యాయి. అందులో
నువ్వుంటే నా జతగా,
ఉండిపోరాదే గుండె నీదేలే,
ప్రేమ ఓ ప్రేమ,
వెళ్ళిపోమాకే,
మాటే వినదుగా,
ఇంకెం ఇంకెం ఇంకెం కావాలే, లాంటి పాటలు ఎంత హిట్టయ్యాయో మనకు తెలుసు.
ఇప్పుడు "సామజవరగమన" అంటు మళ్ళీ సెన్సేషన్ సృష్టిస్తున్నాడు.

      సామజవరగమన పాట చాలా బాగుంది. ఈ పాట ఇంత బాగా రావడానికి కారణం ఈ పాట పాడిన సిద్ శ్రీరామ్. ఈయన ఏపాట పాడిన మాధుర్యంగా ఉంటుంది. ఆయన గాత్రంలో పాట వింటుంటే ఎవరైనా మైమరచిపోవలసిందే. సామజవరగమన పాట కూడా చాలా బాగా పాడారు సిద్ శ్రీరామ్ గారు.
ఈ పాట బాగా రావడానికి కారణమైన ఇంకో వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.  ఒక్క పదం ఇతర భాషా పదాలను ఉపయోగించకుండా అచ్చతెలుగులో,అర్థవంతమైన తేలిక పదాలతో అద్భుతంగా ఈ పాట రాశారు.

ఇక తమన్ సంగీతం గురించి చెప్పనక్కర్లేదు. లౌడ్ స్పీకర్ మోత మోగినట్టు తమన్ సంగీతం ఎవరికి అర్థం కాకపోయినా... సిద్ శ్రీరామ్, సీతారామశాస్త్రి గారి వల్ల ఈ పాట చాలా బాగా వచ్చింది.



 సామజవరగమన