భానోదయం

17, నవంబర్ 2024, ఆదివారం

గాడిద పాల బిజినెస్ లక్షల్లో లాభాలు. మా ఫ్రాంచైజీ తీసుకోండి కోట్లు సంపాదించండి.

 గాడిద పాల బిజినెస్ లక్షల్లో లాభాలు... 




గాడిద పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. మెడిసిన్, కాస్మోటిక్స్ లో వాడుతున్నారు.. ఇప్పుడు గాడిద పాలకు చాలా డిమాండ్ ఉంది. లీటరు గాడిద పాలు 1600/- రూపాయలు. ముందు ముందు 2000/- ఇంకా 7000/- వేల వరకు వెళ్ళొచ్చు. కాబట్టి ఈ బిజినెస్ చేసి నెలకు లక్షల్లో సంపాదించండి. 


గాడిదలు మాదగ్గరే ఉంటాయి కొనండి ఒక గాడిద వచ్చేసి 150000/- మాత్రమే. ఎన్ని గాడిదలు కొంటె అంతలాభం. 50 కొంటె ఒక రోజుకి 50లీ ×1600=80,000/- నెలకి 24,00,000/- మీ పెట్టుబడి రెండు నెలల్లో తీరిపోయి మూడో నెల నుండి అంతా లాభమే.


మా ఫ్రాంచైజీ తీసుకునెందుకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి.

అదేంటంటే:-


*మా ఫ్రాంచైజీ ఫీజు 5లక్షలు

*మా దగ్గర ఒకేసరి 50గాడిదలు కొనాలి 

*గాడిదల కోసం ఆధునిక షెడ్డు లు నిర్మించుకోవాలి 

*పాలను నిల్వ చేయడానికి ఫ్రీజర్ లు ఉండాలి

*గాడిదలను మేపడానికి,పాలు పితకడానికి ట్రైనింగ్ ఇచ్చి పని వాళ్ళను మేమే  పంపిస్తాం 

*ఫాం లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.

*గాడిదల ఫాం మేమే నిర్మించి ఇస్తాం అందుకు డబ్బు కట్టండి...


ఇవి కండీషన్లు


ఇది విని ఒకాయన 50 గాడిదలు కొంటే,,,,

లాభం లెక్క వేసుకున్నాడు

రోజుకు 50గాడిదలు 50లీ పాలు×1600=80,000/-

నెలకి 80,000×30=24,00,000/-

సంవత్సరానికి 2 కోట్ల 88 లక్షలు..


వెంటనే క్లాస్ కు వెళ్ళాడు 50వేలు కట్టాడు.

ఫ్రాంచైజీ కీ 5,50,000/- కట్టాడు.

35,00,000/- కట్టి 50 గాడిదలు తీసుకున్నాడు.

గాడిదల ఫాం, ఫ్రీజర్ లు, కెమెరాలు,హంగులు అన్నింటికి కలిపి 70 లక్షలు వెచ్చించాడు,.


70+35+5.5+.5=1 కోటి 11 లక్షలు పెట్టుబడి పెట్టాడు.


పనివారు వాళ్ళు గుజరాత్ వాళ్ళంట వారికి వసతి భోజనం కల్పించి నలుగురికి నెలకి 50వేలు 


మొదటి రెండు నెలల్లో రెండుసార్లు మాత్రమే పాలు తీసుకెళ్ళారు. కాని డబ్బులు వేయలేదు. సరే ఇస్తారులే నమ్మకస్తులే ఇంత పెట్టుబడి పెట్టాం అని అలా 11 నెలలు చూసారు. పితికిన పాలు అలానే ఉన్నాయి. పని వాళ్ళకు మరో 5 లక్షలు ఫాం మెయింటెనెన్సికి కలిపి మొత్తంగా 1కోటి 30 లక్షలు అయ్యింది..


పాలు తీసుకెళ్ళడం లేదు ఫోన్లో సంప్రదిస్తే సమాధానం లేదు. ఇక లాభం లేదనుకుని తమిళనాడులోని అతని ఆఫీసుకి వెళ్ళి అడిగితే వారంలో ఇస్తాను అని అన్నాడు.  వారం తర్వాత అతని జాడలేదు 

అప్పుడు తెలిసింది ఏంటంటే పోయాం... మోసం..

కోట్ల రూపాయలు మోసపోయారు..


ఒక పది రూపాయలు  పేదవాడికి దానం చేయడానికి పదిసార్లు ఆలోచిస్తారు ఈరోజుల్లో. లక్షల, కోట్ల రూపాయలు ఇలా పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించారా??


ఈ రోజుల్లో మనిషికి ఆశ కాదు అత్యాశ విపరీతంగా పెరిగిపోయింది.. డబ్బు,డబ్బు లాభాలు, లాభాలు కోట్లకు పడగెత్తాలి పెద్ద పెద్ద బంగళాలు కట్టాలి,పెద్ద కార్లలో తిరగాలి. అందరిలో కంటే మనమే గొప్పగా బ్రతకాలి ఇలా అత్యాశకు పోయి ఉన్నదంతా ఊడ్చేసుకుని ఇప్పుడు బాధపడుతున్నారు.


ఆశకు హద్దు ఉండాలి. మోసం చేసిన వాడిది తప్పే. కాని మీ అత్యాశే వాడి లాభం... లాభాల లెక్కలేసుకుని గాల్లో తెలిపోతారే తప్ప అది ఎంత వరకు సాద్యం ఆలోచించరు.

ఇలాంటి స్కాం లు ఎన్ని జరిగినా దురాశపరులు మోసపోతూనే ఉంటారు...


12, నవంబర్ 2024, మంగళవారం

పచ్చని ప్రకృతిని నాశనం చేసే ఫార్మా సిటీలు ఎందుకు?? రైతుల ఆగ్రహం అందుకే..

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో

నవంబర్12 సోమవారం అంటే నిన్న వికారాబాద్ కలెక్టర్,సబ్ కలెక్టర్,ఇతర అధికారులపై రైతులు దాడి చేసారు.

ఫార్మా సిటి కోసం భూసేకరణ చేయడానికి రైతులతో మాట్లాడాటానికి వెళ్ళిన అధికారులపై రైతులు దాడి చేసారు. రాళ్ళతో కార్ల అద్దాలు ధ్వంసం చేశారు.

 అధికారలపైనే రైతులు దాడి చేసారంటే అందులోను జిల్లా కలెక్టర్ పై దాడి. రైతులు ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. 

వాళ్ళ ఆగ్రహం మాత్రమే అందరికి కనిపిస్తుంది ఆ ఆగ్రహం వెనక వారి ఆవేదన ఎంతమందికి తెలుస్తుంది.??


రైతుల కోపానికి కారణం ఏంటంటే

ఫార్మా కంపెనీలు వస్తే ఆ ప్రాంతం అంతా కాలుష్యమవుతుంది.గాలి,నీరు,భూమి అన్ని కలుషితమవుతాయి. పచ్చని ప్రకృతి ని నాశనం చేసే ఫార్మా కంపెనీలు కడుతాం అంటే ఎవరు ఊరుకుంటారు.


తరతరాలుగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న రైతుల భూములు లాక్కుని ఫార్మా కంపెనీలు కడుతాం అంటే ఎవరు ఊరుకుంటారు.


భూముల ధరలు కోట్లలో పలుకుతుంటే లక్షలో పరిహారం ఇస్తామంటే ఎవరు ఊరుకుంటారు.


భూములు లాక్కుంటే రైతుల ఉపాధి సంగతి ఏంటి?

వారు ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి.


ఆ కంపెనీలో ఉద్యోగాలు వస్తాయి అంటారు వారు స్థానికులకు ఇచ్చే ఉద్యోగాలు స్వీపర్,లేబర్ ఉద్యోగాలే వెట్టి చాకిరి చేయిస్తారు. అందులో చాలి చాలని వేతనం మనవాళ్ళు ఇలాంటి పని చేయలేక మానేస్తారు వాళ్ళు బిహార్ వాళ్ళను పనిలో పెట్టుకుంటారు రోజుకు 12గంటలు పని చేయించుకుంటారు. స్థానిక ప్రజలు వలసలు వెళ్ళాల్సిందే.


ఉద్యోగాలు పోని భూమికి పరిహారమైనా తగిన విధంగా ఇస్తారా అంటే అదీలేదు. 

ప్రభుత్వం ఎకరా భూమికి ఇచ్చే పరిహారంతో బయట ఎక్కడా 100 గుంట భూమి రాదు.


చాలిచాలని ఆదాయంతో బ్రతుకుతున్న రైతులకు ఎలాంటి సహాయం చేయకపోగా వారి  భూములు లాక్కుని వారి పొట్ట కాడుతాం అంటే ఎవరు ఊరుకుంటారు??


 టి ఆర్ ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో కాంగ్రెస్ ను గెలిపించారు రైతులు.

గెలిపించిన పాపానికి ఇచ్చిన హామీలు నెరవేర్చక పోగా మీ భూములు లాగేసుకుంటా అంటే ఎవరు ఊరుకుంటారు? 


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయాల వల్ల ఏడాది గడవకముందే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది.

కేసీఆర్ పాలనే బాగుండే అనవసరంగా రేవంత్ రెడ్డిని గెలిపించాం అని జనాలు ఇప్పుడు బాధ పడుతున్నారు.

మరీ ముఖ్యంగా రైతులు.


రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేరలేదు

రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు.


ఒక్క బస్ టికెట్,గ్యాస్ సిలిండర్ తప్ప ఏ హామి నెరవేరలేదు. 


సరే ఇవేమి అక్కర్లేదు ఇవ్వకున్నా పర్వాలేదు. కానీ మా భూములు గుంజుకుని అరకొర పరిహారం ఇచ్చి మమ్మల్ని వెళ్ళగొట్టాలని చూస్తే తిరగబడక ఏం చేస్తారు...


ఏ ప్రభుత్వమైనా కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేవే కాని రైతులు బాగుండాలి వారికి లాభం చేకురాలని ఏప్రభుత్వం, ఏ నాయకుడు ఆలోచించడు.


 రైతుల భూములు లాక్కోవాలి వారిని తరిమి వేయాలి అని చూస్తారే తప్పా వారికి మంచి చేయరు. ఎందుకంటే రైతులు బలహీనులు వారి తరపున అడిగే వారు ఎవరు ఉండరు అందుకే రైతులపై పడి వారి పొట్ట కొడతారు మన గొప్ప నాయకులు..


ప్రజల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. కేవలం ఒక ఏడాది గడవకముందే...