భానోదయం: మార్చి 2021

16, మార్చి 2021, మంగళవారం

ఇప్పుడు జానపద గాయకులు సినిమాలకు పబ్లిసిటీ... సారంగదరియా...

 

     

                       సారంగదరియా పాట‌ గురించి కొన్నాళ్ళుగా వివాదం నడుస్తుంది. ఈ పాట‌ను శేఖర్ కమ్ముల  లవ్ స్టోరీ సినిమాలో తనకు చెప్పకుండానే వాడుకున్నారని జానపద గాయని కోమలి గారు ఆవేదన వ్యక్తం చేశారు.

      సారంగదరియా పాట‌ను మొదట‌గా పాడింది కోమలి. యూట‌్యూబ్ లో ఆమె పాడిన పాట‌ కూడా ఉంది. జానపద పాట‌లలో ఈ పాట‌ కొంచం ఫేమస్ సాంగే. కానీ అంత పెద్ద ఫేమస్ కాదు. కానీ ఈ వివాదం వల్ల చాలా ఫేమస్ అయ్యింది. సింగర్ కోమలి కూడా పెద్దగా ఎవరికి తెలియదు. ఈ వివాదం వల్ల ఆమె అందరికి తెలిసింది. నటుడు మోహన్ బాబు ఆమెని "మొసగాళ్ళు"  సినిమా ఫంక్షన్ కి పిలిచి మోసం చేయడం గురించి ఒక పాట‌ను కూడా పాడించారు. సినిమాల్లోనూ పాట‌లు పాడే అవకాశం కల్పిస్తాను అన్నారు.  ఆ తర్వాత కోమలి గారిని సత్కరించారు. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఈ సారంగదరియా పాట‌ వివాదం కాకుంటే ఆమె ఇక్కడ వరకు వచ్చేదా.?
 
           మోసగాళ్ళు సినిమాకి  సింగర్ కోమలి గారిని పిలిపించి మోసం చేయడం మీద పాట‌ పాడించడం ఎందుకో....?

ఒకరు పాడిన పాటను వారికి తెలికుండా వాడుకోవడం కాపీరైట‌్ ఇష్యూ వస్తుందని సామాన్యులకు కూడా తెలుస్తుంది. కానీ శేఖర్ కమ్ముల, సుద్దాల ఆశోక్ తేజ  వంటి పెద్ద పెద్ద సినిమా డైరెక్టర్స్ కి, రైట‌ర్స్ కి తెలియదా..? 

        ఇలా వివాదం జరిగుతుంది అని తెలిసే చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే సినిమా పబ్లిసిటీ కోసమే ఇలాంటివి చేస్తుంట‌రనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి వివాదాలే సినిమా పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు. కానీ శేఖర్ కమ్ముల వంటి మంచి దర్శకులు కూడా ఇలాంటివి చేయడం చూస్తుంటే తన సినిమా మీద తనకు నమ్మకం లేకపోవడమే అవుతుంది. 

    ఏది ఏమైనా ఈ సారంగదరియా పాట‌ వివాదం వల్ల అందరికి మంచే జరిగింది. కోమలి గారికి సినిమాల్లో పాట‌లు పాడే అవకాశం వచ్చింది. శేఖర్ కమ్ముల సినిమా కు పబ్లిసిటీ వచ్చింది.

    ఇక మోహన్ బాబు గారు కోమలి గారికి సినిమాల్లో పాట‌లు పాడే అవకాశం తప్పకుండా ఇవ్వాలి లేదంటే ఆయన కూడా ఈ వివాదాన్ని మోసగాళ్ళు సినిమా పబ్లిసిటీ కోసం ఉపయోగించుకున్నారని అర్థమవుతుంది.,,,!!

    ఈ మద్య గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన చాలామంది    గాయనీ గాయకులు తమ ప్రతిభతో పైకి వస్తున్నారు. అసలు సంగీతం గురించి ఏమాత్రం అవగాహన లేని వారు సైతం అద్భుతంగా పాడి అందరి ఆదరాభిమానాలు పొందుతున్నారు.  అందులో అరవై ఏళ్ళ వయసులో సైతం "ఆడనెమలి" పాట‌తో సంగీత ప్రియులను ఉర్రూతలూగించారు "కనకవ్వ" గారు..

    ఇలా చాలా మంది  ప్రతిభ ఉన్న గాయని గాయకులు తమ ప్రతిభతో పైకి వస్తున్నారు.

వీరి ప్రతిభను కొంతమంది  సినిమాల్లో వాడుకుంటున్నారు.

నిజంగా సినిమా వాళ్ళకు ఇలాంటి వారిపై ప్రేమ ఉంటే వారికి అవకాశాలు ఇవ్వాలి కానీ వారిని తమ సినిమా ప్రచారాల కోసమే, తాము పే....ద్ద దయాహృదయులమని ప్రజల్లో చాటుకోవడం కోసమె చేస్తున్నారే తప్ప నిజంగా వారిని పైకి తేవాలని అయితే కాదు....  అని నాకు అనిపిస్తుంది...

      ఆ మద్య 2018లో  బేబి అనే ఆవిడ చాలా బాగా పాట‌లు పాడుతుందని, ఆమెది చాలా అద్భుతమైన గొంతు అని అందరూ పొగడ్తలతో ముంచెత్తారు. మొత్తంగా ఆమెని ఆకాశానికి ఎత్తేసారు... సంగీత దర్శకులు కోటి గారు, రఘుకుంచె గారు, పొగడ్తలతో ముంచెత్తారు. చిరంజీవి గారు తన ఇంటికి పిలిచి సత్కరించారు.  
బేబీ గారిని మట‌్టిలో మాణిక్యం అంటు పొగిడారు.
ఆ మట‌్టిలో మాణిక్యం ఇక సినిమాల్లో పాడుతూ బిజీగా అయిపోతుంది అనుకున్నాం... కానీ ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా ఆమె పాడింది లేదు... అసలు ఏమైంది ఈ మట‌్టిలో మాణిక్యం..
అంత పెద్ద సినిమా స్టార్స్   పొగిడిన బేబీ గారు ఇప్పటి వరకు ఒక్క పాట‌ పాడింది లేదు...

రామ్ గోపాల్ వర్మ
అబ్బ సొత్తు కాదురా టాలెంటు ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటూ... అన్నట‌్టు... టాలెంట‌్ మన దగ్గర ఉంటే ఎవరి సహాయం అవసరం లేదు. ముఖ్యంగా సినిమా రంగంలో.
           

ఈ మద్య ఎవరికైనా కొంచెం టాలెంట‌్ ఉన్న వారిని ఈ సినిమా వాళ్ళు షేర్ మార్కెట్ లో  షేర్ లాగా బాగా పైకి ఎత్తుతారు...

అప్పుడు  వీళ్ళ  పరిస్థితి ఎలా ఉంటుందంటే  ఫండమెంట‌ల్ గా , టెక్నికల్ గా అంత బలంగా లేని షేర్ అప్పర్ సర్క్యూట‌్ లోకి వెళ్ళి. ఆ తర్వాత అమాంతం ఢమాల్ న కిందపడిపోయి షేర్ మార్కెట్ నుండి  డీలిస్ట్ అయిపోయినట‌్టు ఉంటుంది..

  కాబట్టి ఎవరో పొగిడారని ఇక తమ జీవితం రంగులమయం అవుతుందని కలల లోకంలో విహరించకండి.

గొప్ప స్టార్స్  చుక్కలే చూపిస్తారు.
ఎందుకంటే వాళ్ళు పెద్ద స్టార్స్ కాబట్టి..

అందుకే  ఎవరో పొగిడారని పొంగిపోవద్దు మనలో టాలెంటు ఉంటే మనమే పైకి వస్తాం.

ఎవరి సహాయం అవసరం లేదు.  మీలో టాలెంటు ఉంటే    

యూట‌్యూబ్ లో ఛానెల్ పెట్టి పాట‌లు పాడండి చాలు.

యూట‌్యూబ్ మిమ్మల్ని స్టార్స్ ని చేస్తుంది..

10, మార్చి 2021, బుధవారం

బంగారు తెలంగాణ కాదు కాలుష్య తెలంగాణ.

        

                మనిషి ప్రశాంతంగా,ఆరోగ్యంగా బ్రతకాలంటే స్వచ్ఛమైన గాలి,నీరు ఎంతో అవసరం. స్వచ్ఛమైన గాలి,నీరు ఎక్కడ లభిస్తుంది అంటే పల్లెటూర్లో లభిస్తుంది అని అందరూ చెబుతారు. ఎందుకంటే పట‌్ట‌ణాల్లో గాలి,నీటి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. పట‌్ట‌ణాల్లో,నగరాల్లో నివసించే ప్రజలు వారాంతాల్లో నగర కాలుష్యానికి దూరంగా పల్లెల వైపు వచ్చి స్వచ్ఛమైన గాలిని, వాతావరణాన్ని ఆస్వాదిస్తుం‌టారు.  పల్లెటూళ్ళంటే పచ్చని ప్రకృతితో, స్వచ్చమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో కళకళలాడుతూ ఉండేవి.  ఉండేవి అని ఎందుకన్నానంటే అది గతంలో ఇప్పుడు కాదు. ఎందుకంటే  ఇప్పుడు        పల్లెటూళ్ళు కాలుష్యంలో  పట‌్ట‌ణాలతో పోటీ పడుతున్నాయి. ఇప్పుడు కాలుష్యంలో పట‌్నంకు, పల్లెకు తేడా లేదు. 

               

              ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంతో కళకళలాడుతూ ఉండే పల్లెల్లో ఇప్పుడు కాలుష్యంతో విలవిల ాడుతున్నాయి. పట‌్ట‌ణాల్లో  వాహనాల పొగ, ప్లాస్టిక్ వ్యర్ధాలు, డ్రైనేజీల వలన కాలుష్యాం ఏర్పడుతుంది. ఇక్కడ ప్రజలు ఎక్కువగా చదువుకున్న వాళ్ళే ఉం‌టారు. వీరికి కాలుష్యం పట‌్ల అవగాహన కూడా ఉంటుంది. అయిన పర్యావరణ కాలుష్యం గురించి ఎవ్వరూ పట్టించుకోరు. అందువలన పట‌్ట‌ణాలెప్పుడు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు పల్లెలు కూడా కాలుష్యంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ముఖ్యంగా గాలి కాలుష్యం విపరీతంగాపెరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే అనర్థాల గురించి చదువుకున్న వాళ్ళే పట‌్టించుకోరు. ఇక పల్లెల్లో ఉండే చదువుకోని ప్రజలకు ఎలాంటి అవగాహన ఉండదు. అందువల్ల పల్లెల్లో కాలుష్యం పెరిగిపోయింది. ముఖ్యంగా గాలి  కాలుష్యం పెరిగిపోయింది. ఎలా అంటే ప్లాస్టిక్ వ్యర్ధాలను తగల పెట‌్ట‌డం వలన గాలి కాలుష్యం ఎక్కువగా ఉంది.  ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వాడకం విపరీతంగాపెరిగిపోయింది. క్యారీబ్యాగ్, కూల్ డ్రింక్స్ బాటిల్స్, ఫుడ్ ప్యాకింగ్ కవర్స్,    ప్లాస్టిక్ విస్తరాకులు, చిప్స్ ప్యాకెట్స్ ఇలా అన్ని ప్లాస్టిక్ మయమే వీటిని వాడిన తర్వాత ఒక దగ్గర వేసి కాల్చి వేస్తున్నారు. దీని వలన ఏర్పడిన పొగ వలన పర్యావరణ ానికి ఎంత ప్రమాదమో వారికి తెలియదు, ఆ పొగ పీల్చటం వలన ఎలాంటి అనారోగ్యాలు వస్తాయో వారికి తెలియదు. ఇది తెలియక చాలామంది ప్లాస్టిక్ వ్యర్ధాలను తగలబెడుతుంట ారు. ఇదివరకు ఎవరి ఇళ్ళముందు వారు తగలబెట్టెవారు. దీని వలన కొంత సమయం గాలి కాలుష్యం ఆ చుట్టు పక్కల ఉండేది. కానీ ఇప్పుడు  ఈ గాలి కాలుష్యం, పొగ రోజంతా పల్లెలను పట్టి పీడిస్తోంది. ఇలా రోజంతా గాలి కాలుష్యం, పొగ రావడానికి కారణం ప్రభుత్వాల అతి తెలివి వల్ల నేడు గ్రామాల్లో వాయు కాలుష్యం పెరిగిపోయింది.


              ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లో ఇంటింటికి వచ్చి చెత్త సేకరించే కార్యక్రమం నడుస్తుంది. తడిచెత్త, పొడి చెత్త వేరు వేరుగా సేకరించాలని కొన్ని గ్రామాల్లో రెండు చెత్త బుట్టలను ఇవ్వడం జరిగింది. తడి చెత్త, పొడి చెత్త గురించి అవగాహన కల్పించారు. ఇక్కడ వరకు ప్రభుత్వం చేసిన పని మెచ్చుకోదగ్గ విషయమే. కానీ ఈ చెత్త డబ్బాలు కొన్ని గ్రామాల్లోనే ఇచ్చారు. చాలా గ్రామాల్లో ఇవి ఇవ్వలేదు. సరే ఇవ్వలేకున్నా సరే మేమే తెచ్చుకుంటాం చెత్తను   వేరు చేసి ఇస్తాం ఈ చెత్తను ప్రభుత్వం ఏమి చేయాలి? పర్యావరణ ానికి హాని కలిగించకుండా రీసైక్లింగ్ చేయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా తడి చెత్త, పొడి చెత్త , ఆ చెత్త ఈ చెత్త అని తెడా లేదు అన్ని చెత్తలు ఒకటే అన్నట‌్టు ఒకే చోట‌ వేస్తున్నారు. ఈ చెత్త  సేకరించే వారు ఉదయం ఒక ట‌్రాక్ట‌ర్ తో గ్రామంలో మొత్తం తిరిగి అన్ని రకాల చెత్తలు అందులో వేసుకుని ఊరి బయట‌ ఉన్న చెత్త డంప్ యార్డ్ లో వేస్తున్నారు.  ఇక్కడ వరకు బాగానే ఉంది కదా?  తెలంగాణ గ్రామాలు దీని వలన స్వచ్ఛంగా వెలిగిపోతున్నాయి అని మీరు అనొచ్చు, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం అని కూడా అనొచ్చు. కాని నేను మాత్రం ఇది పరమ దరిద్రమైన చెత్త పని అని అంటాను.... ఎందుకంటే ఒకపని చేస్తే ప్రజలకు మేలు కలగాలి కాని ఈ చెత్త సేకరించే పని వలన ప్రజలకు నష్ట‌మే తప్ప మేలు జరగడం లేదు.


           ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లో చెత్త డంప్ యార్డులు నిర్మించారు. దాంట‌్లో చెత్తను వేరు చేయడానికి అన్నట‌్టు చిన్న చిన్న గదులు నిర్మించారు. అందులో  గ్రామాల్లో సేకరించిన చెత్తను వేరు చేసి రీసైక్లింగ్ చేయాలి. కానీ ఇప్పడు ఏం చేస్తున్నారంటే డంపు యార్డ్ ముందు ఒక పెద్ద గుంత తీసి గ్రామంలో సేకరించిన చెత్తను అందులో వేసి తగలబెడుతున్నారు. దీని వలన 24/7 365 రోజులు అది మండుతూనే ఉంటుంది. ఆ పొగ పగటి పూట‌ పైకి వెళుతుంది. అప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. కాని సాయంత్రం పూట‌ చుట్టు పక్కల మొత్తం పొగతో నిండిపోయి నరకం కనిపిస్తుంది. గాలి పీల్చాం‌టేనే భయం వేస్తుంది. దగ్గు, ఆయాసం, కళ్ళ మంట‌లు నరకయాతన.

       అసలు ప్రభుత్వాలకు ఇలాంటి చెత్త ఐడియాలు ఎందుకొస్తాయో..? 😭😭😭 మా గ్రామంలో అయితే సాయంత్రం అయ్యిందం‌టే చాలు ఈ చెత్త డంపు యార్డ్ వల్ల దానికి దగ్గరగా ఉన్న ఇళ్ళ ప్రజలు    చాలా ఇబ్బంది పడుతున్నారు.. అందుకు ఉదాహరణ నేనే... సాయంత్రం నుండి ఉదయం వరకు ఆ పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్నా. నా పక్కన ఎవరైన సిగరెట‌్ తాగితేనే నాకు పడదు అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతాను. అలాంటిది లక్షల సిగరెట్లు  కాల్చినంత పొగ వస్తే ఏం చేయాలి. ఉపాది లేక  దశాబ్దం పాటు ఊరు వదిలి వెళ్ళిపోయాం.అక్కడ నానా కష్టాలు పడ్డాం. తెలంగాణ వచ్చాక మన బతుకులు బాగు పడతాయని సొంత ఊరికి వస్తే ఇక్కడేమే స్వచ్చమైన గాలి కూడా లభించడం లేదు. ఇదేనా బంగారు తెలంగాణ అంటే.????

        బంగారు తెలంగాణ ఎవరికి అయ్యిందో అందరికి తెలిసిందే. ఒక కుటుంబం బాగు పడితే చాలా...???


ఇది చాలా చిన్న సమస్య ఇంత పెద్ద రాద్దాంతం చేయడం అవసరమా అని మీరు అనొచ్చు. ఆ కష్టం అనుభవించిన వాడికే తెలుస్తుంది ఆ భాదేమిటో.  ఎక్కడైన పొగ వస్తేనే అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతాం అలాంటిది మన ఇంటికి దగ్గర 24 గంట‌లు పొగ అది కూడా ప్లాస్టిక్ ను తగలబెట్టిన పొగ వస్తే ఎలా ఉం‌టుందో ఆలోచించండి. ఇలాంటి కలుషితమైన గాలిని పీల్చి అనారోగ్యాల పాలయితే ఆసుపత్రుల చుట‌్టు తిరిగే స్తోమత మాకు లేదు. నాకు ఆసుపత్రులంటే మహా భయం.. అక్కడకు వెళ్ళాలంటే ఇంట‌్లో డబ్బులు కాసే చెట్లు ఉండాలి. అయినా ఆసుపత్రుల చుట‌్ట‌్టు తిరగడం కం‌టే ఆరోగ్యంగా ఉండట‌మే మేలు కదా..  


            కెసిఆర్ సార్ అంటే నాకు ఎంతో అభిమానం... నా చుట్టూ ఉండే వాళ్ళు ఎందరు కెసిఆర్ సార్ ను విమర్శించిన

 సార్ గొప్పవాడు  విమర్శించడం తప్పు అనేవాడిని . నేనే తప్పు అని ఇప్పుడు అర్థం అయ్యింది.. ఒక పని చేసే ట‌ప్పుడు అది పూర్తిగా  అమలు జరిగేలా చూడాలి అది వారి బాధ్యత. కాని ఆ పనిని  సగంలోనే వదిలేస్తే   బాధ్యతారాహిత్యం అంటారు.. ఈ చెత్త డంప్ యార్డులు ఎందుకు కట‌్ట‌డం జరిగింది అక్కడ జరుగుతున్నదేమిటి. అది పూర్తిగా నిర్దేశించిన పని జరుగుతుందా లేదా అనే బాధ్యత ప్రభుత్వానికి లేదా....??  కెసిఆర్ సార్ బంగారు తెలంగాణ అంటాడు సార్ మాకు బంగారు తెలంగాణ అవసరం లేదు. మాకు స్వచ్చమైన గాలి కూడా లభించడం లేదు నీ బంగారు తెలంగాణలో...


నా తెలంగాణ ఇప్పుడు కాలుష్యానికి చిరునామా. 

కెసిఆర్ సారూ నీకు కోటి దండాలు...🙏🙏🙏🙏🙏🙏

మీరు ఈ రాష్ట‌్రాన్ని బంగారు తెలంగాణ చేయకపోయిన పరవలేదు కానీ కాలుష్య తెలంగాణగా మాత్రం చేయకండి..


ఇక చివరగా ఒక మాట‌.. కెసిఆర్ సార్ చెప్పిన బంగారు తెలంగాణ ఎక్కడుందంటే ఆయన ఫామ్ హౌస్ లో ఉంది మంచి ఆహ్లాదకరమైన వాతావరణం హాయిగా ఆయన నివసిస్తున్నారు. సార్..... మీరు ముఖ్యమంత్రి అయ్యింది మీ కు‌టుంబం మాత్రమే హాయిగా ప్రశాంతంగా,ఆరోగ్యంగా జీవించడానికి కాదు. తెలంగాణ ప్రజలు హాయిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించాలి. దాన్ని అం‌టారు బంగారు తెలంగాణ అని.. నీ ఫామ్ హౌస్ పక్కన ఒక చెత్త డంపు యార్డ్ ఉండి ఊరి చెత్తనంతా అక్కడ వేసి తగలబెడితే తేలుస్తుంది మా బాధేమిటో. ఈ మాట‌ మీకు కోపం కలిగిస్తే, మాట‌ అన్నందుకే మీకు కోపం వస్తే మీరు గ్రామాల్లో కట‌్టించిన చెత్త డంపు యార్డుల   పొగ వల్ల నరకం అనుభవిస్తున్న మాకు ఎంత రావాలి మీపై కోపం..😠😠😠😠😠😠😠😠😠😠


ఇంకా చాలా అక్రమాలు జరుగుతున్నాయి.  కొండలు తవ్వేయడం, పచ్చని పంట‌ పొలాల్లో కంపెనీలు,  వెంచర్లు వేయడం వలన పర్యావరణం నాశనం అవుతుంది.. ఇక ఒకప్పుడు హైదరాబాద్ తాగునీటీ అవసరాలు తీర్చిన జంట‌ జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు కాలుష్యం కాకుండా 111 జీవో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఇప్పడు కెసిఆర్ ప్రభుత్వం వచ్చింది కదా బంగారు తెలంగాణ చేయాలి కదా ... అందుకే కెసిఆర్ సార్ 111 జీవోను కూడా ఎత్తి పడేస్తా అని చెప్పాడు.. నాకు తెలుసి కెసిఆర్ సార్  తెలంగాణ రాష్ట‌్రాన్ని కాలుష్యంగా మార్చడానికే కంకణం కట‌్టుకున్నట్టున్నాడు..

ఈ రెండు జలాశయను కూడా హూస్సేన్ సాగర్ లాగా  సుగంధభరితమైన జలాశయాలుగా మార్చాలనుకుంటున్నాడు. సారూ మీరు బంగారు తెలంగాణ చేస్తాను అం‌టే ఈ విధంగా చేస్తావనుకోలేదు..

సారూ కెసిఆరూ ఇలాంటి బంగారు తెలంగాణ మాకు వద్దు..... నీకు కోటి దండాలు...🙏🙏🙏🙏🙏🙏��