భానోదయం: పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ అయితే టీచర్లకు పరీక్ష.!!

27, మే 2019, సోమవారం

పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ అయితే టీచర్లకు పరీక్ష.!!

పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ అయితే టీచర్లకు పరీక్ష.!!


     ఎక్కడైనా పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ అయితే మళ్ళీ పరీక్ష రాస్తుంటారు. కాని మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వారికి చదువు చెప్పిన టీచర్లకే పరీక్ష పెట్టాలని నిర్ణయించింది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఆ రాష్ట్రంలో 700 పాఠశాలల్లో  30% మంది  విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో అక్కడి ఉపాద్యాయుల విషయపరిజ్ఞానాన్ని పరీక్షించాలని మధ్యప్రదేశ్ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ పరీక్షలకు కూడా విద్యార్థులకు పెట్టే పరీక్షలవలే ప్రశ్నపత్రాలు రూపొందిస్తారట. పరీక్ష జూన్ 12   జరుగనుంది.
 
      ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారిని స్వచ్ఛందంగా పదవి విరమణ చేయించడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారట. పరీక్షల్లో ఫెయిల్ అయితే విద్యార్థులదే బాధ్యత అంటారు. కానీ మధ్యప్రదేశ్ లో ఉపాద్యాయుల బాధ్యత కూడా ఉంటుందని వారికి పరీక్ష పెట్టి సరైన నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం.
     
             ఏదో మొక్కుబడిగా చదువులు చెప్పి నెల నెల జీతాలు తీసుకోవడం అలవాటయిపోయింది నేటి ప్రభుత్వ ఉపాధ్యాయులకి. విద్యార్థులు చదివిన చదవకపోయిన మాకేంటి మా జీతాలు మాకు వస్తాయి అనే ధోరణిలో ఉన్నారు. ఇప్పటికి అనేక ప్రభుత్వ పాఠశాలల్లో   చదవడం రాయడం కూడా రాని విద్యార్థులు ఉన్నారు. వారు చదవకపోవడానికి కారణం ఎవరు?? ఇందులో  ఉపాధ్యాయుల బాధ్యత ఏమి లేదా..
పైగా కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థినులపై లైంగిక వేదింపులకు పాల్పడుతున్నారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విద్యార్థినులపట్ల  అసభ్యంగా ప్రవర్తిస్తూ నీచానికి దిగజారుతున్నారు.. ఇలాంటి వారి వలన మిగితా ఉపాధ్యాయులకు చెడ్డపేరు వస్తుంది.  ఇలాంటి నీచమైన ఉపాధ్యాయులను ఎవరు ప్రశ్నించకపోవడం వలన వారు ఆడిందే ఆట పాడిందే పాట. మమ్మల్ని ఎవరు ఏం పీకలేరని వారి ధీమా. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి. అప్పుడేె విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. అలాగే విద్యార్థినుల పట్ల నీచంగా ప్రవర్థించే ఉపాధ్యాయులని ఉద్యోగాల నుండి తీసేసి కఠిన శిక్షలు వేయాలి. అలాగే వారి కుటుంబంలో ఎవరికి ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత లేకుండా చేయాలి.

                 
           ఒక ప్రభుత్వ ఉద్యోగానికి వేలల్లో పోటిపడుతున్నారు. ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నవారు ఎందరో ఉన్నారు. అలాంటిది టీచర్  ఉద్యోగం చేసుకుంటు అర లక్ష జీతాలు తీసుకుంటు విద్యార్థినులను లైగికంగా వేదిస్తున్నారు.  ఇలా నీచంగా ప్రవర్తించడం చాలా ధారుణం. ఇలాంటి వారిని ఉద్యోగం నుండి తొలగించి నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలి.


పవిత్రమైన ఉపాధ్యాయవృత్తిలో కీచక టీచర్లు.

https://youtu.be/ZDFdUNojDIY

https://youtu.be/SSK11ezwnTc


https://youtu.be/vA2Pt_FaBno





     


కామెంట్‌లు లేవు: