భానోదయం: నా అభిప్రాయాలు
నా అభిప్రాయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నా అభిప్రాయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, ఏప్రిల్ 2026, శుక్రవారం

హిందూమతం ఈ దేశం దాటి ఎందుకు విస్తరించడం లేదు -మందక్రిష్ణ మాదిగ

 





మతం మారితే sc హోదా, రిజర్వేషన్లు వర్తించవని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది..


దీనిని వ్యతిరేకిస్తూ మందక్రిష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్ పెట్టి, రామాయణం,మహాభారతం , కృష్ణుడిని, హిందూ మతాన్ని కించపరూస్తూ మాట్లాడారు.


రిజర్వేషన్లకు, హిందూ దేవుళ్ళకు సంబంధం ఏమిటి.?


మందక్రిష్ణ మాదిగ గారు హిందూ మతం గురించి ఒక మాట అన్నారు. హిందూమతం ఈ దేశం దాటి ఎందుకు విస్తరించడం లేదు అని?


నేను చెబుతాను హిందూ మతం ప్రపంచంలో ఎందుకు విస్తరించడం లేదో..


1. ఇతర మతాల వారిని బలవంతంగా మతం మార్చదు.


2.ఇతర దేశాల మీద  దాడులు చేసి ఇతర మతాల వారిని,వారి సంస్కృతిని నాశనం చేయలేదు.


3.ఇప్పటికి వారి ప్రార్థన స్థలాల్లో హిందూ మతం పట్ల చాలా ద్వేషం పెంచే ప్రసంగాలు చేస్తారు.

హిందూ మతాన్ని అంతం చేయడమే వారి లక్ష్యం.


4.ఇతర దేశాలనుండి వారి మతస్తులను ఈ దేశంలోకి అక్రమంగా తీసుకొచ్చి ఆశ్రయం కల్పించి వారి జనాభా పెంచుకుంటున్నారు.

కాని హిందువులు అలా చేయడం లేదే..



5.హిందూ మతం రెండు ఎడారి  మతస్తులతో నిరంతరం పోరాడుతు ఈ దేశంలో ఇప్పటికి నిలిచింది 

లేదంటే ఈ దేశం ఎప్పుడో ఎడారి మతస్తుల దేశం అయ్యేది..


6.ఇతర దేశాల్లో విస్తరించవలసిన అవసరం హిందూ మతానికి లేదు.


7.ఈ భారతదేశం అంత గొప్ప భూమి ప్రపంచంలో లేదు..


8.హిందూధర్మాన్ని ఆచరించే శక్తి ఇతర దేశస్తులకు ఉండదు...


9.ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్థికంగా, 

క్రూరంగా బలంగా ఉన్న మతస్తులు ఉంటే ప్రపంచం మొత్తం విస్తరించవచ్చు.

హిందు మతానికి ఈరెండు లక్షణాలు లేవు అందుకే ప్రపంచంలో విస్తరించడం లేదు..


పనికిరాని మతాలు దౌర్జన్యంగా, క్రూరంగా ప్రపంచంలో విస్తరిస్తూ పోతే.. వాటిని గొప్ప మతాలు అనడం మీ మూర్ఖత్వం..


ఈ దేశంలో పుట్టి రిజర్వేషన్లు స్వీకరిస్తూ మళ్ళీ ఈదేశంపైనే ద్వేషం వెళ్ళగక్కుతారు మేమే చాలా తెలివైన వారమని.. మీలాంటి మేధావులు..


ప్రపంచంలో శాంతిని పంచే మతం ఏదైనా ఉందంటే అది హిందూ మతమే...🚩🚩


జై శ్రీరామ్ 🚩 🚩 

జైహింద్ 🚩🚩

జై భారత్ 🚩🚩





26, అక్టోబర్ 2022, బుధవారం

పొట్లం యాప్ ఆన్లైన్ కూరగాయలు

 

పొట్లం యాప్ 

ఈ స్టార్టప్ ఆలోచన చాలా బాగుంది. దీని ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది, వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు అందుతాయి. మరియు 200 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ పొట్లం యాప్ రూపకర్త శ్రీనివాస్ గారు. ఈ 'పొట్లం' అన్ని నగరాలకు విస్తరించాలి.






10, జులై 2022, ఆదివారం

ఈ సన్నివేశం ఎంతో రియాలిటీ గా ఉంటుంది. డైరెక్టర్ కి హాట్సాఫ్ చెప్పాల్సిందే..!




 


   ఈ సన్నివేశం చూస్తే ఎంత రియాలిటీ గా తీశారు అనిపిస్తుంది. ఈ సినిమా దర్శకుడికి హాట్సాప్ చెప్పాలనిపిస్తుంది.

ఆ డైలాగులు మాత్రం చాలా సహజంగా ఉంటాయి..


      ఈ సినిమాలో హీరో పేపర్ బాయ్ హీరోయిన్ ధనవంతుడి కూతురు ఇద్దరు ప్రేమించుకుంటారు. ప్రేమిస్తే సరిపోతుందా వాళ్ళ కుటుంబాలు ఒప్పుకోవాలి కదా. హీరోయిన్ కుటుంబ సభ్యులు వీళ్ళ పెళ్ళికి ఒప్పుకోరు. హీరో తల్లి దండ్రులు ఒప్పుకుంటారు ఎందుకంటే ధనవంతుల అమ్మాయి మనలాంటి పేదవాడి అబ్బాయిని ప్రేమించిందని గొప్పగా భావిస్తారు. మరీ డబ్బున్న వాళ్ళు తమ అమ్మాయి ఒక పేదవాన్ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటానంటే ఒప్పుకుంటారా ససేమిరా ఒప్పుకోరు. ఆ స్థానంలో ఎవరున్నా ఒప్పుకోరు.  ఈ సినిమాలో కూడా హీరోయిన్ కుటుంబ సభ్యులకు తమ అమ్మాయిని ఒక పేపర్ బాయ్ కి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం ఉండదు. కాని హీరోయిన్ మాత్రం అతన్నే పెళ్ళి చేసుకుంటానని పట్టుబడుతుంది. దింతో కూతురి మీద ప్రేమతో హీరోయిన్ తండ్రి అతనితో పెళ్లికి  ఒప్పుకుంటాడు.. 


కాని హీరోయిన్ ఇద్దరు అన్నయ్యలకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం ఉండదు. ఆఫ్ట్రాల్ ఒక పేపర్ బాయ్ కి నా చెల్లినిచ్చి పెళ్ళి చెయ్యాలా అంటూ కోపంతో ఊగిపోతారు.  ఇలాంటి సన్నివేశాల్లో వేరే ఏ సినిమాలో అయిన పెద్ద పెద్ద ఫైట్లు భారీ భారీ డైలాగులు ఛాలెంజ్ లు ఉంటాయి. కాని ఇక్కడ అవేమి ఉండవు. కేవలం హీరోయిన్ అన్నయ్యలు ఇద్దరు హీరో ఇంటికి వెళ్ళి నాలుగు మాటలు చెబుతూ బాధ పడుతుంటారు అంతే హీరోకి ఒక్క మాట కూడా రాదు. అవును ఇది నిజం రియాలిటీ ఇలాగే ఉంటుంది. 


వాళ్ళు ఏమాట్లాడుతారంటే...


హీరోయిన్ ఇద్దరు అన్నయ్యలు హీరో ఇంటికి వస్తారు.

వాళ్ళు రాగానే హీరో అమ్మానాన్నలు కంగారు పడుతూ రండిబాబు మీరా రండి రండి కూసోండి, కూసోండి అంటు అదరా బాదరా పడుతుంటారు.


  ఈ టైం లో వచ్చారు ఏంటండీ.? అంటుంది హీరో అమ్మగారు.

  పొద్దున్నుండి పెళ్ళి షాపింగ్ చేస్తూ వచ్చేసరికి ఈ టైం అయ్యిందాంటీ అంటాడు హీరోయిన్ అన్నయ్య. అలా అంటూనే నాన్న గారు ఇది ఇమ్మాన్నారని చేతిలో ఒక కవర్ పెడతాడు. దాన్ని చూసి ఏంటి బాబు ఇది అని అంటారు హీరో తండ్రి. 


''డబ్బండీ'' అంటారు హీరోయిన్ అన్నయ్యలు.

మా పద్దతి ప్రకారం  మగపెళ్ళి వారి బట్టలకు ఆడపెళ్ళి వారే డబ్బులు ఇస్తారు అంటారు.

 అందుకు వద్దు బాబు ఉన్నంతలో మేం కొనుక్కుంటాం అంటు,  ఇంత బరువు మేం మోయలేమని అంటుంది హీరో అమ్మగారు.


"5లక్షలే మేయలేమని అంటున్నారు రేపు మీ ఇంటికి మా ఇంటి మహాలక్ష్మి రాబోతుంది ఎలా మోస్తారు" అంటాడు హీరోయిన్ అన్నయ్య.


"నా కూతురులా చూసుకుంటాను అయ్యా" అంటుంది హీరో అమ్మగారు.


ఇంతలో మాటల సంగతి తర్వాత ముందు పొయ్ ఛాయ్ పెట్టు అంటాడు హీరో నాన్న..


ఈ టైంలో ఛాయ్ ఏంటీ అంకుల్ పదవుతుంది పొద్దన్నుండి షాపింగ్ లో పడి అన్నమే తినలేదు ఉంటే అన్నమే పెట్టండి అంటారు హీరోయిన్ అన్నయ్యలు.


ఉండండి రెండు నిమిషాల్లో తయారు చేస్తాను అంటుంది హీరో అమ్మగారు..


"ఆంటీ ఉన్నదే పెట్టండి రేపు పెళ్లయ్యాక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా" అంటారు.


ఇదంతా చూస్తూ హీరో ఒక్క మాట కూడా మాట్లాడడు.


ఇక వాళ్ళిద్దరికి రెండు కంచాల్లో అన్నం, పప్పు చారు వడ్డిస్తుంది హీరో అమ్మగారు.


అది చూస్తే మనకే అనిపిస్తుంది డబ్బున్న వాళ్ళు ఇలా అన్నం చారు తింటారా అని..? 


నాకు తెలిసి ధనవంతుల ఇళ్ళల్లో డైనింగు టేబుల్ మీద ప్రతిరోజు నాలుగైదు కూరలు, సాంబారు, పెరుగు, నెయ్యి, అప్పడాలు, నాలుగు రకాల పచ్చళ్లు, వేపుళ్లు ఇలా మెను పేద్దగా ఉంటుంది. ఇలాంటి ఆహారం పేదవారికివిందుభోజనం... కాని ధనవంతులకుమాత్రం రోజు సాధారణ భోజనమే... అలాంటిది కేవలం అన్నం చారు తినాలంటే వాళ్ళు తింటారా... ముద్ద దిగదు కదా...




 ఇక వాళ్ళు అన్నాన్ని కలుపుతూ ఉంటారు. ఇంతలో ఒకడు ఏంట్రా అలా కలుపుతున్నావ్ ఆంటీ నాలుగు ఇళ్ళల్లో వంట పని చేస్తుందని నాలుగు రకాల కూరలు ఉంటాయనుకున్నావా ఏంటి? అని అంటాడు అది చూసి హీరో ఫ్యామిలీ తెల్ల మోహం వేస్తారు ఏంటి వీళ్ళు ఇలా అంటున్నారు అని.


మళ్ళీ ఏంట్రా కారంగా ఉందా కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువగా వేసుకుంటారు అని అంటాడు.. ఇలాంటి గొడ్డు కారం ముద్ద తినడం నాకు అలవాటు లేదురా. ఇది తింటుంటే గొంతులో మంటగా ఉందిరా కాని మన చెల్లి కి తప్పదురా లైఫ్ లాంగ్ ఇదే తినాలి అంటాడు.. దాంతో హీరో అవమానంతో ఏమి అనకుండా అలా చూస్తుండిపోతాడు..


 హీరోయిన్ అన్నయలు ఒకరినొకరు చూసుకుంటూ హీరో పేదరికాన్ని గుర్తు చేస్తూ హేలనగా మాట్లాడుతుంటారు.

 

 ఏంట్రా అలా చూస్తున్నావు ఒకటే రూం ఉందనా..?

ఇక్కడే పడుకుంటారు. 


 ఫస్ట్ నైట్ ఎలా అనా? వాళ్ళు బయట పడుకుంటారు. ఆ తర్వాత అందరు కలిసే పడుకుంటారు.  వీళ్ళు ఇటు తిరిగి వాళ్ళు అంటు తిరిగి...


అలా అనేసరికి హీరో ఫ్యామిలీ నోటివెంట మాటరాదు కదా అయోమయంలో పడిపోతారు.


మన చెల్లి అపోలో హాస్పిటల్ లో పుట్టింది.


 ఇప్పుడు మనం చెల్లి పిల్లలు ఆ గాంధీ హాస్పిటల్ లో పుడతారు.


మన పిల్లలు ఆక్రిడ్జ్ లో చదువుతారు. 

మన చెల్లి పిల్లలు ఆ బ్రిడ్జ్ పక్కన గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. అని హీరో పేదరికాన్ని గుర్తు చేస్తూ  హేళనగా మాట్లాడుతాడు...


ఆ మాటలకు హీరో ఫ్యామిలీ అవమానంతో ఏం అనాలో అర్థం కాక అలానే చూస్తుండి పోతారు..


అలాగే హీరోని ఉద్దేశిస్తూ "రవి నీకే గనుక ఒక చెల్లి ఉంటే తానొక చిత్తు కాగితాలు ఏరుకునే వాడ్ని ప్రేమిస్తే పరువలేదులే ఇద్దరు కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏరుకుంటారు అని పెళ్ళి చేస్తావా" అని అంటాడు.


మరియు" ప్రేమంటే ఇద్దరు వ్యక్తుల ప్రమాణం. పెళ్ళంటే రెండు కుటుంబాల ప్రయాణం".  ఆ ప్రయాణంలో మంచికి చెడుకి మీ ఇంటికొస్తే ఇలా నట్టింట్లోకి షూలు వేసుకుని వచ్చేస్తాం. బాధ ఇప్పుడు ఒకవైపే భవిష్యత్తులో రెండువైపులా ఉంటుంది..

నాలుగు ఇళ్ళల్లో పని చేసుకుని బతికేవారు గద్వాల్ రెడ్డి గారి ఆహ్వాన పత్రిక ఇప్పుడు ఇక మీ చేతిలో ఉంది. అంటూ బాధపడుతూ పరోక్షంగా హెచ్చరించి 5 లక్షల రూపాయలు టేబుల్ మీద పెట్టి వెళ్లి పోతారు.


ఆ 5 తీసుకుని వాళ్ళ చెల్లిని మర్చిపొమ్మని పరోక్షంగా చెప్తారు...


వాళ్ళు వెళ్ళిపోయాక హీరో అమ్మగారు హీరోని చూస్తు రవి నీకు అర్ధం అయ్యిందారా..?  ఆ పిల్లాడు అడిగాడు చిత్తు కాగితాలు ఏరుకునే వాడికి మీ పిల్లను ఇస్తారా అని. గద్వాల్ రెడ్డి గారి ఫ్యామిలీ తో పోలిస్తే  మన స్థాయి అదే కాదరా? మరీ వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి కాదరా? అని అంటుంది.


ఈ పెళ్లి జరిగితే నీకు గొప్ప జీవితం వస్తుందని ఊహించామే కాని ఒక అమ్మాయి గొప్ప జీవితాన్ని కోల్పోతుందని ఊహించలేక పోయాం రా.. అని అంటాడు హీరో నాన్న..


 ఈ పెళ్లి చేయడం ఇష్టం లేక పోతే మన ఆటోకు యాక్సిడెంట్ చేయోచ్చు, ఇంకా ఏమైనా చేయోచ్చు కాని వాళ్ళు అలా ఏమి చేయలేదురా. రెండు కన్నీటి బొట్లు కార్చి వెళ్ళిపోయారు. ఆ కన్నీటికి విలువనిద్దాం రా అంటుంది హీరో అమ్మగారు.. దాంతో హీరో బాధతో సరేనంటు తలూపుతాడు.. 


ఈ సన్నివేశం లో హీరో కి ఒక్క డైలాగ్ కూడా ఉండదు..


వాళ్ళు చెప్పిందాంట్లో తప్పు లేదు కాబట్టి హీరో ఏమీ అనడు. ప్రేమంటే ప్రేమించడానికి బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఒక జీవితం ఉంటుంది. అది సాగాలంటే డబ్బు ఉండాలి. ఒక ధనవంతుల అమ్మాయి అప్పటి వరకు ఏ కష్టం తెలియకుండా పెరిగింది ఇప్పుడు ప్రేమ పేరుతో పేదరికంలోకి వెళ్లి కష్టాలు పడటమే తప్ప మరోటి కాదు. 


చాలా సినిమాల్లో హీరోయిన్ అన్నయ్యలు ఇలాంటి సన్నివేశాల్లో హీరో ఇంటికి వెళ్ళి దాడి చేయడం, దాడిని హీరో తిప్పి కొట్టడం పదిమందిని గాల్లోకి ఎగరేసి కొట్టడం లాంటి సీన్స్ ఉంటాయి. అలాగే హీరో శపథాలు చేసి నెల రోజుల్లో కోటీశ్వరుడు అయి నీ చెల్లిని పెళ్ళి చేసుకుంటా..!! అంటూ భారీ డైలాగులు, ఛాలెంజ్ లు ఉంటాయి. అలా నెల రోజుల్లో కోటీశ్వరుడు అయి కూడా చూపిస్తారు మన హీరోలు. కాని ఇక్కడ అవేమి ఉండవు హీరో అసలు ఒక్క మాట కూడా మాట్లాడడు. వాళ్ళు అన్నది నిజమే కదా అని అర్థం చేసుకుని తను చేసేది తప్పు అని తెలుసుకుని  ఫ్యామిలీ తో సహా ఊరొదిలి వెళ్లి పోతారు..


 ఇది చాలి రియాలిటీ గా ఉంటుంది.. సీనిమా వేరు జీవితం వేరు సినిమాలో ఏదైనా జరుగుతుంది కానీ జీవితంలో అలా జరగదు ఎన్నో అడ్డంకులు, బాధలు ఉంటాయి. ఇక్కడ ప్రేమిస్తే సరిపోదు దానికి ఒక స్థాయి ఉండాలి అని అదిలేకుంటే తర్వాత ఏమవుతుందో చెప్పారు. చాలా బాగుంది ఈ సన్నివేశం..


చాలా మంది ప్రేమికులను ఆలోచింప చేసేలా ఉంటుంది.


ప్రేమి ఇద్దరు వ్యక్తుల ప్రమాణం, పెళ్ళి రెండు కుటుంబాల ప్రయాణం. 


ఆ కుటుంబాలు ఒప్పుకోవాలి కదా.


అలా కుటుంబంలోని వారికి వీళ్ళ ప్రేమలు నచ్చక పోతే ఏమవుతుందో మనం నేడు సమాజంలో చూస్తూనే ఉన్నాం. తమ కూతురు వేరే కులం వాడిని ప్రేమించి పెళ్ళి చేసుకుందని, తమ పరువు పోయిందని, అమ్మాయి వాళ్ళ నాన్నలు, అన్నయ్యలు తమ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాడిని అంతం చేస్తున్నారు.


కాబట్టి ఎవరైనా ప్రేమించే ముందు ఒకసారి ఆలోచించండి. అంటే మనం అమ్మాయి ప్రేమించాలంటే ఆ అమ్మాయి స్థాయి కి తగ్గట్టు ఉండాలా?? అని అడగొద్దు. తప్పకుండా అలా ఉండాల్సిందే. లేదంటే ఒక పేదవాడు ధనవంతుల అమ్మాయి ని ప్రేమించి ఏ ధనవంతుల కూతుర్లకు పెళ్ళిళ్ళు కావా, మొగుళ్ళు రారా అంటు సినిమా డైలాగులు కొడితే బయట పరిస్థితి దానికి భిన్నంగా ఉంటుంది. కాబట్టి సినిమాలు చూసి ప్రేమ ప్రేమ అని పాకులాడే వారికి నేను చెప్పేది ఏంటంటే..


ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, అంతేకాని ప్రేమే జీవితం కాదు. నిన్ను నమ్మి నీకుటుంబ సభ్యులు ఉంటారు ముందు వారి గురించి అలోచించి ప్రేమల గురించి అలోచించండి..


ప్రేమ లేకుండా బతకొచ్చు కాని డబ్బు లేకుండా బతకలేం..


చదువుకునే వయసులో ప్రేమించడం బాగానే ఉంటుంది. ఆ తర్వాత జీవితం చాలా కష్టంగా ఉంటుంది.


ఎందుకంటే చదువుకుని ఒక స్థాయి కి వెళ్ళకుండా ప్రేమ అంటు పార్కుల వెంబడి తిరిగితే పెళ్ళైయ్యాక ఒకరి చేతికింద జీవితాంతం వెట్టిచాకిరి చేసి కుటుంబాన్ని పోషించాల్సి ఉంటుంది..


అందుకే ప్రేమ అనేది అంత ముఖ్యం కాదు మన కేరీర్ ముఖ్యం. ఈ వయసులో ప్రేమ అంటు తిరిగితే జీవితాంతం బాధ పడుతూ బతకాల్సి ఉంటుంది.


అలాగే మీపై ఆధారపడిన మీక కుటుంబ సభ్యులను బాధ పడేలా చేయకండి...


ఇక ప్రేమ చాలా గొప్పది విలువైనది అంటారు నిజమే ప్రేమ అనేది చాలా గొప్పది అమ్మ నాన్నల ప్రేమ గొప్పది,తోట బుట్టిన వాళ్ళ ప్రేమ గొప్పది. ఈ ప్రేమను ఎవరు పట్టించుకోరు కేవలం అమ్మాయి ప్రేమ మాత్రమే గొప్పది అని తెగ ఎమోషన్స్ చేస్తూ  విరహ  గీతాలు పాడుతూ, ప్రేమ లేకపోతే జీవితమే లేదు అన్నట్టు సినిమా వాళ్ళు చూపిస్తుంటారు.  దాన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకుని కొందరు జీవితాలను పాడుచేసుకుంటారు. సినిమా వాళ్ళు సినిమాలో మాత్రమే ప్రేమ గురించి గొప్పగా నీతులు చెబుతుంటారు. కాని వాళ్ళ నిజ జీవితాలు అందుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. అది రోజు మనకు కనపడుతూనే ఉంది... 


కాబట్టి సినిమా వేరు జీవితం వేరు. సినిమాల్లో మాదిరి జీవితంలో జరుగుతుందనుకుంటే ఇక అంతే జీవితం తలకిందులుగా అవుతుంది...


ఈ సినిమాలో ఈ సన్నివేశం చాలా రియాలిటీ గా అనిపించింది.. ఇలాంటి సినిమాల వల్ల సమాజంలో మార్పు వస్తుంది అని నేను భావిస్తున్నాను..


అలా కాకుండా ప్రేమ గొప్పది ప్రేమించిన అమ్మాయిని లేపుకపోయి పెళ్ళి చేసుకోవాలని చెబితే ఏమవుతుందో చూస్తూనే ఉన్నాం. తమ కుటుంబం పరువు కోసం ఎంతకైనా తెగించే వాళ్ళను చూస్తున్నాం..


వాళ్ళు రాక్షసులు అనొచ్చు కాని వాళ్ళు చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ అమ్మాయిని ఎవడో ముక్కు మొహం తెలియని వాడొచ్చి మూడు నెలలు ప్రేమించిన అనే ఒకే ఒక్క అధికారంతో లేపుకపోయి పెళ్ళి చేసుకుంటే ఎవరి ఫ్యామిలీ కైనా కోపం రాక మంచి పని చేసారని సన్మానం చేస్తారా....? ఇరవై ఏళ్ల ప్రేమ కంటే మూడు నాలుగు నెలల ప్రేమ గొప్పదా..!!






 అందుకే ఇంత పెద్ద పోస్టు రాస్తూ లెక్చర్ ఇచ్చాను. ఇంత ఓపికగా చదివినందుకు ధన్యవాదాలు

..



అవును సినిమా పేరు చెప్పడం మర్చిపోయాను. 

సినిమా పేరు "పేపర్ బాయ్".








 





 




7, జులై 2022, గురువారం

ప్లాస్టిక్ నిషేధం విధించారు సరే, అమలు చేయడం సాధ్యమేనా??

    దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ వస్తువులను నిషేధించడం శుభపరిణామం. నేను ఎప్పటినుంచో ఎదురుచుస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక పెద్ద మార్పుకు నాంది. 


నిషేధం విధించారు సరే అమలు జరగడం సాధ్యమేనా.. 


ఒకసారి వాడిపాడేసే ప్లాస్టిక్ వస్తువులను నిషేదించామంటున్నారు అందులో వాటర్ బాటిల్స్ లేవు. పేపర్ ప్లేట్లు లేవు ఇవికూడా ఒకసారి వాడిపాడేసేవే కదా.. 


మరొకటి గాలి అమ్మే ప్యాకెట్లు అదేనండి చిప్స్ పాకెట్లు వాటిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదు.. వీటివల్ల కూడా పెద్ద ఎత్తున కాలుష్యం అవుతుంది. ఈ ప్యాకెట్లో 95% గాలి మిగితా 5% మాత్రమే చిప్స్ అనే పదార్థం ఉంటుంది.. ఈ ప్యాకెట్లో ఉండే పదార్థం తక్కువ దాని ద్వారా వచ్చే కాలుష్యం ఎక్కువ.. ఇలాంటివి కూడా నిషేధించాలి.. నిషేధం అంటే నిషేదమే కఠినంగా ఉండాలి అప్పుడే మార్పు వస్తుంది..


నిషేధం అని మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో పెడితే బాగుంటుంది.. ఇదివరకు చాలా సార్లు నిషేదం విధించారు కాని మళ్ళీ వాడుతూనే ఉన్నారు...


వాటర్ బాటిల్స్, పేపర్ ప్లేట్లు, గ్లాసులు,చిప్స్ ప్యాకెట్స్ ఇలా వీటన్నింటినీ నిషేధించాలి..  అప్పుడే కాలుష్యం తగ్గి పరిసరాలు పరిశుభ్రంగా, అందంగా తయారవుతాయి.. లేదంటే మళ్ళీ కథ మొదటికే వస్తుంది...


ప్రజల్లో అవగాహన కల్పించి ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను వాడే విధంగా ప్రోత్సాహించాలి. 


నేను చాలా సార్లు చెప్పాను. మళ్ళీ చెబుతున్నా ప్రతీ ఒక్కరు బయటకు వెళ్ళినప్పుడు కూరగాయలకు వెళ్ళినప్పుడు వెంట కాటన్ సంచి లేదా జ్యూట్ బ్యాగులను వెంట తీసుకు వెళ్ళండి. అలాగే వాటర్ బాటిల్ బయట కోనే కంటే ఇంటినుండి స్టీల్ బాటిల్లో నీళ్ళు తీసుకెళ్ళాలి. పిల్లలకు గాలి ప్యాకెట్లు అవే చిప్స్ ప్యాకెట్లు తినే అలవాటు చేయకండి.. మనం తినకుంటే కంపెనీ వాడు ఎందుకు చేస్తాడు.. కాబట్టి ముందు మనం మారాలి. 


ప్లాస్టిక్ నిషేధం బాధ్యత ప్రభుత్వానిది మనకెందుకులే అనుకోకుండా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలి... 


ప్లాస్టిక్ తరిమేద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం...







20, ఏప్రిల్ 2022, బుధవారం

నియంతలు, సామ్రాజ్యవాదులు ఉన్నంతకాలం ప్రపంచంలో శాంతి ఉండదు.

  ప్రపంచంలో ఏ మూలన ఏ సంక్షోభం వచ్చిన అందుకు కారణం కొందరు నియంతల సామ్రాజ్యవాదం వలనే.

 ఉక్రెయిన్ యుద్దానికి కారణం సామ్రాజ్యవాదుడైన నియంత పుతిన్. రష్యా పేరుకు ప్రజాస్వామ్య దేశమైన పుతిన్ దానిని నియంత్రుత్వ పాలన కింద మార్చేసాడు.

నియంతల్లో రెండు రకాల నియంతలు ఉంటారు. ఒకరు సామ్రాజ్యవాద నియంతలు. మరొకరు వారసత్వ పాలన నియంతలు.


    పుతిన్ సామ్రాజ్యవాద నియంత. తన లక్ష్యం పూర్వపు సోవియట్ యూనియన్లో ఉన్న దేశాలన్నిటిని కలిపి సోవియట్ యూనియన్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు ఆరాటపడుతున్నాడు. వయసు మీద పడుతోంది సోవియట్ యూనియన్ కు తిరిగి పూర్వ వైభవం తీసుకువచ్చి తన పేరు చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నాడు. అందుకే  ఉక్రెయిన్ పై ఈ యుద్దానికి దిగాడు. సైనిక పరంగా బలహీనమైన దేశం నాలుగు రోజుల్లో స్వాదీనం  చేసుకుందాం అనుకున్నాడు. కాని 50 రోజులైన ఉక్రెయిన్ లొంగిపోవడం లేదు. 50 రోజుల నుండి ఉక్రెయిన్ సంక్షోభం అలానే ఉంది. రష్యా నియంత లక్ష్యం కోసం, సామ్రాజ్య విస్తరణ కోసం ఉక్రెయిన్ లో అశాంతి నెలకొంది. కొన్ని లక్షల మంది  ఉక్రెయిన్ ప్రజలు బతుకు జీవుడా అంటూ పొరుగు దేశాలకు వలస వెళ్లిపోయారు. ఈ సంక్షోభం ముగియాలంటే అధ్యక్షుడు జెలెన్ స్కీ నాటోలో చేరకుండా సోవియట్ యూనియన్లో చేరతానని ఒప్పుకుంటే యుద్ధం ఆగిపోతుంది కాని అది జరగదు. దేశం అంటే అధ్యక్షుడు ఒక్కడే కాదు కదా ప్రజలందరూ ఒప్పుకోవాలి. రష్యా కంటే పశ్చిమ దేశాల వైపే ఉక్రెయిన్ ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఏ దేశ ప్రజలైనా నియంత్రుత్వ పాలన కోరుకోరు కదా.

 అందుకే నాటో వైపే ఉక్రెయిన్ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ప్రజలు కూడా యుద్ధం చేస్తున్నారు.



    ఉక్రెయిన్ సంక్షోభం ముగియాలంటే అధ్యక్షుడు జెలెన్ స్కీ లొంగిపోవాలి. రష్యా, ఉక్రెయిన్ యుద్దం లో హీరో ఎవరంటే ఆ దేశ సైనికులు, ప్రజలు, అధ్యక్షుడు జెలెన్ స్కీ అని చెప్పొచ్చు. చిన్న దేశం సైనిక పరంగా, ఆయుధాల పరంగా రష్యాకు ఏ మూలకు సరితూగని దేశం. అణ్వాయుధాల లేవు అయినా కూడా ఇన్ని రోజులగా యుద్ధం చేస్తూనే ఉంది అంటే దానికి కారణం జెలెన్ స్కీ నే.  ఆయన స్థానంలో వేరే ఎవరున్నా దేశం విడిచి పారిపోయేవారు. నాటో దేశాలు తన తరపున యుద్ధం చేస్తాయనుకున్నాడు కాని అది జరగలేదు. నాటో రాలేదు, ఆయుధాలు లేవు,ఈ పరిస్థితుల్లో కూడా శక్తి వంతమైన రష్యాతో పోరడడానికే సిద్దపడ్డాడు. అందుకే జెలెన్ స్కీ నిజమైన హీరో. అసలు సిసలైన దేశభక్తుడు, నాయకుడు.. తను రష్యాతో యుద్దం గెలవలేక పోవచ్చు గాని తన పోరాటం ఎన్నో చిన్న దేశాలకు స్పూర్తి నిస్తుంది. శత్రువు ఎంత బలవంతుడైనా సరే ధైర్యంగా ఉండి పోరాడితే విజయం సాధించవచ్చు అని నిరూపించాడు. పోరాడితే పోయేది ఏముంది బానిస సంకెళ్లు తప్ప..

 

       అందమైన ఉక్రెయిన్ నగరాలు బాంబు మోతలతో కళావిహీనంగా మారాయి, లక్షల మంది ఉక్రెయిన్ ప్రజలు ఇతర దేశాలకు వలసలు వెళ్లిపోయారు, అమాయక ప్రజలు, సైనికులు యుద్ధంలో చనిపోతున్నారు. ఈ హృదయం విదారక దృశ్యాలను, ఈ వినాశనాన్ని చూసి జెలెన్ స్కీ వెనక్కి తగ్గి రష్యాకు తలొగ్గితే ఈ సంక్షోభం ముగుస్తుంది.  లేదు ఇలాగే ముందుకు వెళ్తే వినాశనమే అణు యుద్ధం వరకు వెళ్ళవచ్చు.  నియంతలు ఓటమి ఒప్పుకోరు అందులో పుతిన్ లాంటి వారు అసలు ఒప్పుకోరు. జెలెన్ స్కీ నే తన దేశ ప్రజల కోసం ఓడిపోయి శాంతి నెలకోల్పుతాడని అనుకుంటున్నాను.



  ఇక శ్రీలంక సంక్షోభానికి కారణం చైనా. చైనా కూడా సామ్రాజ్యవాద దేశమే. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ది కూడా నియంత్రృత్వ పాలనే. శ్రీలంకలో పాగా వేసి హిందూ మహాసముద్రంలో పట్టు సాధించాలని చూస్తున్నాడు. దాని ఫలితమే శ్రీలంకతో ఆర్థిక సంక్షోభం. ఇటు పాకిస్థాన్, అటు శ్రీలంకను ఆక్రమించి చైనాను విస్తరించాలని చూస్తున్నాడు. అందుకోసమే ఆ దేశాలకు అభివృద్ధి పేరిట రూణాలిచ్చి ఆర్థికంగా దెబ్బతీసి ఆక్రమించుకోవాలని జిన్ పింగ్ ఆలోచన. 


     ఇక మరో  రకం నియంత  ఉత్తర కొరియా అధ్యక్షుడు కింగ్ జోన్ ఉన్. వారసత్వ పాలన నియంత. ఇతను సామ్రాజ్యవాదుడు కాకపోయినా ప్రపంచంలో అశాంతికి కారణం అవుతాడు.  అణ్వాయుధాలు, క్షిపణులు తయారు చేస్తూ పెద్ద దేశాలను హెచ్చరిస్తూ ఉంటాడు.  దేశ ప్రజలను బానిసలుగా చేసి పరిపాలిస్తున్నాడు. పక్క దేశం  దక్షిణ కొరియా LG, SAMSUNG వంటి  ఎలక్ట్రానిక్స్, HUNDAI,KIA  వాహనాలు ఉత్పత్తి చేస్తూ అభివృద్ధి చెందుతుంటే, కింగ్ జోన్ ఉన్  వంటి  నియంతలు వినాశకర ఆయుధాలు ఉత్పత్తి చేస్తూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నారు. ఇలాంటి నియంతలు ఉన్నంత కాలం ప్రపంచంలో శాంతి నెలకొనడం అసాధ్యం..



  


29, మార్చి 2022, మంగళవారం

ప్లాస్టిక్ మనుషులు

 



     మానవుడు ఎన్నో ఆవిష్కరణలు చేసాడు అవి మానవాలికి ఉపయోగంతో పాటు కీడు కూడా చేస్తాయి. ప్రపంచంలో ఏ ఆవిష్కరణ అయిన రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటిది. దానిని సరియైన విధంగా ఉపయోగిస్తే అందరికి శ్రేయస్కరం. కాని వాటిని చాలా మట్టుకు వినాశనం ఉండే విధంగానే ఉపయోగిస్తున్నారు. కొంతమంది తెలియక చేస్తే మేధావులు తమ అతి తెలివితో వినాశనానికి దారితీస్తున్నారు.


ఏ ఆవిష్కరణ అయిన తరువాత వ్యాపారం అయిపోతుంది. ఆ తర్వాత ఈ వ్యాపారాలతో ప్రకృతిని నాశనం చేస్తారు. 


మనిషి ఆవిష్కరించిన వాటిలో అత్యంత చెత్త ఆవిష్కరణ "ప్లాస్టిక్".  ఇది ఎంత చెత్త ఆవిష్కరణ అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ చెత్తే కనిపిస్తుంది.

నేలపై, నదుల్లో, సముద్రాల్లో ఇలా ఎక్కడ చూసినా ఈ చెత్తే కనిపిస్తుంది. పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉంటుంది.. ఇన్ని రోజులు బయట మాత్రమే ఉండే ఈ చెత్త ప్లాస్టిక్ ఇప్పుడు మానవ శరీరంలో రక్తంలోకి కూడా చేరింది... ఇన్నాళ్లు పర్యావరణాన్ని చెత్తగా మార్చిన ప్లాస్టిక్ ఇప్పుడు మానవ శరీరాన్ని చెత్తగా మారుస్తుంది.


      ఆవిష్కరణలు మనిషి జీవన విధానాన్ని ఎంత సులభతరం చేస్తయో అంతకంటే ఎక్కువగా నాశనం కూడా చేస్తాయి. ఆవిష్కరణలు రెండు వైపుల పదును వున్న కత్తుల్లాంటివి వాటిని ఎంత జాగ్రత్తగా వాడితే అంత మంచిది విచ్చలవిడిగా వాడితే ముప్పు తప్పదు.. 

     

    ఇప్పుడు ఈ ప్లాస్టిక్ మానవ శరీరంలో రక్తంలోకి ఎలా చేరింది.?

    

 ఎలా చేరిందంటే మనిషి విచ్చలవిడిగా వాడడం వలనే.



 అవసరం ఉన్నా లేకున్నా ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అయిపోయింది.



అందులో కొన్ని నాకు తెలిసినవి:-


ఉదయం నుంచే మన పరుగు ప్లాస్టిక్ తోనే మొదలవుతుంది.


ఉదయము కూరగాయలకు వెళ్తారు ఖాళీ చేతుల్తో. వచ్చేటప్పుడు ప్లాస్టిక్ కవర్లలో కూరగాయలు నింపుకుని వస్తారు.



పాలు ప్లాస్టిక్ కవర్లో.


కిరాణా సరుకులు ప్లాస్టిక్ కవర్లో.


బయట  ఎక్కడైన టిఫిన్ చేస్తే ప్లాస్టిక్ కవర్లో నే.


భోజనం ప్లాస్టిక్ ప్లేట్లలో నే.


ఆహారం ప్యాక్ చేయడం ప్లాస్టిక్ కవర్లో నే.


టీ తాగడానికి కూడా ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకొని తాగుతున్నారు.


అసలు ప్లాస్టిక్ వాడకం అనేది మామూలుగా లేదు అవసరం ఉన్నా లేకపోయినా వాడడం మాత్రం పక్కా.


అంతలా వాడితే మనిషి రక్తంలో ఏంటి ఏకంగా శరీరం మొత్తం ప్లాస్టిక్ అయిపోయి "ప్లాస్టిక్ మనుషులు" గా మారిపోయిన ఆశ్చర్యం లేదు..!!!



ఉదయం లేవగానే కూరగాయలకు ఒక సంచి తీసుకుని వెళ్తే ఏమవుతుంది.? చాలామందికి చేతిలో సంచి తీసుకుని బయిటకు వెళ్తే నామోషో లేక బద్ధకమో తెలియదు కాని అస్సలు తీసుకెళ్ళరు.


 ఖాలీ చేతుల్తో కిరాణా సరుకులు, కూరగాయలకు వెళ్ళి గంపెడు ప్లాస్టిక్ చెత్తను తీసుకువస్తారు. సరే తెచ్చారు వాటిని సరైన విధంగా రీసైక్లింగ్ చేసే విధంగా చేస్తారా అంటే అదిలేదు. ఇష్టం వచ్చినట్టు బయట పారేయడం లేదా కాల్చివేయడం చేస్తారు. ఇలా కాల్చడం వలన ప్లాస్టిక్ కణాలు గాలిలో కలిసి ఆ గాలి పీల్చునప్పుడు శరీరం లోకి ప్రవేశిస్తున్నాయి.


ఇంకొందరు మహానుభావులు వేడి వేడి 'టీ' ని  కూడా ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకొని తాగుతున్నారు. టీ కొట్టు వాడికి తెలియక పోవచ్చు వేడి పదార్థాలను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేయోద్దని చదువుకున్న వాళ్ళుకూడా తెలియదా అలాగే తాగుతున్నారు. అంత వేడి టీ ని ప్లాస్టిక్ కవర్లో పోస్తే ఆ వేడికి ప్లాస్టిక్ కరిగి టీలోకి వెళ్ళి అది తాగినవారి శరీరం లోకి వెళుతుంది.

అలా చేయకుండా ఒక ప్లాస్క్ వాడితే సరిపోతుంది కదా. ప్లాస్క్ వాడడానికి బద్దకం, ఆ ప్లాస్క్ ను కొట్టు వరకు తీసుకువెళ్ళడానికి నామోషి. 


ఇక నీళ్ళు ప్లాస్టిక్ బాటిల్లో.

పల్లెటూళ్ళలో అయితే ఒకసారి తాగిపడేసిన కూల్ డ్రింక్స్ బాటిల్స్, నీళ్ళ బాటిల్స్ ని పదే పదే నీళ్ళు నింపుకుని వాడుతుంటారు.  ఈ ప్లాస్టిక్ బాటిల్స్  లో ఎక్కువ రోజులు నీళ్ళు తాగితే అందులోని ప్లాస్టిక్ కణాలు అందులోని నీటిలోకి వెళ్తాయని వాళ్ళకి తెలియదు. అలాగే వాడుతూ ఉంటారు. తెలిసిన 

ఎవరూ చెప్పరు, చెప్పిన ఎవరూ వినరు...




     ఇంకా పెళ్ళిళ్ళు, దావత్ లకు అప్పట్లో మోదుగ ఆకులతో తయారు చేసిన విస్తరాకుల్లో భోజనం వడ్డించేవారు. ఆ విస్తరాకుల్లో  తృప్తి గా భోజనం చేసేవాళ్ళం. వాటిని తీసుకెళ్ళి పెంటలో వేసే వాళ్ళు అవి ఎరువుగా మారేవి... ఇప్పుడు పేపర్ ప్లేట్లో వడ్డిస్తున్నారు ఈ పేపర్ ప్లేటునుంచి ఏదో దుర్గంధం వస్తుంది. పైగా వాటిపై ప్లాస్టిక్ కవర్ ఉంటుంది వేడి పదార్థాలు అందులో తింటే  ప్లాస్టిక్ శరీరంలోకి చేరకుండా ఉంటుందా..?


ఎంత చక్కనివండి  అప్పట్లో మన పల్లెల్లో "మోదుగ ఆకులతో" తయారు చేసిన విస్తరాకులు. అందులో భోజనం చేస్తే అమోఘం. వీటి వలన పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు పైగా అవి ఎరువుగా ఉపయోగపడుతాయి. ఈ పేపర్, ప్లాస్టిక్ విస్తరాకుల వలన అన్ని విధాలుగా నష్టమే ఎక్కువ...


మన ఆచారాలు, సంప్రదాయాలు అన్ని మరిచిపోయి ప్లాస్టిక్ వెంట పరిగెత్తి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్నాం...



ప్లాస్టిక్ వలన ఖర్చు తక్కువ, తేలికగా ఉండడం ఎక్కువగా వాడుతున్నారు. కాని పరోక్షంగా దీని నష్టాలు గమనించడం లేదు.


ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. అది మన చేతుల్లోనే ఉంది..


కిరాణా సరుకులు, కూరగాయలకు వెళ్ళినప్పుడు జనపనార (జ్యూట్ )బ్యాగులు కాని కాటన్ బ్యాగులు కాని వెంట తీసుకెళ్ళాలి.


పేపర్ ప్లేట్లకు బదులు అరటి ఆకులు గాని, మోదుగ ఆకులతో తయారు చేసిన విస్తరాకులు వాడాలి.


బయట నుండి పార్శిల్ తెచ్చుకొని తినడం కంటే ఇంట్లోనే వండుకోవడం వల్ల ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచిది.....








28, మార్చి 2022, సోమవారం

అభివృద్ధి పేరు చెప్పి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు.

 





అభివృద్ధి పేరు చెప్పి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. 

  పచ్చటి పంటపొలాలను నాశనం చేసి ఫ్లాట్లు చేస్తున్నారు. 

ఒకప్పుడు మా ఊరి భూముల్లో పంటలు

పండేటివి.కాని ఇప్పుడు ఫ్లాట్లు పండుతున్నాయి. 

హైదరాబాద్ కు చుట్టుపక్కల 100 కి.మీ దూరంలో ఎక్కడ చూసినా పొలాలు లేవు ఫ్లాట్లు, వెంచర్లే కనిపిస్తాయి. అక్కడక్కడ కొంత పొలాలు ఉన్న ఇంకొన్ని రోజుల్లో అవి కనుమరుగైపోతాయి.


ఎవరి నోట విన్న వెంచర్లు,ప్లాట్లు,కోట్లు ఇవే మాటలు.


    రైతులకు లక్షలు,కోట్లు ఆశ చూపించి భూములు కొనుగోలు చేయడం వెంచర్లు వేయడం ఇదేపని.

పాపం రైతులు ఎప్పుడు అంతడబ్బు చూసి ఉండరు ఒకేసారి ఎకరం కోటి రూపాయలు అనేసరికి ఎగిరిగంతేసి భూములు అమ్మేసుకుంటున్నారు.

భూములు అమ్మని రైతులను ఎలాగోలా అమ్మేలా చేస్తున్నారు. రైతుల భూములకు దారిలేకుండా చేసి భూములు అమ్ముకునేలా చేస్తున్నారు.


రోడ్డు ప్రక్కన భూమి ఉంటే చాలు రియల్ ఎస్టేట్ గ్రద్దలు అక్కడ వాలిపోతాయి. ఆభూమిని ఎలాగోలా ఎన్ని డ్రామాలు ఆడైనా కొనేస్తారు.  ముందుగా రోడ్డు ప్రక్కన ఉన్న భూమిని కొనేస్తే వెనకాల ఉన్న పొలాలను కొనడం వారికి తేలికవుతుంది. ఎందుకంటే వారికి దారి ఇవ్వకుండా చేసి భూములు అమ్మేలా చేస్తారు. పచ్చని పంటలు పండే భూముల్లో ప్లాట్లు చేసి కోట్లకు అమ్ముకోవడం. మనిషి ఈజీ మనీకి అలవాటు పడిపోయాడు. కష్టపడకుండా కొంచెం తెలివితేటలు ఉపయోగించి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవ్వాలి అనుకుంటున్నారు,అవుతున్నారు. వేలిముద్రలు (అంగూటి) వేసేవాళ్ళు కూడా కోట్లు సంపాదిస్తున్నారు. 

మద్యలో బ్రోకర్లు అబ్బో వీళ్ళగురించి రాస్తే ఒక పుస్తకం అవుతుంది. ఆలోచన రియల్ ఎస్టేట్ వ్యాపారులదైతే ఆచరణ బ్రోకర్లది. వీళ్ళు ఏలాగైనా సరే రైతులను భూములు అమ్ముకునేలా చేస్తారు. ఎలాగైనా సరే....!

 వాళ్ళ కమీషన్ కోసం ఏమైనా చేస్తారు...



నా చిన్నప్పుడు పంటపొలాల్లో అన్నిరకాల పంటలు పండేవి. రాను రాను పత్తి, మొక్కజొన్న ఎక్కువగా పండించేవారు. ఇప్పుడు అవికూడా లేవు 50% పంటపొలాలు ప్లాట్లుగా మారాయి. ఎందుకు ఈపరిస్థితి దాపురించింది అంటే.నా చిన్నప్పుడు పంటలు బాగా పండేవి పాడిపశువులు ప్రతీ ఇంటికి ఉండేవి. వాటి పేడ ఎరువుతోనే పంటలు పండేవి. చీడపీడలు ఉండేవి కావు. రసాయన మందులు అసలు ఎవరికి తెలియదు.కృత్రిమ ఎరువులు, విత్తనాలు వాడలేదు. అప్పుడు రెైతులు అన్నిరకాల అపరాలు,జొన్నలు,వరి,  మిరప, కొర్ర, సజ్జలు, రాగులు,పసుపు వంటి ఆహార పంటలే పండించేవారు.

వ్యవసాయం అంటే పెట్టుబడి ఉండేదే కాదు కేవలం రైతు శ్రమే వ్యవసాయానికి పెట్టుబడి. విత్తనాలు సొంతంగా తయారు చేసుకునేవారు,ఎరువులు పశువుల పేడ. అలా వ్యవసాయం చేసారు కాబట్టి దిగుబడులు బాగా వచ్చేవి. 

ఎవరి ఇంట్లో చూసినా గుమ్ములకు, గుమ్ములు జొన్నలు,బియ్యం,కందులు,కొర్రలు, పెసలు ఉండేవి. 

డబ్బు ఎక్కువగా ఉండేదికాదు. అయినా సంతోషంగా ఉండేవాళ్ళు. 


ఎప్పుడైతే వ్యవసాయం వ్యాపారం అయిందో అప్పటినుండి వ్యవసాయం నాశనం అవుతూ వచ్చింది. డబ్బు ఆశ చూపించి ఈ పంటలు వేస్తే  ఇంత దిగుబడి వస్తుంది ఇంత ధర ఉంటుంది అంటు రైతులకు వాణిజ్య పంటల వైపు మళ్ళేలా చేసారు. ముఖ్యంగా పత్తిపంట. మొదట్లో దిగుబడులు బాగా వచ్చే సరికి చాలామంది రైతులు పత్తిపంట వేయడం ప్రారంభించారు. పత్తి విత్తనాలు రైతులు తయారు చేసుకోలేరు విత్తన కంపేని వారు తయారు చేసే విత్తనాలే వాడాలి. అలా విత్తన కంపెనీలు విత్తనాన్ని తమగుప్పిట్లోకి తీసుకుని వ్యాపారం మొదలెట్టాయి.

ఏం భూమిలో అయినా ఎన్ని రోజులు దిగుబడులు వస్తాయి ఒకే పంట వేస్తుంటే? మొదట్లో దిగుబడులు వచ్చినా రాను రాను దిగుబడులు తగ్గాయి. మళ్ళీ ఇక్కడ ఇంకో వ్యాపారం మొదలైంది ఎరువుల వ్యాపారం ఈ ఎరువులు వాడండి దిగుబడి పెరుగుతుంది అని ఎరువులు కొనేలా చేసారు. తరువాత పురుగుమందులు ఇలా మొత్తం వ్యవసాయాన్ని పెట్టుబడి లేనిదే చేయలేమనే స్థాయికి తీసుకొచ్చారు. 


ఒకప్పుడు రైతులు స్వయంగా తామే విత్తనాలు, ఎరువులు తయారు చేసుకునేవారు. పురుగుమందుల వాడకం అసలే ఉండేది కాదు. ఇప్పుడు వ్యవసాయం అంటే పెట్టుబడి లేనిదే చేయలేని స్థితికి తీసుకొచ్చారు.

వ్యవసాయం దండగా అనే స్థాయికి తీసుకొచ్చారు.

ఒకప్పుడు ఆహారం పంటలు మనదగ్గరే పండేవి కొనవలసిన అవసరం ఉండేది కాదు. ఎప్పుడైతే వ్యవసాయం వ్యాపారం అయిందో అప్పటినుండి ఆహార పంటలు తగ్గిపోయాయి, దిగుబడులు తగ్గాయి.పశుసంపద తగ్గిపోయింది. ఇప్పుడు మనం అన్ని కొనుక్కోవలసిందే.విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలి. అందుకు డబ్బు కావాలి. ఏది కావాలన్నా డబ్బే కావాలి. డబ్బు డబ్బు డబ్బు. డబ్బు లేనిదే ఏమి తినలేం. పంటలు ఎలాగు పండవు అందుకని భూములు అమ్ముకొంటున్నారు.



అప్పుడు ఆరోగ్యకరమైన పంటలు తిని హాయిగా ఆరోగ్యంగా జీవించేవారు. ఇప్పుడు రసాయన ఎరువులు, పురుగుమందులు వేసి పండించిన పంటలు  తిని రోగాల పాలు అవుతున్నారు. 


ఇదా అభివృద్ధి అంటే...???



  మనిషికి కావలసింది ఏంటి కూడు,గూడు, గుడ్డ, ఆరోగ్యకరమైన జీవితం. అంతే కాని డబ్బు కాదు. 

  

కాని డబ్బు డబ్బు అని ఆశ చూపించి పర్యావరణాన్ని, ఆరోగ్యకరమైన జీవనాన్ని నాశనం చేస్తున్నారు.

దీనికి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. చేను కంచె చేసినట్టు ప్రభుత్వమే పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. రైతులను కోటీశ్వరులను చేస్తాం అని గొప్పలు చెప్పుకొంటున్నరు. ఎందుకు ఈ కోట్లు డబ్బులు తింటారా, ఆరోగ్యం పాడైనాక ఎన్నికోట్లు ఉండి ఏం లాభం. పర్యావరణాన్ని దెబ్బతీసి, ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని నాశనం చేసే కోట్ల రూపాయల డబ్బు ఎందుకు...? పర్యావరణం నాశనం అయ్యాక ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన తిరిగి మునుపటి స్థితికి రాదు. 


 111 జీవోను ఎత్తేసి రెండు నదుల పరివాహక ప్రాంతంలోని రైతులను కోటీశ్వరులను చేస్తాం  అని సారు చెప్తున్నాడు. జీవో ఎత్తేస్తే ఏమవుతుంది ఆ ప్రాంతంలో బహుళజాతి కంపెనీలు, అపార్ట్ మెంట్లు పరిశ్రమలు వస్తాయి.పరిశ్రమలనుండి విడుదలయ్యే కాలుష్యం తో రెండు నదులు, రెండు జలాశయాలు మొత్తం కలుషితం అయిపోయి ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఆ ప్రాంతంలో గాలి,నీరు,నేల అన్నిరకాలుగా కలుషితమే. ఇప్పుడు జంట జలాశయాల నీరు తాగేందుకు వీలుంది. జీవో ఎత్తేస్తే అటుపక్కకు వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది.

 ఎలాగంటారా ఆ సుగంధాన్ని భరించలేం మరి....!!!


  2018 లో  హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్, బుద్దుని విగ్రహం చూద్దామని నెక్లెస్ రోడ్ రైల్వేస్టేషన్ లో దిగాను. అక్కడ నుండి ప్రారంభం అయ్యింది ఏదో దుర్గంధం ఎంటీ వాసన అనుకుంటూ  ముందుకు నడుస్తున్నాను. అప్పటికే ఆ వాసనకి తల పట్టేసింది ఇంకాస్త ముందుకు వెళ్ళేసరికి సువాసన పెరిగిపోయింది. ఈ లోపు హుస్సేన్ సాగర్ కనబడింది. అందులో నీళ్ళు చూసేసరికి అర్థం అయింది ఆ దుర్గంధం ఈ సాగర్ నుండే వస్తుందని. ఆ నీళ్ళల్లో కూడా బోటు షికారు చేస్తున్నారు. రైల్వేస్టేషన్ నుండే ఆ వాసన భరించలేక తల తిరుగుతోంది అలాంటిది హుస్సేన్ సాగర్ మద్యలో   బోటు షికారు చేస్తున్నారు అంటే నిజంగా మీకు దండం పెట్టాలి..🙏🙏🙏🙏

 అంతటి దుర్గంధభరితమైన నీటిలో బోటు షికారు చేసే వారిని చూసినపుడు నాకు ఆశ్చర్యం,జాలి, అసహ్యం, అన్ని ఒకేసారి అనిపించాయి..

 అతిపెద్ద సాహసం అది.....!!!

 5నిమిషాలు కూడా అక్కడ ఉండలేక అక్కడ నుండి వెళ్ళిపోయాను. పక్కనే ఉన్న ఎన్టీఆర్ గార్డెన్ కు వెళితే అక్కడకు కూడా సాగర్ సువాసన వస్తూనే ఉంది..

 నేను చాలా సార్లు విన్నా ట్యాంక్ బండ్,బుద్దుని విగ్రహం ఆ చుట్టుపక్కల పార్కులు బాగుంటాయి అని  గొప్పలు చెప్పెవారు. నాకు అక్కడకు వెళ్ళి చూడాలని కుతూహలంగా ఉండేది. ఇక్కడకు వచ్చి చూసాక తెలిసింది ఈ కాలుష్యం గురించా ఇంత గొప్పగా చెప్పారని.  ఇంత కాలుష్యంతో ఇంత దుర్గంధంతో నిండిన ఆ ప్రాంతంలో10నిమిషాలు కూడా ఉండలేం.. అందుకే అంటారు దూరపు కొండలు నునుపు అని... 

 ఇది చూసిన తర్వాత నేను ఒకటి బలంగా చెప్పగలను

 దీనికంటే లక్షరెట్లు మా ఊరి చెరువులు గొప్పవని..

స్వచ్చమైన గాలి, నీరు, నింగి,నేల ఉన్న నా పల్లెటూరు గొప్పది...


ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఒకప్పుడు హుస్సేన్ సాగర్ కూడా మంచినీటి సరస్సే కదా మరి ఇప్పుడు కాలుష్య సాగర్ గా మారింది. దీనికి కారణం అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా వ్యర్థాలను సాగర్ లోకి వదిలి పెట్టి, కనీసం ఆనీటిని తాకడానికి కాదుకదా చూస్తేనే, అటునుండి వెళ్తేనే వాంతికొచ్చెలా చేసారు....

అభివృద్ధి వద్దనడం లేదు కాని ప్రణాలిక లేని అభివృద్ధి మానవాళికి చేటు.. ప్రపంచంలో హైదరాబాద్ కంటే పెద్ద నగరాలు నదుల పక్కనే ఉన్నాయి అక్కడ ఇలాంటి కాలుష్యం లేదే... మరి మన దగ్గర ఎందుకిలా అంటే మన నాయకుల స్వార్థ రాజకీయాల వలన ఇలా ఉంది..


ఎందుకు ఇది చెబుతున్నానంటే  రోడ్లు, బిల్డింగ్స్ కట్టేసి   సహజ వనరులను మురికి కూపంగా మార్చడం అభివృద్ధి కాదు.. హుస్సేన్ సాగర్ బాగు చేయడం ఈ జన్మలో జరగదు. సరే వదిలేద్దాం.. ఇప్పుడు 111 జీవో ఎత్తేసి   జంట జలాశయాలను కూడా హుస్సేన్ సాగర్ లా మార్చాలనుకుంటున్నారు.... సారు..

ఇప్పుడు రెండు జలాశయాలు స్వచ్చమైన నీటితో శుభ్రంగా ఉన్నాయి.. వాటి చుట్టుపక్కల పరిశ్రమలు, బిల్డింగ్స్ కట్టేసి వాటిని కూడా మురికి కూపంగా మార్చేయాలి... ఇదేందయ్యా ఇది అంటే అభివృద్ధి..

అప్పుడు గండిపేట, హిమాయత్ సాగర్ చెరువులను హుస్సేన్ సాగర్ 2, హుస్సేన్ సాగర్ 3అని అనాలి...

ఇప్పటికీ మూసీ నది గండిపేట చెరువు వరకు స్వచ్ఛమైన నీటితో జూన్ లో వర్షాలు ప్రారంభం నుండి డిసెంబర్ వరకు ప్రవహిస్తుంది. మన నాయకుడు అభివృద్ధి చేసిన తర్వాత మురికి కూపంగా ఏడాది పొడవునా ప్రవహిస్తుంది వ్యర్ద జలాలతో.


ఎవరు 111 రద్దు చేయమని చెప్పింది. ఈ జీవో వలన భూముల ధరలు లేక రైతులు నష్టపోతున్నారు అని అంటున్నారు. రైతుల నష్టం ఏమో కాని నాయకుల లాభం కోసం అని అందరికి తెలిసిందే... నిజంగా ఏ నాయకుడికి రైతులపై, ప్రజలకు మంచి చేయాలని ఉండదు.    కేవలం వాళ్ళ ఓట్ల కోసమే ఇన్ని డ్రామాలు. ఆ ఓట్లను నోట్లతో కొనాలి. మరి అంత డబ్బు ఎలా వస్తుంది ఇలా అభివృద్ధి పేరిట దోచుకుంటే వస్తుంది..


అయ్యా మీరు ప్రజలను కోటీశ్వరులను చేయవలసిన అవసరం లేదు. అభివృద్ధి పేరిట కాలుష్యాన్ని పెంచి పర్యావరణాన్ని, ప్రకృతి వనరులను నాశనం చేయకుంటే చాలు అదే పదివేలు....🙏🙏😌😌..


సొంత లాభం కొంత మానుకోని

పరుల సేవకు పాటుపడవోయ్.


ప్రజల సేవకు పాటు పడకపోయినా పర్వాలేదు.

పర్యావరణాన్ని నాశనం చేయకండి..







5, జులై 2021, సోమవారం

బైక్, స్కూటర్ ఏది బెస్ట్.

   

బైక్, స్కూటర్ ఏది బెస్ట్

   ఈ రోజుల్లో బయటికి వెళ్లి ఏపని చేయాలన్నా బైక్ తప్పనిసరిగా ఉండాలి. కోవిడ్ వల్ల పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అంతగా నడవడం లేదు. పైగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అన్నిచోట్లా ఉండదు. పల్లెటూళ్ళలో అసలే ఉండదు. సిటీలో కూడా అన్నిచోట్లకు బస్సు సౌకర్యం ఉండదు. ఆటోలో వెళ్ళాలంటే ఎక్కువ మొత్తంలో చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదికాక టైం కి ఆటో కాని బస్ కాని ఉండదు. కోవిడ్ వల్ల ఎక్కువగా ఆటోలు, బస్సు లు కూడా తిరగడం లేదు. ఒకవేళ తిరిగిన అంతమంది లో వెళ్ళాలంటే వైరస్ భయం.

ఇన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం అదేంటంటే బైక్ కొనుక్కోవడం. టైం కి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వైరస్ భయము ఉండదు. ఈ సమయంలో ప్రతి ఇంట్లో బైక్ ఉండాల్సిందే. లేకపోతే ఏపని జరగదు. కాబట్టి ప్రతీ ఒక్కరు కొనాలి అని చూస్తారు. అంటే అందరూ కాదు బండి లేని వాళ్ళు. 

    ఇప్పుడు మార్కెట్లో బండి కొనాలంటే రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి "బైక్" మరొకటి "స్కూటర్" ఈ రెండింటిలో ఏది కొనాలని చాలామందికి డౌట్ వస్తుంది. మరి అలాంటప్పుడు బైక్ బెటరా స్కూటర్ బెటరా.? మనకు ఏది కంఫర్ట్  తెలుసుకోవాలి.


ముందుగా బైక్ గురించి తెలుసుకుందాం.


ప్లస్ పాయింట్స్:-

బైక్ చూడడానికి లుక్ బాగుంటుంది.

ఎక్కువ మైలేజీ ఇస్తుంది.

మెయింటెనెన్స్ తక్కువ.

దూర ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.


మైనస్ పాయింట్స్:-


గేర్లు, క్లఛ్ మళ్ళీ మళ్ళీ మారుస్తూ ఉండాలి.

బైక్ పై ఏదైనా లగేజీ తీసుకెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది.

బైక్ లో గూడ్స్ స్పేస్ ఉండదు.

బైక్ ను ఇంట్లో అందరూ నడపలేరు.


స్కూటర్ గురించి చూద్దాం.


ప్లస్ పాయింట్స్:-


స్కూటర్ కి గేర్లు ఉండవు కాబట్టి మళ్ళీ మళ్ళీ గేర్లు మార్చే పని ఉండదు.

ఎలాంటి లగేజీ అయినా స్కూటర్ పై  తీసుకుని రావచ్చు.

గ్యాస్ సిలిండర్ గాని, బియ్యం బస్తాలు గాని కిరాణా వస్తువులు కూరగాయలు సులభంగా తీసుకుని రావచ్చు.

ఇంట్లో ఎవరైనా సులభంగా నడపగలరు. ఆడవాళ్ళు కూడా నడపడానికి అనుకూలంగా ఉంటుంది.


మైనస్ పాయింట్స్:-


స్కూటర్ బైక్ అంత స్టైలిష్ గా ఉండదు.

మెయింటెనెన్స్ కాస్తా ఎక్కువ.

బైక్ కంటే మైలేజ్ తక్కువగా ఇస్తుంది.

దూర ప్రయాణాలకు అనుకూలంగా ఉండదు.



రెండింటి లో  తేడాలు గమనించాక ఏది బెస్ట్ అంటే స్కూటర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు స్టెల్ ముఖ్యం కాదు కంఫర్ట్ ముఖ్యం.

మాటిమాటికీ గేర్లు మార్చే తలనొప్పి ఉండదు.ఎలాంటి లాగేజీ అయినా సులభంగా తీసుకుని రావచ్చు.


స్కూటర్ కేవలం ఆడవాళ్ళకు మాత్రమే అనుకుంటారు కాని ఎవరైనా నడపొచ్చు. ఇంట్లో పెద్దవాళ్లు సైతం సులభంగా నడపగలరు.

ముఖ్యంగా ట్రాఫిక్ లో నడపడానికి, లగేజీ తీసుకురావడానికి స్కూటర్ ది బెస్ట్ ఆప్షన్.

బైక్ కంటే స్కూటర్ అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుంది.

బైక్ తీసుకుని ఎవరూ లాంగ్ డ్రైవ్ లకు వెళ్ళారు. నిత్యం ఈ ట్రాఫిక్ , ఈ గుంతలు రోడ్లపైనే తిరగాలి. కాబట్టి స్కూటర్ కొనడం బెటర్.

డిజైన్ పరంగా, లుక్ పరంగా ఇప్పుడు చాలా మంచి స్కూటర్స్ మార్కెట్లో ఉన్నాయి.

అందులో నాకు నచ్చింది అయితే activa 6g బాగుంటుంది అని అనుకుంటున్నాను.





6, డిసెంబర్ 2019, శుక్రవారం

సెల్యూట్ సజ్జనార్ సార్. పోలీస్ అంటే మీలా ఉండాలి.. మిమ్మల్ని చూసి దేశం మొత్తం గర్విస్తుంది..


దిశ ఉదంతంలో నేరస్థులకు ఇంత త్వరగా శిక్ష పడుతుందని అస్సలు ఊహించలేదు. ఆ మృగాలను ఎన్కౌంటర్ చేయడం సరియైనదే. వారం రోజుల్లోనే న్యాయం జరిగింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నేరం రుజువైతే నేరస్థులను కోర్టులు, ఆ పై కోర్టులు అని తిప్పకుండా ఇలా ఎన్కౌంటర్ చేయడమే కరెక్ట్.
ఇంత త్వరగా న్యాయం చేసినందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
   
    పోలీస్ కమీషనర్ సజ్జనార్ సార్ మానవ మృగాల పట్ల మీరు సింహ స్వప్నం.
2008 లో వరంగల్లో ఇప్పుడు హైదరాబాద్ లో మృగాలకు త్వరగా శిక్ష విధించి (ఎన్కౌంటర్ చేసి) బాధితులకు న్యాయం చేసారు. మిమ్మల్ని చూసి దేశం మొత్తం గర్విస్తుంది. వి సెల్యూట్ సజ్జనార్ సార్.. సరిలేరు నీకెవ్వరు... మీలాంటి పోలీసులే ఈ సమాజానికి కావాలి. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను కోరుతున్నాను. 

5, డిసెంబర్ 2019, గురువారం

ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు అందరూ బాగానే ఉంటారు. కానీ సామాన్యులపైనే మొత్తం భారం వేస్తున్నారు.

   


       రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూనే ఉంటాయి. పప్పులు, కూరగాయలు, బియ్యం, డీజిల్, పెట్రోల్, రవాణా చార్జీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఇవి మనకు ప్రతీరోజు అవసరమే. వీటి ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉంటాయి. ఈ ధరల పెరుగుదల దల వల్ల ఎక్కువగా నష్టపోయేది సామాన్య ప్రజలు. అంటే రోజు కూలీలు, చిన్న చిన్న పరిశ్రమలలో పనిచేసే కార్మికులు, కిరాణా షాపుల్లో, బట్టల షాపుల్లో పనిచేసే  వారికి నెలకు పదివేల దాటి జీతం రాదు.
 ఇప్పుడున్న ధరలకు నెలకు పదివేల రూపాయల జీతం ఏ మూలకు సరిపోతుంది. ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉంటాయి. ఇలాంటి చిన్న చితక పనులు చేసే వారికి జీతాలు మాత్రం పెరగవు.

   ఇలా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఎక్కువగా భారం పడేది సామాన్యులకు మాత్రమే.
ఇక మిగితా వారిపై ఈ ధరల ప్రభావం అంత ఉండదు ఎందుకంటే వీరికి వచ్చే నెల జీతాలు భారిగానే ఉంటాయి కాబట్టి వారిపై ధరల పెరుగుదల ప్రభావం ఏమాత్రం ఉండదు.

ప్రభుత్వ ఉద్యోగులను తీసుకుంటే ఏ చిన్న ప్రభుత్వ ఉద్యోగకైనా తక్కువలో తక్కువ నెల జీతం 30,000 రూపాయలు ఉంటుంది ఇది కనీసం గరిష్టంగా లక్ష రూపాయల జీతం కూడా వచ్చే ఉద్యోగులు ఉన్నారు. వీరికి జీతంతో పాటు అన్ని రకాల అలవెన్సులు ఉంటాయి. PF, ESI, లాంటి సౌకర్యాలు ఉంటాయి.  మరియు ప్రతీ మూడూ నెలలకోసారి ఇంక్రిమెంట్లు ఉంటాయి. ఇలా మూడు నెలలకోసారి జీతాలు పెరగడం వలన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు వీరికి ఏమాత్రం భారం పడదు.

 ఇక ప్రైవేటు ఉద్యోగాలకు కూడా జీతాలు భారీగానే ఉంటాయి. అలాగే అలవెన్సులు, ఇంక్రిమెంట్లు ఉంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ధరలు పెరుగుదల వల్ల ఎలాంటి భారం పడదు.

వ్యాపారస్తులకు కూడా  ధరలు పెరుగుదల ఎలాంటి భారం పడదు. పైగా వీరికి ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది. ఎందుకంటే వ్యాపారస్తులు తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులను కొని ఎక్కువ మొత్తంలో నిలువ చేసుకుంటారు. వాటి ధరలు పెరిగినప్పుడు అధిక మొత్తానికి  విక్రయించి కోట్లు సంపాదించుకుంటున్నారు‌.

      ఉత్పత్తి తగ్గినప్పుడు ధరలు పెరగడం సహజం.
కాని వ్యాపారస్తులు కృత్రిమంగా నిత్యవసర వస్తువల కొరత సృష్టించి ధరలు పెంచేసి కోట్లు సంపాదిస్తున్నారు.

 నిత్యవసర వస్తువల ధరలు ఏ విధంగా పెరిగిన చివరకు భారం పడేది సామాన్యులకు మాత్రమే.
వీళ్ళను పట్టించుకునే నాథుడే ఉండడు. వీళ్ళు ఎలాగోలా బతుకు బండిని ముందుకు లాగాల్సిందే..
అదే ప్రభుత్వ ఉద్యోగులయితే తమకు జీతం సరిపోవడం లేదని సమ్మెలు చేసి వారికి కావాల్సిన డిమాండ్లను సాదించుకుని ఏ లోటు లేకుండా హాయిగా జీవిస్తున్నారు.


     ఉదాహరణకు మొన్నటి వరకు సమ్మె చేసిన ఆర్టీసి వారినే తీసుకుందాం. 55 రోజులు సమ్మె చేసి ఇటు ప్రజలను ఇబ్బందులకు గురిచేసారు. సమ్మె చేసినప్పుడు ఇబ్బందులకు పడింది సామాన్యులే. ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెంచేసింది ఇప్పుడు కూడా  భారం పడేది సామాన్యులకే. ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ వరాలు ప్రకటించారు. పని చేయకుండా 55 రోజులు సమ్మె చేసిన వారికి జీతాలు ఇస్తున్నారు. ఇంకా వీరికి అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించారు. ఇన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి కావాల్సిన డబ్బు ఎలా వస్తుందండి. సామాన్యుల ముక్కు పిండి వసూలు చేయాల్సిందే కదా??
ఆర్టీసీ ఉద్యోగులు తమకు జీతాలు సరిపోవడం లేదని సమ్మెలు చేసి వారి డిమాండ్లను సాధించుకున్నారు. మరీ చిన్న చితక ఉద్యోగులు, రోజు కూలీలు ఎవరిని అడిగి తమ సమస్యలు పరిష్కరించుకోవాలి. ఈ దేశంలో గూర్తింపు ఉన్న ఉద్యోగులు మాత్రమే బతకాలా?? సామాన్యుల బతుకులు ఏమైనా పరవాలేదా ? వీళ్ళ గోడు ఎవడు పట్డించుకుంటాడు? ఏ నాయకుడు వింటాడు?

ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు ఎవరు కూడా ధరల పెరుగుదల భారం వారిపై పడనీయరు. సామాన్యులపై వేసి వారి నడ్డి విరిచి పాతాళానికి తొక్కే స్తున్నారు. వాళ్ళు మాత్రం పైకెదుగుతున్నారు.
ఇలాంటప్పుడు సమాజంలో ఆర్థిక అసమానతలు ఎలా తొలగిపోతాయి.

      నా విన్నపం ఏమిటంటే చిన్న చితక పనులు, రోజు కూలీలు,కిరాణా షాపులు, బట్టల షాపులు, చిన్న పరిశ్రమలలో పనిచేసే వారందరూ ఒక యూనియన్ గా ఏర్పడి  మన సమస్యలను పరిష్కరించుకోవాలి. మనకు కూడా ఇంక్రిమెంట్లు, అలవెన్సులు, PF, ESI వంటి సదుపాయాలు ఉండేలా చూసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, పెద్ద పెద్ద పరిశ్రమల ఉద్యోగులు తమ సమస్యల కోసం సమ్మెలు చేసి సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. అలాంటిది ఎలాంటి గుర్తింపు లేని ఈ ఉద్యోగాలు చేస్తూ ఎన్ని రోజులు ఇలా చాలి చాలని జీతాలతో బ్రతుకుతారు. మనం లేనిదే అక్కడ పని జరగదు. ఏ యాజమాని కూడా పని వాళ్ళు లేనిదే వ్యాపారం చేయలేడు. అందువల్ల మనం కూడా సమ్మెలు చేసి సమస్యలను పరిష్కరించుకోవాలి...

3, డిసెంబర్ 2019, మంగళవారం

తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నప్పటి నుండి సంస్కారవంతంగా పెంచితేనే సమాజంలో నేరాలు,ఘోరాలు జరగవు.


    
      ఇప్పుడు సమాజంలో 14 నుండి 25 ఏళ్ళ యువకులకు విలువలు అంటే ఏమిటో తెలియదు. పెద్దలంటే గౌరవం లేదు. మహిళల పట్ల గౌరవం లేదు. తల్లిదండ్రులకు కూడా విలువ ఇవ్వడం లేదు.
పాఠశాల స్థాయి నుంచే వీరు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు చెప్పేది వినరు వారికి ఎదురు తిరుగుతున్నారు. అలాంటప్పుడు ఉపాధ్యాయులు మాత్రం ఏం చేస్తారు. మొక్కుబడిగా తమ పాఠాలు తాము చెప్పుకుంటూ పోతున్నారు. అసలు ఎందుకు సార్ మాకు ఈ చదువులు అనే విద్యార్థులు ఉన్నారు. వీరికి తెలుగు కూడా సరిగా చదవడం రాదు. ఎలాగోలా పది వరకు చదివి బయటకు వచ్చి ఆటోలో, లారీలో నడుపుకుంటూ అన్ని అడ్డమైన అలవాట్లు నేర్చుకుని నేరాలు చేసే స్థాయికి ఎదుగుతున్నారు.
  
        ఇప్పుడున్న యువతకు పెద్దలు పట్ల, మహిళల పట్ల, సమాజం పట్ల గౌరవం లేకపోవడానికి మరో కారణం ఇప్పుడొస్తున్న చెత్త సినిమాలు. ఆ మధ్య ఓ సినిమా వచ్చింది అర్జున్ రెడ్డి అని ఈ సినిమా పోస్టర్ అసభ్యకరంగా ఉందని పెద్దాయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హన్మంతరావు గారు ఇలాంటి సినిమాల వల్ల యువత చెడిపోతుందని ఇలాంటి సినిమాలను అడ్డుకోవాలని చెబితే ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండ 'చిల్ తాతయ్య' అంటూ చీప్ గా తీసిపారేసాడు. ఈ వయసులో నీకెందుకు ఇవన్నీ అంటూ మూసుకుని కూర్చో అనే విధంగా మాట్లడాడు. ఆ సినిమాలో ఏముందో నాకయితే అర్థం కాలేదు కానీ జనాలు మాత్రం అంత పెద్ద హిట్టు చేసారు.  ఈ సినిమాలో బూతులు,ముద్దులు, ఎప్పుడు మందు తాగుతూ,డ్రగ్స్  తీసుకుంటూ ,  కామంతో రగిలిపోతూ ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు మన హీరో విజయ్ దేవరకొండ.  ఇంత చెత్త మూవీ జనాలతో పాటు సెలబ్రిటీలకు  ఎలా నచ్చిందో   నాకిప్పటికీ అర్థం కాదు. ఈ మూవీ రిలీజ్ కి ముందు ఫంక్షన్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ మనం ప్రేమించిన అమ్మాయి పై ఎవడైనా చెయ్యి వేస్తే ఊరుకుంటామా అంటూ బూతులు తిడతాం, కొడతాం అన్నాడు. అవును ఎవరమైనా ఇలాగే చేస్తాం. మరీ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ ఒక సీన్లో వేరే వాడి భార్యతో ఎంతో కామంతో హీనంగా ప్రవర్తిస్తాడో చూసాం. ఇంతలో ఆమె భర్త వచ్చే సరికి అతని ముందు నుంచే హీరో విజయ్ దేవరకొండ వెళ్ళిపోతాడు. మరీ అప్పుడు ఆమె భర్త ఏమి చేయాలి హీరోని??? అంటే నువ్వు వేరే ఆడవాళ్ళను ఏమైనా చేయవచ్చు మీ ఆడవాళ్ళను ఎవరు ఏమి అనవద్దు ఎందుకంటే నువ్వు హీరోవనా??? నువ్వు ఎన్ని తప్పులైనా చెయ్యోచ్చా??? నీలాంటి వారిని ఇన్స్పిరేషన్ గా తీసూకునే యువత పాడైపోతున్నారు. ఇలాంటి సినిమాలు చూసి ఎవడికి వాడు హీరోలా ఫీలయిపోతున్నారు. సమాజం పట్ల, స్త్రీల పట్ల గౌరవం లేకుండా తయారవుతున్నారు. 

     యువత చెడిపోవడానికి మరో కారణం స్మార్ట్ ఫోన్ లు పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు కొనిస్తున్నారు. వారు ఫోన్లలో ఏమి చూస్తున్నారో తల్లిదండ్రులు పట్టించుకోరు. స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి మంచిగా చదువుకోవచ్చు కానీ ఎంతమంది దానిని చదువుకోసం ఉపయోగిస్తున్నారు. వాటిలో ఎక్కువగా బూతు సైట్లే చూస్తున్నారు.
  
     ప్ర‌స్తుతం యువత ఎవరు చెప్పినా వినే స్థితిలో లేరు. ఎవరి మాటలు మేమెందుకు వినాలి అనే దోరణిలో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. పిచ్చి పిచ్చి హెయిర్ స్టైల్స్ చేయించుకుని తల్లిదండ్రులు కొనిచ్చిన బైకులపై అవసరం ఉన్నా లేకున్నా రోడ్లపై పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ వేగంగా వెలుతుంటారు.  మహిళలు కనిపిస్తే చాలు అసభ్యకరంగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. పదిమంది ఒక చోట చేరి రోడ్డుపై వచ్చిపోయే ఆడవారిని ఎగాదిగా చూస్తూ అసభ్యకరంగా కామెంట్స్ చేస్తుంటారు. ఇది రోజు మా ఊర్లో జరిగేదే..... కాని ఏం చేస్తాం చూసి చూడనట్లు వెళుతున్నాను... ఎందుకంటే ఒకరు చెబితే వినే స్థితిలో లేరు వీళ్ళు. మొక్కై వంగనిదీ మానై వంగునా అన్నట్టు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను సభ్యతగా పెంచితే ఇలా ఆవారాగాళ్ళలా తయారవకుండా ఉంటారు.

     సమాజంలో పెద్దల పట్ల, ఆడపిల్లలు, మహిళల పట్ల యువకులు గౌరవంగా ఉండాలంటే తల్లి దండ్రులు తమ పిల్లలను చిన్నప్పటినుండే సంస్కారవంతంగా పెంచాలి.

ఉపాధ్యాయులు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఒక లక్ష్యం ఏర్పరుచుకునేలా చేసి లక్ష్యం సాధించే విధంగా ప్రోత్సహించాలి.

సినిమాలు తీసేవారికి సామాజిక బాధ్యత ఉండాలి.
యువత చెడిపోయే విదంగా సినిమాలు తీయకూడదు.

డైరెక్టర్ సందీప్ వంగా లాంటి వారు బూతు సినిమాలు తీయకుండా ఉండాలి.

 మద్యపానం నిషేదించాలి.

అప్పుడే సమాజంలో నేరావు ఘోరాలు జరగకుండా ఉంటాయి.

2, డిసెంబర్ 2019, సోమవారం

మొన్నటిదాకా రాక్షసుడు అన్నారు నేడు దేవుడంటూ పొగుడుతున్నారు

 
        మొన్నటి వరకు రాక్షసుడు అంటూ బూతులు తిట్టారు. నేడు దేవుడంటూ పొగుడుతున్నారు.



ఆర్టీసీ కార్మికులు సారీ ఇప్పుడు వీళ్ళు కార్మికులు కాదు ఉద్యోగులుగా పరిగణించాలని సీఎం చెప్పారు. వీళ్ళు గత 55 రోజులు 26  డిమాండ్ల కోసం  సమ్మె చేసి  వాటిని సాదించకపోగా అలసిపోయి  చివరకు తమకు ఏ డిమాండ్లను వద్దు కనీసం మా ఉద్యోగం మాకు ఇవ్వండని వేడుకున్నారు. ఇక మమ్మల్ని ఉద్యోగం లోకి తీసుకుంటారో లేదోనని కన్నీరుమున్నీరయ్యారు.
సమ్మె చేస్తున్నప్పుడు కొందరు మహిళ ఉద్యోగులు లు సీఎం కెసీఆర్ ని బూతులు తిట్టారు. ఆర్టీసీ ఆస్తులపై కన్నేసి దోచుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. నిన్న కేసిఆర్ ఆర్టీసి ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారికి వరాలు కురిపించినప్పుడు ఆనందంతో దేవుడంటూ చప్పట్లు కొట్టారు.

ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కెసీఆర్ అందించిన వరాలు:

:-  ఉద్యోగ భద్రత
:- పదవి విరమణ వయసు 58 నుండి 60 ఏళ్ళకు పెంపు
:- కార్మికులు కాదు ఉద్యోగులుగా
పరిగణించాలి
:- ఉద్యోగుల తల్లి దండ్రులకు వైద్య సదుపాయం
:- ఉద్యోగుల తల్లి దండ్రులకు ఉచిత బస్సు పాసులు
:- ఉద్యోగుల పిల్లలకు ఫిజు రీయింబర్స్మెంట్
:- ఉద్యోగుల పిఎఫ్ బకాయిల చెల్లింపు
:- తాత్కాలిక ఉద్యోగులకు పర్మినెంట్ ఉద్యోగం
:- ప్రతీ ఏట బడ్జెట్లో  వెయ్యి కోట్ల రూపాయలు ఆర్టీసీ కి కెటాయింపు
:- మహిళ ఉద్యోగులకు రాత్రి 8 గంటలు వరకే డ్యూటీ.
:- ఉద్యోగులకు గృహ నిర్మాణ పథకం
:- మహిళ ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు శిశు సంరక్షణ సెలవులు
:- ఇంక్రిమెంట్లు
:- ప్రతీ ఏటా ప్రతీ ఉద్యోగి లక్ష రూపాయల బోనస్ తీసుకునేలా చర్యలు
:- ఆర్టీసీ ప్రైవేటీకరణ ఉండదు
:- మహిళ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కమిటీ
:- చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించడం
:- సమ్మె చేసిన 55 రోజుల వేతనం వెంటనే చెల్లించడం

ఇన్ని ప్రయోజనాలు ఆర్టీసి ఉద్యోగులకు సీఎం ప్రకటించినప్పుడు ఉద్యోగులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

ఇలాంటివి ముందే ప్రకటించి ఉండొచ్చు కదా అని అందరూ అనొచ్చు. కాని ఆర్టీసీ ఉద్యోగులు చేసిన తప్పు ఏంటంటే తెలంగాణ లో పెద్ద పండుగా దసరా పండుగ సమయంలో ప్రజలకు ఇబ్బంది కలిగించి సమ్మె చేయడం సీఎం కెసీఆర్ గారికి ఆగ్రహం తెప్పించింది. యూనియన్ నాయకుల మాటలు విని సామాన్యులకు ఇబ్బందులకు గురిచేయడం అది పండగ పూట సమ్మె చేయడం మరింత ఆగ్రహం తెప్పించింది. అందుకే ఆర్టీసి ఉద్యోగుల పట్ల  సీఎం ఇన్నాళ్లు కఠినంగా వ్యవహరించారు. సీఎం కెసీఆర్ గారికి ఆర్టీసీ ఉద్యోగుల పట్ల  ఇన్ని రోజులు ఇంత కఠినంగా వ్యవహరించడానికి కారణం యూనియన్ నాయకులు.  ముఖ్యంగా అశ్వత్థామ రెడ్డి లాంటి నాయకుల పైనే సీఎం ఆగ్రహం అంతేకాని ఉద్యోగులపై కాదు. ఇలాంటి నాయకుల వల్లే ఆర్టీసీ నష్టాల్లో నడుస్తుందని ఇలాంటి యూనియన్ నాయకులు ఉండకూడదనే సీఎం కోరుకుంటున్నారు. అశ్వత్థామ రెడ్డి లాంటి యూనియన్ నాయకుల వల్లే కొందరు ఆర్టీసీ ఉద్యోగులు బలైపోయారు. యూనియన్ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం కార్మికుల చేత సమ్మెలు చేయించి వారిని ఇబ్బందులకు గురి చేస్తారు. కొందరి కార్మికుల ప్రాణాలు తీసుకునెలా చేస్తున్నారు. ఇలాంటి యూనియన్ నాయకుల తీరు ఎలా ఉంటుందంటే వీరికి నిజంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఉండదు. కేవలం యూనియన్ ఎన్నికల్లో గెలవాలనో లేదా ముడుపుల కోసమో సమ్మె లు చేయిస్తారే తప్ప కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కాదు. కేవలం వారి స్వార్థ  ప్రయోజనాల కోసమే ఇలా సమ్మెలు చేయిస్తున్నారు. నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు జీతాలు పెంచాలని ఇలాంటి యూనియన్ నాయకులే సమ్మెలు చేయించారు. నెల రోజుల పాటు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.ఆ నెల రోజులు జీతం రాక కుటుంబ పోషణ కోసం నానా అగచాట్లు పడ్డారు. నెల రోజుల తర్వాత యాజమాన్యం యూనియన్ నాయకులను చర్చలకు పిలిచింది ఆ చర్చల్లో ఏం మాట్లాడారో ఎవరికి తెలియదు.  యూనియన్ నాయకులు వచ్చి సమ్మె విరమించండి కంపెనీ నష్టాల్లో ఉంది లాభాలు వచ్చినపుడు పెంచుతారని ఏవో మాటలు చెప్పి సమ్మె విరమింప చేసారు. ఈ నెల రోజులు యూనియన్ నాయకుల మాటలు విని  కార్మికులు నానా అవస్థలు పడ్డారు.
తర్వాత తెలిసింది ఏంటంటే కంపెనీ యాజమాన్యం యూనియన్ నాయకులకు డబ్బులు ముట్టజెప్పే సరికి సైలెంట్ అయిపోయారు. అప్పటి వరకు చిన్న ఇంట్లో నివసించే యూనియన్ లీడర్లు  ఆ తర్వాత కొన్ని నెలల్లోనే పెద్ద పెద్ద  భవంతులు నిర్మించుకున్నారు. ఇది యూనియన్ నాయకుల నిర్వాకం తాము బాగు పడడం కోసం కార్మికులను పావులుగా వాడుకుంటారు. అంతేకాని నిజంగా కార్మికుల పై ప్రేమతో కాదు...

 ఎక్కడైనా యూనియన్ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారు. డబ్బుల కోసం, రాజకీయంగా ఎదగడం కోసం మాత్రమే కార్మికుల సమస్యల పై పోరాటం చేస్తున్నట్టు నటిస్తారు. డబ్బు ఆశ చూపగానే సైలెంట్ అయిపోతారు. అందుకే కార్మికులు ఇలాంటి  యూనియన్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దు.


29, నవంబర్ 2019, శుక్రవారం

మలబద్ధకం తగ్గిపోవాలంటే ఇలా చేయండి 100% తగ్గిపోతుంది.



              మలబద్ధకం సమస్య చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. ఈ ఒక్క మలబద్ధకాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దీనివల్ల ఒంట్లో వచ్చే రోగాల్లో 70% మలబద్ధకం వల్లే వస్తాయి. అందులో పైల్స్, ఫిషర్, ఫిస్టులా, IBS, IBD, అల్సర్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అజీర్తి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వ్యాధులు మలబద్ధకం వల్లే వస్తాయి కదా..

       ఈ సమస్యను చాలా మంది పట్టించుకోరు. దీనివలన ముందు ముందు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని నివారించుకోవాలి. మలబద్దకం ఉందని డాక్టర్ వద్దకు వెళితే డాక్టర్లు ఏవో ట్యాబ్లెట్స్, టానిక్ లు ఇచ్చి పంపిస్తారు. అవి వాడినన్ని రోజులు బాగానే ఉన్నా తర్వాత మళ్ళీ ఈ సమస్య వస్తుంది. పైగా ఈ ట్యాబ్లెట్లు వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇంకొందరు ప్రకృతి వైద్యులు చెబుతుంటారు నీళ్ళు ఎక్కువగా తాగితే మలబద్దకాన్ని జాడిచ్చి తన్నుతుంది అని చెబుతుంటారు. ఉదయం లేవగానే  1¼లీటరు గోరు వెచ్చని నీరు తాగి పది నిమిషాలు నడిస్తే మోషన్ ఫ్రీగా అవుతుంది అని చెబుతుంటారు. నేను ఇలాగే చేసాను కానీ మోషన్ రాలేదు కాని వికారం, తల నొప్పి మాత్రం వచ్చాయి. పది నిమిషాల తర్వాత మూత్రం వచ్చింది కాని మోషన్ రాలేదు. ఇలా ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిని తాగడం వలన మోషన్ అందరికి రాకపోవచ్చు. మరి అలాంటి వారు ఏం చేయాలి?
        

  మలబద్ధకం పోవాలంటే పీచు పదార్థాలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి అంటారు. ఆ పీచు అంటే ఏమిటో , అంది ఎందులో ఉంటుందో చాలా మందికి తెలియదు. పీచు ఉండే పదార్థాలు, పండ్లు వెతికి  తెచ్చుకుని తినాలంటే అంత ఆర్థిక స్థోమత అందరికి లేకపోవచ్చు. మరి అలాంటి వారు ఏమి చేయాలి??

  నేను ఓ డాక్టరను కాను, ప్రకృతి వైద్యున్ని కాను, సైంటిస్ట్ ని కాను కాని నాకు కలిగిన అనుభవం ప్రకారం చెబుతున్నాను మలబద్ధకానికి చాలా చవకైన మందు ఉంది ఇది ప్రతీ ఊళ్ళో ఉంటుంది. దీన్ని రైతులు, కూలీలు ప్రతీరోజు తాగుతూనే ఉంటారు. ఇప్పటికే అది ఏంటో మీకు అర్థం అయి ఉండొచ్చు. అదేనండి "కల్లు". కల్లు తాగడం వల్ల మలబద్ధకం సమస్యే కాదు అసలు ఎలాంటి రోగం కూడా రాదు. ఎందుకు చెబుతున్నానంటే ప్రతిరోజు కల్లు తాగే వారు ఆసుపత్రికి వెళ్ళడం నేను ఎప్పుడు చూడలేదు. కల్లు తాగే వారు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. నేను కల్లు తాగే వారిని చూస్తే కోప్పడేవాడిని. కల్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పేవాడిని. కల్లు అంటే అసహ్యించుకునే వాడిని. ఇప్పుడు  మలబద్ధకం సమస్య వల్ల నేను బాధపడుతుంటే కల్లు తాగితే తగ్గుతుందని చెబితే అయిష్టంగానే తాగాను. ఆశ్చర్యంగా ఉదయం లేవగానే మోషన్ ఫ్రీగా అయ్యింది. ఎన్నో రోజులుగా ఈ సమస్యతో బాధపడుతున్నాను కల్లు తాగగానే నాకు ఈ సమస్య తగ్గిపోయింది. నేను అందరికి చెప్పేది ఏంటంటే మీకు మలబద్ధకం సమస్య ఉంటే కల్లు తాగండి. ఈ కల్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
      

తాటికల్లు



       ఈ కల్లులో  ఈతకల్లు, తాటికల్లు, మామూలు కల్లు వంటివి ఉంటాయి కదా. అందులో ఈతకల్లు, తాటికల్లు ఎంతో శ్రేష్టమైనవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి అందుబాటులో లేనివారు ఊళ్ళలో దొరికే మామూలు కల్లు తాగవచ్చు సమస్య తగ్గేవరకు. మా గ్రామాల్లో చాలా వరకు ఈతకల్లు కొంతవరకే లభిస్తుంది. మొత్తంగా మామూలు కల్లు మాత్రమే లభిస్తుంది. దీనిని మందుకల్లు అంటారు. ఈ కల్లు ప్రతిరోజు తాగేవారిని నేను చూస్తాను వీళ్ళకు ఎలాంటి అనారోగ్యాలు లేవు ఆరోగ్యంగా ఉన్నారు. 

     నేను అందరికి చెప్పేది ఏంటంటే ఒక్క మలబద్ధకం వల్లే 70% రోగాలు వస్తున్నాయి. కాబట్టి దీనిని తగ్గించుకుంటే ఏ రోగాలు రావు. ఇది రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ కల్లు తాగండి. రోజు తాగడం వీలుకాకుంటే సమస్య వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా తాటి కల్లు లేదా ఈతకల్లు తాగండి. 

  మలబద్ధకం తో బాధపడే వారు నేను చెప్పినట్టు ఈతకల్లు, తాటికల్లు తాగి చూడండి. తప్పకుండా మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది. మీకు ఈ సమస్య ఉంటే కల్లు తాగి చూడండి మళ్ళీ నాకు మీ సమస్య తగ్గిందో లేదో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తప్పకుండా  తెలియజేయండి..

 నేను చెప్పినట్టు ట్రై చెసి చూడండి మలబద్దకాన్ని వదిలించుకోండి. తప్పకుండా మీ అభిప్రాయం తెలియజేయండి..