భానోదయం: జూన్ 2023

21, జూన్ 2023, బుధవారం

ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక బంధు పథకం. ఆ బంధు, ఈ బంధు ,రాబందు పథకాలు..

 ఎన్నికలు వచ్చినప్పుడల్లా తెలంగాణ లో పాలకులకు ప్రజలు గుర్తుకు వస్తారు. ఎన్నికలు అయిపోగానే  ఏ ఒక్కడు ప్రజల గురించి పట్టించుకోడు. వీళ్ళకు కావలసింది ప్రజల ఓట్లు మాత్రమే. ఎన్నికలు వచ్చినప్పుడు ఎలా వారితో ఓటు వేయించుకోవాలి అని ఆలోచించి ఏవో కొన్ని పథకాలు ప్రవేశపెడతారు. మొన్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దలితబంధు అనే పథకం తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఉన్న దలితులందరికి పదిలక్షలు ఇస్తాం అన్నారు. ఆ పథకం ఏమైంది ఎక్కడో కొద్ది మందికి అదికూడా అధికార పార్టీ నాయకులకు మాత్రమే ఇచ్చారు. దీన్నిబట్టి చూస్తే ఏమి అర్థం అవుతుందంటే ఏదో ఒక హామీ ఇస్తే జనాలు మనకు ఓటు వేస్తారు గెలిచికా ఎవడు అడిగేవాడు ఉండడు అడిగిన అధికారం మనది అనగదొక్కేస్తాం అనే ధీమా తో ఉంటారు మన పాలకులు..


 మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మరో పథకం తెరపైకి వచ్చింది. ఆ పథకం పేరు బీసి బంధు అనుకుంటా. రాష్ట్రంలో ఉన్న బీసిలందరికి లక్ష రూపాయలు ఇస్తాం అని ప్రకటించారు. ఇంకేముంది మన జనాలు తండోపతండాలుగా లక్ష రూపాయల పథకం కోసం,  ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. జనాలు ఇలా ఉన్నారు కాబట్టే నాయకులు జనాలను గొర్రెల్లా భావించి ఆడుకుంటున్నారు. లక్ష రూపాయిలు ఇచ్చే పథకం అనగానే ఆఫీసుల చుట్టూ పరిగెడుతున్నారు. ప్రజల్లో చైతన్యం లేదు. నాయకుడు తన అధికారం కోసం ఏదో తాయిలం ఆశ చూపుతున్నాడని వెర్రి జనానికి అర్థం కాదు.

  

 దలితులకు పది లక్షలు ఇచ్చాడా, 

   రైతులకు రుణమాఫీ చేసాడా, 

   డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇచ్చాడా, 

   నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాడా,

   ప్రతీ ఎకరానికి సాగునీరు ఇచ్చాడా.

   

ఇన్ని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి ఏ హామీ నేరవేర్చలేదు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రాగానే మళ్లీ కొన్ని తాయలాలు ఆశచూపి మళ్ళీ అధికారంలోకి రావాలి రాష్ట్రాన్ని దోచుకోవాలి...


జనాలు ఈ హామీల గురించి పశ్నించరు. లక్ష రూపాయిల పథకం అనగానే ఆఫీసుల చుట్టూ పరిగెడుతారు. నిజంగా లక్షరూపాయలతో మీ జీవితంత  మారిపోతుందా ఆలోచించండి. సరే లక్ష్ రూపాయలతో జీవితంలో పైకి వస్తాం అంటే ఆ లక్ష రూపాయలు అందరికి ఇస్తాడా మరీ... మన రాష్ట్రంలో జనాభా 4 కోట్లు అనుకుంటే ఒక నలబై లక్షల కుటుంబాలు బీసీ కుటుంబాలు ఉన్నాయనుకుంటే 40 లక్షలు× 1లక్ష=40 వేల కోట్లు ఎక్కడ నుండి వస్తాయి. 


ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆ బంధు,ఈ బంధు, రాబందు అని కొత్త కొత్త తాయిలాలతో జనాలను ఆకట్టుకొని ఓట్లు రాబట్టుకుని గెలిచినాక ఏ ఒక్క నాయకుడు జనాలను పట్టించుకున్న పాపాన పోడు..


కాబట్టి మనకు కావలసింది ఇలాంటి పనికి మాలిన తాయిలాలు, నేరవేర్చాలేని హామీలు కాదు. మనకు కావలసింది నాణ్యమైన ఉచిత విద్య, నాణ్యమైన ఉచిత వైద్యం. ఇవి చాలు అంతే.. పనికిమాలిన బంధులు అవసరం లేదు. విద్య , వైద్యం కోసమే సామాన్యుడు తాను సంపాదించిన దాంట్లో ఎక్కవగా ఖర్చు చేస్తున్నాడు, అప్పుల పాలు అవుతున్నాడు.


రాజకీయ నాయకుడెవడు ప్రజల అభివృద్ధి కోరుకోడు. వాడికి కావలసింది అధికారం అంతే. అందుకోసం ఏవో కొన్ని పథకాలు అని డబ్బు ఆశచూపి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వస్తాడు. ఆ తర్వాత తరతరాలకు తరగని సంపద పోగేసుకుంటాడు.. 


మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక పథకం అని డబ్బు ఇస్తాం అని చెప్పి ఓట్లు వేయించుకుంటారు.. గెలిచాక హామిలుండవు ఆవకాయ ఉండదు. ఎన్ని వేల ఎకరాలు ఎలా సంపాదించాలి, ఎన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించాలి ఈ ఐదు ఏళ్ళలో అని దోచుకునే పనిలో బిజీ అయిపోతారు. ఐదు ఏళ్ళ వరకు అందిన కాడికి దోచుకుంటారు...


వీళ్ళకు ప్రజల కష్టాలు తెలియవు. ప్రజలను ఓటు బ్యాంకు గానే చూస్తారు అంతే తప్పా మనుషులుగా చూడరు. ఇలాంటి వారిని గెలిపిస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టే.. 


మరీ ఎవరిని గెలిపించాలి అంటే రాజకీయ నాయకులు అంటేనే దోపిడి.. ఈ పార్టీ ఆపార్టీ అని తేడా ఉండదు. అందరూ అందరే. 


ఈ దోపిడిని ఆపి ప్రజలు అభివృద్ధి చెందాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి....

7, జూన్ 2023, బుధవారం

చిన్న నిర్లక్ష్యం వల్ల పెద్ద ప్రమాదం సంభవించింది...

 ఒడిశా లో జూన్ 2 న జరిగిన రైలు ప్రమాదానికి కారణం స్టేషన్ లో జరిగిన తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని నా అభిప్రాయం. 


• ఆ రైల్వేస్టేషన్ లో మూడు ట్రాకులు ఉన్నాయి. ఒక ట్రాకులో గూడ్స్ రైలు ఆగింది దాన్ని లూప్ లైన్ అంటారు. మెయిన్ లైన్ లో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు వెళ్ళాలి కాని అది లూప్ లైన్ లోకి వచ్చి గూడ్స్ రైలును ఢీకొట్టింది. అప్పుడు కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు వేగం గంటకు దాదాపుగా 130 కి.మీ. వేగంతో వచ్చి ఆగిఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడం వలన కోరమాండల్ ఇంజన్ గూడ్స్ రైలు పైకి ఎక్కింది కొన్ని బోగీలు మరో రెండు ట్రాక్ లపై పడ్డాయి. ఇంతలో మరో ఎక్స్ ప్రెస్ రైలు యస్వంత్ పూర్ 130 కి.మీ. వేగంతో వచ్చి ట్రాక్ పై పడిఉన్న కోరమాండల్ బోగీలను ఢీకొట్టింది. ఇలా వెంటవెంటనే రెండు ప్రమాదాలు నిమిషాల వ్యవధిలో జరిగిపోయాయి. 


ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తే ఇందులో రైలు డ్రైవర్ తప్పిదం ఏమి ఉండదు. ఎందుకంటే రైలును ఒక లైన్ నుండి మరో లైనుకు మళ్ళించే వీలు రైలు డ్రైవర్ కు ఉండదు. కాబట్టి అతని తప్పిదం ఏమి ఉండదు. అతను చేయవలసిందల్లా సిగ్నల్ ను అనుసరించి రైలును నడపడం వరకే. 


స్టేషన్ మాష్టర్ తప్పిదం లేదా సాంకేతిక లోపం వల్ల మాత్రమే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు.


రైల్వే స్టేషన్ లో గూడ్స్ రైలును లూప్ లైన్ కి మళ్ళించి అక్కడ ఆపేశారు. ఆ తర్వాత కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలోనే కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఆ స్టేషన్ మీదుగా వెళ్ళాలి సిగ్నల్ వచ్చింది రైలు డ్రైవర్ 130 కి.మీ. వేగంతో రైలు ను నడుపుతున్నాడు. మెయిన్ లైన్ లో వెళ్ళాల్సిన కోరమాండల్ లూప్ లైన్ లో కి వెళ్ళి గూడ్స్ రైలును ఢీకొట్టింది.


ఇక్కడ గూడ్స్ రైలును లూప్ లైన్ లోకి మళ్ళించిన తర్వాత ట్రాక్ ను మెయిన్ లైన్ కి మళ్ళించి ఉండకపోవడం వలన ఈ ప్రమాదం జరిగింది. అందుకు కారణం అక్కడ స్టేషన్ లో గమనించి ఉండకపోవచ్చు. లేదా సాంకేతిక లోపం వల్ల ట్రాక్ మారక పోవచ్చు.


ఇలాంటి చిన్న నిర్లక్ష్యం వల్ల పెద్ద ప్రమాదం సంభవించింది.


ఇలాంటివి జరగకుండా ఉండాలంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులను తొలగించాలి. 


అప్పట్లో సినిమాల్లో చూసే వాళ్ళం రైలు ట్రాకులపై హీరోయిన్ కాలు రైలు పట్టాలు క్రాస్ చేసే చోట ఇరుక్కుపోయేది. ఇంతలో అటునుంచి వేగంగా రైలు వచ్చేది అప్పుడు అందరికి ఒకటే ఆత్రుత హీరోయిన్ ను రైలు డీకొడుతుందేమోనని ఇంతలో హీరో ఆ రైలు పట్టాలపై, కంకరలో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక పెద్ద హ్యాండిల్ లాంటి దాన్ని లాగితే రైలు వేరే ట్రాక్ పై వెళ్ళేది ఆ విధంగా హీరోయిన్ ను కాపాడుతాడు అప్పుడు మా ఆత్రుత, కథ సుఖాంతం అవుతాయి.


ఇలా సినిమాలు చూసినప్పుడు తెలిసేది రైలు ఒక ట్రాక్ నుండి మరో ట్రాక్ కు మారాలంటే పట్టాలపై ఉండే ఒక పెద్ద హ్యాండిల్ లాంటి దాన్ని లాగితే మారుతుందని.


ఇప్పుడు కూడా అలాంటి వ్యవస్థ ఉంటే ఇలాంటి ప్రమాదం జరిగి ఉండేది కాదు కదా.


సరే ఇది పాత పద్ధతి కొత్త సాంకేతిక పరిజ్ఞానము ఉపయోగించుకోవాలి అని ఒక బటన్ నొక్కగానే ట్రాక్ మారిపోయే వ్యవస్థ ఇప్పుడు ఉంది. అలాంటి వ్యవస్థ సరిగ్గా పని చేస్తుందా లేదా అని పర్యవేక్షించాలి కదా మొత్తం దానిపైనే ఆధారపడితే ఎలా వాటిలో సాంకేతిక లోపాలు వస్తుంటాయి లేదా ఈ సాంకేతికతను ఉపయోగించే ఉద్యోగి నిర్లక్ష్యం కారణంగా పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి.


అదే పాత పద్ధతి లో అయితే ట్రైన్ ట్రాక్ దగ్గర ఒక ఉద్యోగి ఉండి స్వయంగా ట్రాక్ మార్చి ట్రైన్ వెళ్ళాక మళ్ళీ వేరే ట్రైన్ కి వెళ్ళే విధంగా ట్రాక్ ను అమర్చేవాడు ఈ పద్ధతిలో ప్రమాదాలు జరగవు. సాంకేతికత పేరుతో ఉద్యోగాలను తొలగించి రెండు మూడు పనులను ఒక ఉద్యోగిపై వేస్తే పనిభారం వల్ల మతిమరుపు వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.


సాంకేతిక పరిజ్ఞానము ఉపయోగించుకోవాలి అనుకుంటే మొత్తంగా సాంకేతికత పైనే ఆధారపడాలి ఇందులో మనుషుల ప్రమేయం ఉండకూడదు. ఉదాహరణకు రైల్వే ట్రాకు మార్పు సంబంధించి ఆటోమేటిక్ గా రైలు రాకపోకలకు తగ్గట్టుగా వాటంతటా అవే మారిపోయే విధంగా ఉండాలి. లూప్ లైన్ లోకి గూడ్స్ రైలు వెళ్లి ఆగిన వెంటనే ట్రాక్ మెయిన్ లైన్ కి ఆటోమేటిక్ గా కలిపే విధంగా ఉండాలి. 


ఈ విధానం సాధ్యపడదు అనుకుంటే స్టేషన్ లో ట్రాక్ మారిందో లేదో చూడడానికి ట్రాక్ చేంజింగ్ వద్ద ఒక కెమెరా ఏర్పాటు చేయాలి ట్రాక్ మారింది లేనిది అందులో తెలుస్తుంది ఒకవేళ మారకపోతే వెంటనే లోపాన్ని సరిచేయటమో లేదా రైలు ను ఇపుడేమో చేసి ప్రమాదాలు నివారించవచ్చు.



ఈ ప్రమాదానికి కారణం లూప్ లైన్లో కి గూడ్స్ రైలును మళ్ళించడానికి ట్రాక్ చేంజ్ చేసి మొయిన్ లైన్ కి మళ్ళించి ఉండకపోవడం వల్ల మెయిన్ లైన్ లో వెళ్ళాల్సిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్ లోకి వచ్చి గూడ్స్ రైలును ఢీకొట్టింది అని నేను అనుకుంటున్నాను...