భానోదయం

30, నవంబర్ 2018, శుక్రవారం

మళ్ళీ ముఖ్యమంత్రిగా కెసిఆర్

         ఎవరు ఊహించని పథకాలు తెరాస ప్రభుత్వం తీసుకొచ్చింది. 60 సంవత్సరాలుగా జరగని అభివృద్ది నాలుగున్నర ఏళ్ళలో జరిగింది.
ఇంకోసారి అధికారంలోకి వస్తే తప్పకుండా బంగారు తెలంగాణ సాద్యం అవుతుంది. తెలంగాణ ప్రజలు కెసిఆర్ ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. కెసిఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్టంలో కూడా లేవు.  నిరుద్యోగులు మాత్రమే కెసిఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారు వారికి కూడా వచ్చే ఏడాదిలో ఉద్యోగాలు
వస్తాయని ఆశిస్తున్నాం. అందరికి న్యాయం చేసినోడు చదువుకున్నోళ్ళకు అన్యాయం చేస్తాడా.
కెసిఆర్ మాటల ముఖ్యమంత్రి కాదు చేతల ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి చేయలేని పనులు ఒక్క కెసిఆర్ మాత్రమే చేసాడు.
ఈ ఎన్నికల్లో కెసిఆర్ ను గెలిపించేది ఆయన అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు.
24 గంటల కరెంట్
మిషన్ భగీరథ
మిషన్ కాకతీయ
రైతు బందు
ఆసరా పించన్లు
కళ్యాణలక్ష్మీ
కెసిఆర్ కిట్ లాంటి మరెన్నో పథకాలే కాకుండా పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారం లాంటి మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారు. ఇలా రాష్ట్ర సర్వతోమఖాభివృద్దికి పాటు పడుతున్న కెసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలి అంటుంది తెలంగాణ ప్రజానికం.
          మహాకూటమి సీట్ల పంపకాలలోనే వీళ్ళకి క్లారిటీ లేదు వీళ్ళేం పాలిస్తారు రాష్ట్రాన్ని ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే సీఎం సీటు కోసం కొట్లాట తప్పితే అభివృద్ది శూన్యం.
        నూటికి నూరు శాతం మళ్ళీ కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారు కావాలి. ఈ రాష్ట్రానికి కెసిఆర్ దిక్సూచి. జై కెసిఆర్ జై తెలంగాణ.

27, నవంబర్ 2018, మంగళవారం

తెలంగాణలో బలమైన పార్టీ ఏది??

   



    తెలంగాణ ఎన్నికల్లో తెరాస, మహాకూటమి మద్యే పోటి బిజెపి తన ఉనికిని కాపాడుకోవడానికే పోటీచేస్తుంది. ఇక లెఫ్ట్ పార్టీలను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. ఆ పార్టీలు పానకంలో పుడకల్లాంటివి.
 ప్రస్తుతం తెలంగాణలో బలమైన పార్టీ ఏదంటే తెరాస అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక పార్టీని ఎదుర్కోవాలంటే బలమైన పార్టీ ఉండాలి. జాతీయ స్థాయి పార్టీ సైతం ఇతర పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడినప్పుడే తెరాస పార్టీ బలమైన పార్టీగా అవతరించింది.
సొంతంగా పోటీ చేసి గెలిచే ధమ్ములేక అన్ని పార్టీలు ఏకమయ్యాయి.
 మహాకూటమి ముఖ్య ఉద్ద్యేశం ఒక్కటే కెసీఆర్ ను గద్దె దింపడం అంతే తప్ప ప్రజల సంక్షేమం కోసమైతె కాదు. కెసీఆర్ లాంటి బలమైన నాయకుడు తెలంగాణలోని ఏ పార్టీలో లేడని చెప్పాలి. కాంగ్రేస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కెసీఆర్ తో సమానమైన బలమైన నాయకుడైతే కాడు. ఇక ఇంకో వ్యక్తి రేవంత్ రెడ్డి
ఈయన తిట్టడానికే పనికి వస్తాడే తప్ప ఇంకేం లేదు. తిట్టడం వల్లనే గొప్ప నాయకుడు ఎలా అవుతారో రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి.
ఇక తెదేపా విషయానికి వస్తే తెలంగాణలో అంతరించి పోయే పార్టిలో ముందు వరుసలో ఉంది. అందుకెనేమో ముందు చూపుతో రెవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాడు. రేవంత్ రెడ్డికి కెసీఆర్ ని విమర్శించడంపై ఉన్న శ్రద్ద తన నియోజకవర్గ అబివృద్దిపై ఉంటే బావుండేది. కెసీఆర్ ను  విమర్శించేముందు తన మీద ఉన్న ఓటు నోటు కేసు గురించి ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఒక వ్యక్తిని ఓడించడానికి అన్ని పార్టీలు ఏకమయ్యాయంటే ఆ వ్యక్తి ఎంత బలమైన నాయకుడో అర్థం అవుతుంది.
   

   ప్రజలకు కావలసింది తోపులు, హీరోల్లాంటి నాయకులు కాదు ప్రజల సంక్షేమం కోసం పాటు పడే నాయకుడు కావాలి.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని,సంస్కృతిని కాపాడే పార్టీ తెరాస. తెలంగాణ అభివృద్ది చెందాలంటే అది తెరాసకే సాద్యం.