భానోదయం: నరేంద్ర మోది, రాహుల్ గాంధీ ఎవరు ప్రధాని..??

23, మే 2019, గురువారం

నరేంద్ర మోది, రాహుల్ గాంధీ ఎవరు ప్రధాని..??

భారతదేశ ప్రధానిగా ఎవరు గెలిచేదెవరు..,

ఈ ఎన్నికల్లో బిజేపి కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటి
ఒక వైపు నరేంద్ర మోది మరో వైపు రాహుల్ గాంధీ ఇద్దరిలో గెలుపెవరిది. ఈ దేశ ప్రజలు ఎవరికి ప్రధానమంత్రిగా పట్టం కట్టబోతున్నారు.

జస్ట్ మరికొన్ని గంటల్లో ఫలితం తేలబోతుంది.
ఇక నరేంద్ర మోది మరియు రాహుల్ గాంధీ ఇద్దరి పట్ల జనాల్లో ఉన్న అనుకూలతలు ప్రతికూలతలు చూద్దాం.

నరేంద్ర మోది:

  ఛాయ్ అమ్మే వ్యక్తి, ఒక సామాన్య కార్యకర్త నుండి ఈ దేశాన్ని పాలించే స్థాయికి ఎదిగాడు.

అందరి నాయకుల్ల అవినీతికి పాల్పడి వేల కోట్లు దోచుకోవడానికి ఆయనకు కుటుంబం లేదు.

కుటుంబ పాలనకు దూరం.

ప్రపంచ దేశాలతో స్నేహపూర్వక వాతావరణం నెలకోల్పాడు.

మోది వచ్చాక గడిచిన ఐదేళ్ళలో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది. అదే కాంగ్రెస్ పాలనలో అయితే  దేశంలో ఎప్పుడు బాంబు దాడులతో అల్లకల్లోలంగా ఉండేది.

ఏ ప్రధాని చేయలేని సాహసం మోది చేసారు. అసలు ఎవరు కలలో కూడా ఊహించని విధంగా నోట్లరద్దు చేసాడు.

జిఎస్టీని అమలు పరిచాడు.

పాకిస్థాన్  ఉగ్రవాదులపై  రెండు సార్లు సర్జికల్ దాడులు చేసి తగిన గుణపాఠం చెప్పాడు.

మోది వల్ల ఈ దేశం కొంచెం ప్రశాంతంగా ఉంది.

దేశంలో ప్రాంతీయ పార్టీలన్ని కలిసి నరేంద్రమోడిని ఓడించాలని చూస్తున్నారు. 22 పార్టీలు ఒక వైపు బిజెపి ఒక వైపు. ఈ పార్టీలన్ని ఒకటైనప్పుడే అనిపిస్తుంది ఒక్కడిని ఓడించడానికి అందరూ కలిసారు అంటే వీరికి దేశ ప్రయోజనాలకంటే మోడిని ఓడించడమే ముఖ్యం. ఇది మోడి గారికి కలిసొచ్చే అంశం. ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు.

ప్రతికూలతలు:

నోట్లరద్దు అంశం ఈ నోట్లరద్దు వల్ల ప్రతి ఒక్కరు ఇబ్బందులకు గురయ్యారు. నోట్లరద్దు వల్ల నల్లధనం బయటికి రాకపోగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

జీఎస్టీ వల్ల సామాన్యులకు ఒరిగిందేమి లేదు.

మోడి హాయంలో జవాన్ లపై దాడులు పెరిగిపోయాయి.

మేకిన్ ఇండియా లాంటివి  ప్రగతి సాదించలేకపోయాయి.

మోది హిందు పక్షపాతి అని  ఇతర పార్టీల వాళ్ళ ఆరోపణ.

రాహుల్ గాంధీ:

మాజీ ప్రధాని కుమారుడు.

దేశపాలనలో ఉన్నప్పుడే ప్రాణాలు అర్పించిన నాయకుల వారసుడు.

తను ప్రధాని అయ్యే అవకాశం ఉన్న త్యాగం చేసి మన్మోహన్ సింగ్ గారిని ప్రధాని ని చేసిన సోనియా గాంధీ గారు ఈ సారి ఆయన కుమారుడిని ప్రధానిగా చూడాలనుకుంటున్నారు.

ప్రతికూలతలు :

పరిపాలన అనుభవం లేకపోవడం.

దేశ సమస్యలపై కాస్తైన అవగాహన రాహుల్ గాంధీకి లేదు. కేవలం ఈ ఐదేళ్ళలో ఒకే ఒక అంశాన్ని పట్టుకుని వేళాడాడు అదే రాఫెల్ అంశం.
రాహుల్ గాంధీ గారికి రాఫెల్ అనే అంశం తప్పితే దేశంలో ఇంక వేరే సమస్యలు ఏవి కనిపించలేవు.

ఇలాంటి వారు ప్రధాని అయితే దేశాన్ని ఏం పాలిస్తారు. కాంగ్రెస్ ప్రధానులు రబ్బర్ స్టాంపు ప్రధానులని పేరు దీనికి రాహుల్ మినహయింపేమి కాదు.

ఇక పదేళ్ళు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రేస్ హాయాంలో  వెలుగు చూడని కుంభకోణం లేదు. కాంగ్రెస్ అంటే కుంభకోణాలు కుంభకోణాలంటే కాంగ్రేస్ పార్టీ అనే విధంగా రోజుకో కుంభకోణాలు వెలుగుచూసాయి  వారి హాయాంలో. అలాంటి పార్టీకి మళ్ళీ జనాలు పట్టం కడుతారా అంటే డౌటే..

ఇక ఈ సారి రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి కాబట్టి దేశ సమస్యలపై కనీస అవగాహన లేని రాహుల్ గాంధీ ప్రధాని అయితే సమర్థవంతంగా ఆయన ఈ దేశాన్ని సమర్థవంతంగా పాలించగలడని నమ్మకం జనాలకు లేదు. కాబట్టి ఆయన ప్రధాని అయ్యే అవకాశం లేదు.


నోట్లరద్దు, జీఎస్టీ లాంటి వాటి వల్ల జనాలు ఇబ్బందులకు గురి అయిన , సర్జికల్ దాడులు వంటి సహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న అవి  దేశ ప్రయోజనాల కోసమే కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకునే మోడినే మళ్ళీ ప్రధాని కావాలని జనం కోరుకుంటున్నారు.

ఇక రాహుల్ గాంధీ ఈ దేశాన్ని పాలించగలడని ప్రజల్లో నమ్మకం లేదు. ఈ సారి కాదు కదా ఇంకో ఇరవై ఏళ్ళయిన మోడినే ప్రధాని గా గెలుస్తారు.

అన్ని పార్టీలు ఏకమైన మోడి  విజయాన్నీ ఎవరు ఆపలేరు. ఈదేశానికి కావలసింది ధమ్మున్న నాయకుడు. పప్పూలు కాదు.

సో 2019 లో  భారత ప్రధానిగా మళ్ళీ నరేంద్ర మోది గారు గెలుస్తారు.




2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
భానోదయం చెప్పారు...

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా... నిజము మరచి నిదురపోకుమా... ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా.... ఎవరు జీవితాలు వాళ్ళే బాగుచేసుకోవాలి.
ఎవరి పనులు వారు చేసుకుంటే ఈ దేశం బాగుపడుతుంది.