భానోదయం: నా ఆలోచనలు
నా ఆలోచనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నా ఆలోచనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, ఏప్రిల్ 2026, శుక్రవారం

హిందూమతం ఈ దేశం దాటి ఎందుకు విస్తరించడం లేదు -మందక్రిష్ణ మాదిగ

 





మతం మారితే sc హోదా, రిజర్వేషన్లు వర్తించవని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది..


దీనిని వ్యతిరేకిస్తూ మందక్రిష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్ పెట్టి, రామాయణం,మహాభారతం , కృష్ణుడిని, హిందూ మతాన్ని కించపరూస్తూ మాట్లాడారు.


రిజర్వేషన్లకు, హిందూ దేవుళ్ళకు సంబంధం ఏమిటి.?


మందక్రిష్ణ మాదిగ గారు హిందూ మతం గురించి ఒక మాట అన్నారు. హిందూమతం ఈ దేశం దాటి ఎందుకు విస్తరించడం లేదు అని?


నేను చెబుతాను హిందూ మతం ప్రపంచంలో ఎందుకు విస్తరించడం లేదో..


1. ఇతర మతాల వారిని బలవంతంగా మతం మార్చదు.


2.ఇతర దేశాల మీద  దాడులు చేసి ఇతర మతాల వారిని,వారి సంస్కృతిని నాశనం చేయలేదు.


3.ఇప్పటికి వారి ప్రార్థన స్థలాల్లో హిందూ మతం పట్ల చాలా ద్వేషం పెంచే ప్రసంగాలు చేస్తారు.

హిందూ మతాన్ని అంతం చేయడమే వారి లక్ష్యం.


4.ఇతర దేశాలనుండి వారి మతస్తులను ఈ దేశంలోకి అక్రమంగా తీసుకొచ్చి ఆశ్రయం కల్పించి వారి జనాభా పెంచుకుంటున్నారు.

కాని హిందువులు అలా చేయడం లేదే..



5.హిందూ మతం రెండు ఎడారి  మతస్తులతో నిరంతరం పోరాడుతు ఈ దేశంలో ఇప్పటికి నిలిచింది 

లేదంటే ఈ దేశం ఎప్పుడో ఎడారి మతస్తుల దేశం అయ్యేది..


6.ఇతర దేశాల్లో విస్తరించవలసిన అవసరం హిందూ మతానికి లేదు.


7.ఈ భారతదేశం అంత గొప్ప భూమి ప్రపంచంలో లేదు..


8.హిందూధర్మాన్ని ఆచరించే శక్తి ఇతర దేశస్తులకు ఉండదు...


9.ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్థికంగా, 

క్రూరంగా బలంగా ఉన్న మతస్తులు ఉంటే ప్రపంచం మొత్తం విస్తరించవచ్చు.

హిందు మతానికి ఈరెండు లక్షణాలు లేవు అందుకే ప్రపంచంలో విస్తరించడం లేదు..


పనికిరాని మతాలు దౌర్జన్యంగా, క్రూరంగా ప్రపంచంలో విస్తరిస్తూ పోతే.. వాటిని గొప్ప మతాలు అనడం మీ మూర్ఖత్వం..


ఈ దేశంలో పుట్టి రిజర్వేషన్లు స్వీకరిస్తూ మళ్ళీ ఈదేశంపైనే ద్వేషం వెళ్ళగక్కుతారు మేమే చాలా తెలివైన వారమని.. మీలాంటి మేధావులు..


ప్రపంచంలో శాంతిని పంచే మతం ఏదైనా ఉందంటే అది హిందూ మతమే...🚩🚩


జై శ్రీరామ్ 🚩 🚩 

జైహింద్ 🚩🚩

జై భారత్ 🚩🚩





26, అక్టోబర్ 2022, బుధవారం

పొట్లం యాప్ ఆన్లైన్ కూరగాయలు

 

పొట్లం యాప్ 

ఈ స్టార్టప్ ఆలోచన చాలా బాగుంది. దీని ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది, వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు అందుతాయి. మరియు 200 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ పొట్లం యాప్ రూపకర్త శ్రీనివాస్ గారు. ఈ 'పొట్లం' అన్ని నగరాలకు విస్తరించాలి.






10, జులై 2022, ఆదివారం

ఈ సన్నివేశం ఎంతో రియాలిటీ గా ఉంటుంది. డైరెక్టర్ కి హాట్సాఫ్ చెప్పాల్సిందే..!




 


   ఈ సన్నివేశం చూస్తే ఎంత రియాలిటీ గా తీశారు అనిపిస్తుంది. ఈ సినిమా దర్శకుడికి హాట్సాప్ చెప్పాలనిపిస్తుంది.

ఆ డైలాగులు మాత్రం చాలా సహజంగా ఉంటాయి..


      ఈ సినిమాలో హీరో పేపర్ బాయ్ హీరోయిన్ ధనవంతుడి కూతురు ఇద్దరు ప్రేమించుకుంటారు. ప్రేమిస్తే సరిపోతుందా వాళ్ళ కుటుంబాలు ఒప్పుకోవాలి కదా. హీరోయిన్ కుటుంబ సభ్యులు వీళ్ళ పెళ్ళికి ఒప్పుకోరు. హీరో తల్లి దండ్రులు ఒప్పుకుంటారు ఎందుకంటే ధనవంతుల అమ్మాయి మనలాంటి పేదవాడి అబ్బాయిని ప్రేమించిందని గొప్పగా భావిస్తారు. మరీ డబ్బున్న వాళ్ళు తమ అమ్మాయి ఒక పేదవాన్ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటానంటే ఒప్పుకుంటారా ససేమిరా ఒప్పుకోరు. ఆ స్థానంలో ఎవరున్నా ఒప్పుకోరు.  ఈ సినిమాలో కూడా హీరోయిన్ కుటుంబ సభ్యులకు తమ అమ్మాయిని ఒక పేపర్ బాయ్ కి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం ఉండదు. కాని హీరోయిన్ మాత్రం అతన్నే పెళ్ళి చేసుకుంటానని పట్టుబడుతుంది. దింతో కూతురి మీద ప్రేమతో హీరోయిన్ తండ్రి అతనితో పెళ్లికి  ఒప్పుకుంటాడు.. 


కాని హీరోయిన్ ఇద్దరు అన్నయ్యలకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం ఉండదు. ఆఫ్ట్రాల్ ఒక పేపర్ బాయ్ కి నా చెల్లినిచ్చి పెళ్ళి చెయ్యాలా అంటూ కోపంతో ఊగిపోతారు.  ఇలాంటి సన్నివేశాల్లో వేరే ఏ సినిమాలో అయిన పెద్ద పెద్ద ఫైట్లు భారీ భారీ డైలాగులు ఛాలెంజ్ లు ఉంటాయి. కాని ఇక్కడ అవేమి ఉండవు. కేవలం హీరోయిన్ అన్నయ్యలు ఇద్దరు హీరో ఇంటికి వెళ్ళి నాలుగు మాటలు చెబుతూ బాధ పడుతుంటారు అంతే హీరోకి ఒక్క మాట కూడా రాదు. అవును ఇది నిజం రియాలిటీ ఇలాగే ఉంటుంది. 


వాళ్ళు ఏమాట్లాడుతారంటే...


హీరోయిన్ ఇద్దరు అన్నయ్యలు హీరో ఇంటికి వస్తారు.

వాళ్ళు రాగానే హీరో అమ్మానాన్నలు కంగారు పడుతూ రండిబాబు మీరా రండి రండి కూసోండి, కూసోండి అంటు అదరా బాదరా పడుతుంటారు.


  ఈ టైం లో వచ్చారు ఏంటండీ.? అంటుంది హీరో అమ్మగారు.

  పొద్దున్నుండి పెళ్ళి షాపింగ్ చేస్తూ వచ్చేసరికి ఈ టైం అయ్యిందాంటీ అంటాడు హీరోయిన్ అన్నయ్య. అలా అంటూనే నాన్న గారు ఇది ఇమ్మాన్నారని చేతిలో ఒక కవర్ పెడతాడు. దాన్ని చూసి ఏంటి బాబు ఇది అని అంటారు హీరో తండ్రి. 


''డబ్బండీ'' అంటారు హీరోయిన్ అన్నయ్యలు.

మా పద్దతి ప్రకారం  మగపెళ్ళి వారి బట్టలకు ఆడపెళ్ళి వారే డబ్బులు ఇస్తారు అంటారు.

 అందుకు వద్దు బాబు ఉన్నంతలో మేం కొనుక్కుంటాం అంటు,  ఇంత బరువు మేం మోయలేమని అంటుంది హీరో అమ్మగారు.


"5లక్షలే మేయలేమని అంటున్నారు రేపు మీ ఇంటికి మా ఇంటి మహాలక్ష్మి రాబోతుంది ఎలా మోస్తారు" అంటాడు హీరోయిన్ అన్నయ్య.


"నా కూతురులా చూసుకుంటాను అయ్యా" అంటుంది హీరో అమ్మగారు.


ఇంతలో మాటల సంగతి తర్వాత ముందు పొయ్ ఛాయ్ పెట్టు అంటాడు హీరో నాన్న..


ఈ టైంలో ఛాయ్ ఏంటీ అంకుల్ పదవుతుంది పొద్దన్నుండి షాపింగ్ లో పడి అన్నమే తినలేదు ఉంటే అన్నమే పెట్టండి అంటారు హీరోయిన్ అన్నయ్యలు.


ఉండండి రెండు నిమిషాల్లో తయారు చేస్తాను అంటుంది హీరో అమ్మగారు..


"ఆంటీ ఉన్నదే పెట్టండి రేపు పెళ్లయ్యాక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా" అంటారు.


ఇదంతా చూస్తూ హీరో ఒక్క మాట కూడా మాట్లాడడు.


ఇక వాళ్ళిద్దరికి రెండు కంచాల్లో అన్నం, పప్పు చారు వడ్డిస్తుంది హీరో అమ్మగారు.


అది చూస్తే మనకే అనిపిస్తుంది డబ్బున్న వాళ్ళు ఇలా అన్నం చారు తింటారా అని..? 


నాకు తెలిసి ధనవంతుల ఇళ్ళల్లో డైనింగు టేబుల్ మీద ప్రతిరోజు నాలుగైదు కూరలు, సాంబారు, పెరుగు, నెయ్యి, అప్పడాలు, నాలుగు రకాల పచ్చళ్లు, వేపుళ్లు ఇలా మెను పేద్దగా ఉంటుంది. ఇలాంటి ఆహారం పేదవారికివిందుభోజనం... కాని ధనవంతులకుమాత్రం రోజు సాధారణ భోజనమే... అలాంటిది కేవలం అన్నం చారు తినాలంటే వాళ్ళు తింటారా... ముద్ద దిగదు కదా...




 ఇక వాళ్ళు అన్నాన్ని కలుపుతూ ఉంటారు. ఇంతలో ఒకడు ఏంట్రా అలా కలుపుతున్నావ్ ఆంటీ నాలుగు ఇళ్ళల్లో వంట పని చేస్తుందని నాలుగు రకాల కూరలు ఉంటాయనుకున్నావా ఏంటి? అని అంటాడు అది చూసి హీరో ఫ్యామిలీ తెల్ల మోహం వేస్తారు ఏంటి వీళ్ళు ఇలా అంటున్నారు అని.


మళ్ళీ ఏంట్రా కారంగా ఉందా కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువగా వేసుకుంటారు అని అంటాడు.. ఇలాంటి గొడ్డు కారం ముద్ద తినడం నాకు అలవాటు లేదురా. ఇది తింటుంటే గొంతులో మంటగా ఉందిరా కాని మన చెల్లి కి తప్పదురా లైఫ్ లాంగ్ ఇదే తినాలి అంటాడు.. దాంతో హీరో అవమానంతో ఏమి అనకుండా అలా చూస్తుండిపోతాడు..


 హీరోయిన్ అన్నయలు ఒకరినొకరు చూసుకుంటూ హీరో పేదరికాన్ని గుర్తు చేస్తూ హేలనగా మాట్లాడుతుంటారు.

 

 ఏంట్రా అలా చూస్తున్నావు ఒకటే రూం ఉందనా..?

ఇక్కడే పడుకుంటారు. 


 ఫస్ట్ నైట్ ఎలా అనా? వాళ్ళు బయట పడుకుంటారు. ఆ తర్వాత అందరు కలిసే పడుకుంటారు.  వీళ్ళు ఇటు తిరిగి వాళ్ళు అంటు తిరిగి...


అలా అనేసరికి హీరో ఫ్యామిలీ నోటివెంట మాటరాదు కదా అయోమయంలో పడిపోతారు.


మన చెల్లి అపోలో హాస్పిటల్ లో పుట్టింది.


 ఇప్పుడు మనం చెల్లి పిల్లలు ఆ గాంధీ హాస్పిటల్ లో పుడతారు.


మన పిల్లలు ఆక్రిడ్జ్ లో చదువుతారు. 

మన చెల్లి పిల్లలు ఆ బ్రిడ్జ్ పక్కన గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. అని హీరో పేదరికాన్ని గుర్తు చేస్తూ  హేళనగా మాట్లాడుతాడు...


ఆ మాటలకు హీరో ఫ్యామిలీ అవమానంతో ఏం అనాలో అర్థం కాక అలానే చూస్తుండి పోతారు..


అలాగే హీరోని ఉద్దేశిస్తూ "రవి నీకే గనుక ఒక చెల్లి ఉంటే తానొక చిత్తు కాగితాలు ఏరుకునే వాడ్ని ప్రేమిస్తే పరువలేదులే ఇద్దరు కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏరుకుంటారు అని పెళ్ళి చేస్తావా" అని అంటాడు.


మరియు" ప్రేమంటే ఇద్దరు వ్యక్తుల ప్రమాణం. పెళ్ళంటే రెండు కుటుంబాల ప్రయాణం".  ఆ ప్రయాణంలో మంచికి చెడుకి మీ ఇంటికొస్తే ఇలా నట్టింట్లోకి షూలు వేసుకుని వచ్చేస్తాం. బాధ ఇప్పుడు ఒకవైపే భవిష్యత్తులో రెండువైపులా ఉంటుంది..

నాలుగు ఇళ్ళల్లో పని చేసుకుని బతికేవారు గద్వాల్ రెడ్డి గారి ఆహ్వాన పత్రిక ఇప్పుడు ఇక మీ చేతిలో ఉంది. అంటూ బాధపడుతూ పరోక్షంగా హెచ్చరించి 5 లక్షల రూపాయలు టేబుల్ మీద పెట్టి వెళ్లి పోతారు.


ఆ 5 తీసుకుని వాళ్ళ చెల్లిని మర్చిపొమ్మని పరోక్షంగా చెప్తారు...


వాళ్ళు వెళ్ళిపోయాక హీరో అమ్మగారు హీరోని చూస్తు రవి నీకు అర్ధం అయ్యిందారా..?  ఆ పిల్లాడు అడిగాడు చిత్తు కాగితాలు ఏరుకునే వాడికి మీ పిల్లను ఇస్తారా అని. గద్వాల్ రెడ్డి గారి ఫ్యామిలీ తో పోలిస్తే  మన స్థాయి అదే కాదరా? మరీ వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి కాదరా? అని అంటుంది.


ఈ పెళ్లి జరిగితే నీకు గొప్ప జీవితం వస్తుందని ఊహించామే కాని ఒక అమ్మాయి గొప్ప జీవితాన్ని కోల్పోతుందని ఊహించలేక పోయాం రా.. అని అంటాడు హీరో నాన్న..


 ఈ పెళ్లి చేయడం ఇష్టం లేక పోతే మన ఆటోకు యాక్సిడెంట్ చేయోచ్చు, ఇంకా ఏమైనా చేయోచ్చు కాని వాళ్ళు అలా ఏమి చేయలేదురా. రెండు కన్నీటి బొట్లు కార్చి వెళ్ళిపోయారు. ఆ కన్నీటికి విలువనిద్దాం రా అంటుంది హీరో అమ్మగారు.. దాంతో హీరో బాధతో సరేనంటు తలూపుతాడు.. 


ఈ సన్నివేశం లో హీరో కి ఒక్క డైలాగ్ కూడా ఉండదు..


వాళ్ళు చెప్పిందాంట్లో తప్పు లేదు కాబట్టి హీరో ఏమీ అనడు. ప్రేమంటే ప్రేమించడానికి బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఒక జీవితం ఉంటుంది. అది సాగాలంటే డబ్బు ఉండాలి. ఒక ధనవంతుల అమ్మాయి అప్పటి వరకు ఏ కష్టం తెలియకుండా పెరిగింది ఇప్పుడు ప్రేమ పేరుతో పేదరికంలోకి వెళ్లి కష్టాలు పడటమే తప్ప మరోటి కాదు. 


చాలా సినిమాల్లో హీరోయిన్ అన్నయ్యలు ఇలాంటి సన్నివేశాల్లో హీరో ఇంటికి వెళ్ళి దాడి చేయడం, దాడిని హీరో తిప్పి కొట్టడం పదిమందిని గాల్లోకి ఎగరేసి కొట్టడం లాంటి సీన్స్ ఉంటాయి. అలాగే హీరో శపథాలు చేసి నెల రోజుల్లో కోటీశ్వరుడు అయి నీ చెల్లిని పెళ్ళి చేసుకుంటా..!! అంటూ భారీ డైలాగులు, ఛాలెంజ్ లు ఉంటాయి. అలా నెల రోజుల్లో కోటీశ్వరుడు అయి కూడా చూపిస్తారు మన హీరోలు. కాని ఇక్కడ అవేమి ఉండవు హీరో అసలు ఒక్క మాట కూడా మాట్లాడడు. వాళ్ళు అన్నది నిజమే కదా అని అర్థం చేసుకుని తను చేసేది తప్పు అని తెలుసుకుని  ఫ్యామిలీ తో సహా ఊరొదిలి వెళ్లి పోతారు..


 ఇది చాలి రియాలిటీ గా ఉంటుంది.. సీనిమా వేరు జీవితం వేరు సినిమాలో ఏదైనా జరుగుతుంది కానీ జీవితంలో అలా జరగదు ఎన్నో అడ్డంకులు, బాధలు ఉంటాయి. ఇక్కడ ప్రేమిస్తే సరిపోదు దానికి ఒక స్థాయి ఉండాలి అని అదిలేకుంటే తర్వాత ఏమవుతుందో చెప్పారు. చాలా బాగుంది ఈ సన్నివేశం..


చాలా మంది ప్రేమికులను ఆలోచింప చేసేలా ఉంటుంది.


ప్రేమి ఇద్దరు వ్యక్తుల ప్రమాణం, పెళ్ళి రెండు కుటుంబాల ప్రయాణం. 


ఆ కుటుంబాలు ఒప్పుకోవాలి కదా.


అలా కుటుంబంలోని వారికి వీళ్ళ ప్రేమలు నచ్చక పోతే ఏమవుతుందో మనం నేడు సమాజంలో చూస్తూనే ఉన్నాం. తమ కూతురు వేరే కులం వాడిని ప్రేమించి పెళ్ళి చేసుకుందని, తమ పరువు పోయిందని, అమ్మాయి వాళ్ళ నాన్నలు, అన్నయ్యలు తమ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాడిని అంతం చేస్తున్నారు.


కాబట్టి ఎవరైనా ప్రేమించే ముందు ఒకసారి ఆలోచించండి. అంటే మనం అమ్మాయి ప్రేమించాలంటే ఆ అమ్మాయి స్థాయి కి తగ్గట్టు ఉండాలా?? అని అడగొద్దు. తప్పకుండా అలా ఉండాల్సిందే. లేదంటే ఒక పేదవాడు ధనవంతుల అమ్మాయి ని ప్రేమించి ఏ ధనవంతుల కూతుర్లకు పెళ్ళిళ్ళు కావా, మొగుళ్ళు రారా అంటు సినిమా డైలాగులు కొడితే బయట పరిస్థితి దానికి భిన్నంగా ఉంటుంది. కాబట్టి సినిమాలు చూసి ప్రేమ ప్రేమ అని పాకులాడే వారికి నేను చెప్పేది ఏంటంటే..


ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, అంతేకాని ప్రేమే జీవితం కాదు. నిన్ను నమ్మి నీకుటుంబ సభ్యులు ఉంటారు ముందు వారి గురించి అలోచించి ప్రేమల గురించి అలోచించండి..


ప్రేమ లేకుండా బతకొచ్చు కాని డబ్బు లేకుండా బతకలేం..


చదువుకునే వయసులో ప్రేమించడం బాగానే ఉంటుంది. ఆ తర్వాత జీవితం చాలా కష్టంగా ఉంటుంది.


ఎందుకంటే చదువుకుని ఒక స్థాయి కి వెళ్ళకుండా ప్రేమ అంటు పార్కుల వెంబడి తిరిగితే పెళ్ళైయ్యాక ఒకరి చేతికింద జీవితాంతం వెట్టిచాకిరి చేసి కుటుంబాన్ని పోషించాల్సి ఉంటుంది..


అందుకే ప్రేమ అనేది అంత ముఖ్యం కాదు మన కేరీర్ ముఖ్యం. ఈ వయసులో ప్రేమ అంటు తిరిగితే జీవితాంతం బాధ పడుతూ బతకాల్సి ఉంటుంది.


అలాగే మీపై ఆధారపడిన మీక కుటుంబ సభ్యులను బాధ పడేలా చేయకండి...


ఇక ప్రేమ చాలా గొప్పది విలువైనది అంటారు నిజమే ప్రేమ అనేది చాలా గొప్పది అమ్మ నాన్నల ప్రేమ గొప్పది,తోట బుట్టిన వాళ్ళ ప్రేమ గొప్పది. ఈ ప్రేమను ఎవరు పట్టించుకోరు కేవలం అమ్మాయి ప్రేమ మాత్రమే గొప్పది అని తెగ ఎమోషన్స్ చేస్తూ  విరహ  గీతాలు పాడుతూ, ప్రేమ లేకపోతే జీవితమే లేదు అన్నట్టు సినిమా వాళ్ళు చూపిస్తుంటారు.  దాన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకుని కొందరు జీవితాలను పాడుచేసుకుంటారు. సినిమా వాళ్ళు సినిమాలో మాత్రమే ప్రేమ గురించి గొప్పగా నీతులు చెబుతుంటారు. కాని వాళ్ళ నిజ జీవితాలు అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. అది రోజు మనకు కనపడుతూనే ఉంది... 


కాబట్టి సినిమా వేరు జీవితం వేరు. సినిమాల్లో మాదిరి జీవితంలో జరుగుతుందనుకుంటే ఇక అంతే జీవితం తలకిందులుగా అవుతుంది...


ఈ సినిమాలో ఈ సన్నివేశం చాలా రియాలిటీ గా అనిపించింది.. ఇలాంటి సినిమాల వల్ల సమాజంలో మార్పు వస్తుంది అని నేను భావిస్తున్నాను..


అలా కాకుండా ప్రేమ గొప్పది ప్రేమించిన అమ్మాయిని లేపుకపోయి పెళ్ళి చేసుకోవాలని చెబితే ఏమవుతుందో చూస్తూనే ఉన్నాం. తమ కుటుంబం పరువు కోసం ఎంతకైనా తెగించే వాళ్ళను చూస్తున్నాం..


వాళ్ళు రాక్షసులు అనొచ్చు కాని వాళ్ళు చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ అమ్మాయిని ఎవడో ముక్కు మొహం తెలియని వాడొచ్చి మూడు నెలలు ప్రేమించిన అనే ఒకే ఒక్క అధికారంతో లేపుకపోయి పెళ్ళి చేసుకుంటే ఎవరి ఫ్యామిలీ కైనా కోపం రాక మంచి పని చేసారని సన్మానం చేస్తారా....? ఇరవై ఏళ్ల ప్రేమ కంటే మూడు నాలుగు నెలల ప్రేమ గొప్పదా..!!






 అందుకే ఇంత పెద్ద పోస్టు రాస్తూ లెక్చర్ ఇచ్చాను. ఇంత ఓపికగా చదివినందుకు ధన్యవాదాలు

..



అవును సినిమా పేరు చెప్పడం మర్చిపోయాను. 

సినిమా పేరు "పేపర్ బాయ్".








 





 




7, జులై 2022, గురువారం

ప్లాస్టిక్ నిషేధం విధించారు సరే, అమలు చేయడం సాధ్యమేనా??

    దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ వస్తువులను నిషేధించడం శుభపరిణామం. నేను ఎప్పటినుంచో ఎదురుచుస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక పెద్ద మార్పుకు నాంది. 


నిషేధం విధించారు సరే అమలు జరగడం సాధ్యమేనా.. 


ఒకసారి వాడిపాడేసే ప్లాస్టిక్ వస్తువులను నిషేదించామంటున్నారు అందులో వాటర్ బాటిల్స్ లేవు. పేపర్ ప్లేట్లు లేవు ఇవికూడా ఒకసారి వాడిపాడేసేవే కదా.. 


మరొకటి గాలి అమ్మే ప్యాకెట్లు అదేనండి చిప్స్ పాకెట్లు వాటిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదు.. వీటివల్ల కూడా పెద్ద ఎత్తున కాలుష్యం అవుతుంది. ఈ ప్యాకెట్లో 95% గాలి మిగితా 5% మాత్రమే చిప్స్ అనే పదార్థం ఉంటుంది.. ఈ ప్యాకెట్లో ఉండే పదార్థం తక్కువ దాని ద్వారా వచ్చే కాలుష్యం ఎక్కువ.. ఇలాంటివి కూడా నిషేధించాలి.. నిషేధం అంటే నిషేదమే కఠినంగా ఉండాలి అప్పుడే మార్పు వస్తుంది..


నిషేధం అని మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో పెడితే బాగుంటుంది.. ఇదివరకు చాలా సార్లు నిషేదం విధించారు కాని మళ్ళీ వాడుతూనే ఉన్నారు...


వాటర్ బాటిల్స్, పేపర్ ప్లేట్లు, గ్లాసులు,చిప్స్ ప్యాకెట్స్ ఇలా వీటన్నింటినీ నిషేధించాలి..  అప్పుడే కాలుష్యం తగ్గి పరిసరాలు పరిశుభ్రంగా, అందంగా తయారవుతాయి.. లేదంటే మళ్ళీ కథ మొదటికే వస్తుంది...


ప్రజల్లో అవగాహన కల్పించి ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను వాడే విధంగా ప్రోత్సాహించాలి. 


నేను చాలా సార్లు చెప్పాను. మళ్ళీ చెబుతున్నా ప్రతీ ఒక్కరు బయటకు వెళ్ళినప్పుడు కూరగాయలకు వెళ్ళినప్పుడు వెంట కాటన్ సంచి లేదా జ్యూట్ బ్యాగులను వెంట తీసుకు వెళ్ళండి. అలాగే వాటర్ బాటిల్ బయట కోనే కంటే ఇంటినుండి స్టీల్ బాటిల్లో నీళ్ళు తీసుకెళ్ళాలి. పిల్లలకు గాలి ప్యాకెట్లు అవే చిప్స్ ప్యాకెట్లు తినే అలవాటు చేయకండి.. మనం తినకుంటే కంపెనీ వాడు ఎందుకు చేస్తాడు.. కాబట్టి ముందు మనం మారాలి. 


ప్లాస్టిక్ నిషేధం బాధ్యత ప్రభుత్వానిది మనకెందుకులే అనుకోకుండా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలి... 


ప్లాస్టిక్ తరిమేద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం...







20, ఏప్రిల్ 2022, బుధవారం

నియంతలు, సామ్రాజ్యవాదులు ఉన్నంతకాలం ప్రపంచంలో శాంతి ఉండదు.

  ప్రపంచంలో ఏ మూలన ఏ సంక్షోభం వచ్చిన అందుకు కారణం కొందరు నియంతల సామ్రాజ్యవాదం వలనే.

 ఉక్రెయిన్ యుద్దానికి కారణం సామ్రాజ్యవాదుడైన నియంత పుతిన్. రష్యా పేరుకు ప్రజాస్వామ్య దేశమైన పుతిన్ దానిని నియంత్రుత్వ పాలన కింద మార్చేసాడు.

నియంతల్లో రెండు రకాల నియంతలు ఉంటారు. ఒకరు సామ్రాజ్యవాద నియంతలు. మరొకరు వారసత్వ పాలన నియంతలు.


    పుతిన్ సామ్రాజ్యవాద నియంత. తన లక్ష్యం పూర్వపు సోవియట్ యూనియన్లో ఉన్న దేశాలన్నిటిని కలిపి సోవియట్ యూనియన్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు ఆరాటపడుతున్నాడు. వయసు మీద పడుతోంది సోవియట్ యూనియన్ కు తిరిగి పూర్వ వైభవం తీసుకువచ్చి తన పేరు చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నాడు. అందుకే  ఉక్రెయిన్ పై ఈ యుద్దానికి దిగాడు. సైనిక పరంగా బలహీనమైన దేశం నాలుగు రోజుల్లో స్వాదీనం  చేసుకుందాం అనుకున్నాడు. కాని 50 రోజులైన ఉక్రెయిన్ లొంగిపోవడం లేదు. 50 రోజుల నుండి ఉక్రెయిన్ సంక్షోభం అలానే ఉంది. రష్యా నియంత లక్ష్యం కోసం, సామ్రాజ్య విస్తరణ కోసం ఉక్రెయిన్ లో అశాంతి నెలకొంది. కొన్ని లక్షల మంది  ఉక్రెయిన్ ప్రజలు బతుకు జీవుడా అంటూ పొరుగు దేశాలకు వలస వెళ్లిపోయారు. ఈ సంక్షోభం ముగియాలంటే అధ్యక్షుడు జెలెన్ స్కీ నాటోలో చేరకుండా సోవియట్ యూనియన్లో చేరతానని ఒప్పుకుంటే యుద్ధం ఆగిపోతుంది కాని అది జరగదు. దేశం అంటే అధ్యక్షుడు ఒక్కడే కాదు కదా ప్రజలందరూ ఒప్పుకోవాలి. రష్యా కంటే పశ్చిమ దేశాల వైపే ఉక్రెయిన్ ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఏ దేశ ప్రజలైనా నియంత్రుత్వ పాలన కోరుకోరు కదా.

 అందుకే నాటో వైపే ఉక్రెయిన్ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ప్రజలు కూడా యుద్ధం చేస్తున్నారు.



    ఉక్రెయిన్ సంక్షోభం ముగియాలంటే అధ్యక్షుడు జెలెన్ స్కీ లొంగిపోవాలి. రష్యా, ఉక్రెయిన్ యుద్దం లో హీరో ఎవరంటే ఆ దేశ సైనికులు, ప్రజలు, అధ్యక్షుడు జెలెన్ స్కీ అని చెప్పొచ్చు. చిన్న దేశం సైనిక పరంగా, ఆయుధాల పరంగా రష్యాకు ఏ మూలకు సరితూగని దేశం. అణ్వాయుధాల లేవు అయినా కూడా ఇన్ని రోజులగా యుద్ధం చేస్తూనే ఉంది అంటే దానికి కారణం జెలెన్ స్కీ నే.  ఆయన స్థానంలో వేరే ఎవరున్నా దేశం విడిచి పారిపోయేవారు. నాటో దేశాలు తన తరపున యుద్ధం చేస్తాయనుకున్నాడు కాని అది జరగలేదు. నాటో రాలేదు, ఆయుధాలు లేవు,ఈ పరిస్థితుల్లో కూడా శక్తి వంతమైన రష్యాతో పోరడడానికే సిద్దపడ్డాడు. అందుకే జెలెన్ స్కీ నిజమైన హీరో. అసలు సిసలైన దేశభక్తుడు, నాయకుడు.. తను రష్యాతో యుద్దం గెలవలేక పోవచ్చు గాని తన పోరాటం ఎన్నో చిన్న దేశాలకు స్పూర్తి నిస్తుంది. శత్రువు ఎంత బలవంతుడైనా సరే ధైర్యంగా ఉండి పోరాడితే విజయం సాధించవచ్చు అని నిరూపించాడు. పోరాడితే పోయేది ఏముంది బానిస సంకెళ్లు తప్ప..

 

       అందమైన ఉక్రెయిన్ నగరాలు బాంబు మోతలతో కళావిహీనంగా మారాయి, లక్షల మంది ఉక్రెయిన్ ప్రజలు ఇతర దేశాలకు వలసలు వెళ్లిపోయారు, అమాయక ప్రజలు, సైనికులు యుద్ధంలో చనిపోతున్నారు. ఈ హృదయం విదారక దృశ్యాలను, ఈ వినాశనాన్ని చూసి జెలెన్ స్కీ వెనక్కి తగ్గి రష్యాకు తలొగ్గితే ఈ సంక్షోభం ముగుస్తుంది.  లేదు ఇలాగే ముందుకు వెళ్తే వినాశనమే అణు యుద్ధం వరకు వెళ్ళవచ్చు.  నియంతలు ఓటమి ఒప్పుకోరు అందులో పుతిన్ లాంటి వారు అసలు ఒప్పుకోరు. జెలెన్ స్కీ నే తన దేశ ప్రజల కోసం ఓడిపోయి శాంతి నెలకోల్పుతాడని అనుకుంటున్నాను.



  ఇక శ్రీలంక సంక్షోభానికి కారణం చైనా. చైనా కూడా సామ్రాజ్యవాద దేశమే. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ది కూడా నియంత్రృత్వ పాలనే. శ్రీలంకలో పాగా వేసి హిందూ మహాసముద్రంలో పట్టు సాధించాలని చూస్తున్నాడు. దాని ఫలితమే శ్రీలంకతో ఆర్థిక సంక్షోభం. ఇటు పాకిస్థాన్, అటు శ్రీలంకను ఆక్రమించి చైనాను విస్తరించాలని చూస్తున్నాడు. అందుకోసమే ఆ దేశాలకు అభివృద్ధి పేరిట రూణాలిచ్చి ఆర్థికంగా దెబ్బతీసి ఆక్రమించుకోవాలని జిన్ పింగ్ ఆలోచన. 


     ఇక మరో  రకం నియంత  ఉత్తర కొరియా అధ్యక్షుడు కింగ్ జోన్ ఉన్. వారసత్వ పాలన నియంత. ఇతను సామ్రాజ్యవాదుడు కాకపోయినా ప్రపంచంలో అశాంతికి కారణం అవుతాడు.  అణ్వాయుధాలు, క్షిపణులు తయారు చేస్తూ పెద్ద దేశాలను హెచ్చరిస్తూ ఉంటాడు.  దేశ ప్రజలను బానిసలుగా చేసి పరిపాలిస్తున్నాడు. పక్క దేశం  దక్షిణ కొరియా LG, SAMSUNG వంటి  ఎలక్ట్రానిక్స్, HUNDAI,KIA  వాహనాలు ఉత్పత్తి చేస్తూ అభివృద్ధి చెందుతుంటే, కింగ్ జోన్ ఉన్  వంటి  నియంతలు వినాశకర ఆయుధాలు ఉత్పత్తి చేస్తూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నారు. ఇలాంటి నియంతలు ఉన్నంత కాలం ప్రపంచంలో శాంతి నెలకొనడం అసాధ్యం..



  


28, మార్చి 2022, సోమవారం

అభివృద్ధి పేరు చెప్పి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు.

 





అభివృద్ధి పేరు చెప్పి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. 

  పచ్చటి పంటపొలాలను నాశనం చేసి ఫ్లాట్లు చేస్తున్నారు. 

ఒకప్పుడు మా ఊరి భూముల్లో పంటలు

పండేటివి.కాని ఇప్పుడు ఫ్లాట్లు పండుతున్నాయి. 

హైదరాబాద్ కు చుట్టుపక్కల 100 కి.మీ దూరంలో ఎక్కడ చూసినా పొలాలు లేవు ఫ్లాట్లు, వెంచర్లే కనిపిస్తాయి. అక్కడక్కడ కొంత పొలాలు ఉన్న ఇంకొన్ని రోజుల్లో అవి కనుమరుగైపోతాయి.


ఎవరి నోట విన్న వెంచర్లు,ప్లాట్లు,కోట్లు ఇవే మాటలు.


    రైతులకు లక్షలు,కోట్లు ఆశ చూపించి భూములు కొనుగోలు చేయడం వెంచర్లు వేయడం ఇదేపని.

పాపం రైతులు ఎప్పుడు అంతడబ్బు చూసి ఉండరు ఒకేసారి ఎకరం కోటి రూపాయలు అనేసరికి ఎగిరిగంతేసి భూములు అమ్మేసుకుంటున్నారు.

భూములు అమ్మని రైతులను ఎలాగోలా అమ్మేలా చేస్తున్నారు. రైతుల భూములకు దారిలేకుండా చేసి భూములు అమ్ముకునేలా చేస్తున్నారు.


రోడ్డు ప్రక్కన భూమి ఉంటే చాలు రియల్ ఎస్టేట్ గ్రద్దలు అక్కడ వాలిపోతాయి. ఆభూమిని ఎలాగోలా ఎన్ని డ్రామాలు ఆడైనా కొనేస్తారు.  ముందుగా రోడ్డు ప్రక్కన ఉన్న భూమిని కొనేస్తే వెనకాల ఉన్న పొలాలను కొనడం వారికి తేలికవుతుంది. ఎందుకంటే వారికి దారి ఇవ్వకుండా చేసి భూములు అమ్మేలా చేస్తారు. పచ్చని పంటలు పండే భూముల్లో ప్లాట్లు చేసి కోట్లకు అమ్ముకోవడం. మనిషి ఈజీ మనీకి అలవాటు పడిపోయాడు. కష్టపడకుండా కొంచెం తెలివితేటలు ఉపయోగించి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవ్వాలి అనుకుంటున్నారు,అవుతున్నారు. వేలిముద్రలు (అంగూటి) వేసేవాళ్ళు కూడా కోట్లు సంపాదిస్తున్నారు. 

మద్యలో బ్రోకర్లు అబ్బో వీళ్ళగురించి రాస్తే ఒక పుస్తకం అవుతుంది. ఆలోచన రియల్ ఎస్టేట్ వ్యాపారులదైతే ఆచరణ బ్రోకర్లది. వీళ్ళు ఏలాగైనా సరే రైతులను భూములు అమ్ముకునేలా చేస్తారు. ఎలాగైనా సరే....!

 వాళ్ళ కమీషన్ కోసం ఏమైనా చేస్తారు...



నా చిన్నప్పుడు పంటపొలాల్లో అన్నిరకాల పంటలు పండేవి. రాను రాను పత్తి, మొక్కజొన్న ఎక్కువగా పండించేవారు. ఇప్పుడు అవికూడా లేవు 50% పంటపొలాలు ప్లాట్లుగా మారాయి. ఎందుకు ఈపరిస్థితి దాపురించింది అంటే.నా చిన్నప్పుడు పంటలు బాగా పండేవి పాడిపశువులు ప్రతీ ఇంటికి ఉండేవి. వాటి పేడ ఎరువుతోనే పంటలు పండేవి. చీడపీడలు ఉండేవి కావు. రసాయన మందులు అసలు ఎవరికి తెలియదు.కృత్రిమ ఎరువులు, విత్తనాలు వాడలేదు. అప్పుడు రెైతులు అన్నిరకాల అపరాలు,జొన్నలు,వరి,  మిరప, కొర్ర, సజ్జలు, రాగులు,పసుపు వంటి ఆహార పంటలే పండించేవారు.

వ్యవసాయం అంటే పెట్టుబడి ఉండేదే కాదు కేవలం రైతు శ్రమే వ్యవసాయానికి పెట్టుబడి. విత్తనాలు సొంతంగా తయారు చేసుకునేవారు,ఎరువులు పశువుల పేడ. అలా వ్యవసాయం చేసారు కాబట్టి దిగుబడులు బాగా వచ్చేవి. 

ఎవరి ఇంట్లో చూసినా గుమ్ములకు, గుమ్ములు జొన్నలు,బియ్యం,కందులు,కొర్రలు, పెసలు ఉండేవి. 

డబ్బు ఎక్కువగా ఉండేదికాదు. అయినా సంతోషంగా ఉండేవాళ్ళు. 


ఎప్పుడైతే వ్యవసాయం వ్యాపారం అయిందో అప్పటినుండి వ్యవసాయం నాశనం అవుతూ వచ్చింది. డబ్బు ఆశ చూపించి ఈ పంటలు వేస్తే  ఇంత దిగుబడి వస్తుంది ఇంత ధర ఉంటుంది అంటు రైతులకు వాణిజ్య పంటల వైపు మళ్ళేలా చేసారు. ముఖ్యంగా పత్తిపంట. మొదట్లో దిగుబడులు బాగా వచ్చే సరికి చాలామంది రైతులు పత్తిపంట వేయడం ప్రారంభించారు. పత్తి విత్తనాలు రైతులు తయారు చేసుకోలేరు విత్తన కంపేని వారు తయారు చేసే విత్తనాలే వాడాలి. అలా విత్తన కంపెనీలు విత్తనాన్ని తమగుప్పిట్లోకి తీసుకుని వ్యాపారం మొదలెట్టాయి.

ఏం భూమిలో అయినా ఎన్ని రోజులు దిగుబడులు వస్తాయి ఒకే పంట వేస్తుంటే? మొదట్లో దిగుబడులు వచ్చినా రాను రాను దిగుబడులు తగ్గాయి. మళ్ళీ ఇక్కడ ఇంకో వ్యాపారం మొదలైంది ఎరువుల వ్యాపారం ఈ ఎరువులు వాడండి దిగుబడి పెరుగుతుంది అని ఎరువులు కొనేలా చేసారు. తరువాత పురుగుమందులు ఇలా మొత్తం వ్యవసాయాన్ని పెట్టుబడి లేనిదే చేయలేమనే స్థాయికి తీసుకొచ్చారు. 


ఒకప్పుడు రైతులు స్వయంగా తామే విత్తనాలు, ఎరువులు తయారు చేసుకునేవారు. పురుగుమందుల వాడకం అసలే ఉండేది కాదు. ఇప్పుడు వ్యవసాయం అంటే పెట్టుబడి లేనిదే చేయలేని స్థితికి తీసుకొచ్చారు.

వ్యవసాయం దండగా అనే స్థాయికి తీసుకొచ్చారు.

ఒకప్పుడు ఆహారం పంటలు మనదగ్గరే పండేవి కొనవలసిన అవసరం ఉండేది కాదు. ఎప్పుడైతే వ్యవసాయం వ్యాపారం అయిందో అప్పటినుండి ఆహార పంటలు తగ్గిపోయాయి, దిగుబడులు తగ్గాయి.పశుసంపద తగ్గిపోయింది. ఇప్పుడు మనం అన్ని కొనుక్కోవలసిందే.విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలి. అందుకు డబ్బు కావాలి. ఏది కావాలన్నా డబ్బే కావాలి. డబ్బు డబ్బు డబ్బు. డబ్బు లేనిదే ఏమి తినలేం. పంటలు ఎలాగు పండవు అందుకని భూములు అమ్ముకొంటున్నారు.



అప్పుడు ఆరోగ్యకరమైన పంటలు తిని హాయిగా ఆరోగ్యంగా జీవించేవారు. ఇప్పుడు రసాయన ఎరువులు, పురుగుమందులు వేసి పండించిన పంటలు  తిని రోగాల పాలు అవుతున్నారు. 


ఇదా అభివృద్ధి అంటే...???



  మనిషికి కావలసింది ఏంటి కూడు,గూడు, గుడ్డ, ఆరోగ్యకరమైన జీవితం. అంతే కాని డబ్బు కాదు. 

  

కాని డబ్బు డబ్బు అని ఆశ చూపించి పర్యావరణాన్ని, ఆరోగ్యకరమైన జీవనాన్ని నాశనం చేస్తున్నారు.

దీనికి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. చేను కంచె చేసినట్టు ప్రభుత్వమే పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. రైతులను కోటీశ్వరులను చేస్తాం అని గొప్పలు చెప్పుకొంటున్నరు. ఎందుకు ఈ కోట్లు డబ్బులు తింటారా, ఆరోగ్యం పాడైనాక ఎన్నికోట్లు ఉండి ఏం లాభం. పర్యావరణాన్ని దెబ్బతీసి, ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని నాశనం చేసే కోట్ల రూపాయల డబ్బు ఎందుకు...? పర్యావరణం నాశనం అయ్యాక ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన తిరిగి మునుపటి స్థితికి రాదు. 


 111 జీవోను ఎత్తేసి రెండు నదుల పరివాహక ప్రాంతంలోని రైతులను కోటీశ్వరులను చేస్తాం  అని సారు చెప్తున్నాడు. జీవో ఎత్తేస్తే ఏమవుతుంది ఆ ప్రాంతంలో బహుళజాతి కంపెనీలు, అపార్ట్ మెంట్లు పరిశ్రమలు వస్తాయి.పరిశ్రమలనుండి విడుదలయ్యే కాలుష్యం తో రెండు నదులు, రెండు జలాశయాలు మొత్తం కలుషితం అయిపోయి ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఆ ప్రాంతంలో గాలి,నీరు,నేల అన్నిరకాలుగా కలుషితమే. ఇప్పుడు జంట జలాశయాల నీరు తాగేందుకు వీలుంది. జీవో ఎత్తేస్తే అటుపక్కకు వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది.

 ఎలాగంటారా ఆ సుగంధాన్ని భరించలేం మరి....!!!


  2018 లో  హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్, బుద్దుని విగ్రహం చూద్దామని నెక్లెస్ రోడ్ రైల్వేస్టేషన్ లో దిగాను. అక్కడ నుండి ప్రారంభం అయ్యింది ఏదో దుర్గంధం ఎంటీ వాసన అనుకుంటూ  ముందుకు నడుస్తున్నాను. అప్పటికే ఆ వాసనకి తల పట్టేసింది ఇంకాస్త ముందుకు వెళ్ళేసరికి సువాసన పెరిగిపోయింది. ఈ లోపు హుస్సేన్ సాగర్ కనబడింది. అందులో నీళ్ళు చూసేసరికి అర్థం అయింది ఆ దుర్గంధం ఈ సాగర్ నుండే వస్తుందని. ఆ నీళ్ళల్లో కూడా బోటు షికారు చేస్తున్నారు. రైల్వేస్టేషన్ నుండే ఆ వాసన భరించలేక తల తిరుగుతోంది అలాంటిది హుస్సేన్ సాగర్ మద్యలో   బోటు షికారు చేస్తున్నారు అంటే నిజంగా మీకు దండం పెట్టాలి..🙏🙏🙏🙏

 అంతటి దుర్గంధభరితమైన నీటిలో బోటు షికారు చేసే వారిని చూసినపుడు నాకు ఆశ్చర్యం,జాలి, అసహ్యం, అన్ని ఒకేసారి అనిపించాయి..

 అతిపెద్ద సాహసం అది.....!!!

 5నిమిషాలు కూడా అక్కడ ఉండలేక అక్కడ నుండి వెళ్ళిపోయాను. పక్కనే ఉన్న ఎన్టీఆర్ గార్డెన్ కు వెళితే అక్కడకు కూడా సాగర్ సువాసన వస్తూనే ఉంది..

 నేను చాలా సార్లు విన్నా ట్యాంక్ బండ్,బుద్దుని విగ్రహం ఆ చుట్టుపక్కల పార్కులు బాగుంటాయి అని  గొప్పలు చెప్పెవారు. నాకు అక్కడకు వెళ్ళి చూడాలని కుతూహలంగా ఉండేది. ఇక్కడకు వచ్చి చూసాక తెలిసింది ఈ కాలుష్యం గురించా ఇంత గొప్పగా చెప్పారని.  ఇంత కాలుష్యంతో ఇంత దుర్గంధంతో నిండిన ఆ ప్రాంతంలో10నిమిషాలు కూడా ఉండలేం.. అందుకే అంటారు దూరపు కొండలు నునుపు అని... 

 ఇది చూసిన తర్వాత నేను ఒకటి బలంగా చెప్పగలను

 దీనికంటే లక్షరెట్లు మా ఊరి చెరువులు గొప్పవని..

స్వచ్చమైన గాలి, నీరు, నింగి,నేల ఉన్న నా పల్లెటూరు గొప్పది...


ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఒకప్పుడు హుస్సేన్ సాగర్ కూడా మంచినీటి సరస్సే కదా మరి ఇప్పుడు కాలుష్య సాగర్ గా మారింది. దీనికి కారణం అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా వ్యర్థాలను సాగర్ లోకి వదిలి పెట్టి, కనీసం ఆనీటిని తాకడానికి కాదుకదా చూస్తేనే, అటునుండి వెళ్తేనే వాంతికొచ్చెలా చేసారు....

అభివృద్ధి వద్దనడం లేదు కాని ప్రణాలిక లేని అభివృద్ధి మానవాళికి చేటు.. ప్రపంచంలో హైదరాబాద్ కంటే పెద్ద నగరాలు నదుల పక్కనే ఉన్నాయి అక్కడ ఇలాంటి కాలుష్యం లేదే... మరి మన దగ్గర ఎందుకిలా అంటే మన నాయకుల స్వార్థ రాజకీయాల వలన ఇలా ఉంది..


ఎందుకు ఇది చెబుతున్నానంటే  రోడ్లు, బిల్డింగ్స్ కట్టేసి   సహజ వనరులను మురికి కూపంగా మార్చడం అభివృద్ధి కాదు.. హుస్సేన్ సాగర్ బాగు చేయడం ఈ జన్మలో జరగదు. సరే వదిలేద్దాం.. ఇప్పుడు 111 జీవో ఎత్తేసి   జంట జలాశయాలను కూడా హుస్సేన్ సాగర్ లా మార్చాలనుకుంటున్నారు.... సారు..

ఇప్పుడు రెండు జలాశయాలు స్వచ్చమైన నీటితో శుభ్రంగా ఉన్నాయి.. వాటి చుట్టుపక్కల పరిశ్రమలు, బిల్డింగ్స్ కట్టేసి వాటిని కూడా మురికి కూపంగా మార్చేయాలి... ఇదేందయ్యా ఇది అంటే అభివృద్ధి..

అప్పుడు గండిపేట, హిమాయత్ సాగర్ చెరువులను హుస్సేన్ సాగర్ 2, హుస్సేన్ సాగర్ 3అని అనాలి...

ఇప్పటికీ మూసీ నది గండిపేట చెరువు వరకు స్వచ్ఛమైన నీటితో జూన్ లో వర్షాలు ప్రారంభం నుండి డిసెంబర్ వరకు ప్రవహిస్తుంది. మన నాయకుడు అభివృద్ధి చేసిన తర్వాత మురికి కూపంగా ఏడాది పొడవునా ప్రవహిస్తుంది వ్యర్ద జలాలతో.


ఎవరు 111 రద్దు చేయమని చెప్పింది. ఈ జీవో వలన భూముల ధరలు లేక రైతులు నష్టపోతున్నారు అని అంటున్నారు. రైతుల నష్టం ఏమో కాని నాయకుల లాభం కోసం అని అందరికి తెలిసిందే... నిజంగా ఏ నాయకుడికి రైతులపై, ప్రజలకు మంచి చేయాలని ఉండదు.    కేవలం వాళ్ళ ఓట్ల కోసమే ఇన్ని డ్రామాలు. ఆ ఓట్లను నోట్లతో కొనాలి. మరి అంత డబ్బు ఎలా వస్తుంది ఇలా అభివృద్ధి పేరిట దోచుకుంటే వస్తుంది..


అయ్యా మీరు ప్రజలను కోటీశ్వరులను చేయవలసిన అవసరం లేదు. అభివృద్ధి పేరిట కాలుష్యాన్ని పెంచి పర్యావరణాన్ని, ప్రకృతి వనరులను నాశనం చేయకుంటే చాలు అదే పదివేలు....🙏🙏😌😌..


సొంత లాభం కొంత మానుకోని

పరుల సేవకు పాటుపడవోయ్.


ప్రజల సేవకు పాటు పడకపోయినా పర్వాలేదు.

పర్యావరణాన్ని నాశనం చేయకండి..







5, జులై 2021, సోమవారం

బైక్, స్కూటర్ ఏది బెస్ట్.

   

బైక్, స్కూటర్ ఏది బెస్ట్

   ఈ రోజుల్లో బయటికి వెళ్లి ఏపని చేయాలన్నా బైక్ తప్పనిసరిగా ఉండాలి. కోవిడ్ వల్ల పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అంతగా నడవడం లేదు. పైగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అన్నిచోట్లా ఉండదు. పల్లెటూళ్ళలో అసలే ఉండదు. సిటీలో కూడా అన్నిచోట్లకు బస్సు సౌకర్యం ఉండదు. ఆటోలో వెళ్ళాలంటే ఎక్కువ మొత్తంలో చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదికాక టైం కి ఆటో కాని బస్ కాని ఉండదు. కోవిడ్ వల్ల ఎక్కువగా ఆటోలు, బస్సు లు కూడా తిరగడం లేదు. ఒకవేళ తిరిగిన అంతమంది లో వెళ్ళాలంటే వైరస్ భయం.

ఇన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం అదేంటంటే బైక్ కొనుక్కోవడం. టైం కి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వైరస్ భయము ఉండదు. ఈ సమయంలో ప్రతి ఇంట్లో బైక్ ఉండాల్సిందే. లేకపోతే ఏపని జరగదు. కాబట్టి ప్రతీ ఒక్కరు కొనాలి అని చూస్తారు. అంటే అందరూ కాదు బండి లేని వాళ్ళు. 

    ఇప్పుడు మార్కెట్లో బండి కొనాలంటే రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి "బైక్" మరొకటి "స్కూటర్" ఈ రెండింటిలో ఏది కొనాలని చాలామందికి డౌట్ వస్తుంది. మరి అలాంటప్పుడు బైక్ బెటరా స్కూటర్ బెటరా.? మనకు ఏది కంఫర్ట్  తెలుసుకోవాలి.


ముందుగా బైక్ గురించి తెలుసుకుందాం.


ప్లస్ పాయింట్స్:-

బైక్ చూడడానికి లుక్ బాగుంటుంది.

ఎక్కువ మైలేజీ ఇస్తుంది.

మెయింటెనెన్స్ తక్కువ.

దూర ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.


మైనస్ పాయింట్స్:-


గేర్లు, క్లఛ్ మళ్ళీ మళ్ళీ మారుస్తూ ఉండాలి.

బైక్ పై ఏదైనా లగేజీ తీసుకెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది.

బైక్ లో గూడ్స్ స్పేస్ ఉండదు.

బైక్ ను ఇంట్లో అందరూ నడపలేరు.


స్కూటర్ గురించి చూద్దాం.


ప్లస్ పాయింట్స్:-


స్కూటర్ కి గేర్లు ఉండవు కాబట్టి మళ్ళీ మళ్ళీ గేర్లు మార్చే పని ఉండదు.

ఎలాంటి లగేజీ అయినా స్కూటర్ పై  తీసుకుని రావచ్చు.

గ్యాస్ సిలిండర్ గాని, బియ్యం బస్తాలు గాని కిరాణా వస్తువులు కూరగాయలు సులభంగా తీసుకుని రావచ్చు.

ఇంట్లో ఎవరైనా సులభంగా నడపగలరు. ఆడవాళ్ళు కూడా నడపడానికి అనుకూలంగా ఉంటుంది.


మైనస్ పాయింట్స్:-


స్కూటర్ బైక్ అంత స్టైలిష్ గా ఉండదు.

మెయింటెనెన్స్ కాస్తా ఎక్కువ.

బైక్ కంటే మైలేజ్ తక్కువగా ఇస్తుంది.

దూర ప్రయాణాలకు అనుకూలంగా ఉండదు.



రెండింటి లో  తేడాలు గమనించాక ఏది బెస్ట్ అంటే స్కూటర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు స్టెల్ ముఖ్యం కాదు కంఫర్ట్ ముఖ్యం.

మాటిమాటికీ గేర్లు మార్చే తలనొప్పి ఉండదు.ఎలాంటి లాగేజీ అయినా సులభంగా తీసుకుని రావచ్చు.


స్కూటర్ కేవలం ఆడవాళ్ళకు మాత్రమే అనుకుంటారు కాని ఎవరైనా నడపొచ్చు. ఇంట్లో పెద్దవాళ్లు సైతం సులభంగా నడపగలరు.

ముఖ్యంగా ట్రాఫిక్ లో నడపడానికి, లగేజీ తీసుకురావడానికి స్కూటర్ ది బెస్ట్ ఆప్షన్.

బైక్ కంటే స్కూటర్ అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుంది.

బైక్ తీసుకుని ఎవరూ లాంగ్ డ్రైవ్ లకు వెళ్ళారు. నిత్యం ఈ ట్రాఫిక్ , ఈ గుంతలు రోడ్లపైనే తిరగాలి. కాబట్టి స్కూటర్ కొనడం బెటర్.

డిజైన్ పరంగా, లుక్ పరంగా ఇప్పుడు చాలా మంచి స్కూటర్స్ మార్కెట్లో ఉన్నాయి.

అందులో నాకు నచ్చింది అయితే activa 6g బాగుంటుంది అని అనుకుంటున్నాను.





28, నవంబర్ 2019, గురువారం

బొప్పాయి,మునగ, బీరతీగ లాంటి మొక్కలు ఇంట్లో పెంచుకోకూడదా??

     

       ఇంటి ముందు, ఇంటి ఆవరణలో కొన్ని చెట్లు ఉండకూడదు అంటారు.
వాటిలో బొప్పాయి, మునగ లాంటి చెట్లు పెంచుకోకుడదు అని అంటారు. అలాగే బీరతీగ లాంటి కూరగాయల మొక్కలు కూడా పెంచుకోకూడదు అంటారు. ఇలాంటి మొక్కలు పెంచుకోకూడదు అని చెప్పేవారు మరీ ఆ మొక్కల ఆకులు, పండ్లు ఎందుకు వాడుతున్నట్టు???
ఇలాంటి మొక్కలు పెంచుకోకూడదు కాని అవసరానికి వాటి యొక్క ఆకులు, పండ్లు మాత్రం కావాలి. ఇదెక్కడి న్యాయం.? బొప్పాయి, మునగ, బీరతీగ లాంటి మొక్కలు పెంచుకోకూడదు అని చెప్పేవారు వాటిని అవసరానికి ఎందుకు ఉపయోగించుకుంటున్నట్టు.???

    నేను కూడా మా ఇంటిముందు బీరతీగ పెంచుకున్నాను. ఇక అదిచూసి అందరూ ఇంటిముందు బీరమొక్క ఉండకూడదు అని అందరూ చెప్పేవారే. అలా చెప్పిన వారే వాటికి బీరకాయలు అయినప్పుడు తెంపుకున్నారు, వాటి ఆకులను కూడా అవసరానికి తీసుకెళ్ళారు. చూసారా! ఈ మొక్కలు పెంచకూడదంటారు కాని వాటి కాయలు, ఆకులు మాత్రం కావాలి. ఇదెక్కడి చోద్యం ఆండీ బాబు. ఈ మనుషులు అవసరానికో మాట మాట్లాడుతారు...

ఇక బొప్పాయి చెట్టు కూడా  ఇంటిముందు ఉండకూడదు, పొద్దున లేవగానే బొప్పాయి చెట్టు ను చూడకూడదు అంటారు. మరీ ఇప్పుడు అదే బొప్పాయి చెట్టు ఎక్కడ ఉందా అని అందరూ వెతుకుతున్నారు. బొప్పాయి చెట్టు కనిపిస్తే చాలు సంజీవని మొక్క కనిపించినంతా ఆనందంగా ఫీలవుతున్నారు.. ఎందుకంటే ఈ మధ్యలో తెలంగాణలో ఎక్కడా చూసినా డెంగీ జ్వరాలే దానికి మందులేదు కదా! అలాంటి డెంగీ జ్వరానికి  బొప్పాయి చెట్టు ఆకులు, పండ్లే మందు. ఒంట్లో రక్తకణాలు పెరగాలంటే బొప్పాయి ఆకుల రసం తాగాలి మరియు బొప్పాయి పండ్లు తినాలి. డాక్టర్లు కూడా ఇదే చెబుతున్నారు. చూసారా! బొప్పాయి చెట్టు ఎంత మంది ప్రాణాలు కాపాడుతుందో. అలాంటి బొప్పాయి చెట్టు ఇంటి ముందు పెంచుకోకూడదు అనడం ఎంతవరకు సమంజసం చెప్పండి??

   ఇంకో చెట్టు మునగ చెట్టు కూడా ఇంటి ముందు పెంచుకోకూడదు అంటారు. మునగ చెట్టు యొక్క ఆకులు, కాయలు, బెరడు అన్ని కూడా పనికి వచ్చేవే. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఇలాంటి చెట్లు పెంచుకోకుడదు అనడం మూర్ఖత్వం. ఇలాంటి చెట్లు పెంచుకోకుడదు కాని వాటి ప్రయోజనాలు మాత్రం కావాలంటే ఎలా? ఎవరైనా ఇలాంటి చెట్లు పెంచుకోకూడదు అంటే పట్టించుకోకూడదు దర్జాగా     పెంచుకోండి...

15, సెప్టెంబర్ 2019, ఆదివారం

ఒక CFLబల్బుల కంపెనీలో ఉద్యోగం



ఒక  చిన్న   కంపెని అందులో CFL బల్బులు తయారు చేస్తారు. కంపెనీలో ఉద్యోగులు 200 వరకు ఉంటారు. అందులో పని చేయడానికి నేను వెళ్ళాను. కంపెనీలో 2 షిఫ్ట్ లు మాత్రమే అంటే ఒక షిఫ్ట్ 12 గంటలు. చాలా కంపెనీల్లో 3 షిఫ్ట్ లు ఒక్కో షిఫ్ట్ 8గంటలు ఉంటాయి. కాని ఈ కంపెనీలో 2 షిఫ్ట్ లు మాత్రమే. 12 గంటలు అయినా సరే ఉద్యోగం చేయాల్సిందే ఎందుకంటే ఉద్యోగం తప్పితే వేరే దారి లేదు. ఉండేది సిటీలో రూమ్ రెంటు కట్టాలి. అన్ని కొనాలి. ఈ పరిస్థితుల్లో ఏ ఉద్యోగం అయినా చేయాల్సిందే తప్పదు.

        కంపెనీలో కి వెళ్ళిన తరువాత అక్కడ పని ఏంటంటే ఒక కన్వేయర్ బెల్ట్ దాని చుట్టూ డజను కుర్చీలు అవి కుర్చీలు అంటే లగ్జరీ కుర్చీలు అనుకునేరు కేవలం కూర్చుని పనిచేసే విధంగా  చెక్క తో తయారు చేసిన బల్లులు. వాటిపై కూర్చుని కన్వేయర్ బెల్ట్ పై నుండి వచ్చే CFL బల్బులను చెక్ చేయడం వాటికి ఉన్న వైర్లు కత్తిరించడం, వాటికి PCB  లు పెట్టడం, క్యాప్ లు పెట్టడం, సోల్టరింగ్ చేయడం ఆ తర్వాత వాటిని డబ్బాలో జాగ్రత్త గా పెట్టాలి. ఇదే పని
అలా కన్వేయర్ బెల్ట్ పై వస్తున్న బల్బులను మిషన్ వేగంతో, తోటి కార్మికుల వేగంతో పని చేయాలి ఎవరు నెమ్మదించిన బెల్ట్ పై బల్బులు వెళ్ళపోతూనే ఉంటాయి మిషన్ మాత్రం ఆగదు. ఒకవేళ ఆపితే అంతే సంగతులు సూపర్వైజర్ తో నానా తిట్లు, రిమార్కులు, జీతంలో కోతలు. అన్నింటికంటే మించి అందరిముందు అవమానం తప్పదు.

      అలా ఉదయం 7 గంటలకి మొదలైన పని సాయంత్రం 7 గంటలవరకు చేయాలి. మధ్యలో ఓ అరగంట మాత్రమే భోజన విరామం ఉంటుంది. ఉదయం 7 గంటలకి కంపెనీకి వెళితే మధ్యాహ్నం 12 గంటలకి భోజనానికి వెళ్ళాలి అదికూడా కేవలం 30 నిమిషాల్లోనే భోజనం చేసి రావాలి. 30 నిమిషాల కంటే ఒక్కో నిమిషం ఆలస్యం అయినా సూపర్ వైజర్ తో తిట్లు తప్పవు వాళ్ళు మామూలుగా తిట్టరు అందుకని ఎవరు నిమిషం ఆలస్యం చేయకుండా వెంటనే వచ్చేస్తారు.
 మధ్యాహ్నం తిని వచ్చిన తర్వాత మళ్ళీ కన్వేయర్ బెల్ట్ పై బల్బుల పని చేస్తూనే ఉండాలి సాయంత్రం 7 గంటల వరకు. 12 గంటలు ఒకే దగ్గర కూర్చుని పనిచేయడం అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.

     అలా వారం రోజులు పగలు డ్యూటీ పూర్తి అయ్యింది. తర్వాత వారం నైట్ డ్యూటీ చేయాలి. సాయంత్రం 7 గంటలకి కంపెనీకి వెళితే ఉదయం 7 గంటలవరకు డ్యూటీ చేయాలి. నైట్ డ్యూటీ కూడా సేమ్ రాత్రి 12 గంటలకి భోజనానికి వెళ్ళాలి అదికూడా కేవలం 30 నిమిషాల్లోనే తినేసి రావాలి. ఒక్కో నిమిషం కూడా ఆలస్యం కాకూడదు. నైట్ డ్యూటీ కదా కాసేపు పడుకుంటాం అంటే కుదరదు.
ఉదయం అయినా రాత్రి అయిన 12 గంటలు పని చేయాల్సిందే. కేవలం 30 నిమిషాలు మినహాయించి.  నిద్ర వస్తుంది అంటే కుదరదు పని చేయాల్సిందే లేదా ఉద్యోగం మానేయాలి. నాముందు చాలా మంది వచ్చారు వెళ్ళారు అక్కడి పని చేయలేక.  కంపెనీలో కి అడుగు పెడితే చాలు అక్కడ కార్మికులకు, యంత్రాలకు పెద్ద తేడా ఉండదు. కంపెనీల్లో కార్మికులను యంత్రాల్లాగే చూస్తారు. ఇలాంటి కంపెనీల్లో కార్మికులను అస్సాం, బీహార్ లాంటి రాష్ట్రాల నుండి తీసుకువస్తారు.


నాకు ఒకరితో మాట అనిపించుకోవడం ఇష్టం ఉండదు కరెక్ట్ టైమింగ్, కరెక్ట్ పని చేసి అందరి మన్ననలు పొందాను. కొందరు అసూయ కూడా పడ్డారు ఎందుకంటే నాతో పాటు పనిలో పోటీ పడలేక పోయేవారు సూపర్ వైజర్ లతో నానా తిట్లు తినేవారు. నేనేప్పుడు మాట పడలేదు కాని ఈ కంపెనీలో ఉద్యోగం అంటే అది 12 గంటలు, వారం రోజులు, పగలు, రాత్రి తేడా లేకుండా డ్యూటీ చేయాలి. ఫ్రీడమ్ అనేది లేదు, యంత్రాలకు, మనుషులకు తేడాలేదు.  12గంటలు పని 2 గంటలు ప్రయాణం,10 గంటలు నిద్ర ఇదేనా జీవితం ఇలాంటి బానిస జీవితం వేస్ట్ అనిపించింది కంపెనీకి దండం పెట్టి వచ్చేసా.



ఇక కంపెనీలో CFL బల్బు తయారు చేసే విధానం ఆశ్చర్యం కలుగుతుంది. ఒక సన్నని గాజు గొట్టాన్ని వివిధరకాల ఆకృతుల్లో ఒక బల్బు గా తయారు చేసే టెక్నాలజీ అద్భుతం.

ఈ CFL కంపెనీలో నేను గమనించిన ఒక పెద్ద విషయం ఏంటంటే మనం మార్కెట్లో  కొనే బల్బుల పై వివిధ రకాల కంపెనీలో బ్రాండ్ లా పేర్లు ఉంటాయి కదా అంది చూసి మనం ప్రతీ బ్రాండ్ కి ఒక కంపెనీ ఉంటుంది అనుకుంటాం.కాని ఏ బ్రాండ్ కి కూడా కంపెనీ ఉండదు. ఒక కంపెనీ బల్బు తయారు చేస్తే వివిధ రకాల బ్రాండ్ల పేరుతో వాటిని ప్యాక్ చేసి మార్కెట్లో విడుదల చేస్తారు.
అంటే ఒకే బల్బు పేర్లు మాత్రం వేరు‌.


ఇప్పుడు LED బల్బులు వచ్చాయి ఇప్పుడు ఆ కంపెనీ మూతపడింది.

16, మే 2019, గురువారం

ఇనుప రేకుల ఇళ్ళు

   

   ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి. బయట తిరగలేం ఇంట్లో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడుతాం. ఇంట్లో ఏసీలు,  ఫ్యాన్ లు, కూలర్ లు ఆన్ చేసుకుని హాయిగా ఉంటాం. కాని అవి అందరికి సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇళ్ళు కాంక్రీట్ తో నిర్మించినది కావు ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు ఇళ్ళను వివిధ రకాలుగా నిర్మించుకుంటారు. అప్పట్లో ఇళ్ళు తాటాకులతో గడ్డితో నిర్మించేవారు కొందరు నాపరాయితో ఇళ్ళ పైకప్పులు నిర్మించేవారు.  కొందరు  మిద్దెలు నిర్మించేవారు.ఈ ఇళ్ళల్లో ఎండాకాలం చాలా చల్లగా ఉంటుంది. మరియు అన్ని కాలాలకు అనుకూలంగా ఉండేవి.కాలక్రమేణ ఇలాంటి ఇళ్ళు మాయమైపోతున్నాయి. అందరు కాంక్రీట్ ఇళ్ళనే నిర్మించుకుంటున్నారు. కాంక్రీట్ ఇళ్ళు నిర్మించుకునే స్థోమతలేని వారు రేకులతో ఇంటి పైకప్పు నిర్మించుకుంటున్నారు.

  ఈ రేకుల ఇండ్లను కొందరు సింమెంటు రేకులతో నిర్మించుకుంటే మరికొందరు ఇనుప రేకులతో నిర్మించుకుంటున్నారు. కొంతవరకు సిమెంట్ రేకులు నయం కాని ఇనుపరేకుల ఇండ్లల్లో మాత్రం చాలా కష్టంగా ఉంటుంది.కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు కూడా ఈ ఇనుప రేకుల ఇళ్ళళ్ళో పనిచేయవు. ఎందుకంటే ఈ రేకులతో నిర్మించిన ఇళ్ళు ఏ కాలానికి అనుకూలంగా ఉండవు. మొగలి రేకులు అనే సీరియల్ ను లక్షా ఎపిసోడ్ లు చూస్తాం కాని ఇనుప రేకుల ఇళ్ళళ్ళో ఒక్కరోజు కూడా ఉండలేం.

ఇనుప రేకులు అన్ని కాలాల వాతావరణాన్ని రెట్టింపు చేసి అందులో నివసించే వారికి చుక్కలేం ఖర్మ పాలపుతలను కూడా టెలిస్కోప్ లేకుండా చూపిస్తుంది.

ఎండాకాలంలో బయటి కంటే కూడా వేడి ఎక్కువగా ఉంటుంది.

బయట 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే లోపల 45 డిగ్రీలు ఉంటుంది.

ఇక ఫ్యాన్ వేసుకుంటే బోనస్ గా మరో ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి టోటల్ గా 50 డిగ్రీలవుతుంది.

 వానాకాలంలో వర్షం పడుతుంటే భారి శబ్ధంతో ఏమి వినపడదు.

5 సెం.మీ. వర్షం పడితే లోపల మాత్రం 20 సెం.మీ. వర్షం కురిసినంత శబ్ధం వస్తుంది.

ఇక చలికాలంలో అయితే బయట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు ఉంటే లోపల 10 డిగ్రీలు ఉంటుంది.

 సాదారణంగా చలికాలంలో మంచుకురుస్తుంది.
ఇనుప రేకుల ఇళ్ళల్లో మాత్రం పైనుండి చల్లని నీళ్ళు కురుస్తుంటాయి. ఇళ్ళంతా వర్షం పడుతున్నట్టు ఉంటుంది.

ఏమని చెప్పాలండీ ఇనుపరేకుల ఇళ్ళల్లో నివసించేవారి బాధలు ఏ కాలానికి కూడా ఈ రేకులు పనికి రావు పైగా ఆ కాలంలో మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంటాయి. అందరికి నేను చెప్పేది ఏంటంటే  వీలుంటె కాంక్రీటుతో ఇళ్ళు నిర్మించుకోండి అంత స్థోమతలేని వారు కనీసం తాటాకులతోనైనా ఇళ్ళు నిర్మించుకోండి అంతేకాని ఇనుప రేకులతో నిర్మించుకోవద్దు. ఎందుకంటే ఇనుపరేకులు అన్నికాలాలకునకు వ్యతిరేకంగా పనిచేస్తాయి.

 ఎండాకాలంలో వేడిని రెట్టింపు చేస్తుంది.
వానాకాలంలో వాన శబ్ధాన్ని రెట్టింపు చేస్తుంది.
చలికాలంలో చలిని రెట్టింపు చేస్తుంది.

ఎందుకు ఈ రేకులను పైకప్పుగా వేసుకున్నామా అనిపిస్తుంది.
దీనికంటే గడ్డితో కప్పుకున్న గుడిసే ఇళ్ళు 100 రెట్లు నయం. ఎందుకంటే గుడిసెలో ఏ కాలంలో అయిన మనకు అనుకూలంగా ఉంటుంది. గుడిసె అని చిన్న చూపు చూస్తారుగాని ఇవి అన్ని కాలాలకు అనుకులం పర్యావరణ హితంగా ఉంటాయి.

ఇనుప రేకుల ఇళ్ళతో ఇన్ని అవస్థలు పడేకంటే సిమెంటు రేకులు వేయవచ్చు కదా అంటే సిమెంట్ రేకులంటే భయం. ఎందుకంటే ఎవరైన ఇంటిమీద రాళ్ళేస్తారని భయం. అందుకే ఎంత అసౌకర్యంగా ఉన్నా ఇనుప రేకులతోనే ఇంటి పైకప్పు నిర్మించుకుంటున్నారు.

                మరి ఇనుప రేకుల ఇళ్ళళ్ళో ఇన్ని అసౌకర్యాలు భరిస్తూ ఉండాల్సిందేనా దీనికి  పరిష్కారం లేదా అంటే ఉంది. అదేలాగంటే థర్మకోల్ సీలింగ్. ఈ థర్మకోల్ సీలింగ్ ని ఇంట్లో బిగించుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఎండా,వానా,చలి కాలాలలో ఎలాంటి ఇబ్బందిలేకుండా రేకుల ఇంట్లో ఉండొచ్చు. దీనివల్ల ఇళ్ళు అందంగాను ఉంటుంది.
దీనిని తక్కువ ఖర్చుతో మనమే ఇంట్లో బిగించుకోవచ్చు.




7, ఏప్రిల్ 2019, ఆదివారం

ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ విధానం

ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ విధానం

ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ విధానం


        ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు చదువుల్లో వెనుకబడి ఉన్నారు. అలాంటప్పుడు వీళ్ళు రేపు ఏ రంగంలో రాణిస్తారు.
మరో వైపు ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు నాణ్యమైన విద్యాబోధన వలన అన్ని రంగాల్లోను రాణిస్తున్నారు. ఇది తీవ్రమైన పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో  రోజుకో కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తుంది.  అలాంటి టెక్నాలజీని అందిపుచ్చుకుని అప్డేట్ అవ్వాలి. కాని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎలా ఉందంటే 70ఏళ్ళైనా ఏమీ మారలేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఈ పరిస్థితి మారదా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరగదా.?

  ప్రభుత్వాలు ఎలాగు ఈ పాఠశాలలను పట్టించుకోవు. టీచర్లు కూడా ఎలాంటి సలహాలు ఇవ్వరు. వాళ్ళ జీతం వాళ్ళకు వస్తే చాలు విద్యార్థులు ఏమైపోతే ఏంటి అనుకుంటారు.

   నాణ్యమైన విద్య అంటే అర్థవంతమైన పాఠాలు చెప్పడం. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ఎలా ఉంటుందో మనకు తెలుసు ఒక నల్ల బోర్డు చాక్ పీస్ అంతే మొత్తం పాఠాలు నల్ల బోర్డు పైనే. ఇలా చెప్తె ఎంత మందికి అర్థమవుతుంది చెప్పండి. పాఠం గురించి ఊహించుకోవాలి అంతే అలా ఊహించుకుని అర్థం చేసుకునే శక్తి అందరికి ఉండదు. ఈ రోజు చెప్పిన పాఠం రేపు అడిగితే చెప్పలేకపోతారు. ఎందుకంటే పాఠాలు చెప్పే విధానం అర్థం కాకపోవడమే.అదే పలాన సినిమాలో హీరో ఎవరంటే టక్కున చెప్పేస్తారు. మొత్తం సినిమా కథ చెప్పమన్న చెప్పేస్తారు. దీనికి కారణం సినిమా అనేది దృశ్యరూపం ఆకర్శనీయంగా ఉంటుంది. ఒకసారి చూస్తే అలాగే గుర్తుండి పోతుంది. అలాగని సినిమాలు చూపించమనట్లేదు. పాఠాలనే అర్థవంతంగా దృశ్యరూపంలో చూపిస్తే చాలా బాగా అర్థం చేసుకుంటారు. అదేనండి స్మార్ట్ క్లాస్ విధానం. ఈ స్మార్ట్ క్లాస్ విధానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలి. అప్పుడే విద్యార్థులు అర్థవంతంగా పాఠాలు నేర్చుకుంటారు.

ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాసెస్ ప్రారంబించాలంటే ప్రభుత్వాల వల్ల కాదు. మనమే చేయాలి ఎలాగంటే స్వచ్ఛంద సంస్థలు గాని లేదా ఎవరైన కొంతమంది ఒక జట్టుగా ఏర్పడి ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ విధానం గురించి అవగాహన కల్పించాలి. ప్రతి పాఠశాలలో స్మార్ట్ క్లాస్ రూం ఎర్పాటు చేసేలా కృషి చేయాలి. ఇందుకు డబ్బులు ఎలా అంటే పాఠశాలలో చదివే ప్రతీ విద్యార్థి వద్ద నుండి కొంత మొత్తం వసూలు చేసి  ఈ స్మార్ట్ క్లాస్ ఎక్విప్ మెంటుకు సరిపడ డబ్బు తీసుకుంటె సరిపోతుంది. అలాగే ఉపాద్యాయుల వద్ద కూడా కొంత మొత్తం తీసుకుని
పాఠశాలలోని ఒక గదిలో స్మార్ట్ క్లాస్ సెటప్ ను సెట్ చేసుకుంటే చాలు.  ప్రొజెక్టర్, స్క్రీన్,  స్పీకర్స్, పాఠాలకు సంబందించిన మెమరీ డ్రైవ్ లు పాఠశాలల్లో అందించి వాటి ఆపరేటింగ్ గురించి ఉపాద్యాయులకు శిక్షణ  ఇచ్చేస్తే చాలు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు  నాణ్యమైన విద్య బోధనను అందిచి వారి అభివృద్దికి పాటుపడుదాం.

ఈ నా ఆలోచన నచ్చినవారు  మీకు వీలైతే ఈ స్మార్ట్ క్లాస్ విధానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయగలరు.