భానోదయం: నియంతలు, సామ్రాజ్యవాదులు ఉన్నంతకాలం ప్రపంచంలో శాంతి ఉండదు.

20, ఏప్రిల్ 2022, బుధవారం

నియంతలు, సామ్రాజ్యవాదులు ఉన్నంతకాలం ప్రపంచంలో శాంతి ఉండదు.

  ప్రపంచంలో ఏ మూలన ఏ సంక్షోభం వచ్చిన అందుకు కారణం కొందరు నియంతల సామ్రాజ్యవాదం వలనే.

 ఉక్రెయిన్ యుద్దానికి కారణం సామ్రాజ్యవాదుడైన నియంత పుతిన్. రష్యా పేరుకు ప్రజాస్వామ్య దేశమైన పుతిన్ దానిని నియంత్రుత్వ పాలన కింద మార్చేసాడు.

నియంతల్లో రెండు రకాల నియంతలు ఉంటారు. ఒకరు సామ్రాజ్యవాద నియంతలు. మరొకరు వారసత్వ పాలన నియంతలు.


    పుతిన్ సామ్రాజ్యవాద నియంత. తన లక్ష్యం పూర్వపు సోవియట్ యూనియన్లో ఉన్న దేశాలన్నిటిని కలిపి సోవియట్ యూనియన్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు ఆరాటపడుతున్నాడు. వయసు మీద పడుతోంది సోవియట్ యూనియన్ కు తిరిగి పూర్వ వైభవం తీసుకువచ్చి తన పేరు చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నాడు. అందుకే  ఉక్రెయిన్ పై ఈ యుద్దానికి దిగాడు. సైనిక పరంగా బలహీనమైన దేశం నాలుగు రోజుల్లో స్వాదీనం  చేసుకుందాం అనుకున్నాడు. కాని 50 రోజులైన ఉక్రెయిన్ లొంగిపోవడం లేదు. 50 రోజుల నుండి ఉక్రెయిన్ సంక్షోభం అలానే ఉంది. రష్యా నియంత లక్ష్యం కోసం, సామ్రాజ్య విస్తరణ కోసం ఉక్రెయిన్ లో అశాంతి నెలకొంది. కొన్ని లక్షల మంది  ఉక్రెయిన్ ప్రజలు బతుకు జీవుడా అంటూ పొరుగు దేశాలకు వలస వెళ్లిపోయారు. ఈ సంక్షోభం ముగియాలంటే అధ్యక్షుడు జెలెన్ స్కీ నాటోలో చేరకుండా సోవియట్ యూనియన్లో చేరతానని ఒప్పుకుంటే యుద్ధం ఆగిపోతుంది కాని అది జరగదు. దేశం అంటే అధ్యక్షుడు ఒక్కడే కాదు కదా ప్రజలందరూ ఒప్పుకోవాలి. రష్యా కంటే పశ్చిమ దేశాల వైపే ఉక్రెయిన్ ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఏ దేశ ప్రజలైనా నియంత్రుత్వ పాలన కోరుకోరు కదా.

 అందుకే నాటో వైపే ఉక్రెయిన్ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ప్రజలు కూడా యుద్ధం చేస్తున్నారు.



    ఉక్రెయిన్ సంక్షోభం ముగియాలంటే అధ్యక్షుడు జెలెన్ స్కీ లొంగిపోవాలి. రష్యా, ఉక్రెయిన్ యుద్దం లో హీరో ఎవరంటే ఆ దేశ సైనికులు, ప్రజలు, అధ్యక్షుడు జెలెన్ స్కీ అని చెప్పొచ్చు. చిన్న దేశం సైనిక పరంగా, ఆయుధాల పరంగా రష్యాకు ఏ మూలకు సరితూగని దేశం. అణ్వాయుధాల లేవు అయినా కూడా ఇన్ని రోజులగా యుద్ధం చేస్తూనే ఉంది అంటే దానికి కారణం జెలెన్ స్కీ నే.  ఆయన స్థానంలో వేరే ఎవరున్నా దేశం విడిచి పారిపోయేవారు. నాటో దేశాలు తన తరపున యుద్ధం చేస్తాయనుకున్నాడు కాని అది జరగలేదు. నాటో రాలేదు, ఆయుధాలు లేవు,ఈ పరిస్థితుల్లో కూడా శక్తి వంతమైన రష్యాతో పోరడడానికే సిద్దపడ్డాడు. అందుకే జెలెన్ స్కీ నిజమైన హీరో. అసలు సిసలైన దేశభక్తుడు, నాయకుడు.. తను రష్యాతో యుద్దం గెలవలేక పోవచ్చు గాని తన పోరాటం ఎన్నో చిన్న దేశాలకు స్పూర్తి నిస్తుంది. శత్రువు ఎంత బలవంతుడైనా సరే ధైర్యంగా ఉండి పోరాడితే విజయం సాధించవచ్చు అని నిరూపించాడు. పోరాడితే పోయేది ఏముంది బానిస సంకెళ్లు తప్ప..

 

       అందమైన ఉక్రెయిన్ నగరాలు బాంబు మోతలతో కళావిహీనంగా మారాయి, లక్షల మంది ఉక్రెయిన్ ప్రజలు ఇతర దేశాలకు వలసలు వెళ్లిపోయారు, అమాయక ప్రజలు, సైనికులు యుద్ధంలో చనిపోతున్నారు. ఈ హృదయం విదారక దృశ్యాలను, ఈ వినాశనాన్ని చూసి జెలెన్ స్కీ వెనక్కి తగ్గి రష్యాకు తలొగ్గితే ఈ సంక్షోభం ముగుస్తుంది.  లేదు ఇలాగే ముందుకు వెళ్తే వినాశనమే అణు యుద్ధం వరకు వెళ్ళవచ్చు.  నియంతలు ఓటమి ఒప్పుకోరు అందులో పుతిన్ లాంటి వారు అసలు ఒప్పుకోరు. జెలెన్ స్కీ నే తన దేశ ప్రజల కోసం ఓడిపోయి శాంతి నెలకోల్పుతాడని అనుకుంటున్నాను.



  ఇక శ్రీలంక సంక్షోభానికి కారణం చైనా. చైనా కూడా సామ్రాజ్యవాద దేశమే. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ది కూడా నియంత్రృత్వ పాలనే. శ్రీలంకలో పాగా వేసి హిందూ మహాసముద్రంలో పట్టు సాధించాలని చూస్తున్నాడు. దాని ఫలితమే శ్రీలంకతో ఆర్థిక సంక్షోభం. ఇటు పాకిస్థాన్, అటు శ్రీలంకను ఆక్రమించి చైనాను విస్తరించాలని చూస్తున్నాడు. అందుకోసమే ఆ దేశాలకు అభివృద్ధి పేరిట రూణాలిచ్చి ఆర్థికంగా దెబ్బతీసి ఆక్రమించుకోవాలని జిన్ పింగ్ ఆలోచన. 


     ఇక మరో  రకం నియంత  ఉత్తర కొరియా అధ్యక్షుడు కింగ్ జోన్ ఉన్. వారసత్వ పాలన నియంత. ఇతను సామ్రాజ్యవాదుడు కాకపోయినా ప్రపంచంలో అశాంతికి కారణం అవుతాడు.  అణ్వాయుధాలు, క్షిపణులు తయారు చేస్తూ పెద్ద దేశాలను హెచ్చరిస్తూ ఉంటాడు.  దేశ ప్రజలను బానిసలుగా చేసి పరిపాలిస్తున్నాడు. పక్క దేశం  దక్షిణ కొరియా LG, SAMSUNG వంటి  ఎలక్ట్రానిక్స్, HUNDAI,KIA  వాహనాలు ఉత్పత్తి చేస్తూ అభివృద్ధి చెందుతుంటే, కింగ్ జోన్ ఉన్  వంటి  నియంతలు వినాశకర ఆయుధాలు ఉత్పత్తి చేస్తూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నారు. ఇలాంటి నియంతలు ఉన్నంత కాలం ప్రపంచంలో శాంతి నెలకొనడం అసాధ్యం..



  


కామెంట్‌లు లేవు: