భానోదయం: ఆరోగ్యం
ఆరోగ్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆరోగ్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, అక్టోబర్ 2022, బుధవారం

పొట్లం యాప్ ఆన్లైన్ కూరగాయలు

 

పొట్లం యాప్ 

ఈ స్టార్టప్ ఆలోచన చాలా బాగుంది. దీని ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది, వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు అందుతాయి. మరియు 200 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ పొట్లం యాప్ రూపకర్త శ్రీనివాస్ గారు. ఈ 'పొట్లం' అన్ని నగరాలకు విస్తరించాలి.






29, మార్చి 2022, మంగళవారం

ప్లాస్టిక్ మనుషులు

 



     మానవుడు ఎన్నో ఆవిష్కరణలు చేసాడు అవి మానవాలికి ఉపయోగంతో పాటు కీడు కూడా చేస్తాయి. ప్రపంచంలో ఏ ఆవిష్కరణ అయిన రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటిది. దానిని సరియైన విధంగా ఉపయోగిస్తే అందరికి శ్రేయస్కరం. కాని వాటిని చాలా మట్టుకు వినాశనం ఉండే విధంగానే ఉపయోగిస్తున్నారు. కొంతమంది తెలియక చేస్తే మేధావులు తమ అతి తెలివితో వినాశనానికి దారితీస్తున్నారు.


ఏ ఆవిష్కరణ అయిన తరువాత వ్యాపారం అయిపోతుంది. ఆ తర్వాత ఈ వ్యాపారాలతో ప్రకృతిని నాశనం చేస్తారు. 


మనిషి ఆవిష్కరించిన వాటిలో అత్యంత చెత్త ఆవిష్కరణ "ప్లాస్టిక్".  ఇది ఎంత చెత్త ఆవిష్కరణ అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ చెత్తే కనిపిస్తుంది.

నేలపై, నదుల్లో, సముద్రాల్లో ఇలా ఎక్కడ చూసినా ఈ చెత్తే కనిపిస్తుంది. పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉంటుంది.. ఇన్ని రోజులు బయట మాత్రమే ఉండే ఈ చెత్త ప్లాస్టిక్ ఇప్పుడు మానవ శరీరంలో రక్తంలోకి కూడా చేరింది... ఇన్నాళ్లు పర్యావరణాన్ని చెత్తగా మార్చిన ప్లాస్టిక్ ఇప్పుడు మానవ శరీరాన్ని చెత్తగా మారుస్తుంది.


      ఆవిష్కరణలు మనిషి జీవన విధానాన్ని ఎంత సులభతరం చేస్తయో అంతకంటే ఎక్కువగా నాశనం కూడా చేస్తాయి. ఆవిష్కరణలు రెండు వైపుల పదును వున్న కత్తుల్లాంటివి వాటిని ఎంత జాగ్రత్తగా వాడితే అంత మంచిది విచ్చలవిడిగా వాడితే ముప్పు తప్పదు.. 

     

    ఇప్పుడు ఈ ప్లాస్టిక్ మానవ శరీరంలో రక్తంలోకి ఎలా చేరింది.?

    

 ఎలా చేరిందంటే మనిషి విచ్చలవిడిగా వాడడం వలనే.



 అవసరం ఉన్నా లేకున్నా ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అయిపోయింది.



అందులో కొన్ని నాకు తెలిసినవి:-


ఉదయం నుంచే మన పరుగు ప్లాస్టిక్ తోనే మొదలవుతుంది.


ఉదయము కూరగాయలకు వెళ్తారు ఖాళీ చేతుల్తో. వచ్చేటప్పుడు ప్లాస్టిక్ కవర్లలో కూరగాయలు నింపుకుని వస్తారు.



పాలు ప్లాస్టిక్ కవర్లో.


కిరాణా సరుకులు ప్లాస్టిక్ కవర్లో.


బయట  ఎక్కడైన టిఫిన్ చేస్తే ప్లాస్టిక్ కవర్లో నే.


భోజనం ప్లాస్టిక్ ప్లేట్లలో నే.


ఆహారం ప్యాక్ చేయడం ప్లాస్టిక్ కవర్లో నే.


టీ తాగడానికి కూడా ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకొని తాగుతున్నారు.


అసలు ప్లాస్టిక్ వాడకం అనేది మామూలుగా లేదు అవసరం ఉన్నా లేకపోయినా వాడడం మాత్రం పక్కా.


అంతలా వాడితే మనిషి రక్తంలో ఏంటి ఏకంగా శరీరం మొత్తం ప్లాస్టిక్ అయిపోయి "ప్లాస్టిక్ మనుషులు" గా మారిపోయిన ఆశ్చర్యం లేదు..!!!



ఉదయం లేవగానే కూరగాయలకు ఒక సంచి తీసుకుని వెళ్తే ఏమవుతుంది.? చాలామందికి చేతిలో సంచి తీసుకుని బయిటకు వెళ్తే నామోషో లేక బద్ధకమో తెలియదు కాని అస్సలు తీసుకెళ్ళరు.


 ఖాలీ చేతుల్తో కిరాణా సరుకులు, కూరగాయలకు వెళ్ళి గంపెడు ప్లాస్టిక్ చెత్తను తీసుకువస్తారు. సరే తెచ్చారు వాటిని సరైన విధంగా రీసైక్లింగ్ చేసే విధంగా చేస్తారా అంటే అదిలేదు. ఇష్టం వచ్చినట్టు బయట పారేయడం లేదా కాల్చివేయడం చేస్తారు. ఇలా కాల్చడం వలన ప్లాస్టిక్ కణాలు గాలిలో కలిసి ఆ గాలి పీల్చునప్పుడు శరీరం లోకి ప్రవేశిస్తున్నాయి.


ఇంకొందరు మహానుభావులు వేడి వేడి 'టీ' ని  కూడా ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకొని తాగుతున్నారు. టీ కొట్టు వాడికి తెలియక పోవచ్చు వేడి పదార్థాలను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేయోద్దని చదువుకున్న వాళ్ళుకూడా తెలియదా అలాగే తాగుతున్నారు. అంత వేడి టీ ని ప్లాస్టిక్ కవర్లో పోస్తే ఆ వేడికి ప్లాస్టిక్ కరిగి టీలోకి వెళ్ళి అది తాగినవారి శరీరం లోకి వెళుతుంది.

అలా చేయకుండా ఒక ప్లాస్క్ వాడితే సరిపోతుంది కదా. ప్లాస్క్ వాడడానికి బద్దకం, ఆ ప్లాస్క్ ను కొట్టు వరకు తీసుకువెళ్ళడానికి నామోషి. 


ఇక నీళ్ళు ప్లాస్టిక్ బాటిల్లో.

పల్లెటూళ్ళలో అయితే ఒకసారి తాగిపడేసిన కూల్ డ్రింక్స్ బాటిల్స్, నీళ్ళ బాటిల్స్ ని పదే పదే నీళ్ళు నింపుకుని వాడుతుంటారు.  ఈ ప్లాస్టిక్ బాటిల్స్  లో ఎక్కువ రోజులు నీళ్ళు తాగితే అందులోని ప్లాస్టిక్ కణాలు అందులోని నీటిలోకి వెళ్తాయని వాళ్ళకి తెలియదు. అలాగే వాడుతూ ఉంటారు. తెలిసిన 

ఎవరూ చెప్పరు, చెప్పిన ఎవరూ వినరు...




     ఇంకా పెళ్ళిళ్ళు, దావత్ లకు అప్పట్లో మోదుగ ఆకులతో తయారు చేసిన విస్తరాకుల్లో భోజనం వడ్డించేవారు. ఆ విస్తరాకుల్లో  తృప్తి గా భోజనం చేసేవాళ్ళం. వాటిని తీసుకెళ్ళి పెంటలో వేసే వాళ్ళు అవి ఎరువుగా మారేవి... ఇప్పుడు పేపర్ ప్లేట్లో వడ్డిస్తున్నారు ఈ పేపర్ ప్లేటునుంచి ఏదో దుర్గంధం వస్తుంది. పైగా వాటిపై ప్లాస్టిక్ కవర్ ఉంటుంది వేడి పదార్థాలు అందులో తింటే  ప్లాస్టిక్ శరీరంలోకి చేరకుండా ఉంటుందా..?


ఎంత చక్కనివండి  అప్పట్లో మన పల్లెల్లో "మోదుగ ఆకులతో" తయారు చేసిన విస్తరాకులు. అందులో భోజనం చేస్తే అమోఘం. వీటి వలన పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు పైగా అవి ఎరువుగా ఉపయోగపడుతాయి. ఈ పేపర్, ప్లాస్టిక్ విస్తరాకుల వలన అన్ని విధాలుగా నష్టమే ఎక్కువ...


మన ఆచారాలు, సంప్రదాయాలు అన్ని మరిచిపోయి ప్లాస్టిక్ వెంట పరిగెత్తి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్నాం...



ప్లాస్టిక్ వలన ఖర్చు తక్కువ, తేలికగా ఉండడం ఎక్కువగా వాడుతున్నారు. కాని పరోక్షంగా దీని నష్టాలు గమనించడం లేదు.


ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. అది మన చేతుల్లోనే ఉంది..


కిరాణా సరుకులు, కూరగాయలకు వెళ్ళినప్పుడు జనపనార (జ్యూట్ )బ్యాగులు కాని కాటన్ బ్యాగులు కాని వెంట తీసుకెళ్ళాలి.


పేపర్ ప్లేట్లకు బదులు అరటి ఆకులు గాని, మోదుగ ఆకులతో తయారు చేసిన విస్తరాకులు వాడాలి.


బయట నుండి పార్శిల్ తెచ్చుకొని తినడం కంటే ఇంట్లోనే వండుకోవడం వల్ల ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచిది.....








10, మార్చి 2021, బుధవారం

బంగారు తెలంగాణ కాదు కాలుష్య తెలంగాణ.

        

                మనిషి ప్రశాంతంగా,ఆరోగ్యంగా బ్రతకాలంటే స్వచ్ఛమైన గాలి,నీరు ఎంతో అవసరం. స్వచ్ఛమైన గాలి,నీరు ఎక్కడ లభిస్తుంది అంటే పల్లెటూర్లో లభిస్తుంది అని అందరూ చెబుతారు. ఎందుకంటే పట‌్ట‌ణాల్లో గాలి,నీటి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. పట‌్ట‌ణాల్లో,నగరాల్లో నివసించే ప్రజలు వారాంతాల్లో నగర కాలుష్యానికి దూరంగా పల్లెల వైపు వచ్చి స్వచ్ఛమైన గాలిని, వాతావరణాన్ని ఆస్వాదిస్తుం‌టారు.  పల్లెటూళ్ళంటే పచ్చని ప్రకృతితో, స్వచ్చమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో కళకళలాడుతూ ఉండేవి.  ఉండేవి అని ఎందుకన్నానంటే అది గతంలో ఇప్పుడు కాదు. ఎందుకంటే  ఇప్పుడు        పల్లెటూళ్ళు కాలుష్యంలో  పట‌్ట‌ణాలతో పోటీ పడుతున్నాయి. ఇప్పుడు కాలుష్యంలో పట‌్నంకు, పల్లెకు తేడా లేదు. 

               

              ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంతో కళకళలాడుతూ ఉండే పల్లెల్లో ఇప్పుడు కాలుష్యంతో విలవిల ాడుతున్నాయి. పట‌్ట‌ణాల్లో  వాహనాల పొగ, ప్లాస్టిక్ వ్యర్ధాలు, డ్రైనేజీల వలన కాలుష్యాం ఏర్పడుతుంది. ఇక్కడ ప్రజలు ఎక్కువగా చదువుకున్న వాళ్ళే ఉం‌టారు. వీరికి కాలుష్యం పట‌్ల అవగాహన కూడా ఉంటుంది. అయిన పర్యావరణ కాలుష్యం గురించి ఎవ్వరూ పట్టించుకోరు. అందువలన పట‌్ట‌ణాలెప్పుడు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు పల్లెలు కూడా కాలుష్యంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ముఖ్యంగా గాలి కాలుష్యం విపరీతంగాపెరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాల గురించి చదువుకున్న వాళ్ళే పట‌్టించుకోరు. ఇక పల్లెల్లో ఉండే చదువుకోని ప్రజలకు ఎలాంటి అవగాహన ఉండదు. అందువల్ల పల్లెల్లో కాలుష్యం పెరిగిపోయింది. ముఖ్యంగా గాలి  కాలుష్యం పెరిగిపోయింది. ఎలా అంటే ప్లాస్టిక్ వ్యర్ధాలను తగల పెట‌్ట‌డం వలన గాలి కాలుష్యం ఎక్కువగా ఉంది.  ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వాడకం విపరీతంగాపెరిగిపోయింది. క్యారీబ్యాగ్, కూల్ డ్రింక్స్ బాటిల్స్, ఫుడ్ ప్యాకింగ్ కవర్స్,    ప్లాస్టిక్ విస్తరాకులు, చిప్స్ ప్యాకెట్స్ ఇలా అన్ని ప్లాస్టిక్ మయమే వీటిని వాడిన తర్వాత ఒక దగ్గర వేసి కాల్చి వేస్తున్నారు. దీని వలన ఏర్పడిన పొగ వలన పర్యావరణ ానికి ఎంత ప్రమాదమో వారికి తెలియదు, ఆ పొగ పీల్చటం వలన ఎలాంటి అనారోగ్యాలు వస్తాయో వారికి తెలియదు. ఇది తెలియక చాలామంది ప్లాస్టిక్ వ్యర్ధాలను తగలబెడుతుంట ారు. ఇదివరకు ఎవరి ఇళ్ళముందు వారు తగలబెట్టెవారు. దీని వలన కొంత సమయం గాలి కాలుష్యం ఆ చుట్టు పక్కల ఉండేది. కానీ ఇప్పుడు  ఈ గాలి కాలుష్యం, పొగ రోజంతా పల్లెలను పట్టి పీడిస్తోంది. ఇలా రోజంతా గాలి కాలుష్యం, పొగ రావడానికి కారణం ప్రభుత్వాల అతి తెలివి వల్ల నేడు గ్రామాల్లో వాయు కాలుష్యం పెరిగిపోయింది.


              ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లో ఇంటింటికి వచ్చి చెత్త సేకరించే కార్యక్రమం నడుస్తుంది. తడిచెత్త, పొడి చెత్త వేరు వేరుగా సేకరించాలని కొన్ని గ్రామాల్లో రెండు చెత్త బుట్టలను ఇవ్వడం జరిగింది. తడి చెత్త, పొడి చెత్త గురించి అవగాహన కల్పించారు. ఇక్కడ వరకు ప్రభుత్వం చేసిన పని మెచ్చుకోదగ్గ విషయమే. కానీ ఈ చెత్త డబ్బాలు కొన్ని గ్రామాల్లోనే ఇచ్చారు. చాలా గ్రామాల్లో ఇవి ఇవ్వలేదు. సరే ఇవ్వలేకున్నా సరే మేమే తెచ్చుకుంటాం చెత్తను   వేరు చేసి ఇస్తాం ఈ చెత్తను ప్రభుత్వం ఏమి చేయాలి? పర్యావరణ ానికి హాని కలిగించకుండా రీసైక్లింగ్ చేయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా తడి చెత్త, పొడి చెత్త , ఆ చెత్త ఈ చెత్త అని తెడా లేదు అన్ని చెత్తలు ఒకటే అన్నట‌్టు ఒకే చోట‌ వేస్తున్నారు. ఈ చెత్త  సేకరించే వారు ఉదయం ఒక ట‌్రాక్ట‌ర్ తో గ్రామంలో మొత్తం తిరిగి అన్ని రకాల చెత్తలు అందులో వేసుకుని ఊరి బయట‌ ఉన్న చెత్త డంప్ యార్డ్ లో వేస్తున్నారు.  ఇక్కడ వరకు బాగానే ఉంది కదా?  తెలంగాణ గ్రామాలు దీని వలన స్వచ్ఛంగా వెలిగిపోతున్నాయి అని మీరు అనొచ్చు, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం అని కూడా అనొచ్చు. కాని నేను మాత్రం ఇది పరమ దరిద్రమైన చెత్త పని అని అంటాను.... ఎందుకంటే ఒకపని చేస్తే ప్రజలకు మేలు కలగాలి కాని ఈ చెత్త సేకరించే పని వలన ప్రజలకు నష్ట‌మే తప్ప మేలు జరగడం లేదు.


           ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లో చెత్త డంప్ యార్డులు నిర్మించారు. దాంట‌్లో చెత్తను వేరు చేయడానికి అన్నట‌్టు చిన్న చిన్న గదులు నిర్మించారు. అందులో  గ్రామాల్లో సేకరించిన చెత్తను వేరు చేసి రీసైక్లింగ్ చేయాలి. కానీ ఇప్పడు ఏం చేస్తున్నారంటే డంపు యార్డ్ ముందు ఒక పెద్ద గుంత తీసి గ్రామంలో సేకరించిన చెత్తను అందులో వేసి తగలబెడుతున్నారు. దీని వలన 24/7 365 రోజులు అది మండుతూనే ఉంటుంది. ఆ పొగ పగటి పూట‌ పైకి వెళుతుంది. అప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. కాని సాయంత్రం పూట‌ చుట్టు పక్కల మొత్తం పొగతో నిండిపోయి నరకం కనిపిస్తుంది. గాలి పీల్చాం‌టేనే భయం వేస్తుంది. దగ్గు, ఆయాసం, కళ్ళ మంట‌లు నరకయాతన.

       అసలు ప్రభుత్వాలకు ఇలాంటి చెత్త ఐడియాలు ఎందుకొస్తాయో..? 😭😭😭 మా గ్రామంలో అయితే సాయంత్రం అయ్యిందం‌టే చాలు ఈ చెత్త డంపు యార్డ్ వల్ల దానికి దగ్గరగా ఉన్న ఇళ్ళ ప్రజలు    చాలా ఇబ్బంది పడుతున్నారు.. అందుకు ఉదాహరణ నేనే... సాయంత్రం నుండి ఉదయం వరకు ఆ పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్నా. నా పక్కన ఎవరైన సిగరెట‌్ తాగితేనే నాకు పడదు అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతాను. అలాంటిది లక్షల సిగరెట్లు  కాల్చినంత పొగ వస్తే ఏం చేయాలి. ఉపాది లేక  దశాబ్దం పాటు ఊరు వదిలి వెళ్ళిపోయాం.అక్కడ నానా కష్టాలు పడ్డాం. తెలంగాణ వచ్చాక మన బతుకులు బాగు పడతాయని సొంత ఊరికి వస్తే ఇక్కడేమే స్వచ్చమైన గాలి కూడా లభించడం లేదు. ఇదేనా బంగారు తెలంగాణ అంటే.????

        బంగారు తెలంగాణ ఎవరికి అయ్యిందో అందరికి తెలిసిందే. ఒక కుటుంబం బాగు పడితే చాలా...???


ఇది చాలా చిన్న సమస్య ఇంత పెద్ద రాద్దాంతం చేయడం అవసరమా అని మీరు అనొచ్చు. ఆ కష్టం అనుభవించిన వాడికే తెలుస్తుంది ఆ భాదేమిటో.  ఎక్కడైన పొగ వస్తేనే అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతాం అలాంటిది మన ఇంటికి దగ్గర 24 గంట‌లు పొగ అది కూడా ప్లాస్టిక్ ను తగలబెట్టిన పొగ వస్తే ఎలా ఉం‌టుందో ఆలోచించండి. ఇలాంటి కలుషితమైన గాలిని పీల్చి అనారోగ్యాల పాలయితే ఆసుపత్రుల చుట‌్టు తిరిగే స్తోమత మాకు లేదు. నాకు ఆసుపత్రులంటే మహా భయం.. అక్కడకు వెళ్ళాలంటే ఇంట‌్లో డబ్బులు కాసే చెట్లు ఉండాలి. అయినా ఆసుపత్రుల చుట‌్ట‌్టు తిరగడం కం‌టే ఆరోగ్యంగా ఉండట‌మే మేలు కదా..  


            కెసిఆర్ సార్ అంటే నాకు ఎంతో అభిమానం... నా చుట్టూ ఉండే వాళ్ళు ఎందరు కెసిఆర్ సార్ ను విమర్శించిన

 సార్ గొప్పవాడు  విమర్శించడం తప్పు అనేవాడిని . నేనే తప్పు అని ఇప్పుడు అర్థం అయ్యింది.. ఒక పని చేసే ట‌ప్పుడు అది పూర్తిగా  అమలు జరిగేలా చూడాలి అది వారి బాధ్యత. కాని ఆ పనిని  సగంలోనే వదిలేస్తే   బాధ్యతారాహిత్యం అంటారు.. ఈ చెత్త డంప్ యార్డులు ఎందుకు కట‌్ట‌డం జరిగింది అక్కడ జరుగుతున్నదేమిటి. అది పూర్తిగా నిర్దేశించిన పని జరుగుతుందా లేదా అనే బాధ్యత ప్రభుత్వానికి లేదా....??  కెసిఆర్ సార్ బంగారు తెలంగాణ అంటాడు సార్ మాకు బంగారు తెలంగాణ అవసరం లేదు. మాకు స్వచ్చమైన గాలి కూడా లభించడం లేదు నీ బంగారు తెలంగాణలో...


నా తెలంగాణ ఇప్పుడు కాలుష్యానికి చిరునామా. 

కెసిఆర్ సారూ నీకు కోటి దండాలు...🙏🙏🙏🙏🙏🙏

మీరు ఈ రాష్ట‌్రాన్ని బంగారు తెలంగాణ చేయకపోయిన పరవలేదు కానీ కాలుష్య తెలంగాణగా మాత్రం చేయకండి..


ఇక చివరగా ఒక మాట‌.. కెసిఆర్ సార్ చెప్పిన బంగారు తెలంగాణ ఎక్కడుందంటే ఆయన ఫామ్ హౌస్ లో ఉంది మంచి ఆహ్లాదకరమైన వాతావరణం హాయిగా ఆయన నివసిస్తున్నారు. సార్..... మీరు ముఖ్యమంత్రి అయ్యింది మీ కు‌టుంబం మాత్రమే హాయిగా ప్రశాంతంగా,ఆరోగ్యంగా జీవించడానికి కాదు. తెలంగాణ ప్రజలు హాయిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించాలి. దాన్ని అం‌టారు బంగారు తెలంగాణ అని.. నీ ఫామ్ హౌస్ పక్కన ఒక చెత్త డంపు యార్డ్ ఉండి ఊరి చెత్తనంతా అక్కడ వేసి తగలబెడితే తేలుస్తుంది మా బాధేమిటో. ఈ మాట‌ మీకు కోపం కలిగిస్తే, మాట‌ అన్నందుకే మీకు కోపం వస్తే మీరు గ్రామాల్లో కట‌్టించిన చెత్త డంపు యార్డుల   పొగ వల్ల నరకం అనుభవిస్తున్న మాకు ఎంత రావాలి మీపై కోపం..😠😠😠😠😠😠😠😠😠😠


ఇంకా చాలా అక్రమాలు జరుగుతున్నాయి.  కొండలు తవ్వేయడం, పచ్చని పంట‌ పొలాల్లో కంపెనీలు,  వెంచర్లు వేయడం వలన పర్యావరణం నాశనం అవుతుంది.. ఇక ఒకప్పుడు హైదరాబాద్ తాగునీటీ అవసరాలు తీర్చిన జంట‌ జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు కాలుష్యం కాకుండా 111 జీవో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఇప్పడు కెసిఆర్ ప్రభుత్వం వచ్చింది కదా బంగారు తెలంగాణ చేయాలి కదా ... అందుకే కెసిఆర్ సార్ 111 జీవోను కూడా ఎత్తి పడేస్తా అని చెప్పాడు.. నాకు తెలుసి కెసిఆర్ సార్  తెలంగాణ రాష్ట‌్రాన్ని కాలుష్యంగా మార్చడానికే కంకణం కట‌్టుకున్నట్టున్నాడు..

ఈ రెండు జలాశయను కూడా హూస్సేన్ సాగర్ లాగా  సుగంధభరితమైన జలాశయాలుగా మార్చాలనుకుంటున్నాడు. సారూ మీరు బంగారు తెలంగాణ చేస్తాను అం‌టే ఈ విధంగా చేస్తావనుకోలేదు..

సారూ కెసిఆరూ ఇలాంటి బంగారు తెలంగాణ మాకు వద్దు..... నీకు కోటి దండాలు...🙏🙏🙏🙏🙏🙏��











              






                 












          

11, నవంబర్ 2019, సోమవారం

టీ,కాఫీలు తాగుతున్నారా.? మానేయండి.


          

     టీ, కాఫీలు  ఉదయం నుండి రాత్రి వరకు చాలామంది టీ,కాఫీలు తాగుతూనే ఉంటారు. టీ లేకుంటే ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. చాలామంది టీ తాగడంతోనే రోజు మొదలవుతుంది. అసలు టీ తాగడం అవసరమా!
టీ,కాఫీలు తాగడం వలన ఏం ప్రయోజనం చెప్పండి. టీ,కాఫీలు తయారు చేసే పాలు, టీ పొడి, కాఫీ పొడి ఇవన్ని నాణ్యమైనవేనా??  
ఉదయం లేవగానే ఇంటి ముందు పాలప్యాకెట్ దర్శనమిస్తుంది. లేదా షాప్ లో తెచ్చుకుంటారు. అసలు పాలు ఎందుకు తాగాలి?? సృష్టి ధర్మం ఏంటీ? పాలు అనేవి జీవులు  అవి ఏ జీవులైనా పిల్లలకు జన్మనిచ్చాక పసి పిల్లలకు ఆహారంగా మాత్రమే ఇవ్వడానికి ఉపయోగపడుతాయి. పుట్టినప్పుడు ఏ జీవులైనా ఏ ఇతర ఆహార పదార్థాలు తీసుకోలేవు ద్రవపదార్థాలు మాత్రమే ఆరగిస్తాయి. అందుకోసమే సృష్టి లో జీవులు ఉదాహరణకు గేదెలు, ఆవులు వంటి జంతువులు  వాటి పిల్లలకు పాలు ఇస్తాయి. అంతేకాని మనుషుల కోసం కాదు‌. ఎప్పుడైనా తప్పని పరిస్థితుల్లో అంటే చిన్న పిల్లలకి పాలు సరిపోకపోతే ఆవు,గేదె పాలు పట్టాలే కాని ప్రతి ఒక్కరు పాలు తాగడం అవసరమా?? ఆవు,గేదెల పాలు వాటి పిల్లలకు పట్టకుండా ఆ పాలతో వ్యాపారం మొదలు పెట్టాడు మానవుడు. వ్యాపారంతో పాటు కల్తీ కూడా చాలా పెరిగింది. పాలు కల్తీ ఎంతలా ఉందంటే ఉదాహరణకు మనదగ్గర పాల ఉత్పత్తి 100 లీటర్లు ఉంటే 300 లీటర్ల పాలు అమ్ముడవుతున్నాయట. అంటే 200% కల్తీ జరుగుతుంది.


ఇక మనం ప్యాకెట్ పాలు గురించి మాట్లాడుకుందాం అవి మనకు ఎక్కడి నుండి వస్తాయి. పాలకేంద్రాల నుండి వస్తాయి కదా అక్కడి నుండి మన దగ్గరకు వచ్చే మార్గంలో ఏంత కల్తీ జరుగుతుందో ఎవరికి తెలుసు. ప్యాకెట్ ఓపెన్ చేసి అందులో కలుషితమైన పాలు పోసి  మళ్ళీ ఎక్కడా డౌట్ రాకుండా ప్యాక్ చేస్తుంటారు. ఒక్కో చోట అయితే ఫేవికాల్, బట్టలు ఉతికే సర్ఫ్, యూరియా వంటి వాటితో పాలు తయారు చెసి అమ్ముతున్నారు. తెల్లగా ఉన్నాయి కదా అని పాలే అనుకుని తాగేస్తుంటారు. తెల్లగా ఉన్నవన్ని పాలు కావని గుర్తుంచుకోండి. ఇలాంటి కలుషిత పాల గురించి రోజు వార్తల్లో చూస్తూనే ఉంటాం.
పాలను ఎలా కల్తీ  చేస్తారో ఇక్కడ చూడండి.

https://youtu.be/HnjeoIJTcT8



కొందరు ఇలాంటి కలుషితమైన పాల గురించి తెలిసి  ప్యాకెట్ పాలు వాడకుండా నేరుగా గేదెల షెడ్ నుండి పాలు తెచ్చుకుంటారు. ఈ పాలు కూడా నాణ్యమైనవేనా!! ఇక్కడ కూడా పాలు నాణ్యమైనవి కావు. ఎందుకంటే గేదెలు పాలు ఎక్కువ ఇచ్చేలా వాటికి నిషేదిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఈ పాలు దీర్ఘకాలికంగా తాగడం వలన వ్యాధులు వస్తాయి.
చూసారా మనం తాగే పాలు ఎక్కడ కూడా నాణ్యమైనవి లభించడం లేదు. డబ్బులు ఇచ్చి మరీ రోగాలు కొని తెచ్చుకుంటున్నారు.

     మన ఇంట్లో చేసుకునే టీ, కాఫీలు 50% కలుషితం అయితే బయట తాగే టీ కాఫీలు 100% కలుషితమే. బయట తాగే టీ కప్పులో నుండి టీ పొడి వరకు అన్ని కలుషితమే. టీ కొట్టులో ఎందరో తాగిన గ్లాసుల్లో టీ తాగుతారు ఆ గ్లాసులను సరిగా కడగరు కంపు కొడుతుంటాయి. దీని గురించి ఎవరు ప్రశ్నించరు. అలాగే తాగివస్తారు కొందరు పేపర్ కప్పుల్లో  తాగుతుంటారు. పేపర్ కప్పుల్లో వ్యాక్స్ ఉంటుంది. అందువలన టీ అనేది కప్పుకు అంటకుండా ఉంటుంది. వీటిలో వేడి వేడి టీ పోయడం వలన వ్యాక్స్ అందులో కలుస్తుంది. ఇది ఆరోగ్యానికి హానికరమే.  ఇక కొందరు ప్లాస్టిక్ కవర్లో  టీ తెచ్చుకుని తాగుతుంటారు దీనివలన వేడి వేడి టీలో ప్లాస్టిక్ కరిగుతుంది. ఇలా తాగడం  ఆరోగ్యానికి హానికరం.  హైదరాబాద్లో ఫేమస్ టీ ఇరానీ టీ  ఇందులో ఎముకల పొడి కలుపుతారట.
టీతో పాటు ఉస్మానియా బిస్కెట్ ఫేమస్ ఇవి  తయారు చేసే బెకరీల్లో చూడండి ఎలా ఉంటుందో అక్కడ చూస్తే మళ్ళీ ఉస్మానియా బిస్కేట్ తినలేమంట. మొత్తంగా బొద్దింకలు మయంగా ఉంటుందట.
ఇక కొట్టులో వాడే పాలు నాణ్యమైనవేనా?? టీ పొడి నాణ్యమైనదేనా? అందులో వాడే నీరు పరిశుభ్రమైన దేనా? టీ కప్పులు పరిశుభ్రంగా ఉంటున్నాయా? ఇవన్ని తెలిసి కూడా టీ తాగుతున్నారంటే అది వారి మూర్ఖత్వం.  బయట వ్యాపారం చేసే ఇలాంటి వ్యాపారాలు చేసే వారెవరు జనాల ఆరోగ్యాల గురించి పట్టించుకోరు. పాలల్లో యూరియా, సర్ఫ్ కలిపి వ్యాపారం చేస్తున్నారంటే  లాభాలకోసం ఏమైనా చేయడానికి వెనుకాడటం లేదు. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోడ్డు పక్కన  టీ తాగకూడదు. టిఫిన్ చెయకూడదు. ఇంట్లో చేసుకోండి.

బయట టీ కొట్టులో ఎలా ఉంటుందో ఈ వీడియో లో చూడండి.




అసలు టీ, కాఫీ లు తాగకుండా ఉండలేరా?
అంతగా టీ,కాఫీలు అలవాటుంటే ఇంట్లో చేసుకోవడం ఉత్తమం. అదికూడా పాలతో చేసింది కాదు కేవలం మంచినీళ్ళను మరిగించి అందులో పూదినా లేదా తులసి ఆకులు వేసి అందులో కొంచెం నిమ్మరసం మరియు ఒక స్పూన్ తేనే వేసుకుని తాగాలి. ఇలా చేయడం వలన టీ తాగిన అనుభూతి ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 

తులసీ టీ



24, అక్టోబర్ 2019, గురువారం

దోమల నివారణకు ఏం చేయాలి


దోమల నివారణ



        దోమల నివారణకు ఆల్ అవుట్,గుడ్ నైట్ వంటి లిక్విడ్ వెపరైజర్లు, జెట్ కాయిల్స్, దోమల అగరబత్తీలు వాడుతుంటాం వీటి వల్ల దోమలు రాకుండా ఉంటాయి కాని వీటి వాడకం వల్ల శ్వాసకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అలాగే  ఈ లిక్విడ్ వెపరైజర్లు ఖాళీ అయిపోయిన తర్వాత పారేస్తున్నారు వీటి వలన పర్యావరణం కాలుష్యం అవుతుంది.

 సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దోమలను నివారించాలంటే
మస్కిటో కిల్లర్ ట్రాప్ అనే చిన్న పరికరం సహాయంతో దోమలను నివారించవచ్చు.    దీనివలన
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పైగా ఇవి ఇకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. ఇందులో పడ్డ దోమలు బయటికి వెళ్ళలేవు చనిపోతాయి.కాబట్టి వాటి సంఖ్య పెరగకుండా ఉంటుంది. లిక్విడ్ వెపరైజర్లు,కాయిల్స్,దోమల అగరబత్తీలు వాడటం వల్ల దోమలు రాకుండా ఉంటాయే తప్ప చనిపోవు బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తాయి. మస్కిటో కిల్లర్ ట్రాప్ ను వాడితే
అవి దోమలను ఆకర్షించి చంపేస్తాయి. ఇవి పర్యావరణానికి అనుకూలమైనవి.



దోమల నివారణ







30, సెప్టెంబర్ 2019, సోమవారం

పల్లీలు నువ్వుల లడ్డు





పల్లీలు నువ్వుల లడ్డు

కేవలం మూడు పదార్థాలతోనె చాలా సులువుగా రుచికరమైన, ఆరోగ్యానికి మేలు చేసే లడ్డు తయారుచేసే విధానం..

కావలసిన పదార్థాలు:-

పల్లీలు       - 1 కప్పు
నువ్వులు  - 1 కప్పు
బెల్లం            - అరకప్పు


తయారి విధానం:-
పల్లీలు, నువ్వులను దోరగా వేయించుకోవాలి.వేయించిన పల్లీలు,నువ్వులను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బెల్లం వేసి గ్రైండ్ చేసుకోని ఉండలు కట్టుకోవాలి.
అంతే రుచికరమైన లడ్డు తయారవుతుంది.


నువ్వుల లడ్డు



ఈ లడ్డు చూడటానికి అంత ఆకర్షనీయంగా లేకపోయినా తింటే మాత్రం రుచి అద్భుతంగా ఉంటుంది.
పల్లీలు,నువ్వుల లడ్డులో కాల్షియం అధికంగా ఉంటుంది ఈ లడ్డు తినడం వలన ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి.

29, సెప్టెంబర్ 2019, ఆదివారం

గోధుమ గడ్డి



wheatgrass
గోధుమ గడ్డి

       



గోధుమ గడ్డి పెంచే విధానం:-

ఒక కప్పు గోధుమలు తీసుకుని కడిగి ఒక గిన్నెలో నీళ్లు పోసి 12 గంటలు నానబెట్టాలి.

12 గంటలు నానిన తర్వాత నీళ్ళు ఒంపేసి ఒకసారి కడిగి ఒక కాటన్ గుడ్డలో మూటకట్టి ఒకరోజు ఉంచాలి.

తర్వాత ఒక ప్లాస్టిక్ ట్రే తీసుకుని దానికి అడుగు భాగంలో రంధ్రాలు చేయాలి. అందులో సగం వరకు  మట్టిని పోయాలి. ఈ మట్టిలో  వర్మీ కంపోస్టు ఎరువు కలుపుకుంటే గడ్డి బాగా వస్తుంది.

మట్టి పోసిన తర్వాత మొలకెత్తిన గోధుమలను ప్లాస్టిక్ ట్రే లో ఒత్తుగా వేయాలి. అలా వేసిన తర్వాత పైనుండి  గోధుమలు మునిగేలా మట్టిని పోసి నీళ్ళు పొయ్యాలి.

ఈ ట్రేను నీడలో ఉంచాలి.
ఉదయం సాయంత్రం వేళల్లో నీటిని చిలకరించాలి.


 గోధుమ గడ్డి  పది రోజులతర్వాత ఆరు అంగుళాలకు మించి పెరుగుతుంది.




wheatgrass

21, సెప్టెంబర్ 2019, శనివారం

ఆరోగ్యానికి మొలకలు




          ఆరోగ్యానికి మొలకలు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. విటమిన్లు, శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు ఉంటాయి. తేలికగా జీర్ణం అవుతాయి.

      లావుగా ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల సన్నపడతారు. ఇందుకు ఉదాహరణ మా స్నేహితుడు ఒకప్పుడు 100కేజీల కంటే ఎక్కువ బరువు ఉండేవాడు. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఎలాగైనా బరువు తగ్గాలని కఠినంగా ఆహార నియమాలు పాటించడం మొదలు పెట్టాడు ఒక సంవత్సరం లో బరువు తగ్గి 60కేజీలకు వచ్చేసాడు. ఏ డాక్టర్ ను సంప్రదించలేదు ఏ మందులు వాడలేదు. కేవలం టీవీలో వచ్చే ప్రోగ్రముల్లో ఆరోగ్యకరంగా బరువు తగ్గే విధానాలను చూసి ఆహారంలో మార్పులు చేసుకున్నాడు. రోజుకు 5లీటర్ల నీరు రెండుపూటల ఆహారం మాత్రమే తినడం. అందులో ఒక పూట మొలకలు ఆహారంగా తీసుకునే వాడు. ముడిబియ్యం మాత్రమే తింటాడు. ఎందుకంటే పాలీష్ బియ్యం తింటే షుగర్ వస్తుంది అందులో పోషకాలు కూడా ఉండవు. ఉప్పు, కారం , నూనె, పంచదార తినడు. ఇలా కఠినంగా ఆహార నియమాలు పాటించడం వలన బరువు తగ్గి చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. బరువు తగ్గాలనుకునే వారు ఒక మంచి డైటీషీయన్ ని కలిసి బరువు తగ్గడానికి కావలసిన డైట్ ను తెలుసుకుని ఆహారనియమాలని పాటించడి.



    పెసలు,శనగలు,బెబ్బర్లు వంటి గింజలను విడివిడిగా 12గంటలు నీటిలో నానబెట్టి ఒకరోజు కాటన్ గుడ్డలో మూటకట్టి ఉంచితే మొలకలు వస్తాయి అందులో దానిమ్మ పండు గింజలు వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బరువు తగ్గాలనే వారే కాకుండా ఎవరైనా వీటిని తినొచ్చు. చిన్న పిల్లలకి బయట దొరికే  చిప్స్ , జంక్ ఫుడ్ తినిపించే బదులు మొలకలు తినడం అలవాటు చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఇక మొలకలను ఉదయం, మధ్యాహ్నం వేళల్లోనే తినాలి రాత్రి పూట తినకూడదు.గ్యాస్ ప్రాబ్లెం ఉన్నవారు తినకూడదు.




 
పెసలు,శనగలు,బెబ్బర్లు,అవిశ లు, వంటివి తొందరగా మొలకలు వస్తాయి.








Sprouts maker 

8, మార్చి 2019, శుక్రవారం

రోగుల పట్ల వైద్యుల నిర్లక్ష్యం.

           
         ఏదైనా జబ్బు చేస్తే జబ్బు తగ్గిపోతుందనే ధీమాతో డాక్టర్ వద్దకు వెళ్తాం. అనారోగ్యంగా వెళ్ళి ఆరోగ్యంగా ఇంటికి వస్తాం ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే డాక్టర్లంటేనే భయం వేస్తుంది. ఒక జబ్బు నయం అయ్యింది అనుకొని ఇంటికి వచ్చాక ఇంకో సమస్య మొదలవుతుంది.
ఆపరేషన్ చేసిన తర్వాత కూడా తరచు నొప్పి వస్తుంటే మళ్ళీ ఆసుపత్రికి వెళ్తే అప్పుడు వెలుగు చూస్తున్నాయి దారుణాలు. ఆపరేషన్ చేసిన తర్వాత కడుపులో కత్తెర మర్చిపోవడం, దూది మర్చిపోవడం వంటి సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇవేవో చిన్న ఆసుపత్రిలో జరిగాయి అనుకుంటే పొరపాటే అవి చాలా పెద్ద ఆసుపత్రులే.
            ఒక మహిళకు   ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేసారు. ఇంటికి వెళ్ళిన మహిళ తరచూ కడుపులో నొప్పి వస్తుంటే మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళింది. అక్కడ డాక్టర్లు పరీక్షలు జరిపి కడుపులో కత్తెర ఉన్నదని గుర్తించారు. అదికూడా రెండు మూడు నెలల తర్వాత గుర్తించారు. ఎంత దారుణం ఆపరేషన్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియదా ఇంత నిర్లక్ష్యమా! మనిషి ప్రాణాలంటే అంత చులకన.
       అలాగే మెడిసిన్ ఇచ్చే క్రమంలో కూడా నిర్లక్షమే ఒకదానికి బదులు మరో మెడిసిన్ ఇవ్వడం వల్ల ఇద్దరు చిన్నారుల  ప్రాణాలు  పోయాయి. ఇంకా చాలా మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
   
   డాక్టర్లంటే దేవుళ్ళతో సమానం మీ మీద భరోసాతోనే జనాలు ఆసుపత్రులకు వస్తున్నారు. మీ నిర్లక్ష్య ధోరణితో రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడకండి. డాక్టర్లంటేనే భయం కలిగించేలా ప్రవర్తించకండి. కొందరు చేసిన ఈ నిర్లక్ష్యం కారణంగా మొత్తం వైద్య వృత్తికే చెడ్డపేరు వస్తుంది.
దయచేసి రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడకండి.


ఏదైనా జబ్బు వచ్చి ఆసుపత్రిలో చేరడం కంటే ముందు జాగ్రత్తగా సరైన ఆరోగ్య నియమాలు పాటించి ఆరోగ్యంగా ఉండటం అన్ని విధాల శ్రేయస్కరం..


7, మార్చి 2019, గురువారం

కల్తీలేని ఆహారపదార్థాలు

     

       మనం రోజు ఉపయోగించే నిత్యవసరాల పదార్థలలో కల్తీలేని ఆహారపదార్థం అంటూ ఏది లేదు. పాలు, పప్పు, ఉప్పు ,కారం,కూరగాయలు, పండ్లు ఇలా ఎలాంటి ఆహార పదార్థాలైనా అన్నీ కల్తీయె.
వీటిని తినడం వలన రోగాల పాలవడం గ్యారంటీ. కల్తీ ఆహార పదార్థాలను గుర్తించి వాటిని వాడకపోవడం వంటివి చేస్తున్న అదంతా సమయం డబ్బు వృదా. అనారోగ్యం పాలయ్యి ఆసుపత్రుల చుట్టూ తిరగడం కంటే సహజసిద్దంగా పండించే ఆహారపదార్థాలను తినడం ఉత్తమం.
          సహజసిద్దంగా పండించే ఆహారపదార్థాలు ఎక్కడ దొరుకుతాయంటే ఎక్కడ దొరకవు దొరికిన చాలా తక్కువ కాబట్టి మనమే పండించుకోవాలి.
అదెలాగంటే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తున్న కిచెన్ గార్డెనింగ్ తో. మనకు కావలసిన కూరగాయలు పండ్లు మన ఇంటి పెరట్లో ఉన్న కాస్త స్థలంలో చక్కగా పండించుకోవచ్చు. వీటికి మనం రసాయనాలు వాడము  కేవలం పశువుల పేడ, వర్మీకంపోస్ట్  మాత్రమే వాడుతాం కాబట్టి సహజసిద్దంగా ఉంటాయి. పశువుల పేడ బయట ఎక్కడనుండైనా రైతుల వద్ద నుండి తెచ్చుకోవచ్చు.
వర్మీ కంపోస్ట్ కూడా మార్కెట్లో లభిస్తుంది. లేదా వీలుంటే వంటింటి వ్యర్ధాలతో కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. మనం సొంతంగా పండించుకున్న కూరగాయలు పండ్ల రుచి చాలా బాగుంటుంది. రసాయనాలు వేసి పండించిన వాటికి అంతగా రుచి ఉండదు ఈ విషయం మీరు సొంతంగా పండించుకున్న కూరగాయలు పండ్లు తిన్నప్పుడు గమనిస్తారు. ఇంటి చుట్టు పక్కల మొక్కలు ఉండటం వలన స్వచ్ఛమైన గాలి కూడా లభిస్తుంది.
కూరగాయలు, పండ్ల మొక్కలతో పాటు కొన్ని రకాల ఔషదమొక్కలు పెంచుకుంటే మంచిది అందులో దోమలు రాకుండా చేసే మొక్కలను పెంచుకుంటే ఇంట్లోకి దోమలు దరిచేరవు.

          ఇక పాల విషయానికి వస్తే వీలుంటే ఒక ఆవును పెంచుకోవడం ఉత్తమం. దీనివలన మంచి పాలతో పాటు  పెరటి తోటకు సరిపోయే పేడ లభిస్తుంది.

     వంటనూనెల విషయానికి వస్తే నేరుగా రైతుల వద్ద నుండి వేరుశనగ, నల్లకుసుమలు, నువ్వులు వంటి వాటిని కొనుగోలు చేసి గానుగ పట్టించి వాడితే మంచిది. అలాగే పప్పులు వంటి వాటిని నేరుగా రైతుల వద్ద కొనుగోలు చేయాలి.
ఇలా సాద్యమైనంత వరకు కల్తీ లేకుండా ఆహారపదార్థాలను తీసుకోవడం ఉత్తమం.

అనారోగ్యాల పాలయ్యి ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఆస్తులు గుల్ల చేసుకోవడం కంటే ముందు జాగ్రత్తగా  కొద్దిగా కష్టపడి పైన చెప్పిన విధంగా సహజ ఆహారపదార్థాలను వాడితే ఆరోగ్యంగా ఉండవచ్చు.

               ఆరోగ్యమే మహాభాగ్యం