భానోదయం: 2018

19, డిసెంబర్ 2018, బుధవారం

లక్ష రూపాయలతో కోట్లు సంపాదించడం ఎలా??

    బస్ వచ్చి చాలా సేపు అయ్యింది తొందరగా రా అంటు...నా స్నేహితుడు బస్ లో నుండి ఫోన్ చేసాడు. పరుగున వెళ్ళి  గబ గబ బస్ ఎక్కాను. అక్కడ  రోజు ఇద్దరే స్నేహితులు ఉంటారు కాని ఈరోజు ఎవరో కొత్త వ్యక్తి ఉన్నాడు.ఎవరా అని దగ్గరకెళ్ళి చూస్తే నా చిన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు చూసిన నా క్లాస్ మేట్ ఎక్కడనుండి ఊడిపడ్డడో ఏమో కాని ముగ్గురు దేని గురించో తీవ్రంగా చర్చిస్తున్నారు. ఆ ఇద్దరికి బాగా బ్రెయిన్ వాష్ చేస్తున్నట్టు కనిపించాడు అతడు.

       మధ్యలో నేను కలుగజేసుకున్నాను ఏంటి విషయం అని అడిగాను. 

రేపు సిటీలో మీటింగ్ ఉంది అక్కడికి రండి మొత్తం ప్లాన్ అర్థమవుతుంది. మీరు ప్లాన్ విన్న తర్వాత వెంటనే ఇందులో జాయిన్ అవుతారు అంటూ చెప్పాడు.
నేను మీటింగ్ విన్న వెంటనే లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసేసాను అంటూ చెప్పాడు.

 ఎన్ని రోజులు ఇలా ఉంటారు మీరు సంపాదించేది మీకు సరిపోతుందా ఒక్క సారి ఇందులో జాయిన్ అవ్వండి లక్షలేంటి కోట్లు సంపాదిస్తారు. అంటు గాలి బాగా కొడుతున్నాడు.

మా మిత్రుడు ఇతని గాలి కొట్టుడుకు బాగా ఉబ్బిపోతున్నాడు బెలూన్ ఉబ్బినట్టు. కాని మరీ ఎక్కవ గాలి అయితే  ఏంటి పరిస్తితి అంటూ నా సందేహం.

ఏంటి ఈ స్కీమ్ అని అడిగాను.

ఎం లేదు సింపుల్ నువ్వు ఒక లక్ష రూపాయలు ఈ సంస్థలో కట్టాలి కట్టిన నెల నుండే నీకు 6000 రూపాయలు 25 నెలల పాటు  వస్తాయి. మరియు 25 నెలల తర్వాత మీ లక్ష మీకు ఇస్తారు. ఇంకా నీ తరుపున ఇందులో ఎవరినైన ఇందులో చేర్పిస్తే అందుకు కమీషన్ 3%అంటే మూడు వేలు వస్తాయి నువ్వు ఎంత మందిని చేర్పిస్తే అంత సంపాదించుకోవచ్చు అంటు గుక్క తిప్పుకోకుండా ఒకటే గాలి మాటలు చెబుతూనే ఉన్నాడు.

మావాడు ఇప్పటికే బాగా బెలూన్ లా ఉబ్బిపోయాడు.
 ఇంత డబ్బు వస్తుదంటే గాల్లో తేలిపోయేలా ఉన్నాడు. వీడు ఎక్కడ ఎగిరిపోతాడో అని వాడి మాటలకు అడ్డుపడి ఓకె బ్రదర్ ఇందులో సంపాదిస్తున్న వారి వివరాలు చెప్తావా??అని అడిగాను.

తన ఫోన్ తీసి ఒక ఇద్దరు ముగ్గురు  తమ కార్ల ముందు దిగిన ఫోటోలు చూపించాడు.
వీళ్ళు తెలుసా అంటు అడిగాడు తెలియదు అన్నాం ..

ఒకప్పుడు ఏమీ లేనోళ్ళు వీళ్ళంతా ఇప్పుడు కార్లలో తిరుగుతున్నారు. వీళ్ళు చాలా మందిని చేర్పించారు. బాగా సంపాదిస్తున్నారు అంటూ ఫోటోలు చూపించాడు.

ఇంకా నమ్మకపోతే ఈ వీడియో చూడు అంటూ కొంతమంది ఓర్వలేక ఈ సంస్థ మోసాలు చేస్తుందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అందుకే సంస్థ మనేజర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ సంస్థ వివరాలు చెప్పాడు. అంటూ యూట్యూబ్ లో వీడియోలు చూపించాడు.

ఓకె ... ప్రెస్ మీట్ పెట్టాడు నమ్మోచ్చు మరీ ఈసంస్థకు ప్రభుత్వ గుర్తింపు ఉందా ? అని అడిగాను.

ఏ.. అవన్ని మనకెందుకు అన్న మనకు నెల నెల డబ్బులు వస్తున్నాయా లేదా? అంటు అన్నాడు .

ఇంకో మిత్రుడు కలుగచేసుకుని ఒకవేళ మోసం చేస్తే ఏంటి పరిస్థితి అంటు గాలి తీసేసాడు. బెలూన్ లా ఉబ్బిన మావాడు ఈ మాటతో తుస్సుమన్నాడు.

 ఎలాగైన ముగ్గురి చేత డబ్బులు కట్టించి కమీషన్ పొందాలని చూస్తున్న అతడు వెనక్కి తగ్గుతాడా? ఒక ఫోటో చూపించాడు

 ఈయన ఎవరో తెలుసా?? అని అడిగాడు.

 హా! తెలుసు ఈయన చాలా నిజాయితి పరుడు అవినీతి పరుల గుండెల్లో రైల్లు పరిగెత్తించిన భారతదేశంలోనే ఒకరైన ఐఏస్ అధికారి అంటు ఇద్దరం సమాధానం చెప్పాం.

తెలుసు కదా ఈయన గురించి మరీ ఈ సంస్థ మోసం చేేసేదే అయితే అంత నిజాయితి పరుడైన ఐఏస్ అధికారి ఈ సంస్థ వారు చేపట్టే కార్యక్రమాలకు వస్తాడా ?? చెప్పండి అంటూ ప్రశ్న సందించాడు.

అరే అవునురా ఇందులో మోసంలేదు మనం ఇందులో లక్ష కడుదాం మన తరుపునుండి ఎవరినైనా జాయిన్ చేద్దాం డబ్బులు సంపాదించుకుందాం ఎన్ని రోజులు ఇలా చాలి చాలని జీతాలతో పని చేస్తాం నేను లక్ష కట్టేస్తా అని మా మిత్రుడు జాయిన్ అవ్వడానికి సిద్దం అయ్యాడు.

నేను ఇంకో మిత్రుడు మాత్రం సందేహిస్తూనే ఉన్నాం.

సరే ఓకవేళ మోసం చేస్తే ఏంటి పరిస్థితి?? అంటూ అడిగాం.

అరే ఏందన్నా ఇన్ని డౌట్లు నమ్మాలి అన్నా అందుకే మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు ఇందులో జాయిన్ అయ్యి ప్రతీ నెల లక్షలు సంపాందించేే వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు ఏమి లేనటువంటి వారు ఇప్పుడు కార్లలో తిరుగుతున్నారు. సొంతంగా బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు నమ్మాలి అన్న నమ్మకమే జీవితం. అంటూ ధీమా వ్యక్తం చేసాడు.

నువ్వు ఎన్నైనా చెప్పు బ్రదర్ ఒక వేళ రాత్రికి రాత్రే బోర్డ్ తిప్పేస్తే ఏంటి పరిస్థితి. ఇలా బోర్డ్ తిప్పేసిన సంస్థలు చాలా చూసాం. అక్కడ డబ్బులు పెట్టి మోసపోయిన చాలా మందిని చూసాం. మేము నీ మాటలు నమ్మలేం అన్నాను.

అన్నా నమ్మితే నమ్ము లేకపోతే లేదు ఇందులో జాయిన్ అయ్యే వాళ్ళను మాత్రం ఆపకు అంటూ కొంచెం చిరాకుగా చెప్పాడు.

నా మిత్రుడితో అరే నువ్వు ఎవరి మాట వినకు నువ్వు నా కింద జాయిన్ అవ్వు...
పోతే లక్ష పోతాయి వస్తే కోట్లు వస్తాయి ఒక్కసారి లక్ష పెట్టు నువ్వే ఇందులో ఇంకా పది మందిని చేర్పిస్తావు. ఇంకో విషయం ఎంత ఎక్కువ మందిని చేర్పిస్తే అంత కమీషన్ తో పాటు గోవా, సింగపూర్, దుబాయ్ లాంటి ప్రదేశాలకు టూర్లు కూడా పంపిస్తారు. మన పక్క ఊర్లో సగం మందికి పైగా జాయిన్ అయ్యి కార్లలో తిరుగుతున్నారు.అసలు నువ్వు ఊహించావా కార్లలో తిరుగుతావని మరియు ఫారిన్ టూర్లు వెళ్తానని ఎప్పుడైన ఊహించావా?!!
తొందరగా కట్టు ఇప్పుడే ఈ నెలలోనె లక్ష రూపాయలు కట్టి జాయిన్ అవ్వు వచ్చే నెల అంటే డిసెంబర్ లోపల జాయిన్ అవ్వు ఎందుకంటే తర్వాత జాయిన్ అయితే డబ్బులు చాలా తక్కువ వస్తాయి. ఎందుకంటే చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు అందుకే కమీషన్ తక్కువగా ఇస్తారు. నువ్వు రేపు లక్ష కట్టి జాయిన్ అవ్వు త్వరగా
 అంటూ మా వాడికి బాగా బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు.

పోతే లక్ష పోతాయా లక్ష అంటే చిన్న మొత్తమా ??
నీతో పాటు ప్రయాణించే నీ మిత్రుడికి పది రూపాయలు పెట్టి బస్ టికెట్ కొనడానికి వెనక ముందు ఆలోచిస్తావు. టిఫిన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇరవై రూపాయలు కట్టడానికి జేబులు తడుముకుంటావు. నీవు లక్ష పోతే పోతాయి అంటున్నావా??  ఆహా ! డబ్బు సంపాదించడానికి ఎన్నైనా చెబుతారు ఎంతకైనా దిగజారుతారు. అంటు అనుకున్నాను.
అది కూడా డిసెంబర్ లోపల కట్టాలి అంటూ తొందరపెడుతున్నాడు.

అబ్బా ఇంత తొందర ఏంటి డిసెంబర్ లోపలె కట్టాలా ???  డిసెంబర్ లోపల వీళ్ళ టార్గెట్ మనీ రీచ్ అయితే బోర్డు తిప్పేద్దామని కాబోలు.. అని నా సందేహం..

ఇప్పుడు మా మిత్రుడికి ఎంత చెప్పిన వినేలా లేడు.
మా వాడి బ్రెయిన్ లో కార్లు ,టూర్లు ,డాలర్లు షికారు చేస్తున్నాయి.

 కార్లల్లో తిరగాలని ఫారిన్ టూర్లు వెళ్ళాలని అందరికీ ఉంటుంది కానీ వాడు మోసం చేస్తే కార్లు టూర్లు ఏమో కాని వీడిని నమ్మీ  డబ్బు పెట్టిన వారు, నీ మీద నమ్మకం తోనే ఇందులో డబ్బులు పెట్టాం. ఆ డబ్బులు నువ్వే ఇవ్వు అంటే కనీసం సొంత ఊళ్ళోనైనా  తిరగగలడా??


నెల రోజుల తరువాత డిసెంబర్ నెల...

ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్నాం.

వార్తల హెడ్ లైన్స్ ...

అంబాని వారింట పెళ్ళి సందడి ప్రపంచంలోనే ఖరీదైన పెళ్ళంటా..

 తెలంగాణలో ఓటమికి కారణాలు అన్వేషిస్తున్న కూటమి..

దూసుకొస్తున్న పెథాయ్ తుఫాన్..

 అధిక వడ్డీలు ఇస్తామంటూ బోర్డ్ తిప్పేసిన సంస్థ..

ఆస్ట్రేలియాతో భారత్ ఓటమి..

సిందు ఖాతాలో మరో విజయం..


అంబానీల సంబురాల కంటే
కూటమి ఓటమి కంటే
తుఫాన్ భీభత్సం కంటే
భారత్ ఓటమి కంటే
సిందు విజయం కంటే

ఇన్ని వార్తల్లో  హైలెట్ ఏంటంటే  కోట్లల్లో వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంస్థ..!!!

ఆ సంస్థ మరేదో కాదు ఒ రోజు మాకు బస్సులో బ్రెయిన్ వాష్ చేసిన వ్యక్తి తాలుకు సంస్థే.

ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే ఫోన్ స్విఛాఫ్ చేయబడి ఉంది. అంటూ సమాధానం వచ్చింది.

ఎప్పటికైనా బోర్డు తిప్పేస్తారని ఊహించాం కానీ ఇంత తొందర గా తిప్పేస్తారని ఊహించలేం.

ఒక ప్రభుత్వ పాఠశాల టీచర్.
14000  మందిని నిలువునా ముంచేసాడు.
158 కోట్లు కాజేసాడు.

అత్యాశకు పోయి కష్టపడి సంపాదించున్న డబ్బులు. ఏ కష్టం చేయకుండా సంపాదించుకోవచ్చు అని చెపితే గొర్రెల్లా వెళ్ళి ఈ మాయగాడికి సమర్పించుకున్నారు.

 చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం???

నువ్వు చేరు నీ కింద ఇంకో ముగ్గురుని చేర్పించు ఇక అంతే  నువ్వు ఏ పని చేయక్కర్లేదు కూర్చున్న చోటకే డబ్బులు వస్తాయి అని చెప్పే మాయగాళ్ళ మాటలు నమ్మి చాలా మంది మోసపోతున్నారు.
ఇంకా కూడా మోసపోతూనే ఉంటారు.

ఈజీగా డబ్బు వస్తుందటే అది 100% మోసమే అని గుర్తించాలి..

వీళ్ళు  అందరిని నమ్మించడానికి చాలా కార్యక్రమాలు చేస్తారు మంచి పేరున్న వ్యక్తులను పిలిపించి సేవా కార్యక్రమాలను చేపడుతారు.
మీటింగ్ లు పెట్టి వింధు భోజనాలు పెట్టిస్తారు. వచ్చిన వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి పెట్టుబడి పెట్టెలా "కలుస్తే గెలుస్తం" అంటూ ఉపన్యాసాలతో ఊదరగొడతారు.
అధిక వడ్డీకి ఆశపడి డబ్బులు పెట్టేస్తున్నారు సామాన్య జనం.
అప్పులు చేసి మరీ ఇందులో పెడుతున్నారు.

వాళ్ళు అనుకున్న అమౌంట్ వచ్చినాక బిచానా ఎత్తేస్తారు. సంస్థ నిర్వాహకులు.

ఎన్నీ సంస్థలు బోర్డులు తిప్పేసిన ఇంకో కొత్త సంస్థలు వస్తూనే ఉంటాయి. గొర్రెల్లా జనాలు అందులో డబ్బులు పెట్టి మోసపోతూనే ఉంటారు.

నిర్వాహకులు మాత్రం కోట్లు వెనకేసుకుంటున్నారు.
ఒక్క రూపాయి లేకుండా కోట్లు సంపాదించడం ఎలా??
అంటూ, ఇలా ప్రజలను మోసం చేసి సంపాదిస్తున్నారు.




12, డిసెంబర్ 2018, బుధవారం

కారు+సారు=సర్కారు@కెసీఆర్ వార్ వన్ సైడ్



  తెలంగాణలో ఎదురులేని శక్తిగా తెరాస నిలిచింది.
మహా కూటమి కూలిపోయింది. కూటమిలో వారిలో వారికే స్పష్టత లేదు మరి ఇలాంటి వారికి జనం అధికారం అప్పజెప్తారా.???  పైగా ప్రగల్భాలు అది చేస్తాం ఇది చేస్తాం పీకేస్తాం బరికేస్తాం అంటూ ఒకటే ఊపదంపుడు ఉపన్యాసాలు.

అసలు కూటమి యొక్క ముఖ్య ఉద్ద్యేషం కెసీఆర్ ను గద్దె దింపడం.! అంతె తప్ప అబివృద్ది, ప్రజల సంక్షేమం కోసమైతే కాదు. కెసీఆర్ ను గద్దె దింపడం ఎవరి తరం కాదు. కారణం ప్రజలు కెసీఆర్ గారి నాయకత్వం కోరుకుంటున్నారు. తెలంగాణ సంక్షేమంగా ఉండాలంటే కెసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలంటు ఈ అఖండ విజయాన్ని అందించారు.
  ఇది ప్రజల విజయం...

మహాకూటమి నేతలు ఓవర్ కాన్ఫిడెన్స్ తో మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. కెసీఆర్ పాలన అంతం చేస్తాం, కాంగ్రేస్ లో ఫైర్ బ్రాండ్ అనిపించుకునే నేతలు మీసాలు, గెడ్డాలు మెలేసారు ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాం అని, ఇంకొకరు బ్లేడ్ తో కోసుకుంటాననీ.ఇంకొకరు తొడలు కొట్టారు బుల్ బుల్ కామెడీలు చేసారు.

చివరికి ఏమైంది సారే కెసీఆరే గెలిచారు. మీసాలు
గెడ్డాలు  మెలేసిన పౌరుషం ఏమైంది???? తొడలు కొట్టిన హీరోయిజం ఏమైంది????

ఫామ్ హౌస్ లో పండుకునేటోడు రాష్ట్రాన్నీ ఏం పాలిస్తాడన్నారు?? కెసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకునేటోడు కాదు ఫామ్ లో ఉన్నోడు అని నిరూపించాడు...

పేడ మూతోడు మీసాలు లేనోడు అంటు హేళన చేస్తు మాట్లాడిన నేతలకు తన మెజారిటీ గెలుపుతో తన స్టామినా ఏంటో నిరూపించాడు కెటీఆర్.

మీసాలు,గడ్డాలు పెంచినంత మాత్రాన హీరోలైపోరు జనం హృదయాలను గెలవాలి ఆడే మగోడు మగాడు...
       
కెటీఆర్ సాఫ్ట్ వేర్ మీలాగా చిల్లరగాడు కాదు.
మైక్ ఉందికదా నలుగురు చెంచాగాళ్ళు ఆరుస్తున్నారు కదా అని నోటికి ఏదోస్తే అదే మాట్లాడటం కరెక్ట్ కాదు.

హీ ఇజ్ ఏ క్లారిటీ పర్సన్. మిస్టర్ పర్ ఫెక్ట్..

ప్రజలకు కావలసింది ఈలలు వేయించే మాటలు కాదు. అభివృద్దికి వేయించే బాటలు కావాలి..
     
 ఇంకొకరు సినిమా డైలాగులతో మేం సింహాలం ఒకవైపే గెలుపు అన్నట్టు సినిమా డైలాగులతో అధరగొట్టారు.
అధరగొట్టె సమయంలో నవ్వులపాలు అయ్యారు. సినిమా వేరు జీవితం వేరు సినిమాని జీవితాన్ని ఒకేలా చూడలేం. సినిమా ,జీవితం ఒకేలా ఉంటుందనుకుంటే పప్పులో కాలేసినట్టే .. అలా అనుకుంటే పప్పు పప్పు అయిపోవడం గ్యారంటీ!!
అయిపోయారు కూడా!!😁😁😁😁

పెద్ద ఎత్తున డంబాచారం కొట్టిన మహాకూటమి కెసీఆర్ ప్రభంజనం ముందు గడ్డిపోచలా కొట్టుకుపోయింది.

అసలు సింహం ఎవరో తెలిపోయింది..

కెసీఆర్ అంటే ఆల్తు ఫాల్తు కాదు..

కెెసీఆర్ అంటే కెసీఆరే ..

ఎదురులేని నాయకుడు ..

ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక సీఎం...

ఫిర్ ఏక్ బార్ కాదు బార్ బార్ సీఎం కెసీఆర్...

           

8, డిసెంబర్ 2018, శనివారం

కమెడియన్ ఆఫ్ ద ఇయర్


              తెలుగు సినిమా ఇండస్ట్రీలో  హీరోలు విలన్లుగా విలన్లు హీరోలుగా మారి యాక్టింగ్ చేస్తుంటారు. ఉదాహరణకు జగపతిబాబు ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఒక వెలుగు వెలిగాడు. ఇప్పుడు విలన్ గా నటిస్తున్నాడు. అలాగే  ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న అరవింద స్వామి ఇప్పుడు విలన్ గా నటిస్తున్నాడు. 
            అలాగే టాప్ కమెడియన్లు సునీల్ , సప్తగిరి, షకలక శంకర్ కూడా హీరోలైపోయారు.  తెలుగులో కమెడియన్లు అందరూ హీరోలుగా నటించడం వలన కామెడి తక్కువైపోయింది. బ్రహ్మీ సినిమాలు చేయడం లేదు. మరీ ఇలాంటి సమయంలో తెలుగు ప్రేక్షకులు కామెడీ లేక బోర్ గా ఫీల్ అవుతున్న సమయంలో నేనున్నానంటూ దూసుకొచ్చాడు ఈ కామెడీ సింహం.
     టాప్ కమెడియన్లను మించి కామెడి చేస్తున్నాడు. 
    తెలంగాణ ఎన్నికల్లో నాయకులు ప్రచారం చేసి చేసి అలసిపోయి ఈయన కామెడి చూసి రిలీఫ్ అవుతున్నారు.
  ఇటు తెలుగు అటు హిందీ భాషల్లో,
 ఇటు టాలీవుడ్ ప్రేక్షకులను అటు బాలీవుడ్ ప్రేక్షకులను, రాజకీయ నాయకులను  ఏకకాలంలో తన కామెడీతో కడుపుబ్బ నవ్విస్తున్నాడు. 
  
  అసలు కామెడీ ఎలా చేయాలో ఈయనను చూసి నేర్చుకోవాలి. కామెడీకి స్పెల్లింగ్ నేర్పిందే ఈయన.


తన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేల నవ్విస్తు "కామేడియన్ ఆఫ్ ద ఇయర్" అనిపించుకున్నాడు ఈ తెలుగు తేజం..
    
    ఆయన ఎవరో అనుకుంటున్నారా!!!

మాదాపూర్ లో ఐటీ కి స్పెల్లింగ్ నేర్పించిన మాదాపూర్ మైదాపిండి!!

తన కామెడీతో హిస్టరీ క్రియేట్ చేస్తున్న కామెడీ సింహం....!!!

ఆయన ఎవరో నేను చెప్పను మీరే చూడండి...!!!

ఆయన చేసిన కామెడీలో మచ్చుకు ఒకటి ఈ బుల్ బుల్ కామెడి....!!!😂😂😂😂
   
    ఈ పోస్ట్ ఎవరిని కించపరచడానికి  కాదు  కేవలం నవ్వడానికి మాత్రమే..










      


          

6, డిసెంబర్ 2018, గురువారం

రూపం మార్చిన ఆక్టోపస్

   
   ఆక్టోపస్ అంటే అందరికి తెలుసు ఆరు నుండి ఎనిమిది కాల్లు ఉంటాయి వాటినే టెంటకిల్స్ అంటారు. అవసరానికి అనుగునంగా తన ఈ టెంటకిల్స్ తో  రూపాన్ని మార్చుకుంటుంది. పరిసరాలకనుగునంగా రంగులు మారుస్తుంది శత్రు జీవులనుండి కాపాడుకోవడానికి దాని శత్రు జీవిగా మారిపోతుంది అది ఆక్టోపస్ ప్రత్యేకత. మరి సముద్రంలో ఉండే ఆక్టోపస్ ప్రపంచం దృష్టిని ఎలా ఆకర్షించింది అంటే సాకర్ వరల్డ్ కప్ 2010 లో ఏ దేశం మ్యాచ్ నెగ్గుతుందో ముందే జోష్యం చెప్పింది అది చెప్పినట్టే జరిగింది దాని యజమాని పాల్. అందుకే దానికి పాల్ ఆక్టోపస్ అని పేరు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఏమైందో కాని తర్వాత ప్రపంచకప్ లో అది కనపడలేదు. రష్యాలో జరిగిన సాకర్ ప్రపంచకప్ లో చెవిటి పిల్లి జోష్యం చెప్పింది.
    మరీ పాల్ ఏమయ్యింది ప్రపంచవ్యాప్తంగా అందరూ పాల్ గురించి ఆలోచిస్తున్నారు చనిపోయిందా లేదా  సముద్రంలోకి వెళ్ళిపోయిందా ఏమైంది.??
       అలా ఆలోచిస్తుంటే ఆంద్రప్రదేశ్ లో ప్రత్యక్షమైంది ఒక కొత్త రూపంలో ఒకప్పుడు ఫుట్ బాల్ ప్రపంచకప్ లకు జోష్యం చెప్పే పాల్ ఇప్పుడు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో జోష్యం చెప్పింది అరే ఈ హైటెక్ యుగంలో ఈ చిలక జోష్యాలు పాల్ జోష్యాలు ఎవడు నమ్ముతారు అని మీరనొచ్చు నమ్మాలి ఎందుకంటే అది చెప్పిన జోష్యం నిజం అయ్యింది కాబట్టి. 2014  ఎన్నికల్లో తెలంగాణలో సర్వే చేసి  ఫలితాలు ఎలా ఉంటాయో ఈ ఆక్టోపాస్ కరెక్ట్ గా చెప్పింది అప్పుడు ప్రపంచం దృష్టి ఆంధ్రావైపు మళ్ళింది పాల్ ఆక్టోపాస్ ఎక్కడికి వెళ్ళలేదు ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళిందని అందరూ దానికి ఆంధ్ర ఆక్టోపస్ అని పేరు పెట్టారు కాని సముద్రంలో ఉండే ఆక్టోపస్ కి తన లక్షణాలు ఒక్కటి కూడాలేవు.
          మరి ఆక్టోపస్ ఎందుకు తన రూపాన్ని కోల్పోయింది అనుకుంటున్నారా ముందే చెప్పానుగా ఆక్టోపస్ అనే జీవి పరిసరాలకనుగునంగా అవసరానికి తగ్గట్టుగా తన రూపాన్ని మార్చుకుంటుందని అందుకే ఇప్పుడు ఇలా ఆంధ్రా ఆక్టోపస్ గా అవతరించింది. రూపం అయితే మారింది గాని అది చెప్పే జోష్యం మారలేదు. 2014 లో సర్వే చేసి అన్ని ఎన్నికల ఫలితాలు కరెక్ట్ గా చెప్పింది. 2018 లో కూడా సర్వేచేసి  ఫలితాలు చెప్పింది కాని అది నిజం అవుతుందో కాదో అసలు అవుతుందా అని డౌటు ఎందుకంటే పాల్ ఆక్టోపస్ ఒకసారి మాత్రమే ఫుట్ బాల్ టోర్నీకి జోష్యం చెప్పింది తర్వాత చెప్పలేదు తన రూపాన్ని మార్చుకున్నట్టే వృత్తిని ,ప్రాంతాన్ని రెండు మార్చేసింది అదేనండి సాకర్ నుండి ఎన్నికలకు, జర్మనీ నుండి ఆంధ్రప్రదేశ్ కు మారింది ఈసారి మాత్రం ఏమీ మార్చలేదు అలాగే ఉంది అందుకే అది చెప్పే జోష్యం కరెక్ట్ కాదని అనిపిస్తుంది.
     అసలు పాల్ ఆటల నుండి రాజకీయాల వైపు అదికూడా తెలుగు రాజకీయాలవైపు వచ్చింది ఎందుకు ?? బహుషా రాజకీయాలంటేనే రంగులు మార్చడం అనుకుందేమో అవసరాన్ని బట్టి రాజకీయ నాయకులు పార్టీ కండువాలు మారుస్తుంటారు అందుకని ఈ వైపు వచ్చి ఉండాలి రంగులు మార్చే నాయకులను ఊసరవెల్లితో పోలుస్తాం నాకేం తక్కువ రంగులతో పాటు రూపాన్ని కూడా మార్చగలననీ ఇటు వైపు వచ్చి ఉండాలి. కొంపదీసి ఈ ఆక్టోపస్ ను రప్పించింది బాబు గారైతే కాదు కదా!!

 అసలు పాల్ ఈ సారి ఎందుకు తన రూపాన్ని మార్చలేదు ఒకవేళ తన జోష్యం తప్పయితే మార్చుతుందేమో చూడాలి. నాలుగైదు సంవత్సారాలకు ఒక సారి  తన రూపాన్ని మార్చేే పాల్  ఆక్టోపస్ ఈ సారి ఎక్కడికి వెళ్తుందో చూడాలి.
   

           
                      సర్వేజన లగడపాటి భవంతు

4, డిసెంబర్ 2018, మంగళవారం

బహుభాష కోవిదుడు బాలయ్య



    తెలుగులో అనర్గళంగా మాట్లాడేవారిలో బాలయ్య బాబు ముందువరుసలో ఉంటారు. అబ దబబ ఆఆఒ బబబ అబ అంటు అనర్గళంగా మాట్లాడగలరు.ఇప్పుడు ఎన్నికల పప్రచారంలో తనదైన శైలిలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తన మాటల తూటాలతో ఎండగడుతున్నారు.మరోవైపు మోది సర్కార్ పైన కూడా తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు మనందరికి తెలుసు బాలయ్య బాబు తెలుగు ఎంత చక్కగా ఉఛ్ఛరిస్తారో కొందరు భాష పండితులకు మాత్రమే అది అర్థం అవుతుంది. ఇప్పుడు బాలయ్య హిందీలో కూడా అధరగోడుతున్నారు బాలయ్యకు తొడలు కొట్టడమే వచ్చు అనుకున్నాం కాని ఇలా హిందీలో అధరగొడుతాడని ఊహించలేం.
           ఈ మధ్య ఒక సభలో ఆయన హిందీలో చేసిన ప్రసంగం హిందీ భాషా పండితులకు సైతం అర్థం కాలేదు అది బాలయ్య వాక్ఛ్యాతుర్యం అంటే. బాలయ్య కొడితేనే కోమాలోకి వెళ్తారు అనుకున్నాం కాని బాలయ్య మాట్లాడితే కూడా కోమాలోకి వెళ్తారని ఆయన హిందీ ప్రసంగంతో ఋజువయ్యింది. ఆయన హిందీలో ఏం మాట్లాడారో అర్థం కాక హిందీ భాషా పండితులు నాలుగైదుగురు కోమాలోకి వెళ్ళిపోయారు. అది బాలయ్య దెబ్బ అంటే.
           ఆయన ఏం మాట్లాడారో  ఆ పదాలు అర్థం అవ్వడానికి  ఈ ప్రపంచంలో ని ఏ డిక్షనరీలో వెతికిన దొరకదు. అది బాలయ్య భాష చతురత.
       
 బాలయ్య బాబు సినిమాల్లో మరియు బయట ఒకేలా ఉంటారు అక్కడ రౌడీలను కొడతారు ఇక్కడ అభిమానులను కొడుతారు ఆయనతో కొట్టించుకోవడానికి ఆయన అభిమానులు ఎగబడుతుంటారు. ఒకప్పుడు తొడలు కొట్టేవాడు ఇప్పుడు జనాలని కొడుతున్నాడు. ఒకప్పుడు కత్తులతో కాదు కంటి చూపుతో చంపేసేవాడు ఇప్పుడు మాటలతో చంపేస్తున్నాడు.
  ఇంకో అడుగు ముందుకేసి వార్నింగ్ లు కూడా ఇస్తున్నాడు తెలంగాణ మంత్రి కెటీఆర్ కు ఇచ్చిన వార్నింగ్  ఇలా ఉంది  "బిడ్డా కెటిఆల్ హైటెక్ సిటీ కట్టాలా చెంచాబాద్ ఎయిల్ పోల్ట్ కట్టాలా లింగ్ లోడ్ కట్టాలా  ఏం కట్టాలు మీలు ఇవన్ని కట్టింది మా బావ బాబు గాలు హైదలాబాద్ అభిలుద్ది చేచింది మా బావ బాబు గాలు ఆయన్ను తిడితే ఊలుకోనూ ఆంధ్లా ఎన్నికల్లో వేలు పెడుతావా ధమ్ముందా  లా చూచుకుందాం ఆంధ్లాలో " అంటు భీకరమైన లెలుగు సారీ తెలుగు భాషలో హెచ్చలించాలు.
చూసారా బాలయ్య భాష వింటే నాకు కూడా ఆయన భాష వచ్చేలా ఉంది. ఎంతకైనా మంచిది కెటీఆర్ సార్ బాలయ్య జోలికి వెళ్ళకు ఆయన భాష మీకు వచ్చేయగలదు.
 ఈ జోరు చూస్తుంటే బాలయ్య టీడిపీని తెలంగాణలో ఒంటి చేత్తో గెలిపించేలా ఉన్నాడు ఈ విషయం బాబు గారు గుర్తించలేక పోయినట్టున్నారు ముందే తెలిస్తే 119 సీట్లు టీడీపీకె వచ్చేవి బాలయ్య అంటే మజాకా మరి సమర సింహం. పాపం బాబు గారు కేవలం 13సీట్లకే పరిమితమయ్యారు. బాబు గారు ఇంకో సింహాన్ని తెలంగాణలో వదలలేదు ఎవరో అనుకుంటున్నారా అదేనండి ఈయన బాలయ్య కంటే ఘనుడు ఈయనకు కూడా తెలుగు భాషను నేర్పింది బాలకిట్టీ గారే. ఈయన  తెలుగు మాట్లాడటంలో గురువును మించిన శిష్యుడు ఆయనేనండి మన పండితపుత్ర పరమ ........ నారా లోకేష్ పప్పు  గారు ఈయనను కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దించి ఉంటే వార్ వన్ సైడ్ అయిపోతుండే. ఎందుకు ఈ సింహాన్ని వదలలేదో అర్థం కాలేదు బహుషా సమరసింహం అదేనండి గడ్డాలు మీసాలు గీసుకున్న మగ సింహం బాలయ్య ఒక్కడు చాలు అనుకున్నాడేమో బాబు గారు.

నాకొకటి అర్థం కావటంలేదు అసలు బాలయ్య భాషలు ఎక్కడ నేర్చుకుంటున్నారు ఆయన భాషలు ప్రపంచంలో ఎవరీకి అర్థం అవ్వటంలేదు బాబు గారు వేరే గ్రహం నుండి  గ్రహాంతరవాసులను రప్పించి ఈ భాషను నేర్పించినట్టున్నాడు అభివృద్దిలో బాబును మించినోడే లేడుపో
 నీ కీర్తీ ఖండాంతరాలు సారీ గ్రహాంతరాలు దాటింది
పో.
    ఏది ఏమైనా బాలయ్య గారు భాషలు మాట్లాడటంలో  తెలుగు జాతికి దొరికిన ఆలిముత్యం సారీ ఆణిముత్యం.
                       
                        జై లాలయ్య అబ్బా... సారీ....
                                   జై బాలయ్య

     

 
         

30, నవంబర్ 2018, శుక్రవారం

మళ్ళీ ముఖ్యమంత్రిగా కెసిఆర్

         ఎవరు ఊహించని పథకాలు తెరాస ప్రభుత్వం తీసుకొచ్చింది. 60 సంవత్సరాలుగా జరగని అభివృద్ది నాలుగున్నర ఏళ్ళలో జరిగింది.
ఇంకోసారి అధికారంలోకి వస్తే తప్పకుండా బంగారు తెలంగాణ సాద్యం అవుతుంది. తెలంగాణ ప్రజలు కెసిఆర్ ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. కెసిఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్టంలో కూడా లేవు.  నిరుద్యోగులు మాత్రమే కెసిఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారు వారికి కూడా వచ్చే ఏడాదిలో ఉద్యోగాలు
వస్తాయని ఆశిస్తున్నాం. అందరికి న్యాయం చేసినోడు చదువుకున్నోళ్ళకు అన్యాయం చేస్తాడా.
కెసిఆర్ మాటల ముఖ్యమంత్రి కాదు చేతల ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి చేయలేని పనులు ఒక్క కెసిఆర్ మాత్రమే చేసాడు.
ఈ ఎన్నికల్లో కెసిఆర్ ను గెలిపించేది ఆయన అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు.
24 గంటల కరెంట్
మిషన్ భగీరథ
మిషన్ కాకతీయ
రైతు బందు
ఆసరా పించన్లు
కళ్యాణలక్ష్మీ
కెసిఆర్ కిట్ లాంటి మరెన్నో పథకాలే కాకుండా పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారం లాంటి మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారు. ఇలా రాష్ట్ర సర్వతోమఖాభివృద్దికి పాటు పడుతున్న కెసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలి అంటుంది తెలంగాణ ప్రజానికం.
          మహాకూటమి సీట్ల పంపకాలలోనే వీళ్ళకి క్లారిటీ లేదు వీళ్ళేం పాలిస్తారు రాష్ట్రాన్ని ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే సీఎం సీటు కోసం కొట్లాట తప్పితే అభివృద్ది శూన్యం.
        నూటికి నూరు శాతం మళ్ళీ కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారు కావాలి. ఈ రాష్ట్రానికి కెసిఆర్ దిక్సూచి. జై కెసిఆర్ జై తెలంగాణ.

27, నవంబర్ 2018, మంగళవారం

తెలంగాణలో బలమైన పార్టీ ఏది??

   



    తెలంగాణ ఎన్నికల్లో తెరాస, మహాకూటమి మద్యే పోటి బిజెపి తన ఉనికిని కాపాడుకోవడానికే పోటీచేస్తుంది. ఇక లెఫ్ట్ పార్టీలను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. ఆ పార్టీలు పానకంలో పుడకల్లాంటివి.
 ప్రస్తుతం తెలంగాణలో బలమైన పార్టీ ఏదంటే తెరాస అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పార్టీని ఎదుర్కోవాలంటే బలమైన పార్టీ ఉండాలి. జాతీయ స్థాయి పార్టీ సైతం ఇతర పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడినప్పుడే తెరాస పార్టీ బలమైన పార్టీగా అవతరించింది.
సొంతంగా పోటీ చేసి గెలిచే ధమ్ములేక అన్ని పార్టీలు ఏకమయ్యాయి.
 మహాకూటమి ముఖ్య ఉద్ద్యేశం ఒక్కటే కెసీఆర్ ను గద్దె దింపడం అంతే తప్ప ప్రజల సంక్షేమం కోసమైతె కాదు. కెసీఆర్ లాంటి బలమైన నాయకుడు తెలంగాణలోని ఏ పార్టీలో లేడని చెప్పాలి. కాంగ్రేస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కెసీఆర్ తో సమానమైన బలమైన నాయకుడైతే కాడు. ఇక ఇంకో వ్యక్తి రేవంత్ రెడ్డి
ఈయన తిట్టడానికే పనికి వస్తాడే తప్ప ఇంకేం లేదు. తిట్టడం వల్లనే గొప్ప నాయకుడు ఎలా అవుతారో రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి.
ఇక తెదేపా విషయానికి వస్తే తెలంగాణలో అంతరించి పోయే పార్టిలో ముందు వరుసలో ఉంది. అందుకెనేమో ముందు చూపుతో రెవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాడు. రేవంత్ రెడ్డికి కెసీఆర్ ని విమర్శించడంపై ఉన్న శ్రద్ద తన నియోజకవర్గ అబివృద్దిపై ఉంటే బావుండేది. కెసీఆర్ ను  విమర్శించేముందు తన మీద ఉన్న ఓటు నోటు కేసు గురించి ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఒక వ్యక్తిని ఓడించడానికి అన్ని పార్టీలు ఏకమయ్యాయంటే ఆ వ్యక్తి ఎంత బలమైన నాయకుడో అర్థం అవుతుంది.
   

   ప్రజలకు కావలసింది తోపులు, హీరోల్లాంటి నాయకులు కాదు ప్రజల సంక్షేమం కోసం పాటు పడే నాయకుడు కావాలి.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని,సంస్కృతిని కాపాడే పార్టీ తెరాస. తెలంగాణ అభివృద్ది చెందాలంటే అది తెరాసకే సాద్యం.
        

24, నవంబర్ 2018, శనివారం

ఆదర్శ రైతు శాస్త్రవేత్త

 

    ఈ రోజుల్లో పొలం ఉంటే ఏం చేస్తారు రేటు వస్తే అమ్మేసి కార్లు, బంగళాలు కొనేసి లగ్జరీ లెఫ్ అనుభవించాలని చూస్తారు. లేదా ఫ్లాట్లు, వెంచర్లు లాంటివి చేసి అమ్మేసి అప్పుడు కూడా లగ్జరీ లైఫ్ అనుభవించాలని చూస్తారు. ఎటు తిరిగి కార్లలో, పెద్ద పెద్ద బంగాళాలో ఉండాలని కోరుకుంటారు ఇదే మనిషి జీవన విధానం అనుకుంటారు.
         కాని వ్యవసాయం చేయాలని ఎవరు అనుకోరు అదికూడా ప్రకృతి వ్యవసాయం. వ్యవసాయం చేయాలంటే  అసలు వ్యవసాయమే దండగ అనే వారు ఉన్నారు.
వ్యవసాయం చేస్తే ఏమొస్తుంది అప్పులే మిగులుతున్నాయి. పెట్టుబడులు సైతం రాలేని పరిస్థితి నెలకొంది ఇలాంటప్పుడు ఎవరు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయంలో నష్టాలు రావడానికి కారణం నేడు మనం పాటించే పద్దతులు మితిమీరిన ఎరువులు పురుగుమందులు వాడటం. పైగా విత్తనాలను కూడా కొంటున్నారు ఒకప్పుడు ఎవరి విత్తనాలు వారే తయారు చేసుకునే వారు సహజ సిద్దమైన ఎరువులనే వాడేవారు అలా పండించిన ఆహారం తిన్నవారు ఆరోగ్యంగా జీవించేవారు. నేడు రసాయన ఆహారం తిని రోగాల బారిన పడుతున్నారు ఈ రసాయన ఎరువులు వాడి పండించిన ఆహారం తీసుకుంటే ఒక సంవత్సర కాలంలో ఒక బస్తా ఎరువు మనకు తెలియకుండానే తింటున్నాం.
         విత్తన కంపెనీలు ఎరువుల కంపెనీలు రైతులను కీలు బొమ్మల్ల ఆడిస్తున్నాయి. మేం తయారు చేసిన విత్తనాలే వేయాలి మేం తయారు చేసిన ఎరువులు పురుగు మందులు వాడాలి అంటు వ్యవసాయం మొత్తం ఈ కంపెనీల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. రైతులు తమ సొంతంగా విత్తనాలు ఎరువులు తయారుచేయడం మానేసి ఈ కంపెనీలపై ఆధారపడుతున్నారు.
         ఈ విత్తనాలకు ఈ రేటు, ఈ ఎరువులకు ఈ రేటు అంటు కంపెనీ వాడే ధర  నిర్ణయిస్తాడు. కాని రైతులు  పండించిన పంటలకు ధర ఎవరో ధలారి నిర్ణయిస్తాడు.  ఇది రైతుల పరిస్థితి మరి ఇలాంటప్పుడు ఎవరు వ్యవసాయం చేయడానికి ఇష్టపడుతారు.
          కాని ఒక రైతు ఉన్నాడు అతన్ని రైతు అనే కంటే వ్యవసాయ శాస్త్రవేత్త అనాలి. తనకున్న పొలంలో సహజ సిద్దంగా పంటలను పండించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.
    వ్యవసాయంలో కొత్త కొత్త పద్దతులను అవలంబించి అధిక దిగుబడులను సాదిస్తున్నాడు. తను అవలంబించే విధానాలను అందరి రైతులకు ఉపయోగపడేలా తన వ్యవసాయ క్షేత్రం సందర్శించి తెలుసుకునేలా ఏర్పాటు చేసాడు. పంటలతో పాటు చేపల పెంపకం కూడా చేసి రెండు సమన్వయం చేస్తున్నాడు. ఈయన వ్యవసాయ క్షేత్రాన్ని తెలుగు రాష్ట్రలనుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా విద్యార్థులు,రైతులు ,శాస్ర్తవేత్తలు సందర్శిస్తు ఉంటారు. ఆయనే విశ్వనాథ రాజు మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది ఈయన వ్యవసాయ క్షేత్రం.
     పచ్చని పంట పొలాలను సైతం కాంక్రీట్ జంగల్లుగా మారుస్తున్న నేటీ సమాజంలో బీడు భూముల్లో సైతం బంగారు పంటలు పండిచ్చవచ్చు అని నిరూపిస్తున్న విశ్వనాథ రాజు ఎందరికో ఆదర్శం. రైతే రాజు అని ఆయన నిరూపిస్తున్నాడు.

      కార్లు బంగాళాలు కోట్ల రూపాయల లగ్జరీ లైఫ్ అనుకుంటు పీల్చే  గాలిని సైతం  కొనుక్కుంటున్నారు నేటి మనుషులు.
         పచ్చని ప్రకృతిలో ఆహ్లాదకరంగా బ్రతికే వారికి కోట్ల రూపాయలు చిత్తు కాగితాలతో సమానం.
      విశ్వనాథ రాజు లాంటి వ్యవసాయ రైతు శాస్త్రవేత్తలు నేటి సమాజానికి ఎంతో ఆదర్శం..
          

21, నవంబర్ 2018, బుధవారం

ముద్దుల్లో మునిగి తేలుతున్న టాలీవుడ్

 

       తెలుగు  సినిమా ఇండస్ట్రీ ముద్దుల్లో మునిగి తేలుతుంది సినిమాల్లో నే కాదు ఆడియో ఫంక్షన్లలో కూడా ఈ సీన్లు చూస్తున్నాం.

  తెలుగు సినిమాల్లో ముద్దు అనేది ఇప్పుడు ట్రెండ్.  తెలుగు సినిమా మూడు ముద్దులు ఆరు హగ్గులతో విజయవంతంగా సాగిపోతుంది.బాలీవుడ్ లో మాత్రమే కొందరు హీరోలకు మాత్రమే పరిమితమయ్యే ముద్దు సీన్లు ఇప్పుడు టాలీవుడ్ లో కొత్తగా వస్తున్న హీరోలకి, డైరెక్టర్లని స్టార్లని చేస్తున్నాయి.     
      అబ్బో ఈ ముద్దు సన్నివేశాలు మామూలుగా ఉండటం లేదు మితిమీరి పోతున్నాయి. అసలు  సెన్సార్ బోర్డు పని చేస్తుందా లేదా అన్నట్టు ఉంది. కుటుంబంతో కలిసి సినిమాలు చూసే పరిస్థితి పోయింది.   దీనిపై ఎవరన్నా ప్రశ్నిస్తే ప్రేక్షకులు ఏది చూస్తే అదే తీస్తాం! అంటు సమాధానమిస్తున్నారు కొత్తగా వస్తున్న డైరెక్టర్లు. మంచి సినిమాలు చూస్తే నువ్వు చూస్తావ ?? అంటు ఎదురు ప్రశ్నిస్తున్నారు.
      ముద్దులు, హగ్గులు లేకుండా సినిమాలు తీస్తే ఎవరు చూడటం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులు ఏది చూస్తే అదే తీస్తాం అనే ధోరణిలో కొత్తగా వస్తున్న దర్శకులు బాహాటంగానే చేబుతున్నారు. కాని మంచి కథ ఉంటే ఇలాంటి అశ్లీల దృశ్యాలు అవసరం లేదని వీరికి తెలియదు. కొత్తగా వస్తున్న దర్శకులు  మూడు ముద్దులు ఆరు హగ్గులు ఉంటే చాలు సినిమా హిట్టు అయిపోతుందని భావిస్తున్నారు.

     సినిమా అనేది ఒక బలమైన మీడియా సినిమాల ప్రభావం జనాలపై ఎంతో ఉంటుంది.
 సినిమా అంటే వ్యాపారం డబ్బుకోసమే సినిమాలు తీస్తాం సమాజం గురుంచి మాకెందుకు అని అంటున్నారు నేటి దర్శకులు.
   
   ఇలాంటి సినిమాల వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఏమో.??🤔🤔
  

17, నవంబర్ 2018, శనివారం

మార్పు ఆరంభం

                       

                      పర్యావరణానికి ప్లాస్టిక్ వల్ల కలిగే ముప్పు అంత ఇంత కాదు అన్ని విదాలుగా కాలుష్యం కలిగించే ప్లాస్టక్ ను నిషేదించాలని నేను ఎన్నో రోజులుగా ఆకాంక్షిస్తున్నాను.
 ఇప్పుడిప్పుడే పాలకులు దీనిపై దృష్టి సారించినట్టున్నారు
ఈ రోజు మా మున్సిపాలిటీలో నోటీసు లు అందజేసారు.






          ప్లాస్టిక్ నిషేదాన్ని కఠినంగా  అమలు చేస్తారా లేదా కేవలం కాగితాలకే పరిమితం అవుతుందో చూడాలి.
        ఏది ఏమైనా  పర్యావరణానికి ప్లాస్టిక్ ముప్పు నుండి కాపాడే మార్పు ఆరంభం అయ్యిందని సంతోషిస్తున్నాను.

     ఇలా ప్రతీచోట ప్లాస్టిక్ నిషేదాన్ని అమలు పరచాలని కోరుకుంటున్నాను.
     కొంచెం బద్దకాన్ని వదిలి ప్రతీ ఒక్కరు ఇంటినుండి బజారుకి  కూరగాయలకి, కిరాణ కొట్టుకి వెళ్ళేటప్పుడు చేతిసంచులు తీసుకెళ్తే ఈ సమస్య పరిష్కారం అవ్వడానికి ఎన్నో రోజులు పట్టదు.

   "ప్లాస్టిక్ వాడాకాన్ని నిషేదిద్దాం                                                                    పర్యావరణాన్ని కాపాడుదాం"

15, నవంబర్ 2018, గురువారం

రైతులకు వరం వేస్ట్ డీకంపోసర్

     
 పంటలకు కృత్రిమ ఎరువులు,పురుగు మందులు వాడటం వలన పంటల దిగుబడి ఎలా ఉన్నా నష్టాలు మాత్రం అనేకం భూసారం కోల్పోవడం, రైతులు అనారోగ్యాల పాలవడం, ఖర్చులు పెరగడం, పర్యావరణం దెబ్బతినడం జ‌రుగుతుంది.
        మరియు రసాయనాల అవశేషాలు కలిగిన ఆహారం తినడం వలన ప్రజలు కూడా అనారోగ్యం భారిన పడుతున్నారు

           మరి దీనికి పరిష్కారం సేంద్రీయ వ్యవసాయ చేయడం. కాని సేంద్రీయ వ్యవసాయం అందరికి సాద్యపడక పోవచ్చు. అలాంటి వారికోసం మరియు అందరు రైతులు
వాడుకునేలా తయారు చేసిందే ఈ వేస్ట్ డీకంపోసర్ దీని ధర కేవలం ‌20రూపాయలు మాత్రమే. వేస్ట్ డీకంపోసర్  పంటలకు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. చీడపీడలనుండి పంటలను కాపాడుతుంది మరియు పంటలకు ఎరువుగాను ఉపయోగపడుతుంది. భూమిలో సారాన్ని పెంచి పంటలు అధిక దిగుబడులు వచ్చేలా తోడ్పడుతుంది. చీడపీడలు సోకినపుడు ఈ ద్రావణాన్ని పంటలపై పిచికారి చేయవచ్చు.

         ఈ వేస్ట్ డీకంపోసర్ ను తయారు చేసింది కేంద్రప్రభుత్వ సంస్థ "నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్" ఇది ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉంది.

 వేస్ట్ డీకంపోసర్ ను వాడే విదానం : 
   
 20 రూపాయల వేస్ట్ డీకంపోసర్ డబ్బాలోని పదార్థాన్ని ఒక ప్లాస్టక్ డ్రమ్ములో 200 లీటర్ల నీటిని తీసుకుని అందులో వేసి అందులో 2కీలోల నల్ల బెల్లాన్ని వేసి రోజుకు రెండు సార్లు ఉదయం సాయంత్రం కర్రతో తిప్పాలి అలా వారం రోజుల పాటు తిప్పుతూ ఉంటె నుురగ వస్తుంది మరియు పులిసిన వాసన వస్తుంది అలా వచ్చినపుడు పంటలకు వాడుకోవడానికి సిద్దంగా ఉందని గమనించాలి. అలా తయారయిన ద్రావణాన్ని నీటితోపాటు పొలం అంత పారేలా చేయాలి దీనివలన భూసారం పెరుగుతుంది. పంటలకు  చీడపీడలు ఆశించినప్పుడు నేరుగా పంటలపై పిచికారి చేయాలి. ఈ ద్రావణం రెండు విదాలుగా ఉపయోగ పడుతుంది. ఒకసారి తయారు చేసుకున్న ద్రావణాన్ని కొద్ధిగా ఉంచుకుని మళ్ళీ అందులో బెల్లం నీరు కలిపి ఎన్నీ సార్లైనా వాడుకోవచ్చు. దీనిలో సూక్ష్మజీవులు పెరుగుతునే ఉంటాయి. అలా తయారు చేసుకున్న ద్రావణాన్ని కొద్దిగా ఉంచుకొని మళ్ళీ నీళ్ళు బెల్లం కలిపితే మళ్ళీ తయారవుతుంది. ఈ వేస్ట్ డీకంపోసర్ ఒకసారి కొంటే చాలు ఎన్ని సార్లైనా వాడుకోవచ్చు. ఈ వేస్ట్ డీకంపోసర్ ని వాడి చాలా మంది రైతులు అధిక దిగుబడులు సాధించారు. రసాయనిక ఎరువులు ,మందులు వాడకపోవడం ఖర్చులు తగ్గడం అధిక దిగుబడులు రావడం వలన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు... ఈ వేస్ట్ డీకంపోసర్ ని అన్ని పంటలకు వాడవచ్చును .

        

20, ఆగస్టు 2018, సోమవారం

మొక్కలు నాటుదాం

   
  చెట్లు ప్రగతికి మెట్లు. అంతెకాదు మన జీవనాధారం చెట్లు లేనిదే మనిషి మనుగడ లేదు. ప్రాణవాయువును ప్రసాదించేది ఈ చెట్లే. మరియు కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకుని మనకు ఆక్సీజన్ ప్రసాదిస్తాయి.
అనేక రకాల పండ్లు,పువ్వులు, ఔషదాలు మనకు ప్రసాదిస్తాయి ఈ కల్పవృక్షాలు ఇలా అనేక రకాలుగా మనకు ఉపయోగపడే చెట్లను అభివృద్ది పేరిట నరికేస్తుఉన్నారు.
మనిషి వల్ల చెట్లకు ఏ ఉపయోగం లేదు కాని చెట్ల వల్లె మనిషి బ్రతుకుతున్నాడు. చెట్లు లేకుంటే మనిషే లేడు.

      అభివృద్ది పేరిట అడవులను నాశనం చేస్తున్నారు. కొండలను తొలచి క్వారీలుగా మార్చి అపురూపమైన వృక్షసంపదను నాశనం చేసి పచ్చని ప్రకృతిని వికృతంగా మార్చేస్తున్నారు. కొందరి స్వార్థపరుల అత్యాశ మూలంగా పచ్చని పర్యావరణాన్నీ నాశనం చేసి కోట్లకు పడగలెత్తుతున్నారు అక్కడి ప్రజల జీవినాన్నీ దుర్భరం చేస్తున్నారు.

     పర్యావరణం ఎప్పుడు సమతుల్యంగ ఉంటేనే అంతా బావుంటుంది. అడవులను నాశనం చేసి కొండలను తవ్వేసి ఇష్టారాజ్యంగా ప్రకృతిని నాశనం చేస్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతిని అతివృష్టి అనావృష్టి లాంటి విపత్తులు ఎదుర్కోవలసి వస్తుంది.

      ఈ భూమి మీద మానవుడు బ్రతకడానికి అన్నీ విదాలుగా అనుకూలంగా ఉంది. మరే ఇతర గ్రహం మీద మానవుడు జీవించలేడు. ఈ భూమిపై ఉన్న సౌకర్యాలు ఏ గ్రహం మీద లేవు కనీసం నీరు కూడా లేదు. మనకు ఇన్నీ విదాలుగా మన మనుగడకు తోడ్పడే భూమిని మనం ఏం చేస్తున్నాం చేజేతులారా నాశనం చేస్తున్నాం. కొందరి అత్యాశల వల్ల ధన దాహం వల్ల ప్రకృతిని నాశనం చేసి పర్యావరణాన్నీ అసతుల్యం చేసి భూగ్రహంపై కూడా మనిషి జీవనానికి ప్రమాదకరంగా మరే రోజులు ఎంతో దూరంలో లేవు.

అభివృద్ది అనేది అవసరమే కాని పర్యావరణ సమతుల్యత అనేది ఎంతో ముఖ్యం.

       అభివృద్ది అంటే ఒక దగ్గర పచ్చని ప్రకృతిని నాశనం చేసి మరో చోట  ఎత్తైన భవనాలు నిర్మించడం కాదు. పర్యావరణాన్నీ సమతులంగా ఉంచడం. అంటే ఒక చెట్టును కొట్టేస్తే రెండు చెట్లు నాటాలి, వాటిని పెద్దగా అయ్యేవరకు కాపాడాలి.

       నేడు కోట్లాది వాహనాలు,ఫ్యాక్టరీల వల్ల విపరీతమైన గాలి కాలుష్యం పెరిగిపోయింది. ప్రధాన నగరాలల్లో గాలి కాలుష్యం మరి ఎక్కవ పీల్చే గాలి కూడా కరువే అక్కడ.
ఇప్పటికే మనం నీటిని కొనుక్కోని తాగుతున్నాం ముందు ముందు గాలిని కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చినా ఆశ్చ్యర్య పోవలసిన అవసరం లేదు. ప్రకృతి ప్రసాదించిన నీరు గాలి ఎక్కడైనా ఉచితంగా లభించాలి కాని ఇప్పుడు కొనుక్కోవలసి వస్తుంది. ముందు ముందు ఇంకా దారుణంగా ఉంటుందేమో.

      మనిషి బ్రతకడానికి అన్నివిదాలుగా ప్రకృతి ఉంది. కానీ అత్యాశకు మాత్రం ఎంత ఉన్నా సరిపోదు.

      . మనిషి వల్ల ప్రకృతికి ఎలాంటి ఉపయోగం లేదు కాని ప్రకృతి వల్లే మనిషి బ్రతుకుతున్నాడు. అది తెలిసి కూడా తను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాడు. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా వుంటుందో మనకు తెలుసు ..



           కాబట్టి  పర్యావరణాన్నీ నాశనం చేయకుండా వీలైనన్నీ మొక్కలు నాటీ ప్రకృతిని కాపాడుదాం ఆనందంగా జీవిద్దాం.

     ఒక మొక్క నాటండి దానికి నీరు పోసి కొంచెం పేడ కాని వీలయితే కంపోస్టు ఎరువు వేసి చూడండి అది పూల మొక్క లేదా పండ్ల మొక్క కానివండి కొన్ని రోజుల తర్వాత వాటికి పూలు పండ్లు కాస్తుంటే అ ఆనందం మాటల్లో చెప్పలేనిది. 

దయచేసి ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటండి పర్యావరణాన్నీ కాపాడండీ...


17, జులై 2018, మంగళవారం

మేకవన్నె పులులు



కుక్క కు విశ్వాసం ఉంటుంది.
పిల్లికి విశ్వాసం ఉండదు..
సింహం ,పులి ,లాంటి జంతువులకు కౄరత్వం ఉంటుంది.
ఆవుకు మృదు స్వభావం ఉంటుంది..
ఊసరవెల్లికి రంగులు మార్చే గుణం ఉంటుంది.
ప్రతీ జీవికి పుట్టుకతోనే ఒక స్వభావం ఉంటుంది.
అది ప్రకృతి రీత్య ఆయా జంతువుల స్వభావం..

ప్రతీ జంతువు స్వాభావం మనకు తెలుసు..
అందుకే
కౄర మృగాలకు దూరంగా ఉంటాం.
ఆవు మేక కుక్క  వంటి వాటిని మనం ఇంట్లో పెంచుకుంటాం..
అవి ఏనాడు మనకు హాని తల పెట్టవు.

కాని ప్రపంచంలోని అన్నీ జంతువుల స్వభావాలు ఒక మనిషిలో మాత్రమే చూడగలం.
అదే

"మానవ మృగాలు"

సందర్భాన్నీ బట్టీ ఒక్కో స్వభావం బయట పడుతుంది.

కౄర జంతువులు అడవుల్లో తమకంటే చిన్న బలహీనమైన జంతువులను వేటాడి తిని బ్రతుకుతాయి.

కాని మానవ మృగాలు మన చుట్టూనే ఉంటారు
మేక వన్నె పులిలా తిరుగుతూ అవకాశం వచ్చినపుడు పంజ విసురుతారు..
అలాంటి వారిని ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది..

మన చుట్టూ ఉంటూ మంచిగా ఉన్నట్టు నటిస్తు మన వెనకాలే గోతులు తవ్వే వంద మంది స్నేహితుల కంటే నిజాయితీగా ఉండే ఒక స్నేహితుడు చాలు జీవితంలో సంతోషంగా బ్రతకడానికి......

ఈ పోస్ట్ సమాజంలో కొందరు వ్యక్తులు నమ్మకంగా ఉంటు నమ్మిన వారినే వెన్నుపోటు పొడిచే వారిని ఉద్దేశించి వ్రాయడం జరిగింది..










13, జులై 2018, శుక్రవారం

విశ్వనగరంలో మూసీనది

హైదరాబాద్ నాలుగువందల ఏళ్ళ చారిత్రక నగరం. మనం ఇప్పుడు విశ్వనగరం అంటున్నాం నిజంగా హైదరాబాద్ విశ్వనగరమేనా?? శరవేగంగా అభివృద్ది చెందుతున్న నగరం అంతకంటే ఎక్కువ కాలుష్యాన్ని సృష్టించే నగరం.

ఒకప్పుడు గోదావరిలా స్వచ్ఛమైన నీరు ప్రవహించే మూసీ నది ఇప్పుడు ఒక పేద్ద మురికి కాలువలా తయారయింది
ఒకప్పుడు స్వచ్ఛమైన నీరు ప్రవహించేదంటే ఆశ్ఛ్యర్యం కలుగక మానదు. హైదరాబాద్ లో మూసి నది అంటే భరించలేనంత కంపు అటువైపు వెళ్ళాలంటే ఓకింత సాహసం చేయాల్సిందే. విశ్వనగరంలో నదులు  ఇలా ఉంటాయా???

ఇతర దేశాల్లో పెధ్ద నగరాల్లో ప్రవహించే నదులు ఎంత ఆహ్లాదకరంగా అందంగా స్వచ్ఛంగా ఉంటాయో చూడండి
మరి మన నగరంలో ఏంటీ దుస్థితి దీనికి కా‌రణం ఎవరంటే 99‌% ప్రజలే..... విఛ్ఛలవిడిగా కాలుష్యకారకాలను నదిలో పడేసి మురికి కూపంలా మార్చారు మన ఇల్లు ఒకటే శుభ్రంగా ఉంటే సరిపోద్ది అనే దోరణిలో విశ్వనగర ప్రజలు ఉన్నారు ఇక్కడ గోదావరి ప్రవహించిన కేవలం ఒక వారంలో మురికి కూపంలా మార్చేస్తారు.

ప్రపంచంలో వివిధ దేశాలలో ఉండే నగరాలలో నదులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో చూడండి..

నది                            నగరం             దేశం

థేమ్స్                         లండన్            బ్రిటన్
టైబర్                         రోమ్               ఇటలీ
లాస్ ఎంజిల్               లాస్ ఎంజిల్    అమెరికా
చార్లెస్                        బోస్టన్             అమెరికా
బ్రిస్బేన్                        బ్రిస్బేన్            ఆస్ట్రేలియా
కెలాని                         కొలంబో          శ్రీలంక
ఊక                           యోకోహామ     జపాన్
వియన్నా                    దనుబే            ఆస్ట్రియా
పియర్ల్                       హాంగ్ కాంగ్      చైనా
పొటొమాక్                  వాషింగ్టన్         అమెరికా



ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నదులే ఉన్నాయి వాటిలో ఎక్కడ కూడా కాలుష్యం అనేదే కనిపించదు.
అక్కడి ప్రజలు ఎంత అదృష్ట వంతులో కదా.
వీటిలో మనకంటే అబివృద్ది చెందిన నగరాలే ఉన్నాయి మరి ఇంత కాలుష్యం అక్కడ లేదే?? అదేలా సాద్యం??? అది అక్కడి ప్రజల పరిసరాల పరిశుభ్రతపై ఉన్న అవగాహన ..  మరి మనకు ఎందుకు లేదు ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు అంటారు ప్రజల సహకారం లేనిదే ప్రభుత్వాలు ఎంత చేసిన ఫలితం శూన్యం ..

మన బాధ్యతగా చెత్తను మూసీలో వేయకుండా నివారిద్దాం.ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చెత్త కుండీల్లోనే వేద్దాం.  అప్పుడే స్వఛ్ఛ హైదరాబాద్ సాద్యం.
మూసీ నది హైదరాబాద్ కు మరో మణిహారం అవుతుంది..

ఒక్క సారి ఊహించండి ..... మూసీ నదిలో స్వఛ్ఛమైన నీరు ప్రవహిస్తూ ఉంటుంది అందులో చిన్న చిన్న పడవలు,బోట్లు విహరిస్తూ ఉంటే అందులో మనం ప్రయాణిస్తూ ఉంటే మరో థేమ్స్ నదిలా ఉంటుంది కదా!!???
ఈ ఊహ ఎప్పుడు నిజమయ్యేనో వేచి చూద్దాం...

7, జులై 2018, శనివారం

పర్యావరణం నుండి ప్లాస్టిక్ ను తరిమేద్దాం

తెలుగు వారందరికి నమస్కారం

పర్యావరణానికి హాని కలిగించే వాటిలో ప్లాస్టిక్ ముందు వరుసలో ఉంటుంది. ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ ని వాడేస్తున్నం. ఉదయం కూరగాయలు,పాలు ఏవస్తువు కొనన్న ప్లాస్టక్ లేనిదే మన ఇంటి వరకు రాదు.
వీధుల్లో ‌‌,రోడ్ల వెంబడి బజార్లు ఎక్కడ చూసిన ప్లాస్టిక్ దర్శనమిస్తుంది.
అవసరం లేకున్నా ప్లాస్టిక్ వాడేస్తాం!
దానివల్ల అనర్థాలు తెలిసిన వాడేస్తూనే ఉంటాం.
చదువుకోని వాళ్ళు అంటే తెలియక చేస్తారు‌,
చదువుకున్న వాళ్ళు కూడానా.
పది మందికి ప్లాస్టిక్ పై అవగాహనశ కల్పించి పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడండి.
ఉదయం లేవగానే కూరగాయల మార్కెట్ వెళ్తాం సంచి తీసుకెళ్ళం లేక కాదు ఉన్నా తీసుకెళ్ళం. ఎలాగు ఓ పది ప్లాస్టిక్ కవర్లు ఇంటికి రావాలి లేక పోతే నిద్ర పట్టదు.
తర్వాత పాలు, పెరుగు,పప్పులు ఉప్పులు అన్నీ ను ప్లాస్టిక్ లో తేవలసిందే ఎందుకంటే పర్యావరాణాన్నీ నాశనం చేయాలి కదా.

వాడిన కవర్లు చెత్త బుట్టీలో వేయం ‌రోడ్డు పైనే పారేస్తొం మన ఇళ్ళు శుభ్రంగి ఉంటే చాలు పర్యావరణం నాశనం ఐతే నాకేంటీ అంటారు..

అవి వెల్లి డ్రైనేజీలో అడ్డుపడి రోడ్లన్నీ జలమయం ఇళ్ళల్లోకి నీరు చేరడం ప్రభుత్వాన్నీ తిట్టుకోవడం మీరు చేసిన పనికి ప్రభుత్వాన్నీ నిందిస్తారు.

ఒక సారి ఆలోచించండి వీలైనంతవరకు ప్లాస్టిక్ ని తగ్గించండి ప్లాస్టిక్ లేని సమాజాం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఆలోచించండి.

ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలు:

ఇది భూమిలో కలిసిపోడానికి వేల సంవత్సరాాలు పడుతుంది
డ్రైనేజీలలో అడ్డుపడి వరదలకు తద్వార రోగాలకు కారణమవుతుంది.
ప్లాస్టిక్ ను తగలబెట్టడం వల్ల విషవాయువులు వెలువడి శ్వాసకోశ,చర్మ,క్యాన్సర్ ఇంకా అనేక వ్యాదులకు కారణమవుతుంది.
పర్యావరణం దెబ్బతింటుంది
మిగిలిపోయిన ఆహారపదార్థాలు కవర్లలో చుట్టి పారవేయడం వాటిని తిన్న జంతువులు చనిపోవడం
రాగి కంచాలు రాగి చెంబులు మర్చిపోయాం ప్లాస్టిక్ ప్లేట్లు ప్లాస్టిక్ బాటిల్సనే వాడుతున్నాం చవకగా వస్తున్నాయని వీటీనే వాడుతున్నాం అనారోగ్యాన్నీ కొని తెచ్చుకుంటున్నాం.

కాబట్టి ప్లాస్టిక్ ని పారద్రోలదాం పర్యావరణాన్నీ కాపాడుకుందాం .

ప్లాస్టిక్ ను నివారింంచే మార్గాలు:

కూరగాయలకి , పండ్లు కొనడానికి వెళ్ళేటపుడు చేతి సంచి తీసుకెళ్ళాలి.
ఆహార పదార్థాలు ఇడ్లీ,దోశ లాంటి పదార్థాలు పార్శిల్ తెచ్చేటపుడు స్టీల్ గిన్నెలు తీసుకెళ్ళాలి.
ప్లాస్టిక్ నీళ్ళ బాటీల్ కి బదులు రాగి బాటిల్ వాడాలి..
పెపర్ ప్లేట్లకి బదులు స్టీల్ గిన్నెలు వాడాలి.
ప్రతీచోట ప్లాస్టిక్ అవసరాన్ని తగ్గించాలి.
స్కూల్లల్లో పిల్లలకి ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరించి అవగాహణ కల్పించి ప్లాస్టిక్ ను ముందు తరాలు వాడకుండా నియంత్రిద్దాం.

మొక్కలు నాటుదాం పర్యావరణాన్నీ సమతుల్యం చేద్దాం.

నా ఒక్కడి వల్ల ఏం అవుతుంది అనుకోవద్దు ఒక్క అడుగు పడితేనే వేయి అడుగులు నడవగలం.
మార్పు అనేది ఒక్కడితోనే ఆరంభం అవుతుంది.

పచ్చని ప్రకృతితో చాలా అందంగా ఉండే దేశాలు మనం సినిమాలలో చూస్తూ ఉంటాం మనకు అలాంటి ప్రదేశాలలో ఉండాలనిపిస్తుంది అవేవి కూడా ఆకాశం నుండి ఊడిపడలేదు ఆ దేశ ప్రజల పర్యావరణ ప్రేమ.

మనం కూడా అలాంటి ప్రదేశాలను సృష్టించవచ్చు మొక్కలు నాటి. నార్వే,స్వీడన్ లాంటి దేశాల సరసన చేరుదాం.
మొక్కలు నాటుదాం, ప్లాస్టిక్ ను తరిమేద్దాం పర్యావారణం కాపాడుదాం.

7, మార్చి 2018, బుధవారం

రైతునేస్తం

భానోదయం బ్లాగుకు విచ్చేసినందుకు మీకు ధన్యవాధములు.

ప్రతి రోజు ఉదయం తన లేలేత కిరణాలతో చీకటిని పారద్రోలి వెండి వెలుగులు నింపేవాడు భానుడు.

సమాజానికి నా అక్షర కిరణాలతో వెలుగులు నింపడమే భానోదయం బ్లాగు.

భారతదేశం:
రైతు ప్రధాన దేశం కానీ ఈదేశంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కవ.
ఈ దేశంలో వేలకోట్లు ముంచే వారికి ఎర్ర తివాచి పరిచి అప్పులిచ్చే బ్యాంకులు రైతుల పంట సాగుకు మాత్రం కాళ్ళరిగేలా తిప్పుతారు.
ఒక బిస్కేట్ కంపెనీ వాడో లేదా వేరే ఏఇతర కంపెనీ వాడయినా తాను తయారు చేసిన వస్తవుకు ధరను తనే నిర్ణయిస్తాడు కాని రైతులు కష్టపడి పండించిన పంటల ధరలను ధళారులు నిర్ణయిస్తారు.
రైతులు కష్టపడుతున్నారు ధళారులు కోటీశ్వరులవుతున్నారు.
ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల కష్టాలు తీరడం లేదు.
ఉద్యోగులు ,వ్యాపారస్తులు,సాఫ్టవేర్ ఉద్యోగులు,పారిశ్రామిక వేత్తలు మీరంతా ఒక్కసారి ఆలోచించండి రైతుల గురించి మనందరికి అన్నం పెట్టే రైతన్న దీనస్థితిని మాకెందుకు ప్రభుత్వాలు చూసుకుంటాయిలే అనకండి చూస్తూనే ఉన్నాం స్వతంత్య్రం వచ్చి ఎన్నేండ్లయినా ఏం మారింది రైతుల బతుకు.


      ఎప్పుడూ ఏసీ గదుల్లో కూర్చూనే మీకు ఎక్కడ నుండి వస్తుంది మీరు తినే అన్నం.
మీరు తినే ప్రతీ మెతుకు రైతు చెమటోడ్చి పండించిందే.
మేము ఊరికే తినట్లేదు డబ్బులిచ్చి కొంటున్నాం అనొచ్చు కానీ మీరు కొనే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నిర్ణయించేది రైతులు కాదు మద్యవర్తులు, దళారులే.
ధళారులు రైతుల వద్ద నుండి తక్కువ ధరకు కొని మార్కెట్లో రెట్టింపు ధరలకు అమ్మి లాభాలు గడిస్తున్నారు.
ఎండనకా వాననక కష్టపడి పంటలు పండించిన  రైతులకు  మాత్రం కష్టాలు కన్నీళ్ళె మిగులుతున్నాయి.
 ఈ దేశంలో రైతు ఆనందంగా జీవించలేడా.?
రైతులు జీవితాలు మారవా.?


ఈ దేశంలో రైతుల కష్టాలు విత్తనలనుండే మొదలవుతాయి. విత్తన కంపెనివాడు నకిలి విత్తనాలను అంటగట్టి మోసం చేస్తాడు.

ఒకవేళ విత్తనాలు బాగుండి మొలకెత్తితే వర్షాలు సరిగ్గా పడతాయో లేదో అని ఆందోళన.

అన్ని అనుకూలించి పంటలు బాగా పండితే మార్కెట్లో అమ్మడానికి వెళితే గిట్టుబాటు ధరలు లేక పెట్టిన పెట్టుబడి కుడా రాని పరిస్థితి. రైతుల కష్టపడితే ధళారులు లాభపడుతున్నారు.

రైతులు బాగుండాలంటే ధళారి వ్యవస్థ పోవాలి.
నేరుగా రైతులే తాము పండించిన పంటలను అమ్ముకునేలా చేస్తే ఇటు రైతులు అటు వినియోగదారులు ఇద్దరు బాగుపడుతారు.

రైతులకు అనుకూలంగా ఉండేటట్టు ప్రభుత్వాలు విధానాలు రూపొందించాలి. ప్రజలు కూడా నేరుగా రైతుల వద్దనుండే వ్యవసాయ ఉత్పత్తులను కొనే ఏర్పాట్లు చేయాలి అప్పుడే రైతులు బాగుపడుతారు.

ఈ రోజుల్లో అందరికి డబ్బే ప్రధానం అయ్యింది డబ్బు డబ్బు డబ్బు. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఒక్క రైతు మాత్రమే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఇంకా తన కష్టాన్నే నమ్ముకుని వ్యవసాయం చేస్తూ ఈ దేశానికి అన్నం పెడుతున్నాడు.
చాలా మంది రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేనప్పుడు ఎందుకు ఇంకా వ్యవసాయం చేయడం అంటూ వ్యవసాయం మానేసి పట్టణాలకు వలసవెళ్ళి చిన్న చితక పనులు చేసుకుంటు బతుకుతున్నారు.

గతంలో ఉమ్మడి  తెలుగు రాష్ట్రంలో స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రే వ్యవసాయం దండగ అని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రే ఇలా అన్నప్పుడు రైతులు ఏం చేయాలి సాయం చేయాల్సిన వాడే నువ్వు చేయాల్సిన పని దండగ అంటే ఏం చేస్తారు. సాయం చేయాల్సింది పోయి వ్యవసాయమే దండగా అంటే ఇక రైతులు చేసేది ఏమిటి. వ్యవసాయం వదిలేయడమే శరణ్యం.

ముఖ్యమంత్రి గారి వ్యవసాయం దండగా అనే మాటల ప్రకారం ఆయన రైతుల పట్ల వ్యవసాయం పట్ల ఆయనకున్న అసహనం అర్థమవుతుంది. రైతులందరు వ్యవసాయం మానేస్తే జనాలకు ఈయన గడ్డి తిని బతకమంటారేమో.? లేదా నోట్ల కట్టలు తినమంటారేమో?

ప్రభుత్వాలు రైతులకు అనుకూల విధానాలను అవలంభించి వ్యవసాయాన్ని ప్రత్సాహించాలి.
వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండగ అనే రోజులు రావాలి. రైతులు ఆనందంగా జీవించే రోజులు రావాలి..
అప్పుడే  ‌రైతు బాగుంటాడు రైతు బాగుంటే ఈ దేశం బాగుపడుతుంది..