భానోదయం: రాజకీయం
రాజకీయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రాజకీయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, జులై 2022, సోమవారం

కోనోకార్పస్ లాంటి పనికి రాని మొక్కలు పెంచే కంటే పళ్ళమొక్కలు పెంచవచ్చు కదా..


కోనోకార్పస్ మొక్క







కోనోకార్పస్ మొక్క ఇప్పుడు పల్లెలో, పట్టణాల్లో రోడ్ల వెంబడి విరివిగా కనిపించే మొక్క. అలా నాటించారు మీ పాలకులు...

 నెలల వ్యవధిలోనే ఏపుగా పెరిగుతుంది ఈ మొక్క..
 ఒక్కసారి నాటితే చాలు పెద్దగా దీని సంరక్షణ అంతగా చూసుకోవాల్సిన అవసరం లేకుండా పెరుగుతుంది.

ఇతర మొక్కలైతే ప్రతిరోజు నీరు అందించాలి, పశువులు తినకుండా కాపాడాలి. అందుకే ఈ మొండిజాతి మొక్కలు నాటారు అనిపిస్తుంది..

ఇప్పుడు కోనోకార్పస్ మొక్కలు ఏపుగా పెరిగి రోడ్ల వెంట పచ్చదనంతో నిండిపోయింది.. కాని ఇప్పుడు ఈ మొక్కల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా వీటివల్ల మనుషులకు ఎలర్జీలు వస్తాయని చెబుతున్నారు.
వీటి ఆకులను పశువులు కూడా తినవు, పక్షులు కూడా వీటిపై గూళ్ళు పెట్టవట.. 

ఇది నిజమేనా? అంటే నిజమే అనిపిస్తుంది.. నేను మా ఊరిలో గమనించాను వీటి ఆకులను పశువులు తినడం లేదు, పక్షులు కూడా వీటిపై గూళ్ళు పెట్టడం లేదు.. మనుషులకు ఎలర్జీలు అంటే ఇంకా ఏమి తెలీదు.. చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో..

ఈ మొక్కల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా, వీటివల్ల నష్టాలు ఉన్నాయని తెలిసే వీటిని నాటించారా, లేక తెలియక నాటించారా??

వీటి బదులు పనికి వచ్చే మొక్కలు చాలానే ఉన్నాయి కదా వాటిని పెంచవచ్చుగా..?

ఉదాహరణకు జామ, మామిడి, దానిమ్మ, నిమ్మ, నేరేడు, వేప, చింత, ఇలా చెప్పుకుంటూ పోతే మనకు పనికి వచ్చే మొక్కలు చాలానే ఉన్నాయి అలాంటి మొక్కలను రోడ్లకు ఇరువైపులా పెంచవచ్చు కదా...
వీటివల్ల మనుషులకు చాలా ఉపయోగం ఉంటుంది కదా..

గ్రామాల్లో అభివృద్ధి పనులకు తాగిపడేసిన బీరు సీసాలు, లిక్కరు సీసాలు ఏరుకుని ఆ డబ్బులతో గ్రామంలో అభివృద్ధి పనులు చేయాలని మన గౌరవ మంత్రి గారు సెలవిచ్చారు...

ఇలా తాగి పడేసిన లిక్కరు సీసాలకు బదులు, ఆ పండ్ల మొక్కలు పెంచి వాటి పండ్లను అమ్మి గ్రామంలో అభివృద్ధి పనులు చేయోచ్చు కదా...

ఎందుకు పనికిరాని మొక్కలు పెంచడం ఎందుకు.. పండ్లమొక్కలు, ఔషద మొక్కలు నాటితే ఎంతో ఉపయోగం కదా...

పాలకులు ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేయాలి, ఎలా దోచుకోవాలి అని చూస్తారే తప్ప, ప్రజలకు మంచి చేయాలని చూడరు.. ఇక్కడ రాజకీయాలు ఇంతే...








10, మార్చి 2021, బుధవారం

బంగారు తెలంగాణ కాదు కాలుష్య తెలంగాణ.

        

                మనిషి ప్రశాంతంగా,ఆరోగ్యంగా బ్రతకాలంటే స్వచ్ఛమైన గాలి,నీరు ఎంతో అవసరం. స్వచ్ఛమైన గాలి,నీరు ఎక్కడ లభిస్తుంది అంటే పల్లెటూర్లో లభిస్తుంది అని అందరూ చెబుతారు. ఎందుకంటే పట‌్ట‌ణాల్లో గాలి,నీటి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. పట‌్ట‌ణాల్లో,నగరాల్లో నివసించే ప్రజలు వారాంతాల్లో నగర కాలుష్యానికి దూరంగా పల్లెల వైపు వచ్చి స్వచ్ఛమైన గాలిని, వాతావరణాన్ని ఆస్వాదిస్తుం‌టారు.  పల్లెటూళ్ళంటే పచ్చని ప్రకృతితో, స్వచ్చమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో కళకళలాడుతూ ఉండేవి.  ఉండేవి అని ఎందుకన్నానంటే అది గతంలో ఇప్పుడు కాదు. ఎందుకంటే  ఇప్పుడు        పల్లెటూళ్ళు కాలుష్యంలో  పట‌్ట‌ణాలతో పోటీ పడుతున్నాయి. ఇప్పుడు కాలుష్యంలో పట‌్నంకు, పల్లెకు తేడా లేదు. 

               

              ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంతో కళకళలాడుతూ ఉండే పల్లెల్లో ఇప్పుడు కాలుష్యంతో విలవిల ాడుతున్నాయి. పట‌్ట‌ణాల్లో  వాహనాల పొగ, ప్లాస్టిక్ వ్యర్ధాలు, డ్రైనేజీల వలన కాలుష్యాం ఏర్పడుతుంది. ఇక్కడ ప్రజలు ఎక్కువగా చదువుకున్న వాళ్ళే ఉం‌టారు. వీరికి కాలుష్యం పట‌్ల అవగాహన కూడా ఉంటుంది. అయిన పర్యావరణ కాలుష్యం గురించి ఎవ్వరూ పట్టించుకోరు. అందువలన పట‌్ట‌ణాలెప్పుడు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు పల్లెలు కూడా కాలుష్యంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ముఖ్యంగా గాలి కాలుష్యం విపరీతంగాపెరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాల గురించి చదువుకున్న వాళ్ళే పట‌్టించుకోరు. ఇక పల్లెల్లో ఉండే చదువుకోని ప్రజలకు ఎలాంటి అవగాహన ఉండదు. అందువల్ల పల్లెల్లో కాలుష్యం పెరిగిపోయింది. ముఖ్యంగా గాలి  కాలుష్యం పెరిగిపోయింది. ఎలా అంటే ప్లాస్టిక్ వ్యర్ధాలను తగల పెట‌్ట‌డం వలన గాలి కాలుష్యం ఎక్కువగా ఉంది.  ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వాడకం విపరీతంగాపెరిగిపోయింది. క్యారీబ్యాగ్, కూల్ డ్రింక్స్ బాటిల్స్, ఫుడ్ ప్యాకింగ్ కవర్స్,    ప్లాస్టిక్ విస్తరాకులు, చిప్స్ ప్యాకెట్స్ ఇలా అన్ని ప్లాస్టిక్ మయమే వీటిని వాడిన తర్వాత ఒక దగ్గర వేసి కాల్చి వేస్తున్నారు. దీని వలన ఏర్పడిన పొగ వలన పర్యావరణ ానికి ఎంత ప్రమాదమో వారికి తెలియదు, ఆ పొగ పీల్చటం వలన ఎలాంటి అనారోగ్యాలు వస్తాయో వారికి తెలియదు. ఇది తెలియక చాలామంది ప్లాస్టిక్ వ్యర్ధాలను తగలబెడుతుంట ారు. ఇదివరకు ఎవరి ఇళ్ళముందు వారు తగలబెట్టెవారు. దీని వలన కొంత సమయం గాలి కాలుష్యం ఆ చుట్టు పక్కల ఉండేది. కానీ ఇప్పుడు  ఈ గాలి కాలుష్యం, పొగ రోజంతా పల్లెలను పట్టి పీడిస్తోంది. ఇలా రోజంతా గాలి కాలుష్యం, పొగ రావడానికి కారణం ప్రభుత్వాల అతి తెలివి వల్ల నేడు గ్రామాల్లో వాయు కాలుష్యం పెరిగిపోయింది.


              ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లో ఇంటింటికి వచ్చి చెత్త సేకరించే కార్యక్రమం నడుస్తుంది. తడిచెత్త, పొడి చెత్త వేరు వేరుగా సేకరించాలని కొన్ని గ్రామాల్లో రెండు చెత్త బుట్టలను ఇవ్వడం జరిగింది. తడి చెత్త, పొడి చెత్త గురించి అవగాహన కల్పించారు. ఇక్కడ వరకు ప్రభుత్వం చేసిన పని మెచ్చుకోదగ్గ విషయమే. కానీ ఈ చెత్త డబ్బాలు కొన్ని గ్రామాల్లోనే ఇచ్చారు. చాలా గ్రామాల్లో ఇవి ఇవ్వలేదు. సరే ఇవ్వలేకున్నా సరే మేమే తెచ్చుకుంటాం చెత్తను   వేరు చేసి ఇస్తాం ఈ చెత్తను ప్రభుత్వం ఏమి చేయాలి? పర్యావరణ ానికి హాని కలిగించకుండా రీసైక్లింగ్ చేయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా తడి చెత్త, పొడి చెత్త , ఆ చెత్త ఈ చెత్త అని తెడా లేదు అన్ని చెత్తలు ఒకటే అన్నట‌్టు ఒకే చోట‌ వేస్తున్నారు. ఈ చెత్త  సేకరించే వారు ఉదయం ఒక ట‌్రాక్ట‌ర్ తో గ్రామంలో మొత్తం తిరిగి అన్ని రకాల చెత్తలు అందులో వేసుకుని ఊరి బయట‌ ఉన్న చెత్త డంప్ యార్డ్ లో వేస్తున్నారు.  ఇక్కడ వరకు బాగానే ఉంది కదా?  తెలంగాణ గ్రామాలు దీని వలన స్వచ్ఛంగా వెలిగిపోతున్నాయి అని మీరు అనొచ్చు, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం అని కూడా అనొచ్చు. కాని నేను మాత్రం ఇది పరమ దరిద్రమైన చెత్త పని అని అంటాను.... ఎందుకంటే ఒకపని చేస్తే ప్రజలకు మేలు కలగాలి కాని ఈ చెత్త సేకరించే పని వలన ప్రజలకు నష్ట‌మే తప్ప మేలు జరగడం లేదు.


           ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లో చెత్త డంప్ యార్డులు నిర్మించారు. దాంట‌్లో చెత్తను వేరు చేయడానికి అన్నట‌్టు చిన్న చిన్న గదులు నిర్మించారు. అందులో  గ్రామాల్లో సేకరించిన చెత్తను వేరు చేసి రీసైక్లింగ్ చేయాలి. కానీ ఇప్పడు ఏం చేస్తున్నారంటే డంపు యార్డ్ ముందు ఒక పెద్ద గుంత తీసి గ్రామంలో సేకరించిన చెత్తను అందులో వేసి తగలబెడుతున్నారు. దీని వలన 24/7 365 రోజులు అది మండుతూనే ఉంటుంది. ఆ పొగ పగటి పూట‌ పైకి వెళుతుంది. అప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. కాని సాయంత్రం పూట‌ చుట్టు పక్కల మొత్తం పొగతో నిండిపోయి నరకం కనిపిస్తుంది. గాలి పీల్చాం‌టేనే భయం వేస్తుంది. దగ్గు, ఆయాసం, కళ్ళ మంట‌లు నరకయాతన.

       అసలు ప్రభుత్వాలకు ఇలాంటి చెత్త ఐడియాలు ఎందుకొస్తాయో..? 😭😭😭 మా గ్రామంలో అయితే సాయంత్రం అయ్యిందం‌టే చాలు ఈ చెత్త డంపు యార్డ్ వల్ల దానికి దగ్గరగా ఉన్న ఇళ్ళ ప్రజలు    చాలా ఇబ్బంది పడుతున్నారు.. అందుకు ఉదాహరణ నేనే... సాయంత్రం నుండి ఉదయం వరకు ఆ పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్నా. నా పక్కన ఎవరైన సిగరెట‌్ తాగితేనే నాకు పడదు అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతాను. అలాంటిది లక్షల సిగరెట్లు  కాల్చినంత పొగ వస్తే ఏం చేయాలి. ఉపాది లేక  దశాబ్దం పాటు ఊరు వదిలి వెళ్ళిపోయాం.అక్కడ నానా కష్టాలు పడ్డాం. తెలంగాణ వచ్చాక మన బతుకులు బాగు పడతాయని సొంత ఊరికి వస్తే ఇక్కడేమే స్వచ్చమైన గాలి కూడా లభించడం లేదు. ఇదేనా బంగారు తెలంగాణ అంటే.????

        బంగారు తెలంగాణ ఎవరికి అయ్యిందో అందరికి తెలిసిందే. ఒక కుటుంబం బాగు పడితే చాలా...???


ఇది చాలా చిన్న సమస్య ఇంత పెద్ద రాద్దాంతం చేయడం అవసరమా అని మీరు అనొచ్చు. ఆ కష్టం అనుభవించిన వాడికే తెలుస్తుంది ఆ భాదేమిటో.  ఎక్కడైన పొగ వస్తేనే అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతాం అలాంటిది మన ఇంటికి దగ్గర 24 గంట‌లు పొగ అది కూడా ప్లాస్టిక్ ను తగలబెట్టిన పొగ వస్తే ఎలా ఉం‌టుందో ఆలోచించండి. ఇలాంటి కలుషితమైన గాలిని పీల్చి అనారోగ్యాల పాలయితే ఆసుపత్రుల చుట‌్టు తిరిగే స్తోమత మాకు లేదు. నాకు ఆసుపత్రులంటే మహా భయం.. అక్కడకు వెళ్ళాలంటే ఇంట‌్లో డబ్బులు కాసే చెట్లు ఉండాలి. అయినా ఆసుపత్రుల చుట‌్ట‌్టు తిరగడం కం‌టే ఆరోగ్యంగా ఉండట‌మే మేలు కదా..  


            కెసిఆర్ సార్ అంటే నాకు ఎంతో అభిమానం... నా చుట్టూ ఉండే వాళ్ళు ఎందరు కెసిఆర్ సార్ ను విమర్శించిన

 సార్ గొప్పవాడు  విమర్శించడం తప్పు అనేవాడిని . నేనే తప్పు అని ఇప్పుడు అర్థం అయ్యింది.. ఒక పని చేసే ట‌ప్పుడు అది పూర్తిగా  అమలు జరిగేలా చూడాలి అది వారి బాధ్యత. కాని ఆ పనిని  సగంలోనే వదిలేస్తే   బాధ్యతారాహిత్యం అంటారు.. ఈ చెత్త డంప్ యార్డులు ఎందుకు కట‌్ట‌డం జరిగింది అక్కడ జరుగుతున్నదేమిటి. అది పూర్తిగా నిర్దేశించిన పని జరుగుతుందా లేదా అనే బాధ్యత ప్రభుత్వానికి లేదా....??  కెసిఆర్ సార్ బంగారు తెలంగాణ అంటాడు సార్ మాకు బంగారు తెలంగాణ అవసరం లేదు. మాకు స్వచ్చమైన గాలి కూడా లభించడం లేదు నీ బంగారు తెలంగాణలో...


నా తెలంగాణ ఇప్పుడు కాలుష్యానికి చిరునామా. 

కెసిఆర్ సారూ నీకు కోటి దండాలు...🙏🙏🙏🙏🙏🙏

మీరు ఈ రాష్ట‌్రాన్ని బంగారు తెలంగాణ చేయకపోయిన పరవలేదు కానీ కాలుష్య తెలంగాణగా మాత్రం చేయకండి..


ఇక చివరగా ఒక మాట‌.. కెసిఆర్ సార్ చెప్పిన బంగారు తెలంగాణ ఎక్కడుందంటే ఆయన ఫామ్ హౌస్ లో ఉంది మంచి ఆహ్లాదకరమైన వాతావరణం హాయిగా ఆయన నివసిస్తున్నారు. సార్..... మీరు ముఖ్యమంత్రి అయ్యింది మీ కు‌టుంబం మాత్రమే హాయిగా ప్రశాంతంగా,ఆరోగ్యంగా జీవించడానికి కాదు. తెలంగాణ ప్రజలు హాయిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించాలి. దాన్ని అం‌టారు బంగారు తెలంగాణ అని.. నీ ఫామ్ హౌస్ పక్కన ఒక చెత్త డంపు యార్డ్ ఉండి ఊరి చెత్తనంతా అక్కడ వేసి తగలబెడితే తేలుస్తుంది మా బాధేమిటో. ఈ మాట‌ మీకు కోపం కలిగిస్తే, మాట‌ అన్నందుకే మీకు కోపం వస్తే మీరు గ్రామాల్లో కట‌్టించిన చెత్త డంపు యార్డుల   పొగ వల్ల నరకం అనుభవిస్తున్న మాకు ఎంత రావాలి మీపై కోపం..😠😠😠😠😠😠😠😠😠😠


ఇంకా చాలా అక్రమాలు జరుగుతున్నాయి.  కొండలు తవ్వేయడం, పచ్చని పంట‌ పొలాల్లో కంపెనీలు,  వెంచర్లు వేయడం వలన పర్యావరణం నాశనం అవుతుంది.. ఇక ఒకప్పుడు హైదరాబాద్ తాగునీటీ అవసరాలు తీర్చిన జంట‌ జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు కాలుష్యం కాకుండా 111 జీవో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఇప్పడు కెసిఆర్ ప్రభుత్వం వచ్చింది కదా బంగారు తెలంగాణ చేయాలి కదా ... అందుకే కెసిఆర్ సార్ 111 జీవోను కూడా ఎత్తి పడేస్తా అని చెప్పాడు.. నాకు తెలుసి కెసిఆర్ సార్  తెలంగాణ రాష్ట‌్రాన్ని కాలుష్యంగా మార్చడానికే కంకణం కట‌్టుకున్నట్టున్నాడు..

ఈ రెండు జలాశయను కూడా హూస్సేన్ సాగర్ లాగా  సుగంధభరితమైన జలాశయాలుగా మార్చాలనుకుంటున్నాడు. సారూ మీరు బంగారు తెలంగాణ చేస్తాను అం‌టే ఈ విధంగా చేస్తావనుకోలేదు..

సారూ కెసిఆరూ ఇలాంటి బంగారు తెలంగాణ మాకు వద్దు..... నీకు కోటి దండాలు...🙏🙏🙏🙏🙏🙏��











              






                 












          

11, సెప్టెంబర్ 2019, బుధవారం

హైదరాబాద్ ను దేశ రెండో రాజధానిగా చేస్తే ఎం జరుగుతుంది.




   
హైదరాబాద్ ను  ఈ దేశానికి రెండో రాజధానిగా చేస‌్తే ఏం జరుగుతుంది.

డిల్లీ తరహాలో మరో రాష్ట్రంగా ఏర్పడుతుందా?

అలాగే గవర్నర్,ముఖ్యమంత్రులతో కూడిన అసెంబ్లీ ఏర్పడనుందా?

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగిస్తారా? లేదా వేరే ఇతర నగరాన్ని రాజధానిగా చేస్తారా?



   




హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేస‌్తే ఇక్కడ పార్లమెంటు ను ఏర్పాటు చేసి పరిపాలన చేస్తారా?
సంవత్సరం లో ఆరు నెలలు డిల్లీ నుండి ఆరునెలలు హైదరాబాద్ నుండి పరిపాలన చేస్తారా?

హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేస‌్తే ప్రయోజనం ఏమిటి?

హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఏమవుతుంది?

అసలు ఎందుకు హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా లేదా కేంద్రపాలిత ప్రాంతం చేయాలనుకుంటున్నారు.







12, జూన్ 2019, బుధవారం

బోరున విలపిస్తున్న ప్రజలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు

     


           అయ్యా చంద్రబాబు మీరు లేకపోతే ఎట్లాగయ్యా మా బతుకులు దుర్భరంగా తయారయ్యాయి. అన్నదాత సుఖీభవ రద్దు చేశామంటున్నారు. రుణమాఫీ చేయమంటున్నారు ఇట్లగయితే మేం ఎలా వ్యవసాయం చేసేది అంటూ రైతులు  చంద్రబాబు వద్ద గొల్లున ఏడుస్తున్నారు. అయ్యా చంద్రబాబు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు భూములరేట్లు పడిపోయాయి ఇలాగయితే మేం బతికెదెట్ల అంటూ
రాజధాని చుట్టు పక్కల ప్రాంత ప్రజలు చంద్రబాబు వద్ద వాపోతున్నారు.

     సార్ చంద్రబాబు గారు మిమ్మల్ని చూసే మేము బీటెక్ చదువుకున్నాం రెపోమాపో జాబ్ వస్తుంది అనుకున్నాం. కాని ఇప్పుడు పరిస్థితి చూస్తే  మాకు జాబు వచ్చేలా లేదు అంటూ నిరుద్యోగులు బోరున విలపిస్తున్నారు. అయ్యా చంద్రబాబు గారు మిమ్మల్ని ఆధర్శంగా తీసుకునే మా పిల్లల్ని చదివిస్తున్నాం ఇప్పుడు వాళ్ళ భవిష్యత్ ఏంటీ? మీరు ఓడిపోయిన తర్వాత ఇక ఇక్కడికి సాఫ్ట్వేర్ కంపెనీలు రావట, ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతాయట ఇలాగయితే మా పిల్లల భవిష్యత్ ఏంటని చంద్రబాబు గారి వద్ద పిల్లల తల్లిదండ్రులు బోరున విలపించారట. రైతులు, రాజధాని ప్రాంత ప్రజలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకుని తమ కష్టాలను చెప్పుకుని బోరున విలపించారు.

బాబుగారు...

మళ్ళీ మీరొస్తేనే భూముల రేట్లు పెరుగుతాయి, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి,
 కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి,

 రైతులకు అన్నదాత సుఖీభవ వస్తుంది,
రైతులకు రుణమాఫీ అవుతుంది,

మా పిల్లల భవిష్యత్ బాగుంటుంది మళ్ళీ మీరే ముఖ్యమంత్రి కావాలని, తమ కష్టాలను తీర్చాలని ప్రజలు నిన్న  చంద్రబాబు వద్ద బోరున విలపించారట.

9, జూన్ 2019, ఆదివారం

పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి కారణం 150 కోట్లు.

 

     పవన్ ఓడిపోవడానికి ముఖ్య కారణం 150 కోట్ల డబ్బు అంట. ఇది ఎవరో  అన్నది కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే అన్నారు.   150 కోట్లు ఉంటే చాలు ఎన్నికల్లో ప్రత్యర్థిని ఓడించవచ్చని మనం అనుకోవాలా? అంటే జనానికి ఎవరు డబ్బులు ఇస్తే వారికే ఓటు వేస్తారా?  తమకు సరియైన నాయకుడు ఎవరన్నది ప్రజలకు తెలియదని పవన్ అభిప్రాయమా.? ఈ రోజుల్లో ఏ ఓటరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని డబ్బులు పంచిన తమకు సరియైన నాయకుడు ఎవరో వారికే ఓటు వేస్తారు కాని ఎవరు డబ్బులకు, మందుకు ఆశపడి ఓటు వేయరు. అది పవనాలు సార్ కి తెలుసుకోలేక పోతున్నారు. పవన్ అన్నట్టు భీమవరంలో 150 కోట్ల డబ్బులు పంచి తనను ఓడించారని అంటున్నాడు. మరీ గాజువాక లో ఎందుకు ఓడారు అక్కడ ఎన్ని డబ్బులు పంచారు. ఓడిపోయాడు ఏదో కారణం చెప్పాలి అందుకని 150 కోట్లు ఖర్చు చేసి భీమవరంలో తనను వైసీపి ఓడించిందని చెబుతున్నాడు. అంటే పవన్ దృష్టిలో డబ్బులు ఉంటే చాలు ఎన్నికల్లో గెలవచ్చని అర్థమా? . పవన్ దగ్గర డబ్బు ఉంటే ఈ ఎన్నికల్లో గెలిచే వాడేమో!
     
                      తెలుగు రాష్ట్రాలల్లో  పెద్ద సెలెబ్రెటీ, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సొంత పార్టీ స్థాపించి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటి చేస్తే 150  కోట్ల రూపాయలతో ఓడించేస్తే, సామాన్య  ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించడానికి 10 కోట్లు చాలేమే. ఈ లెక్కన చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ సీట్లు గెలవడానికి 2050 కోట్లు ఉంటే చాలు  పవన్ సార్ ఈజీగా గెలిచేవాడేమో. సార్ పవన్ కళ్యాణ్ గారు మీరన్నట్టు డబ్బులు పంచితేనే ఎన్నికల్లో గెలుస్తారనుకుంటే వచ్చే ఎన్నికల్లో మీరు రెండు వేలకోట్లతో పాటు అవతలి పార్టీ వాళ్ళు కూడా డబ్బులు పంచుతారు కాబట్టి దానికి ఇంకో వెయ్యికోట్లు ఎక్కువ మీరు ఖర్చు చేయాల్సి వస్తుంది మరియు ఎన్నికలకు ఇంకా ఐదేళ్ళు సమయం ఉంది కాబట్టి ఖర్చులు పెరిగిపోతాయి అందుకని జనాలకు ఇప్పుడిచ్చే దానికి రెట్టింపు డబ్బులు పంచాలి. లేదంటే ఎవరు ఎక్కవ పంచితే వారికి ఓటేస్తారు. కాబట్టి మొత్తంగా రౌండ్ ఫీగర్ ఓ 5 వేలకోట్లు సిద్ధం చేసుకోండి. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మీరే గెలుస్తారు ముఖ్యమంత్రి అవుతారు. ఇది నేనన్న మాట కాదు మీరే అన్న మాట డబ్బులు పంచి నన్ను ఓడించారని అన్నారు. అందుకని నేను చెబుతున్నాను మీరు కూడా ఒక చోట కూర్చుని డబ్బులు పంచండి మీరే ముఖ్యమంత్రి అవుతారు.


       ఇప్పుడు ఓటర్లకు కావాలసింది సరైనా పాలన అందించే నాయకుడు కాదు ఎవరు ఎక్కువ డబ్బులు పంచితే వారినే ఎన్నికల్లో గెలిపిస్తున్నారు    అనే పవన్ అభిప్రాయం ప్రకారం  తెలంగాణలో కెసీఆర్ కేంద్రంలో మోడి ఇలా డబ్బులు పంచే అధికారంలోకి వచ్చారా??  అని అనుకోవాలా ఈ లెక్కన ఆంధ్రాలో చంద్రబాబు కూడా  ఎన్నికలకు కొన్ని నెలలముందు పథకాల పేరుతో అధికారికంగా డబ్బులు పంచారు. అయినా ఘోరంగా ఓడిపోయారు. మరీ ఇక్కడ డబ్బు ప్రభావం ఎందుకు పనిచేయలేదు? పవన్ సార్ సమాధానం చెప్పాలి..


               
                  కేవలం డబ్బులు పంపిణీ చేస్తే ఎన్నికల్లో గెలుస్తారనుకోవడం పవన్ ఆజ్ఞానానికి నిదర్శనం.
ఈ రోజుల్లో ఓటర్లు అమాయకులేం కారు  ఎవరు సమర్థవంతమైన నాయకులో వారికి తెలుసు గతంలో వారు ఏం చేసారు, వారి కుటుంబం ఎలాంటిది, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారా, తమ సమస్యలను పరిష్కరించగలడా లేదా అని చూస్తారు. అంతేకాని ఎవడో  రెండు వేలు నోటు చేతిలో పెడితే ఓటు వేయరు. అలా అంటే డబ్బు ఉన్న ప్రతోడు ఎన్నికల్లో గెలుస్తాడు.
 పవన్ సార్.... డబ్బులు పంచి జగన్ ఎన్నికల్లో   గెలవలేదు. గతంలో ఆయన తండ్రిగారి పాలన చూసి గెలిపించారు. రాష్ట్రంలో సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేసి జనంతో మమేకమై గెలిచాడు. తన తండ్రిలాగా పాలన చేస్తానని చెప్పి గెలిచాడు. మీకోసం నెనున్నాను అని భరోస ఇచ్చి గెలిచాడు.అంతేకాని డబ్బులు పంచి అధికారంలోకి రాలేదు. జగన్ అవినీతి పరుడు లక్షలకోట్లు సంపాదించాడని అంటున్నారు అన్ని కోట్లు ఉన్న వ్యక్తి డబ్బులు పంచి ఈజీగా గెలవచ్చంటే  2014 ఎందుకు ఓడిపోయారు.?
పవన్ సార్ ఎన్నికల్లో గెలవాలంటే కావల్సింది డబ్బులు కాదు సార్ జనానికి నేనున్నానే భరోస ఇవ్వాలి. సమర్థవంతంగా పాలించగలడనే నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకాన్ని ఈ సారి జగన్ కలిగించాడు గెలిచాడు. జగనన్న జగనన్న జనమంతా నీవెంటే అన్నారు ముఖ్యమంత్రిని చేసారు. నీవు కూడా పవనన్న పవన్న ప్రజలంతా నీవెంటే అనేలా చేయి అప్పుడు నిన్ను గెలిపిస్తారు. అయనా కష్టమే ఎందుకంటే జగన్ లాంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకో నాయకుడు ఎందుకు అని ప్రజలు భావిస్తున్నారు. అయినా అన్న చిరంజీవి గారు కూడా పార్టీని స్థాపించి కాంగ్రెస్ లో విలీనం చేసినప్పడే సినిమా వాళ్ళ మీద నమ్మకం పోయింది జనాలకి. ఇప్పుడు ఆయన స్వంత తమ్ముడైనా పవన్ ను నమ్మాలంటే కష్టమేమరీ. నమ్మి గెలిపిస్తే మళ్ళీ ఏ పార్టీలోనైనా విలీనం చేసేస్తడేమేనని జనాల భయం కాబట్టి పవన్ ని జనాలు ఇప్పట్లో నమ్మరు.... 

     
     ఇప్పుడు చెప్పండి పవన్ ఓడిపోవడానికి కారణం 150 కోట్ల లేదా  తనపై జనాలకు లేని విశ్వసనీయత వల్లన. ఆయనే తెలుసుకోవాలి.. కేవలం డబ్బు  పంచితేనే గెలుస్తారనుకుంటే ఎప్పటికి పవన్ గెలవలేరు. పైగా జనాలను నోటుకు ఓటు వేస్తారనడం వలన  పవన్ ను ప్రజలు హీనంగా చూసే పరిస్థితి వస్తుంది.

31, మే 2019, శుక్రవారం

ఒక్క మాటతో ఏడు ఎం.పీ సీట్లు పోగొట్టుకున్న కెసీఆర్.




ఒక్క మాటతో ఏడు ఎం.పీ సీట్లు  పోగొట్టుకున్న
కెసీఆర్.

   తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏక పక్షంగా కేసీఆర్ కే మళ్ళీ పట్టం కట్టారు ప్రజలు. 89 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కూడా టిఆర్ఎస్ లో చేరిపోయారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ఎదురులేని విధంగా తయారయింది పరీస్థితి. ఇక రానున్న ఎంపీ ఎలక్షన్లలో 17  సీట్లకు 16  సీట్లు మనమే గెలుస్తాం అనే ధీమాలో ఉన్నారు కేసీఆర్,ఆ పార్టీ నాయకులు. కారు+సారు+సర్కారు=పదహారు అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు ఆపార్టీ నాయకులు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలిచి అలాగే ఓవైసీ సపోర్టు ఎలాగు ఉంటుంది మొత్తం 17 సీట్లు. ఇక ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీ గెలిచే ఎంపీ సీట్ల సపోర్ట్ తో కేంద్రంలో చక్రం తిప్పుదామనుకున్నారు కెసీఆర్ సార్. కేంద్రంలో ఏ పార్టీకి స్వంతంగా  ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని అనుకున్నాడు. ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఏకంగా ప్రధానమంత్రి అవుదామని కలలు కన్నారు కెసీఆర్ సారు.

            ఇక  దేశంలో ఎంపీ ఎలక్షన్స్ తేది ఖరారయ్యింది. అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. టిఆర్ఎస్ పార్టీ గెలుపు ధీమాతో ప్రచారంలోకి దిగింది. అసెంబ్లీ ఫలితాలే పార్లమెంటులో కూడా వస్తాయని ధీమాతో ఉన్నారు. కారు సార్ సర్కారు పదహారు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. ఇక పార్టీ ముఖ్యమంత్రి కెసీఆర్ సభలలో  ఇతర పార్టీల నాయకులపై ముఖ్యంగా బిజేపి నేతలపై తనదైన శైలిలో విరుచుకు పడ్డారు. ఎలాగు గెలుపు తమదే అని విజయగర్వంతో బిజేపి నేతలపై మీరేనా హిందువులు మేము కదా అంటు విరుచుకుపడ్డారు. మార్చి 17 న కరీంనగర్ సభలో బిజేపి నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తూ  "హిందూ గాళ్ళు బొందు గాళ్ళు" అంటూ వ్యాఖ్యానించారు.
ఈ ఒక్క మాటతో  అప్పటి వరకు కెసీఆర్ కు ఉన్న ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకున్నాడు. కేసిఆర్ హిందు వ్యతిరేకి అంటు జనంలో బలంగా నాటుకు పోయింది.  ఈ వ్యాఖ్యలపై కెసీఆర్ అంత సీరియస్ గా తీసుకోలేదు. ఎన్నికలు ముగిసాయి. అప్పటికి 16 సీట్లు మనవే అనుకున్నారు కెసీఆర్. ఇక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి తీరా ఫలితాలు చూస్తే ఏమయ్యింది సారుకు పదహారు కాదు అందులో సగమే వచ్చాయి. అందరూ షాక్ ఎందుకంటే టిఆర్ఎస్ కు సగం సీట్లు వచ్చినందుకు కాదు రాష్ట్రంలో బిజేపి ఉనికే లేకుండా పోయిందనుకున్నారు. కాని ఈ సారీ బిజేపికి 4 సీట్లు గెలుచుకుని అందరిని ఆశ్ఛర్యపరిచింది. స్వయాన ముఖ్యమంత్రి కుమార్తె సైతం బిజేపి అభ్యర్తి చేతిలో ఓడిపోయింది. మరో మూడు సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. మల్కజ్ గిరిలో రేవంత్ రెడ్డి గెలవడం కూడా కెసీఆర్ పట్ల జనాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని అర్థమవుతోంది.  జనాల్లో కెసీఆర్ పట్ల వ్యతిరేకత రావడానికి ముఖ్య కారణం హిందూ గాళ్ళు బొందు గాళ్ళు అంటూ వ్యాఖ్యానించడం. ఇంకా ముఖ్యమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల గురించి ఎక్కడ ప్రస్తావించక పోవడం. ఇప్పటీకి కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గురించి ఉలుకు లేదు పలుకు లేదు. కెసీఆర్ గారు ఇలాగే ఉంటే ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపి అధికారంలోకి వచ్చిన ఆశ్ఛర్యపోవలసిన పనిలేదు.

               కేంద్రంలో మోది మళ్ళీ అధికారంలోకి రాడని అందరు అనుకున్నారు అన్నిపార్టీలు ఏకమై మోది పై విరుచుకు పడ్డారు. ఎన్ని పార్టీలు ఏకమైన ప్రజలు అందరు ఏకమై మోదికి మళ్ళీ అధికారం కట్టబెట్టారు. ఈ దేశానికి మోది లాంటి నాయకుడే సరియైన వాడని ఈ దేశప్రజలు గట్టిగా నమ్మారు మోదినే ప్రధానిని చేసారు. బిజేపి అంతమైపోతుందని అనుకునే రాష్ట్రంలో ఊహించిన దానికంటే ఎక్కవ సీట్లు సాధించిందటే దానికి కారణం మోది. ఎవరు ఏమనుకున్నా బిజెపీ హిందూ పార్టీ అని చెప్పుకోవచ్చు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఈ దేశ ప్రజలు ఊరుకోరని ఈ పార్లమొంటు ఎన్నికల్లో తెలంగాణ ఫలితాల్లో నిరూపితమయ్యింది.
    ఈ దేశం లౌకిక దేశమే అలాగే హిందు ప్రధానదేశం. ఇతర మతాలను హిందు మతం గౌరవిస్తుంది.

30, మే 2019, గురువారం

ఖజానా ఖాళీ చేసిన బాబు గారు.

ఖజానా ఖాళీ చేసిన బాబు గారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఖజానాలో ఉన్న డబ్బు 100 కోట్లు మాత్రమే. ఈ నెల కావలసింది 5000 కోట్లు.
కొత్త ముఖ్యమంత్రి లోటు బడ్జెట్ తో ఈ నెల ఉద్యోగులకు జీతాలు ఎలా చెల్లిస్తారు. సంక్షేమ పథకాలు ఎలా అందిస్తారని రాస్తున్నారు. సరే అదే మళ్ళీ బాబు గారే ముఖ్యమంత్రిగా గెలిస్తే ఇలా ఖజానా గురించి రాసేవారా. అంటే జగన్ ఇలాంటి ఆర్థిక పరిస్తితులలో రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కించగలడని పరోక్షంగా బాబుగారి పత్రికలు రాస్తున్నాయి.

     కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి జగన్ ఎలా ఈ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతారు. చంద్రబాబు గారు ఎన్నికలకు ముందే ఖజానా మొత్తం ఖాళీ చేసారు. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న నాలుగున్నర ఏళ్ళలో గుర్తుకు రాని ఆడపడుచులు, రైతులు ఎన్నికలకు నాలుగు నెలల ముందు వారిపై ఎనలేని ప్రేమ ముంచుకొచ్చింది. ఖజానాలో ఉన్న కాస్త డబ్బును ఆడపడుచులకు, రైతులకు పంపిణీ చేసాడు . ఎలాగు గెలవనని బాబు గారికి తెలిసిపోయింది అందుకే ఖజానా మొత్తం ఖాళీ చేసాడు. కొత్త ముఖ్యమంత్రికి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యేలా చేసాడు...
ఇలాంటి ఆర్థిక పరిస్థితులలో బాబుగారే రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలడని అందరూ అనుకుంటారని బాబుగారి ఆలోచన.


24, మే 2019, శుక్రవారం

ఓడిన వారి పరిస్థితి ఏంటి..??


     
    ఎన్నికల్లో  గెలిచిన జగన్ సీఎం అవుతారు, నరేంద్ర మోడి పీఎం అవుతారు. మరీ ఓడిన వారి పరిస్థితి ఏంటి..


     ఆంద్రప్రదేశ్ లో జగన్ ప్రభంజనంలో చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ఘోరంగా ఓడిపోయారు
ఈవిఎమ్ మిషన్ ల వల్లే తాము ఓడిపోయామని  చంద్రబాబు అనుమానం. ఎందుకంటే ఎన్నికల కంటే ముందునుండే చంద్రబాబు ఈవిఎమ్ మిషన్ లను వ్యతిరేకిస్తూ వచ్చాడు. జనాల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు ఈవిఎమ్ లు పెట్టిన బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగిన ఎలా గెలుస్తారు. చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో అన్ని సగం సగం పనులే. ఐదేళ్ళు చేయలేని పనులు ఎన్నికలు దగ్గర పడగానే రైతులకు , ఆడపడుచులకు ఎవో కొన్ని తాయిలాలు ఇస్తే తనను మళ్ళీ గెలిపిస్తారని బాబు ఐడియా. జనాలు వెర్రి వాళ్ళ ఏంటి? ఇచ్చింది పుచ్చుకుని బాబుకు తగిన బుద్ది చెప్పారు.
ఐదేళ్ళు పట్టించుకోకుండా ఎన్నికలకు ముందు ప్రేమ ఒలకబోస్తే ఎవరు నమ్ముతారు.? అందుకే బై బై బాబు అంటు ఇంటికి పంపారు.?
పైగా కేంద్రంలో చక్రం తిప్పుదామనుకున్నాడు కాని రాష్ట్రంలోనే సైకిల్ ఫంక్చర్ అయ్యే ఇకా చేసేదేముంది  సైకిల్ చక్రాలు పీకి మనవడితో ఆడుకుంటాడు... అని జనాలు అనుకుంటున్నారు..
 
పవన్ కళ్యాణ్ పరిస్థితి మరీ ధారుణం ఛాయ్ పోయక ముందే గ్లాస్ పగిలిపాయే..  తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన పేరు చెప్పుకుని ఎమ్మెల్యేగా నిలడితే కళ్ళుముసుకుని గెలిచేంత పవర్ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి స్వయంగా ఎన్నికల్లో  ఎమ్మెల్యేగా నిలబడితే ఘోరంగా ఓడిపోవడం శ్చర్యం వేస్తుంది. ఒకచోట కాదు  రెండు చోట్ల ఓడిపోవడం ఇంకా ఆశ్చర్యం...
   పవన్ సార్ కి తెలియదు ఈలలు గోలలు వేసినంత ఈజీగా ఓట్లు పడవని. ఇంకా నయం ఒక్క సీటు గెలుచుకుని ఇజ్జత్ కాపాడుకున్నాడు.
ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్  తన పార్టీ గెలిచే సీట్లతో చక్రం తిప్పుదామనుకున్నాడు. కర్ణాటకలో కుమారస్వామిలాగా కింగ్ మేకర్ అవ్వాలనుకున్నాడు కాని జనాలు జోకర్ ని చేసారు. ఆవేశ ప్రసంగాలు, పంచ్ డైలాగులు, సాదారణ వ్యక్తిలాగా వ్యవహరించడాలు ఇవేమి ఆయనను గెలిపించలేవు. ఈ ఎన్నికల్లో గబ్బర్ సింగ్ లాగా పవర్ చూపిద్దామనుకున్నాడు కాని అజ్ఞాతవాసిలాగా అయిపోయాడు. ఇక పవన్ సార్ ఐదేళ్ళు ప్రశ్నిస్తాడో లేక అజ్ఞాతవాసి లాగా సినిమాలు తీసుకుంటాడో వేచిచూడాలి....



   కేంద్రంలో రాహుల్ గాంధీ పరిస్థితి చూస్తే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాం కాబట్టి ఈ సారి కేంద్రంలో కూడా గెలిచి ప్రధాని  అవుదామనుకున్నాడు. కాని పప్పు అయ్యాడు. రాఫెల్ ను  పట్టుకుని వేలాడితే జనాలు ఎలా ఓట్లేస్తారు.
అటు వైపు ఉన్నది మోది. రాహుల్ లాంటి వాళ్ళ పప్పులు ఉడకవక్కడ. ఈ దేశ ప్రజలు రాహుల్ గాంధీని ఒక జోకర్ లా చూస్తారే తప్ప ప్రధానమంత్రి పదవి పై కూర్చోబెట్టే సాహసం చేయరు. దేశం గురించి అవగాహన లేని వ్యక్తి దేశ ప్రధాని అవ్వలేడు. ప్రజలకు కావాలసింది సమర్థవంతంగా పాలించే పాలకులు రాహుల్ గాంధీ లాంటి పప్పూలు కాదు. ఇక రాహుల్ గాంధీ బంపర్ మెజారిటీతో కేరళలో గెలవడం ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ రాహుల్ గెలవడానికి ప్రధాన కారణం అక్కడ హిందూ వ్యతిరేకతే కారణం. హిందూ వ్యతిరేక ఓటర్లు  ఓటు వేయడం మూలాన  రాహుల్ గాంధీ అక్కడ గెలిచారు. యూపిలో ఓడిపోయాడు.
ఒక చోట గెలిచాడు ఎలాగు పార్లమెంటు లో అడుగు పెడుతాడు తర్వాత ఇంకెంటి ప్రియా ప్రకాశ్ వారియర్ లా కన్నుకొడుతూ ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేస్తాడు.  బయట రాఫెల్ గురించి వాదిస్తూ మరో ఐదేళ్ళు అలా ముందుకు వెళ్తాడు...

23, మే 2019, గురువారం

నరేంద్ర మోది, రాహుల్ గాంధీ ఎవరు ప్రధాని..??

భారతదేశ ప్రధానిగా ఎవరు గెలిచేదెవరు..,

ఈ ఎన్నికల్లో బిజేపి కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటి
ఒక వైపు నరేంద్ర మోది మరో వైపు రాహుల్ గాంధీ ఇద్దరిలో గెలుపెవరిది. ఈ దేశ ప్రజలు ఎవరికి ప్రధానమంత్రిగా పట్టం కట్టబోతున్నారు.

జస్ట్ మరికొన్ని గంటల్లో ఫలితం తేలబోతుంది.
ఇక నరేంద్ర మోది మరియు రాహుల్ గాంధీ ఇద్దరి పట్ల జనాల్లో ఉన్న అనుకూలతలు ప్రతికూలతలు చూద్దాం.

నరేంద్ర మోది:

  ఛాయ్ అమ్మే వ్యక్తి, ఒక సామాన్య కార్యకర్త నుండి ఈ దేశాన్ని పాలించే స్థాయికి ఎదిగాడు.

అందరి నాయకుల్ల అవినీతికి పాల్పడి వేల కోట్లు దోచుకోవడానికి ఆయనకు కుటుంబం లేదు.

కుటుంబ పాలనకు దూరం.

ప్రపంచ దేశాలతో స్నేహపూర్వక వాతావరణం నెలకోల్పాడు.

మోది వచ్చాక గడిచిన ఐదేళ్ళలో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది. అదే కాంగ్రెస్ పాలనలో అయితే  దేశంలో ఎప్పుడు బాంబు దాడులతో అల్లకల్లోలంగా ఉండేది.

ఏ ప్రధాని చేయలేని సాహసం మోది చేసారు. అసలు ఎవరు కలలో కూడా ఊహించని విధంగా నోట్లరద్దు చేసాడు.

జిఎస్టీని అమలు పరిచాడు.

పాకిస్థాన్  ఉగ్రవాదులపై  రెండు సార్లు సర్జికల్ దాడులు చేసి తగిన గుణపాఠం చెప్పాడు.

మోది వల్ల ఈ దేశం కొంచెం ప్రశాంతంగా ఉంది.

దేశంలో ప్రాంతీయ పార్టీలన్ని కలిసి నరేంద్రమోడిని ఓడించాలని చూస్తున్నారు. 22 పార్టీలు ఒక వైపు బిజెపి ఒక వైపు. ఈ పార్టీలన్ని ఒకటైనప్పుడే అనిపిస్తుంది ఒక్కడిని ఓడించడానికి అందరూ కలిసారు అంటే వీరికి దేశ ప్రయోజనాలకంటే మోడిని ఓడించడమే ముఖ్యం. ఇది మోడి గారికి కలిసొచ్చే అంశం. ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు.

ప్రతికూలతలు:

నోట్లరద్దు అంశం ఈ నోట్లరద్దు వల్ల ప్రతి ఒక్కరు ఇబ్బందులకు గురయ్యారు. నోట్లరద్దు వల్ల నల్లధనం బయటికి రాకపోగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

జీఎస్టీ వల్ల సామాన్యులకు ఒరిగిందేమి లేదు.

మోడి హాయంలో జవాన్ లపై దాడులు పెరిగిపోయాయి.

మేకిన్ ఇండియా లాంటివి  ప్రగతి సాదించలేకపోయాయి.

మోది హిందు పక్షపాతి అని  ఇతర పార్టీల వాళ్ళ ఆరోపణ.

రాహుల్ గాంధీ:

మాజీ ప్రధాని కుమారుడు.

దేశపాలనలో ఉన్నప్పుడే ప్రాణాలు అర్పించిన నాయకుల వారసుడు.

తను ప్రధాని అయ్యే అవకాశం ఉన్న త్యాగం చేసి మన్మోహన్ సింగ్ గారిని ప్రధాని ని చేసిన సోనియా గాంధీ గారు ఈ సారి ఆయన కుమారుడిని ప్రధానిగా చూడాలనుకుంటున్నారు.

ప్రతికూలతలు :

పరిపాలన అనుభవం లేకపోవడం.

దేశ సమస్యలపై కాస్తైన అవగాహన రాహుల్ గాంధీకి లేదు. కేవలం ఈ ఐదేళ్ళలో ఒకే ఒక అంశాన్ని పట్టుకుని వేళాడాడు అదే రాఫెల్ అంశం.
రాహుల్ గాంధీ గారికి రాఫెల్ అనే అంశం తప్పితే దేశంలో ఇంక వేరే సమస్యలు ఏవి కనిపించలేవు.

ఇలాంటి వారు ప్రధాని అయితే దేశాన్ని ఏం పాలిస్తారు. కాంగ్రెస్ ప్రధానులు రబ్బర్ స్టాంపు ప్రధానులని పేరు దీనికి రాహుల్ మినహయింపేమి కాదు.

ఇక పదేళ్ళు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రేస్ హాయాంలో  వెలుగు చూడని కుంభకోణం లేదు. కాంగ్రెస్ అంటే కుంభకోణాలు కుంభకోణాలంటే కాంగ్రేస్ పార్టీ అనే విధంగా రోజుకో కుంభకోణాలు వెలుగుచూసాయి  వారి హాయాంలో. అలాంటి పార్టీకి మళ్ళీ జనాలు పట్టం కడుతారా అంటే డౌటే..

ఇక ఈ సారి రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి కాబట్టి దేశ సమస్యలపై కనీస అవగాహన లేని రాహుల్ గాంధీ ప్రధాని అయితే సమర్థవంతంగా ఆయన ఈ దేశాన్ని సమర్థవంతంగా పాలించగలడని నమ్మకం జనాలకు లేదు. కాబట్టి ఆయన ప్రధాని అయ్యే అవకాశం లేదు.


నోట్లరద్దు, జీఎస్టీ లాంటి వాటి వల్ల జనాలు ఇబ్బందులకు గురి అయిన , సర్జికల్ దాడులు వంటి సహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న అవి  దేశ ప్రయోజనాల కోసమే కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకునే మోడినే మళ్ళీ ప్రధాని కావాలని జనం కోరుకుంటున్నారు.

ఇక రాహుల్ గాంధీ ఈ దేశాన్ని పాలించగలడని ప్రజల్లో నమ్మకం లేదు. ఈ సారి కాదు కదా ఇంకో ఇరవై ఏళ్ళయిన మోడినే ప్రధాని గా గెలుస్తారు.

అన్ని పార్టీలు ఏకమైన మోడి  విజయాన్నీ ఎవరు ఆపలేరు. ఈదేశానికి కావలసింది ధమ్మున్న నాయకుడు. పప్పూలు కాదు.

సో 2019 లో  భారత ప్రధానిగా మళ్ళీ నరేంద్ర మోది గారు గెలుస్తారు.




22, మే 2019, బుధవారం

ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు..??

ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు..??

   మనదేశంలో అటు పార్లమెంటు ఎన్నికలు ఇటు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు అందరికి ఆసక్తికర అంశం ఎవరు గెలుస్తారు అని. కేంద్రం సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలుగు ప్రజలందరిలో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా చంద్రబాబు గారు, జగన్ గారు, పవన్ గారు ఈ ముగ్గురి మధ్యే పోటి నెలకొంది. ఇందులో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు ఎందుకంటే ఆయనకు వచ్చే సీట్లు అంకెలకే పరిమితమవుతాయి కాబట్టి ఆయన సీఎం కాలేరు ఒకవేళ కింగ్ మేకర్ అవుతాడనుకుంటే ఆయన పార్టీకి వచ్చే సీట్లతో అది సాధ్యం కాదు.
ఇక చంద్రబాబు గారు మరియు జగన్ గారి మధ్యే అసలైన పోటి. వీరిద్దరిలో జగన్ కు అత్యధికంగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సారి మాత్రం జగన్ సీఎం అవడం పక్క.

చంద్రబాబు, జగన్, పవన్ ఈ ముుగ్గురిలో ప్రజలు ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు. ఎందుకుఅనేది ఇప్పుడు చూద్దాం.

చంద్రబాబు: అనుకూలతలు

సీనియర్ రాజకీయ నాయకుడు.
మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగాన్ని స్థాపించి హైదరాబాదును ప్రపంచవ్యాప్తం చేసాడు.

ఇక రాష్ట్రం విడిపోయాక రాజధాని నగరాన్ని నిర్మిస్తున్నాడు.

ఆంధ్రుల ఎన్నో ఏళ్ళ స్వప్నం పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాడు.

కియా కార్ల కంపెనీని రాష్ట్రంలో నెలకొల్పాడు.

సెల్ఫోన్ తయారి కంపెనీలు రాష్టరంలో ఏర్పాటు చేసాడు.

చంద్రబాబు ప్రతికూలతలు:

ఉమ్మడి రాష్ట్రాన్ని 9 ఏండ్లు పాలించినప్పుడు కేవలం ఐటీ రంగాన్ని మాత్రమే ప్రోత్సాహించి మిగిత రంగాలను పట్టించుకోలేదు.


వ్యవసాయం దండగ అన్నాడు. వ్యవసాయ రంగాన్ని, రైతులను అవమానించాడు.

కరెంట్ అడిగిన పాపానికి రైతులపై కాల్పులు జరిపించాడు.

అన్ని రంగాలను తుంగలో తొక్కి కేవలం ఐటీ రంగాన్ని మాత్రమే ప్రోత్సహించి హైదరాబాదును అభివృద్ది చేసానని చెప్పుకుంటాడు.

ఉమ్మడి రాష్ట్రం చాలా పెద్దది కేవలం హైదరాబాదును అభివృద్ది చేసి నేను ఈరాష్ట్రాన్ని అభివృద్ది చేసానని పదే పదే చెప్పుకుంటాడు. సరే హైదరాబాదును అభివృద్ది చేసాడు మిగితా ప్రాంతాల పరిస్థితి ఏంటి.?  అక్కడ ప్రజలకు ఉపాది అవకాశాలు ఏంటి.

హైదరాబాద్ లో అభివృద్ది కూడా కేవలం ఐటీ రంగంలోనే చేసాడు. మరి మిగితా రంగాల పరిస్థితి ఏంటి..? అందరు చదువుకున్న వాళ్ళు ఉండరు కదా వారికి ఉపాది అవకాశాలు ఎలా??

హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టింది నేనే అనే చంద్రబాబు గారు ఒకసారి మూసీ నదిని కూడా ప్రపంచ పటంలో పెట్టి ఆయన  చేసిన అభివృద్దిని ప్రపంచానికి చూపాలి..

చంద్రబాబు గారు 9ఏండ్లు సీఎం గా ఉన్నప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్రానికి చేసింది ఒక ఐటీ తప్ప మిగితాదంతా శూన్యం.

ఇక రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు గారు చేసింది రాజధాని నిర్మాణం అది సాగుతూనే ఉంటుంది సింగపూర్ ల చేస్తా అని చెప్పుకుంటున్నారు. అది పూర్తయ్యేదెప్పుడో.

పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నానని గొప్పలు చెప్పే బాబుగారు ఆ ప్రాజెక్ట్ ను ప్రాజెక్ట్ ఐదేళ్ళలో పూర్తి చేయలేదు ఎందుకు ??  ఎందుకంటే చంద్రబాబు  మళ్ళీ గలవకపోతే   ప్రాజెక్ట్ పూర్తవదని జనాలు అనుకుని మళ్ళీ గెలిపిస్తారని ఆయన భ్రమ.

ప్రత్యేక హోదా విషయంలో రోజుకో మాట మాట్లడుతారు.

ఇక గొప్ప కార్ల కంపెని కియా ను రాష్ట్రంలో ఏర్పాటు చేసాను. ఇలాంటి కంపెనీలు చంద్రబాబు వల్లే సాధ్యం అని ప్రజలు భావించి మళ్ళీ తనని గెలిపిస్తారని అనుకుంటున్నాడు. ఓకే..   కార్ల కంపెని వచ్చింది రాష్ట్రానికి. దానివల్ల ఎవరికి ప్రయోజనం
స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని అనుకోవచ్చు కాని అందులో పెద్ద ఉద్యోగాలు అన్ని ఇతర దేశాలు లేదా ఇతర రాష్ట్రాల వారికే వస్తాయి. చిన్న చితక ఉద్యోగాలు స్థానికులకు ఇస్తారు. అందులోను గొడ్డు  చాకిరి చేయించుకుంటారు. ఇలాంటి గొడ్డు పనులు ఎలాగు  మనవాళ్ళు చేయరు అందువలన ఇతర రాష్ట్రాలు ఒడిశా, బీహార్ లాంటి రాష్ట్రాల వారిని  తెప్పించి వారితో చేయించుకుంటారు. ఇప్పుడు చెప్పండి స్థానికులకు ఉద్యోగాలు ఎక్కడివి. ఇలాంటి కంపెనీల వలన ఎవరికి ప్రయోజనం.

మిగితా కంపెనీలైనా సెల్ఫోన్, ఎలక్ట్రానిక్ కంపెనీలలో కూడా ఇదే పరిస్థితి స్థానికులకు ఉద్యోగాలు శూన్యం. పేరుకు ఉద్యోగాలు ఇస్తారు కాని మనవాళ్ళ చేత గొడ్డు చాకిరి చేయించి పొమ్మనలేక పొగ పెట్టిన చందాన వ్యవహరించి బయటికి వెళ్ళేలా చేసి ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఇస్తారు. ఇప్పుడు చెప్పండి ఇదేనా అభివృద్ది అంటే ఈ కంపెనీల వల్ల స్థానికులకు ప్రయోజనం లేకపోగా కాలుష్యం మాత్రం దండిగా ఉంటాది. కాలుష్యం స్థానికులకి ఉద్యోగాలు ఇతర రాష్ట్రాల వారికి ఇది చంద్రబాబు అభివృద్ధి.

ఇక రైతుల విషయానికి వస్తే చంద్రబాబు గారు చేసింది అప్పుడు శూన్యమే ఇప్పుడు పరమ శూన్యం.  రైతులకు , కార్మికులకు,పేదవారికి, మధ్యతరగతి వారికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చని బాబు గారు మళ్ళీ ఎలా ముఖ్యమంత్రిగా గెలుస్తారు.
చంద్రబాబు గారికి ఓటు వేసేది కేవలం ఐటీ ఉద్యోగులు, పార్టీ కార్యకర్తలు మాత్రమే.

ఇక జగన్ విషయానికి వస్తే

ప్రతికూలతలు:

అక్రమ ఆస్తుల కేసులు ఒక్కటే ఆయనపై ఉన్న ఉన్న ప్రతికూల అంశం.

ఇంకోకటి పరిపాలన అనుభవం లేకపోవడం.

 అనుకూలతలు:

రాష్ట్రమంతట పాదయాత్ర చేసి
ఒంటి చెత్తో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి అయిన  మహా నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి కూమారుడిగా ప్రజల్లో జగన్ అంటే అభిమానం.

దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల జనాల హృదయాలు గెలుకున్న నేత ప్రియతమ రాజశేఖర్ రెడ్డిగారు.

రాష్ట్ర ప్రజల సేవలో నిరంతరం కృషి చేస్తూ ప్రజాసేవలోనే తన జీవితాన్ని త్యాగం చేసిన మహావ్యక్తి వైయస్ రాజశేఖర్ రెడ్డిగారు. ముఖ్యమంత్రి పదవికే వన్నే తెచ్చిన మహానేత.
అలాంటి మహానేత కుమారుడు  ముఖ్యమంత్రి అయితే మళ్ళీ రాజశేఖర్ రెడ్డిగారిలా రాష్ట్రాన్ని పాలిస్తాడని జనాలు విశ్వసిస్తున్నారు.

రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాల ద్వారా లభ్ధి పొందారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చిరస్మరణీయం.

  మహానేత  రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతాడని జనాలు విశ్వసిస్తున్నారు.

మరో విషయం ఏంటంటే  జగన్ రాష్ట్రమంతట పాదయాత్రలు చేసి ఆయా ప్రాంతాల పరిస్థితులను  అక్కడి సమస్యలను దగ్గరుండి చూసాడు కాబట్టి జగన్ సీఎం అయితే అక్కడి సమస్యలు పరిష్కారం అవుతాయని జనం జగనే సీఎం కావాలనుకుంటున్నారు.

జగన్ సీఎం అయితే  రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్ని మళ్ళీ ప్రారంభించి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడుతాడని ప్రజలు జగనే సీఎం కావాలనుకుంటున్నారు.

ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నూటికి నూరు శాతం వైయస్ జగన్ గారే.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే లగడపాటి  సర్వే ఏపి ఎన్నికల విషయంలో తప్పు చెప్పిన పవన్ కళ్యాణ్ గారి గురించి కరెక్ట్ గా చెప్పారు.   ఒకటి నుండి మూడు సీట్లు మహా అయితే అంకెలు దాటి సంఖ్యలకు వెళ్ళవు ఆయన పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య. కాబట్టి పవన్ ఈసారి పోటిలో ఉన్న ముఖ్యమంత్రి అన్న పదానికి ఇంకో 20 ఏండ్లు వేచిచూడాలి.

పవన్ పరిస్థితి  ఎలా ఉందంటే పూనకం వచ్చినప్పడు ఊగిపోయి పప్రంగిస్తుంటాడు. ఆయనకు అంత ఆవేశం ఎందుకో ఆయన అభిమానులకే అర్థం కాదు.

రాజకీయాల పట్ల అవగాహన లేదు. పరిపాలన పట్ల అంతకన్నా లేదు ఇలాంటి వ్యక్తి సీఎం అవడం కష్టం. ఇది సినిమా కాదు జీవితం సినిమాల్లో లాగా డైలాగులు కొడితే ఈలలు పడుతాయే తప్ప ఓట్లు పడవు. జనాలకు కావాలసింది పంచ్ డైలాగులు కొట్టేవాడు కాదు. సమర్థవంతంగా రాష్ట్రాన్ని పాలించేవాడు. ఆ నమ్మకం ఈసారి ప్రజలు జగన్ పై ఉంచారు.

2019 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైయస్ జగన్.






19, మే 2019, ఆదివారం

లగడపాటి సర్వే మళ్ళీ బొక్క బోర్ల పడబోతుంది.

     
                   ఎన్నికల సర్వేల్లో లగడపాటి సర్వే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అన్ని సర్వేలు ఏమోకాని లగడపాటి సర్వేలు అంటే జనాలకు ఆసక్తి ఎక్కువ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లగడపాటి గారి  సర్వే బొక్క బోర్ల పడింది. అంతటితో సర్వేల సన్యాసం తీసుకుంటాడనుకున్నారందరు. కాని మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ తో పాటు ఏపి అసెంబ్లీ ఎన్నికల తన సర్వేలు ప్రకటించారు. పార్లమెంటు ఫలితాలు ఎలా ఉన్నా ఏపి అసెంబ్లీ ఫలితాలపై లగడపాటి సర్వే మీదే అందరికి ఆసక్తికరంగా మారింది.

    లగడపాటి సర్వే ప్రకారం ఏపి అసెంబ్లీ ఫలితాల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తన తన సర్వే ప్రకటించాడు.

ఇందులో తెదేపాకు 90 నుండి 110 సీట్లు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 65 నుండి 69 సీట్లు.

జనసేనకు  3 సీట్లు.

ఇతరులకు 1 నుండి 5  సీట్లు వస్తాయని తన ఫలితాలు ప్రకటించాడు.

మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లగడపాటి సర్వే ఏమైంది ఆయన ప్రకటించిన ఫలితాలన్ని తలకిందులైపోయాయి. ఆయన నిజంగా సర్వే చేయలేదు కేవలం తనకు ఇష్టమైన పార్టీలు నాయకులకు అనుకూలంగా ఫలితాలు ప్రకటించి వారిని సంతోషపరిచాడే తప్ప అది నిజమైన సర్వే కాదు. ఇప్పుడు కూడా అలాగే ఉందనిపిస్తుంది ఏపి అసెంబ్లీ ఎన్నికల్లో  లగడపాటి గారు చంద్రబాబు గారికి అనుకూలంగా ఫలితాలు ప్రకటించాడే తప్ప అది నిజమైన సర్వే మాత్రం కాదు. ఈ సారి కూడా లగడపాటి సర్వే బొక్క బోర్ల పడబోతుంది ఇది మాత్రం పక్క. ఇక ఇంతటితో లగడపాటి గారు సర్వేలకు సన్యాసం తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను. అప్పుడు కూడా ఇంకా సర్వేలు చెస్తూ ఉంటే మాత్రం ఆయన ఒక జోకర్ ల జనాల్లో మిగిలిపోతారు.

   చంద్రబాబు గారికి అనుకూలంగా ఫలితాలు వస్తాయని ప్రకటించిన లగడపాటిగారు. చంద్రబాబు గారికి ఓకింత సంతోషం కలిగించారు.  కాని చంద్రబాబు గారికి మాత్రం మళ్ళీ సీఎం అవుతానో కాదో అని బయపడిపోతున్నారు. అధికారంలో ఉండికూడా ఈసీని నిందిస్తున్నారు. వ్యవసాయం దండగ అన్న హైటెక్ బాబు గారు హైటెక్ సిటీని ఆంద్రప్రదేశ్ కి పరిచయం చేసి ఐటీ స్పెల్లింగ్ కి అర్థం చెప్పిన బాబు గారు ఇప్పుడు మాత్రం అదె ఐటీ రంగానికి చెందిన EVM లను  నమ్మడం లేదు. అధికారంలో ఉండికూడా తను గెలుస్తానో లేదో అని బయపడి పోతున్న బాబు గారు ఒకవేళ అపోజిషన్ లో ఉండి ఉంటే అధికార పార్టీ వాళ్ళు అధికార బలంతో తనను గెలవనీయలేదని  దుమ్మెత్తిపోసేవారు. ఈసారి ఒకవేళ బాబుగారు ఓడిపోతే EVM ల వల్లే ఓడిపోయామని తెపుతారు. అంతేకాని తన అసమర్థ పాలన అని ఒప్పుకోడు. ఏది ఏమైన లగడపాటి గారి సర్వే వల్ల బాబు గారు ఫలితాలు వచ్చేవరకు ఫ్రస్ట్రేషన్ లేకుండా కొంచెం ఫన్ గా ఉంటాడు.

6, ఏప్రిల్ 2019, శనివారం

పవన్ కళ్యాణ్ అభిమాని

పవన్ కళ్యాణ్ సార్ మీరంటే మాకు ఎంత అభిమానమో మాటల్లో చెప్పలేం. మీరు  దేవుడు సార్ దేవుడినైనా చూడడానికి జనాలు వస్తారో రారో కాని మిమ్మల్ని చూడడానికి లక్షల మంది వస్తారు.  అక్కడ స్థలం సరిపోక పోతే చుట్టూ ఉన్న చెట్లు, స్థంభాలు , హోర్డింగులు, ఆఖరికి కరెంట్ పోల్ కూడా వదలకుండ ఎక్కి చూస్తాం. కరెంట్ పోల్ లో పవర్ ఉంటుంది! షాక్ కొడుతుంది అనుకునేరు మీ పవర్ ముందు ఈ పవర్ ఎంత సార్. ఇంత కష్టపడే బదులు టీవీల్లో చూడవచ్చు కదా అంటారమో!? టీవీలో చూడటం కంటే స్థంభం ఎక్కి చూస్తే వచ్చే కిక్కే వేరప్పా..చూసారా  సార్ మీరంటే మాకు ఎంత అభిమానమో! ఒక్కసారైనా మిమ్మల్ని ఎదురుగా చూడాలని ఎదురు చూస్తాం. అవకాశం వస్తే గట్టిగా  గట్టిగా కౌగిలించుకుంటాం ఎంత గట్టిగా అంటే  మీకు ఊపిరి ఆడనంత గట్టిగా. కౌగిలించుకునే వీలు లేకుంటే మీ  కాళ్ళనైన పట్టుకుంటాం అదికూడా గట్టిగా ఎంతలా అంటే మీరు పట్టుకున్న మైక్ విరిగిపోయి మీరు కింద పడిపోయేంతలా. మీకు ఓపిక ఉందో లేదో మాకు అనవసరం మిమ్మల్ని హత్తుకోవడమే మాకు కావాలి. మీరు పడిపోయిన, కిందపడి గిలగిల కొట్టుకున్న మాకు అనవసరం. అలా చేయడం  మీమీద మాకు ఉన్న  అ....భిమానం.


              అంతేనా సినిమా ఫంక్షన్లలో ఎవరి సినిమా అయిన పర్వాలేదు మీ పేరు వినపడితే చాలు మాకు పూనకం వచ్చేస్తుంది మా అరుపులతో హాలు దద్దరిల్లి పోవాలసిందే ఎవరు మాట్లడానికి వీలులేకుండా. అది సార్ మీరంటే మాకు అభిమానం కాదు సార్ వీరాభిమానం.

     మీరు స్టేజీపైనా పూనకం వచ్చినట్టు ఊగిపోతు ప్రసంగిస్తుంటే మాకు పూనకాలు వచ్చేస్తాయి. అప్పుడు కూడా గట్టిగా పట్టుకోవాలని ఉంటుంది కాని సెక్యూరిటీ వాళ్ళు రానివ్వరు.
 రాష్ట్రం విడిపోయినప్పుడు బాధతో మీరు ఎనిమిది రోజులు అన్నం మానేశారని తెలిసి మేము  మీకంటే పదిరెట్లు  ఎక్కువగా బాధపడ్డాం  రాష్ట్రం విడిపోయినందుకు కాదు మీరు అన్నం మానేసినందుకు!

మాకోసం మీరు ఇంత సహనం, ఓర్పుతో  రాష్ట్ర ప్రయోజనాలకోసం పాటుపడుతున్నారు. అయిన మీకు వచ్చే సీట్లు మాత్రం  కూడా అంకెలల్లో నైనా  వస్తాయో లేదో. మిమ్మల్ని గెలిపించడం కోసం ఏమైనా చేస్తామో చేయమో కాని మిమ్మల్ని మాత్రం గట్టిగా గట్టిగా పట్టుకోవాడాని ఏమైనా చేస్తాం.

రాజకీయాల్లో  మార్పు తీసుకురావడం పవన్ లక్ష్యం.

పవన్ పేరు చెబితే గట్టిగా అరవడం అభిమానుల లక్ష్యం.

సీఎం కావడం పవన్ లక్ష్యం.

పవన్ ను గట్టిగా పట్టుకోవడం అభిమానుల లక్ష్యం.

మీ ఆరోగ్యం ఏమైనా పర్వాలేదు సార్..

మిమ్మల్ని గట్టిగా పట్టుకోవడానికి ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాం సార్.

జై పవన్ జై పవన్ అభిమాని

                             _ఒక పవన్ అభిమాని



5, ఏప్రిల్ 2019, శుక్రవారం

ఆంధ్రప్రదేశ్ కాబోయే సీఎం ఎవరు

             2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా గెలుపొందే నాయకుడు ఎవరు?
ముఖ్యంగా నాలుగు పార్టీల నేతల మధ్య పోటీ నెలకొని ఉంది. చంద్రబాబు గారు, జగన్ గారు, పవన్ గారు , పాల్ గారు. వీళ్ళందరిలో ఎవరి వైపు జనం మొగ్గు చూపుతున్నారు.

ముందుగా చంద్రబాబు గారి గురించి చూస్తే 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు.

 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.

హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలిపిన ఘనత చంద్రబాబు గారిదే.

ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక  కొత్త రాజధాని అమరావతిని నిర్మిస్తున్నాడు.

ఆంధ్రుల ఎన్నో ఏళ్ళ కల పోలవరం ప్రాజెక్ట్ ను కూడా కట్టిస్తున్నాడు.

 ఇక కరువు సీమ అనంతపురానికి కియా కార్ల కంపెని తీసుకొచ్చాడు.

చిత్తూరు జిల్లాలో తిరుపతి సిలికాన్ సిటీగా మార్చే ప్రయత్నంలో కొన్ని ఎలక్ట్రానిక్ కంపెనీలు కూడా వచ్చాయి.

ఇన్ని అభివృద్ది పనులు చేసిన చంద్రబాబు గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉందా అంటే ఈ సారికైతే లేవనే చెప్పాలి. ఇన్ని అనుకూలతలు ఉన్న ప్రతికూలతలు కూడా చాలానే ఉన్నాయి.

చంద్రబాబు గారు కేవలం కంప్యూటర్లు ఐటీ రంగం పైనే ఎక్కవగా దృష్టి పెడతారు. కాని రైతులను సామాన్యులను పట్టించుకున్న పాపాన పోలేదు ఉమ్మడి రాష్ట్రంలోనైనా ఇప్పుడైనా.

 ఆంధ్రాను సింగపూర్ చేస్తా అమరావతిని అమెరికా చేస్తా అమలాపురం ను ఆస్ట్రేలియా చేస్తా అంటాడు.  సార్ బాబు గారు ఆంధ్రాను అమెరికాలు సింగపూర్లు చెయ్యాల్సిన అవసరం లేదు అన్నదాతలను ఆదుకోండి అంతేకాని పచ్చని పంటపొలాలను అభివృద్ది పేరుతో నాశనం చేయకండి.

దేశానికే  అన్నం పెట్టె అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని అందరికి తెలుసు కాని బాబు గారు వ్యవసాయం దండగా అంటారు. అసలు చంద్రబాబుకు రైతులంటేనే అసహ్యం.

బాబు వస్తే జాబు వస్తుంది అన్నారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఈ ఐదేళ్ళలో.

బాబు గారు తీసుకొచ్చిన కియా మరియు ఎలక్ట్రానిక్ విడిబాగాల కంపెనీలలో వేల  ఉద్యోగాలు వచ్చాయి కదా అని అనొచ్చు కాని వాటిలో ఎక్కవగా ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన వారే ఉంటారు.  ఈ కంపెనీలలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వనప్పుడు ఎంత పెద్ద కంపెనీలు వస్తే ఏం లాభం వాటి వల్ల  స్థానికులకు ఉద్యోగాలు రాకపోగా బోనస్ గా కాలుష్యం మాత్రం
ఫ్రీగా వస్తుంది. కాలుష్యం స్థానికులకు ఉద్యోగాలు ఇతర రాష్ట్రాల వారికి. ఇదేనా చంద్రబాబు గారి అభివృద్ది.

ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రను ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు.

విద్యార్థలకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడం లేదు.

ఆరోగ్య శ్రీ పథకాన్ని అటకెక్కించాడు.

కేవలం ఐటీ ఐటీ అనడం తప్ప రైతులకు పేదలకు చేసిందేమి లేదు.

ఎన్నికల ముందు ఎవో కొన్ని పథకాలు ప్రవేశపెట్టి డబ్బులు పంపిని చేసినంత మాత్రాన మళ్ళీ గెలుస్తానని అనుకోవడం చంద్రబాబు భ్రమ. జనాలు ఎర్రి పుష్పాలు కాదు ఐదేళ్ళ నుండి ఆయన చేసిన ఘనకార్యాలను చూస్తూనే ఉన్నారు.

ఐదేళ్ళుగా రైతులకు ఆడపడుచులకు చేయలేని సాయం కేవలం ఒక నెల రెండు నెలల ముందు చేస్తే ఏమిటి ప్రయోజనం. అప్పుడు గుర్తురాలేదా? పేదలు, రైతులపై ఎన్నికలు సమీపించగానే ఎక్కడాలేని ప్రేమ పొంగుకొస్తుంది బాబు గారికి.

 పేదలను,రైతులను ఓటు బ్యాంకుగా చూస్తాడే తప్ప ఇంకోటి కాదు.

ప్రత్యేక హోదా గురించి రోజుకో మాట మాట్లాడుతుంటాడు.

అమరావతి , పోలవరం కడుతూనే ఉన్నారు ఎప్పటి వరకు కడతారండి. సగం కట్టి ఆపేస్తారు ఎందుకో ఒక వేళ బాబుగారిని గెలిపించకపోతే అవి ఆగిపోతాయని ప్రజలను తప్పుదోవ పట్టించి మళ్ళీ గెలవాలని ప్లానింగా. రాజకీయాలలో ఇదో ఎత్తుగడ.

ఒక పనిని చేయడానికి మీకు ఐదేళ్ళు కూడా సరిపోవు దిన్ని పూర్తి చేయడానికి మళ్ళీ గెలిపించాలా. ఒక విద్యార్థి పరిక్ష కేంద్రానికి వెళ్ళడానికి ఒక్క నిమిషం ఆలస్యం అయితేనే బయటికి గెంటివేస్తారు. అలాంటిది మీరు ఒక పనిని చేయడానికి ఐదు సంవత్సరాలైనా చేయకపోతే మిమ్మల్ని ఏం చేయాలి.

ఆంధ్రా ప్రజలు  బాబు గారికి మళ్ళీ ఓట్లేసి అసెంబ్లీకి పంపిస్తారా. లేదా రైతులను పేదలను పట్టించుకోనందుకు, ఐదేళ్ళైనా పూర్తి చేయని పనులవలన ఓడిస్తారా గెలిపిస్తారా  చూద్దాం.....

ఇక రెండో వ్యక్తి  వై యస్ జగన్ గారి గురించి చూస్తే

జగన్ గారి గురించి ప్రజల్లో అనుకూలతలు:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డైనమిక్ ముఖ్యమంత్రి జన హృదయనేత వై యస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు అవడం వలన  జనాల్లో ఆయనకు అభిమానం ఎక్కవ.

రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు చిరస్మరణీయం దేశంలో  ఏ ముఖ్యమంత్రి కూడా ప్రవేశ పెట్టని పథకాలు ప్రవేశ పెట్టి పేదలు, రైతులకు ఎంతో మేలు చేసాడు. ఆయన పుత్రుడు జగన్ గెలిస్తే మళ్ళీ రాజశేఖర్ రెడ్డిలా పరిపాలన చేస్తాడని జనాలు భావిస్తున్నారు.

 రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు.

రాష్ట్రంలోని  13 జిల్లాల్లో పాదయాత్రలు చేస్తూ ప్రజల భాధలను దగ్గరనుండి చూసి వారికి అండగా ఉంటానని హామి ఇచ్చి ప్రజలకు దగ్గగరయ్యాడు.

ఇక ప్రతకూలతల విషయానికి వస్తే

జగన్ పై ఉన్న కేసులు.

పరిపాలన అనుభవం లేకపోవడం.

ఎక్కవ శాతం ప్రజలు జగన్ వైపే   మొగ్గుచూపుతున్నారనిపిస్తుంది.

ఇక మూడో వ్యక్తి పవన్ గురించి చూస్తే

గొప్ప సినిమా స్టార్
చిరంజీవి తమ్ముడు

రాజకీయాల్లో మార్పుకోసం తపిస్తున్న వ్యక్తి.

రాష్ట్రంలో ప్రజల కష్టాలు తెలిసిన వాడు . దగ్గరుండి మరీ ప్రజల కష్టాలు ఓర్పుగా వింటాడు.

 పవన్ ప్రతికూలతలు:

2009 లో ఇలాగే రాజకీయాల్లో మార్పుకోసం చిరంజీవి పార్టీని స్థాపించి అనుకున్న  ఫలితాలు సాదించలేక పార్టీని కాంగ్రేస్ లో విలీనం చేసి చేతులు దులుపుకున్నాడు. చిరంజీవిలాగే పవన్ కూడా చేస్తాడేమోనని ప్రజల భయం.

2009  లో చిరంజీవే సీ ఎం అవుతాడని అందరు అనుకున్నారు కాని రాజశేఖర్ రెడ్డి ప్రభంజనంలో కొట్టుకుపోయింది ఆయన పార్టీ.

సినిమాలు వేరు రాజకీయం వేరు పవన్ కు
రాజకీయ అనుభవం లేదు.

పవన్ కళ్యాణ్ అంటే యువతకు మాత్రమే తెలుసు పెద్దవయసు  ఓటర్లకు పవన్ అంటే చాలా మందికి తెలియదు. అలాంటప్పుడు పవన్ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు.

ఇక చివరగా నాలుగో వ్యక్తి కే ఏ పాల్ ఈయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
కామెడి పీస్ బిల్డప్ బాబాయ్.
ఆయన ఏం మమాట్లాడిన జనాలు కామెడిగానే చూస్తారు.

 పాల్  గారు సీ ఎం కాదు కదా ఒక ఊళ్ళో సర్పంచ్ కూడా కాలేరు.

చివరగా నా అంచనా ప్రకారం జగనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది.

 ఏ నాయకునికి ఎంత మంది ప్రజలు అనుకూలంగా ఉన్నారంటే

 జగన్ కు 70 శాతం
 చంద్రబాబు కు 20 శాతం
 పవన్ కు 9 శాతం
 పాల్ కు 1 శాతం ప్రజలు అనుకూలంగా ఉన్నారు.

ఇది కేవలం నాకు అనిపించిన అంచనా మాత్రమే.
తుది నిర్ణయం ప్రజలు నిర్ణయిస్తారు.


22, జనవరి 2019, మంగళవారం

ఐదేళ్ళకోసారి వచ్చే మందు పండుగ...!

మందు పండుగలా ఎన్నికలు
     
        పల్లెల్లో ఇంకా పంచాయితి ఎన్నికలు జరగకముందే అభివృద్ది ఎలా ఉంటుందో చూపిస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు. పోటిపడి మరీ క్వాటర్ సీసా, నోట్లతో అభివృద్ది అంటే ఏమిటో చూపిస్తున్నారు. ప్రతీ ఇంట్లో అరడజను పైగా మందుసీసాలతో కళకళలాడుతున్నాయి. మొత్తంగా మూడు నోట్లు,ఆరు క్వార్టర్
సీసాలతో వాళ్ళు చేసే అభివృద్ది ఏంటో చూపిస్తున్నారు.  జనాలను మత్తులో ముంచుతున్నారు. నేను గెలిస్తే ఊళ్ళో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాను అని ఏ ఒక్క అభ్యర్థి చెప్పిన పాపాన పోలేదు.
   
         సర్పంచ్ పదవికి పోటీచేసే అభ్యర్థుల దృష్టిలో ఓటర్లను గొర్రెల్లాంటి వారుగా భావిస్తారో ఏమోగాని ఇప్పటికి కూడాను మందు,నోట్లు ఆశచూపితే గెలుస్తామనే ధీమాలో ఉంటున్నారు.  ఇచ్చేవాడిది తప్పు అయితే తీసుకునేవాడిది కూడా తప్పే కదా!
కాని ఓటర్లెవరు కూడా మాకు మందు డబ్బులు వద్దు ఊరిని అభివృద్ది చేయండి అని ఎవరు చెప్పరు. ఎవడిచ్చిన తీసుకోవడమే. డబ్బులు ఎవరికి ఊరికే రావు!! అన్నట్టు ఇచ్చింది పుచ్చుకుంటున్నారు పండగ చేసుకుంటున్నారు.

      చదువుకోని నిరక్ష్యరాస్యులైన ఓటర్లు డబ్బుకు,మందుకు ఆశపడితే ఇక చదువుకున్న యువ ఓటర్లు వీళ్ళన్న అభివృద్ది గురించి అడుగుతారననుకుంటే అదీ లేదు  ఎంత ఖర్చు అయిన పరవాలేదు పక్కోడు ఓడిపోవాలి మనం గెలవాలి అనే దానిపైనే వీళ్ళ దృష్టంతా.  పంతం నీదా నాదా సై! అంటున్నారే తప్ప అభివృద్ది ఊసే ఎత్తట్లేదు. ఇక ఊరి అభివృద్ది సంగతి దేవుడెరుగు.

 అసలు సర్పంచ్ ఎన్నికలు అంటే ఐదేళ్ళకోసారి వచ్చే వారం రోజుల మందు పండుగలా తయారయింది.

ఇలా అయితే ఊళ్ళు ఎప్పుడు బాగు పడుతాయి..

12, డిసెంబర్ 2018, బుధవారం

కారు+సారు=సర్కారు@కెసీఆర్ వార్ వన్ సైడ్



  తెలంగాణలో ఎదురులేని శక్తిగా తెరాస నిలిచింది.
మహా కూటమి కూలిపోయింది. కూటమిలో వారిలో వారికే స్పష్టత లేదు మరి ఇలాంటి వారికి జనం అధికారం అప్పజెప్తారా.???  పైగా ప్రగల్భాలు అది చేస్తాం ఇది చేస్తాం పీకేస్తాం బరికేస్తాం అంటూ ఒకటే ఊపదంపుడు ఉపన్యాసాలు.

అసలు కూటమి యొక్క ముఖ్య ఉద్ద్యేషం కెసీఆర్ ను గద్దె దింపడం.! అంతె తప్ప అబివృద్ది, ప్రజల సంక్షేమం కోసమైతే కాదు. కెసీఆర్ ను గద్దె దింపడం ఎవరి తరం కాదు. కారణం ప్రజలు కెసీఆర్ గారి నాయకత్వం కోరుకుంటున్నారు. తెలంగాణ సంక్షేమంగా ఉండాలంటే కెసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలంటు ఈ అఖండ విజయాన్ని అందించారు.
  ఇది ప్రజల విజయం...

మహాకూటమి నేతలు ఓవర్ కాన్ఫిడెన్స్ తో మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. కెసీఆర్ పాలన అంతం చేస్తాం, కాంగ్రేస్ లో ఫైర్ బ్రాండ్ అనిపించుకునే నేతలు మీసాలు, గెడ్డాలు మెలేసారు ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాం అని, ఇంకొకరు బ్లేడ్ తో కోసుకుంటాననీ.ఇంకొకరు తొడలు కొట్టారు బుల్ బుల్ కామెడీలు చేసారు.

చివరికి ఏమైంది సారే కెసీఆరే గెలిచారు. మీసాలు
గెడ్డాలు  మెలేసిన పౌరుషం ఏమైంది???? తొడలు కొట్టిన హీరోయిజం ఏమైంది????

ఫామ్ హౌస్ లో పండుకునేటోడు రాష్ట్రాన్నీ ఏం పాలిస్తాడన్నారు?? కెసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకునేటోడు కాదు ఫామ్ లో ఉన్నోడు అని నిరూపించాడు...

పేడ మూతోడు మీసాలు లేనోడు అంటు హేళన చేస్తు మాట్లాడిన నేతలకు తన మెజారిటీ గెలుపుతో తన స్టామినా ఏంటో నిరూపించాడు కెటీఆర్.

మీసాలు,గడ్డాలు పెంచినంత మాత్రాన హీరోలైపోరు జనం హృదయాలను గెలవాలి ఆడే మగోడు మగాడు...
       
కెటీఆర్ సాఫ్ట్ వేర్ మీలాగా చిల్లరగాడు కాదు.
మైక్ ఉందికదా నలుగురు చెంచాగాళ్ళు ఆరుస్తున్నారు కదా అని నోటికి ఏదోస్తే అదే మాట్లాడటం కరెక్ట్ కాదు.

హీ ఇజ్ ఏ క్లారిటీ పర్సన్. మిస్టర్ పర్ ఫెక్ట్..

ప్రజలకు కావలసింది ఈలలు వేయించే మాటలు కాదు. అభివృద్దికి వేయించే బాటలు కావాలి..
     
 ఇంకొకరు సినిమా డైలాగులతో మేం సింహాలం ఒకవైపే గెలుపు అన్నట్టు సినిమా డైలాగులతో అధరగొట్టారు.
అధరగొట్టె సమయంలో నవ్వులపాలు అయ్యారు. సినిమా వేరు జీవితం వేరు సినిమాని జీవితాన్ని ఒకేలా చూడలేం. సినిమా ,జీవితం ఒకేలా ఉంటుందనుకుంటే పప్పులో కాలేసినట్టే .. అలా అనుకుంటే పప్పు పప్పు అయిపోవడం గ్యారంటీ!!
అయిపోయారు కూడా!!😁😁😁😁

పెద్ద ఎత్తున డంబాచారం కొట్టిన మహాకూటమి కెసీఆర్ ప్రభంజనం ముందు గడ్డిపోచలా కొట్టుకుపోయింది.

అసలు సింహం ఎవరో తెలిపోయింది..

కెసీఆర్ అంటే ఆల్తు ఫాల్తు కాదు..

కెెసీఆర్ అంటే కెసీఆరే ..

ఎదురులేని నాయకుడు ..

ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక సీఎం...

ఫిర్ ఏక్ బార్ కాదు బార్ బార్ సీఎం కెసీఆర్...

           

30, నవంబర్ 2018, శుక్రవారం

మళ్ళీ ముఖ్యమంత్రిగా కెసిఆర్

         ఎవరు ఊహించని పథకాలు తెరాస ప్రభుత్వం తీసుకొచ్చింది. 60 సంవత్సరాలుగా జరగని అభివృద్ది నాలుగున్నర ఏళ్ళలో జరిగింది.
ఇంకోసారి అధికారంలోకి వస్తే తప్పకుండా బంగారు తెలంగాణ సాద్యం అవుతుంది. తెలంగాణ ప్రజలు కెసిఆర్ ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. కెసిఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్టంలో కూడా లేవు.  నిరుద్యోగులు మాత్రమే కెసిఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారు వారికి కూడా వచ్చే ఏడాదిలో ఉద్యోగాలు
వస్తాయని ఆశిస్తున్నాం. అందరికి న్యాయం చేసినోడు చదువుకున్నోళ్ళకు అన్యాయం చేస్తాడా.
కెసిఆర్ మాటల ముఖ్యమంత్రి కాదు చేతల ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి చేయలేని పనులు ఒక్క కెసిఆర్ మాత్రమే చేసాడు.
ఈ ఎన్నికల్లో కెసిఆర్ ను గెలిపించేది ఆయన అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు.
24 గంటల కరెంట్
మిషన్ భగీరథ
మిషన్ కాకతీయ
రైతు బందు
ఆసరా పించన్లు
కళ్యాణలక్ష్మీ
కెసిఆర్ కిట్ లాంటి మరెన్నో పథకాలే కాకుండా పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారం లాంటి మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారు. ఇలా రాష్ట్ర సర్వతోమఖాభివృద్దికి పాటు పడుతున్న కెసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలి అంటుంది తెలంగాణ ప్రజానికం.
          మహాకూటమి సీట్ల పంపకాలలోనే వీళ్ళకి క్లారిటీ లేదు వీళ్ళేం పాలిస్తారు రాష్ట్రాన్ని ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే సీఎం సీటు కోసం కొట్లాట తప్పితే అభివృద్ది శూన్యం.
        నూటికి నూరు శాతం మళ్ళీ కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారు కావాలి. ఈ రాష్ట్రానికి కెసిఆర్ దిక్సూచి. జై కెసిఆర్ జై తెలంగాణ.

27, నవంబర్ 2018, మంగళవారం

తెలంగాణలో బలమైన పార్టీ ఏది??

   



    తెలంగాణ ఎన్నికల్లో తెరాస, మహాకూటమి మద్యే పోటి బిజెపి తన ఉనికిని కాపాడుకోవడానికే పోటీచేస్తుంది. ఇక లెఫ్ట్ పార్టీలను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. ఆ పార్టీలు పానకంలో పుడకల్లాంటివి.
 ప్రస్తుతం తెలంగాణలో బలమైన పార్టీ ఏదంటే తెరాస అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పార్టీని ఎదుర్కోవాలంటే బలమైన పార్టీ ఉండాలి. జాతీయ స్థాయి పార్టీ సైతం ఇతర పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడినప్పుడే తెరాస పార్టీ బలమైన పార్టీగా అవతరించింది.
సొంతంగా పోటీ చేసి గెలిచే ధమ్ములేక అన్ని పార్టీలు ఏకమయ్యాయి.
 మహాకూటమి ముఖ్య ఉద్ద్యేశం ఒక్కటే కెసీఆర్ ను గద్దె దింపడం అంతే తప్ప ప్రజల సంక్షేమం కోసమైతె కాదు. కెసీఆర్ లాంటి బలమైన నాయకుడు తెలంగాణలోని ఏ పార్టీలో లేడని చెప్పాలి. కాంగ్రేస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కెసీఆర్ తో సమానమైన బలమైన నాయకుడైతే కాడు. ఇక ఇంకో వ్యక్తి రేవంత్ రెడ్డి
ఈయన తిట్టడానికే పనికి వస్తాడే తప్ప ఇంకేం లేదు. తిట్టడం వల్లనే గొప్ప నాయకుడు ఎలా అవుతారో రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి.
ఇక తెదేపా విషయానికి వస్తే తెలంగాణలో అంతరించి పోయే పార్టిలో ముందు వరుసలో ఉంది. అందుకెనేమో ముందు చూపుతో రెవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాడు. రేవంత్ రెడ్డికి కెసీఆర్ ని విమర్శించడంపై ఉన్న శ్రద్ద తన నియోజకవర్గ అబివృద్దిపై ఉంటే బావుండేది. కెసీఆర్ ను  విమర్శించేముందు తన మీద ఉన్న ఓటు నోటు కేసు గురించి ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఒక వ్యక్తిని ఓడించడానికి అన్ని పార్టీలు ఏకమయ్యాయంటే ఆ వ్యక్తి ఎంత బలమైన నాయకుడో అర్థం అవుతుంది.
   

   ప్రజలకు కావలసింది తోపులు, హీరోల్లాంటి నాయకులు కాదు ప్రజల సంక్షేమం కోసం పాటు పడే నాయకుడు కావాలి.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని,సంస్కృతిని కాపాడే పార్టీ తెరాస. తెలంగాణ అభివృద్ది చెందాలంటే అది తెరాసకే సాద్యం.