దిశ ఉదంతంలో నేరస్థులకు ఇంత త్వరగా శిక్ష పడుతుందని అస్సలు ఊహించలేదు. ఆ మృగాలను ఎన్కౌంటర్ చేయడం సరియైనదే. వారం రోజుల్లోనే న్యాయం జరిగింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నేరం రుజువైతే నేరస్థులను కోర్టులు, ఆ పై కోర్టులు అని తిప్పకుండా ఇలా ఎన్కౌంటర్ చేయడమే కరెక్ట్.
ఇంత త్వరగా న్యాయం చేసినందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
పోలీస్ కమీషనర్ సజ్జనార్ సార్ మానవ మృగాల పట్ల మీరు సింహ స్వప్నం.
2008 లో వరంగల్లో ఇప్పుడు హైదరాబాద్ లో మృగాలకు త్వరగా శిక్ష విధించి (ఎన్కౌంటర్ చేసి) బాధితులకు న్యాయం చేసారు. మిమ్మల్ని చూసి దేశం మొత్తం గర్విస్తుంది. వి సెల్యూట్ సజ్జనార్ సార్.. సరిలేరు నీకెవ్వరు... మీలాంటి పోలీసులే ఈ సమాజానికి కావాలి. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను కోరుతున్నాను.