భానోదయం: హైదరాబాద్ కు మరో రెండు హుస్సేన్ సాగర్ లు రాబోతున్నాయి.

20, మే 2023, శనివారం

హైదరాబాద్ కు మరో రెండు హుస్సేన్ సాగర్ లు రాబోతున్నాయి.

 హైదరాబాద్ కు అభివృద్ధిలో భాగంగా మరో రెండు హుస్సేన్ సాగర్ లు రాబోతున్నాయి. అందులో ఒకటి గండిపేట చెరువు, హిమాయత్ సాగర్ చెరువులు హుస్సేన్ సాగర్ లా అభివృద్ధి చెందబోతున్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు జలాశయాల‌ నీరు స్వచ్ఛంగా ఉంది. ఇకపై హుస్సేన్ సాగర్ నీటిలా పవిత్రంగా మార్చేస్తారు. 


111 జీవో రద్దుతో ఈ రెండు జలాశయాలు మురికి కూపంలా మారబోతున్నాయి. ప్రజల ఆకాంక్ష మేరకు ఈ జీవోను రద్దు చేస్తున్నట్లు పాలకులు చెబుతున్నారు. పాలకులకు ప్రజలపై ఎంత ప్రేమ ఉందో కదా. ప్రజల కష్టాలను తీర్చడం కోసం మీ పాలకులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. 111 జీవో వల్ల ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు అందుకోసం ఈ జీవోను రద్దు చేశారు. ఇక్కడ భూముల విలువలు తక్కువగా ఉండటంతో రైతులు నష్టపోతున్నారు అని చెబుతున్నారు. అక్కడ  ఇదివరకే తక్కువ  ధరకు భూములు కొన్న పెద్ద రైతులు నష్టపోతున్నారు. అలాగే అక్కడ ఫామ్ హౌస్ లు కట్టుకున్న రైతులు నష్టపోతున్నారు అందుకోసం ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి 111 జీవోను రద్దు చేస్తుంది. ప్రభుత్వానికి రైతులంటే ఎనలేని ప్రేమ. 

కామెంట్‌లు లేవు: